-
పోలీసుల అదుపులో ఐఎస్ అనుమానితులు
ఇస్తాంబుల్: తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో భాగంగా ఇస్తాంబుల్ నగర వ్యాప్తంగా టర్కీ పోలీసులు తనిఖీలు చేశారు. దాదాపుగా 34 మంది అనుమానితులను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారు గతంలో ఉగ్రవాద సంస్థలో పనిచేసినవారు, ఉగ్రకుట్రలకు పథకం రచించిన వారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వారి నుంచి భారీగా డాక్యుమెంట్లు, డిజిటల్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 82 మంది విదేశీయులను నిర్భంధంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 283 మంది ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. 66 పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2015 నుంచి టర్కీలో జరిగిన బాంబు పేలుళ్ల కారణంగా సుమారు 300 మంది పౌరులు చనిపోయారు. -
9000 మంది పోలీసుల తొలగింపు
అంకారా (టర్కీ): ఏకంగా తొమ్మిది వేల మంది పోలీసులను టర్కీ ప్రభుత్వం తొలగించింది. గతేడాది జూన్లో టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదుర్ఘటనకు ప్రధానకారకుడు వ్యాపార వేత్త గులెన్ అని టర్కీ ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో గులెన్పై చర్యలు తీసుకోవలని టర్కీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా గులెన్తో సంబంధాలు ఉన్న 9000 మంది పోలీసులను గుర్తించి వారిని విధులనుంచి తొలగించింది. బుధవారం వెయ్యి మందిపైగా గులెన్ సానుభూతి పరులని గుర్తించి అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. పోలీసు శాఖలో అవినీతి నిర్మూలనలో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు జింహువా అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. జులై 16 సైనిక తిరుగుబాటుకు గులెన్ ప్రధానకారకుడు. కొన్ని దశాబ్దాలుగా పలు దేశాల్లో వ్యాపార, మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. 2013 నుంచి అమెరికాలో అజ్ఞాతంలో గడుపుతున్నాడు. గులెన్ను అప్పగించాలని టర్కీ అమెరికాను ఇప్పటికే పలు సార్లు కోరింది. -
టర్కీ పోలీసుల అదుపులో ఖమ్మం యువకుడు
ఖమ్మం : ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువకుడికి ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్ఐఎస్తో సంబంధం ఉందనే కారణంతో టర్కీ పోలీసులు అదుపులో తీసుకోవటం నగరంలో కలకలం రేకెత్తించింది. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ఖమ్మం పోలీసులకు సమాచారం అందించటంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఖమ్మంలోని అతని ఇంట్లోవారిని విచారించినట్లు తెలిసింది. ఖమ్మంలోని పంపింగ్వెల్రోడ్కు చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. గత నెల 27న అతడు టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో దిగడంతో అక్కడి పోలీసులకు అనుమానం వచ్చి విచారించారు. అతనితో పాటు మరో ముగ్గురు సిరియాలో ఐఎస్ఐఎస్ శిక్షణకు వెళ్తున్నట్లు తేలింది. దీంతో అక్కడి పోలీసులు వీరి గురించి కర్ణాటక పోలీసులకు తెలిపారు. ఈ సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అతనింట్లో తనిఖీలు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement