-
Vyuham: ఆర్జీవీ వ్యూహానికి తొలగిన అడ్డంకులు
రాం గోపాల్ వర్మ ‘వ్యూహం’ రిలీజ్కు అడ్డంకులు తొలిగాయి. సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ విషయాన్ని ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్వయంగా పంచుకున్నారు. ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారాయన. ఇక సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడంపై వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్ అంటూ ఎక్స్లో సందేశం ఉంచారాయన. BAD NEWS for BAD GUYS 💪 VYUHAM censor CERTIFICATE 🙌 DECEMBER 29 th in THEATRES 😌 pic.twitter.com/LBBKAt977s — Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2023 వర్మ డైరెక్షన్లో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. ఈ సినిమాను అడ్డుకునేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ సైతం రాశారు. ఆ సమయంలో ఆర్జీవీ తీవ్ర స్థాయిలోనే స్పందించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని ఛాలెంజ్ను స్వీకరించారాయన. ఇదీ చదవండి- ‘వ్యూహం’ ఏ పార్టీకి చెందింది కాదు.. కేవలం.. : ఆర్జీవీ -
మంచివాడు
కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ని పొందింది. సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్. -
ఆత్రేయ వస్తున్నారు
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రల్లో స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ‘మళ్ళీరావా’ చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా రూపొందించిన ఈ సినిమా ‘యు/ఎ’ సర్టిఫికెట్ అందుకుంది. ఈనెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. నవీన్ ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో నటించాడు. డిఫరెంట్ టేకింగ్, స్క్రీన్ప్లేతో సాగే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. మార్క్ కె.రాబిన్ సంగీతం, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. -
మధ్య తరగతి అమ్మాయి కథ
రాజకిరణ్ సినిమా పతాకంపై ఫణి తిరుమల శెట్టి సమర్పిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్నారు. ’గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. ‘‘సాధారణ మధ్యతరగతి అమ్మాయి జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోని సమస్యలు ఆమెను వేధిస్తాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఆ సమస్యలను పరిష్కరిస్తాడు. అతడు ఎవరు? ఆమె కథలో మనిషి మేథస్సుకు అందని సృష్టి రహస్యాలు ఏంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించిన ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అని చెప్పే ప్రయత్నమే ‘విశ్వామిత్ర’. మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నందితా రాజ్ చేశారు. ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రానా, ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా లవ్ థ్రిల్లర్ జానర్లో సినిమా రూపొందింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
మోదీ బయోపిక్కు బ్రేక్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ’చిత్ర విడుదలకు బ్రేక్ వేసింది. దేశంలో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ నాయకుల బయోపిక్లను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశించింది. దీంతో గురువారం (11న) విడుదల కావాల్సిన మోదీ బయోపిక్ వాయిదాపడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ బయోపిక్ విడుదలను నిలిపివేయాలని కోరుతూ.. కాంగ్రెస్ కార్యకర్త ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చిత్రం విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా ఈసీ ఆదేశాలతో సినిమా విడుదల వాయిదా పడింది. కాగా ఇదే నిబంధనలు ‘నమో టీవీ’ విషయంలోనూ వర్తించే అవకాశం ఉందని ఎన్నికల ప్యానెల్ అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో నమో టీవీలో ప్రసారాలు నిలిపివేయాలన్నారు. ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి సంబంధించిన విషయాలను పోస్టర్ లేదా సినిమాల రూపంలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేయకూడదు. మోదీ బయోపిక్కు ‘యూ’సర్టిఫికెట్.. పీఎం నరేంద్ర మోదీ సినిమాకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ‘యూ’సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాకు యూ సర్టిఫికెట్ రావడంపై చిత్ర నిర్మాత సందీప్æ సంతోషం వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ ఈ చిత్రంలో మోదీగా నటించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement