-
‘సమ్మె’ శాలరీ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. గతేడాది జరిగిన ఆర్టీసీ సమ్మె కాలానికి సంబంధించి వేతనానికి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీకి రూ.235 కోట్ల మొత్తాన్ని ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25 వరకు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. తొలుత సమ్మెను ప్రభుత్వం పట్టించు కోకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేప ట్టింది. అదే సమయంలో కొందరు ఉద్యోగులు ఆత్మహత్య చేసు కోగా, దాదాపు 30 మంది గుండెపోటుతో చనిపోయారు. చివరకు కార్మిక సంఘాలు సమ్మెను విరమించాయి. అప్పటివరకు సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. అదే సమయంలో సమ్మె కాలానికి వేతనం కూడా ఇవ్వనున్నట్టు, ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆమేరకు ప్రభుత్వం సమ్మె కాలానికి వేతనాల కోసం తాజాగా రూ.235 కోట్లు విడుదల చేసింది. -
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ స్థితిని గాడిలో పెట్టడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనే విషయం మరోమారు రుజువైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చెప్పిన విధంగా సమ్మె కాలానికి సంబంధించిన జీతాల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం శుభపరిణామం అన్నారు. (ఒక్క కార్మికుడిని సస్పెండ్ చేయలేదు) కాగా.. సమ్మె కాలానికి జీతాల చెల్లింపుల కోసం రూ. 235 కోట్లు విడుదల చేసి ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని పువ్వాడ తెలిపారు. ఇది ఆయన పెద్ద మనసుకు నిదర్శనమన్నారు. ఒకే దఫాలో నిధులను విడుదల చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. మార్చి 31వ తేదీలోగా సమ్మె కాలం జీతభత్యాలు ఉద్యోగులకు చెల్లించనున్నట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ అభ్యున్నతి కోసం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగుల బాగోగుల కోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, సంస్థ ఆర్థిక స్థితిని మరింత మెరుగు పరచడానికి సమిష్టిగా ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో చెప్పినట్లుగానే బడ్జేట్లో ఆర్టీసీకి రూ. 1000 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. సంస్థ పురోగతికై అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేసి సీఎం ఆశించిన ఫలితాలు తీసుకురావాలని మంత్రి సూచించారు. -
‘సమ్మె’లో కుమ్మేశారు!
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పుడు బస్సుల్లో టిక్కెట్ తీసుకొనే బాధ్యత ప్రయాణికుడిదే కావడం వల్ల కండక్టర్లకు కొద్దిగా ఊరట లభించింది. కానీ గతంలో లెక్కల్లో ఒక్క రూపాయి తేడా వచ్చినా..ఉద్యోగంఊడిపోవలసిందే. ప్రతినిత్యం ఎంతోమంది కండక్టర్లు అభద్రతతో పనిచేసేవారు. కానీ అలాంటి ఆర్టీసీలో కొందరు అధికారులే తమ చేతివాటాన్ని ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆర్టీసీ ఆడిట్ విభాగం చేపట్టిన గణాంకాల్లో నగరంలోని పలు డిపోల్లో లక్షలాదిరూపాయలు లెక్కల్లో కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సమ్మె కాలంలో డిపో స్థాయి అధికారులే అక్రమాలకు పాల్పడి ఉండవచ్చుననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె మొదలైన కొద్ది రోజుల పాటు ఎలాంటి టిక్కెట్లులేకుండానే బస్సులుసడిపారు. ఆ తరువాత ప్రింటెడ్ టిక్కెట్లు ముద్రించినప్పటికీ వాటిపైన వచ్చిన ఆదాయాన్ని పూర్తిస్థాయిలో జమ చేయకుండా కొందరు డిపోమేనేజర్లు తమ జేబుల్లోవేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అద్దె బస్సుల యజమానులు సైతం ఆర్టీసీ డిపోల్లో ట్యాంకుల కొద్దీ డీజిల్ నింపుకొని ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తమకు నచ్చిన రూట్లలో బస్సులు నడుపుకొన్నారు. వచ్చిన సొమ్మును ఆర్టీసీకి అద్దె చెల్లించకుండానే ఎగురేసుకెళ్లారు. తీవ్ర నష్టాల్లో కూరుకొనిపోయి ఉన్న ఆర్టీసీలో కొంతకాలంగా ప్రక్షాళన పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆడిట్ విభాగం చేపట్టిన డిపోస్థాయి తనిఖీల్లో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ‘ఆర్టీసీలో అవినీతి, అక్రమాలకు తావు లేదు. ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది. కానీ సమ్మె కాలంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది.’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రూ.లక్షల్లోనే కాజేశారు.... నగర శివార్లోని ఒక డిపోలో రూ.5 లక్షలు తక్కువ ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు బస్సులు నడిపే మరో డిపోలోనూ సుమారు రూ.7 లక్షల వరకు సొమ్ముకు సరైన లెక్కలు లేవు. అలాగే నగరంలోని మరో కీలకమైన డిపోలోనూ ఇదే పరిస్థితి. సుమారు 56 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మె కాలంలో బస్సులు నడపడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ డిపో స్థాయి నిర్వహణ కొరవడింది. ప్రింటెడ్ టిక్కెట్లపైన లెక్కాపత్రం లేకుండాపోయింది. ఏ రోజుకు ఆ రోజు నడిపిన బస్సులు, వాటిపైన వచ్చిన ఆదాయం పైన కూడా జవాబుదారీతనం లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఇప్పుడు ఆడిటింగ్లో తలలు పట్టుకుంటున్నారు. నిజానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు నగరంలోని అన్ని డిపోల్లో ప్రతి రోజు 1500 నుంచి 2000కు పైగా బస్సులు నడిచాయి. ప్రయాణికులు సైతం ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. ఆ సమయంలో అక్రమాలకు పాల్పడకుండా తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లపైన పోలీసులు, ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించడం సత్ఫలితాలను ఇచ్చింది. కానీ సాధారణ రోజుల్లో ప్రతిరోజు కనీసం రూ.కోటి ఆదాయం వచ్చే ఆర్టీసీలో సమ్మె రోజుల్లో రూ.25 లక్షల కంటే ఎక్కువ రాలేదు. నిజానికి అద్దె బస్సుల యజమానుల నుంచి రావలసిన సొమ్ము రాకపోవడం కూడా ఇందుకు కారణమే. అదే సమయంలో కొందరు అధికారుల చేతివాటం కూడా అక్రమాల పర్వానికి ఆజ్యం పోసినట్లయిందనే ఆరోపణలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. నిద్రపోయిన నిఘా వ్యవస్థ... ఆర్టీసీ స్వీయ నిఘా వ్యవస్థ విజిలెన్స్ విభాగంసమ్మె కాలంలో నిస్తేజంగా ఉండడం కూడా ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు డిపోలపైన సరైన నిఘా ఉంచకపోవడం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో పట్టించుకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా మారింది. సాధారణంగా విజిలెన్స్ విభాగం ఇచ్చే నివేదికల ఆధారంగా ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు చేపడుతారు. కానీ సమ్మె కాలంలో అలాంటి పారదర్శకమైన వ్యవస్థ ఏ స్థాయిలోనూ పని చేయకపోవడం గమనార్హం. -
ఆర్టీసీ ప్రక్షాళన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రక్షాళనకు కసరత్తు మొదలైంది. ఎవరెక్కడ పనిచేస్తున్నారో, వారికిచ్చే వేత నానికి తగ్గ పని జరుగుతోందో లేదో, ఏ విభాగంలో ఎందరున్నారో వంటి విషయాలపై ఇప్పటివరకు లోపించిన జవాబుదారీతనాన్ని తిరిగి తీసు కొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీ సమ్మె అనంతరం టికెట్ ధరల పెంపుతో ఇప్పటికే సంస్థ ఆదాయం పెరగ్గా మరిన్ని చర్యలతో సంస్థకు మరింత ఊపు తెప్పించనుంది. కొన్ని విభాగాల్లో సిబ్బందికి సరైన పనే లేదు. కొన్ని చోట్ల తీవ్ర పని ఒత్తిడి ఉంది. ఇప్పుడు 800 బస్సులను తగ్గిం చడం, కొత్తగా సరుకు రవాణా విభాగాన్ని ప్రారంభిస్తుం డటం, త్వరలో 1,334 అద్దె బస్సులు కొత్తగా ఆర్టీసీ లోకి వస్తుండటం.. వెరసి మొత్తం సంస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణ యించింది. దశల వారీగా అమలు చేయనుంది. తొలుత డిపో స్థాయిలో సిబ్బందిని సర్దుబాటు చేయడంతో ప్రారంభించి అనంతరం ఆర్టీసీలో అనుబంధంగా ఉన్న విభాగాల్లో అవసరం లేని వాటిని తొలగించనుంది. సిబ్బంది పంపకాలు...: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీకి 97 డిపోలు ఉండగా వాటిల్లో కొన్ని డిపోలకు అవసరానికి మించి ఎక్కువ బస్సులు కేటాయించారు. దీంతో అవి నష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 800 బస్సులను సంస్థ తగ్గిస్తోంది. తొలుత వెయ్యి బస్సులు అనుకున్నా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటిని 800కు తగ్గించాలని భావిస్తోంది. బస్సుల సంఖ్య తగ్గడంతోపాటు కండిషన్లో లేని దాదాపు మరో 400 డొక్కు బస్సులను తొలగించనుంది. అప్పుడు డిపోల్లో సిబ్బంది అవసరం కూడా తగ్గుతుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న డిపోలకు ఎక్కువ బస్సులు కేటాయించి తక్కువ డిమాండ్ ఉన్న డిపోలకు తక్కువ బస్సులు ఉండేలా అధికారులు హేతుబద్ధీకరించనున్నారు. అంతగా పనిలేని సిబ్బందిని వేరే చోటకు పంపనున్నారు. మరో 15 రోజుల్లో 1,334 అద్దె బస్సులు కొత్తగా రాబోతున్నాయి. వాటి డ్రైవర్లు, మెకానిక్లను వాటి యజమానులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున ఆర్టీసీపై అంతమేర భారం తగ్గనుంది. గతంలో ఇలా మిగిలిపోయే సిబ్బందిని సర్దుబాటు చేయకపోవడంతో వారు పనిలేకుండా డిపోల్లో మిగిలిపోయారు. అలా ఉన్న పాత వారితోపాటు ఇప్పుడు కొత్తగా పని తగ్గే వారిని వేరే డిపోలకు సర్దుబాటు చేయనున్నారు. అప్పటికీ సిబ్బంది మిగిలితే సరుకు రవాణా విభాగం లాంటి వాటికి పంపనున్నారు. బస్ బాడీ యూనిట్ ఉండదా? ప్రస్తుతం ఆర్టీసీకి సొంతంగా మియాపూర్లో బస్ బాడీ వర్క్షాప్ ఉంది. అందులోనే బస్సుల నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ వర్క్షాప్ వల్ల ఉపయోగంకన్నా ఖర్చే ఎక్కువగా ఉంటోందని ఆర్టీసీ గుర్తించింది. దాని బదులు ప్రైవేటు కంపెనీలకు వర్క్షాప్ అప్పగిస్తే ఖర్చు తక్కువగా ఉంటుందని గుర్తించింది. దీంతో క్రమంగా బస్బాడీ వర్క్షాపును వదిలించుకునే ఆలోచనలో ఉంది. అలాగే హైదరాబాద్ శివార్లలోని హకీంపేట, వరంగల్లో ఆర్టీసీకి సొంత శిక్షణ కేంద్రాలు ఉండగా వాటి అవసరం లేదని సంస్థ భావిస్తోంది. వరంగల్లోని కేంద్రాన్ని మూసేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో ఉంది. ప్రక్షాళన అవసరం... ఆర్టీసీలో ఉన్న గందరగోళాన్ని వెంటనే నివారించేందుకు వీలుగా దిద్దుబాటు చర్యలు అవసరమని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్శర్మ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన సంస్థ ఈడీలతో భేటీ అయ్యారు. డిపోలవారీగా ఉన్న సిబ్బంది, వారిపై ఉన్న పని ఒత్తిడిని గుర్తించి వెంటనే హేతుబద్ధీకరించాలని ఆదేశించారు. ఇతర అనుబంద యూనిట్ల అవసరం, వాటిని తొలగిస్తే ఎదురయ్యే సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి హామీల అమల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు. జనవరి మొదటి వారంలో అందుబాటులో ఉన్న వాహనాలతో సరుకు రవాణా విభాగాన్ని ప్రారంభించాల్సిందేనని స్పష్టం చేశారు. -
పైసలొచ్చే రూట్లలోనే ఆర్టీసీ బస్సులు
ఆదాయం లేదంటూ అకస్మాత్తుగా వందల రూట్లలో ఆర్టీసీ సర్వీసుల్ని రద్దు చేశారు. సామాన్యుల కష్టాలు పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బస్సులురద్దు చేయడంతో గత వారం పది రోజులుగాప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా నిరుపేద కూలీలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, చిరుద్యోగులు ఆర్టీసీ బస్సులు రాక..ఎక్కువ చార్జీలు చెల్లించి మెట్రో రైలు, క్యాబ్లు, ఆటోలు ఎక్కలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట దాదాపు 6 వేల ట్రిప్పులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ‘సాక్షి’ మంగళవారంపరిశీలన జరపగా...సామాన్య ప్రయాణికుల వెతలెన్నో వెలుగుచూశాయి. ఇప్పటికైనా అధికారులు పునరాలోచన చేసి ట్రిప్పుల సంఖ్య పెంచాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. సాక్షి,సిటీబ్యూరో/నెట్వర్క్: తెల్లవారుజామున 5 గంటలకు మేడిపల్లి నుంచి సికింద్రాబాద్కు వెళ్లే బస్సును రద్దు చేశారు. ఆ సమయంలో చెంగిచర్ల, మేడిపల్లి, బోడుప్పల్, ఉప్పల్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే ప్రయాణికులకు ఇప్పుడు సిటీ బస్సు సదుపాయం లేదు. సికింద్రాబాద్ నుంచి నాంపల్లి మీదుగా మెహిదీపట్నం వరకు నడిచే (49ఎం) బస్సు కూడా రద్దయింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అడ్డగుట్ట, మహేంద్ర హిల్స్, గౌతమ్నగర్ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకొనే (సికింద్రాబాద్– సికింద్రాబాద్ 38 ఈఎక్స్) బస్సును ఆదాయం రావడం లేదనే కారణంతో రద్దు చేశారు. దీంతో ఉదయాన్నే సికింద్రాబాద్కు చేరుకొనే కూలీలు, చిరువ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సివస్తోంది. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు. రాత్రి వేళల్లోనూ ఇప్పుడు బస్సులు అందుబాటులో ఉండడం లేదు. సికింద్రాబాద్ నుంచి కోఠి మీదుగా శాలిబండకు వెళ్లే (8ఏ), సికింద్రాబాద్– బోయిన్పల్లి (26ఎన్), తదితర రూట్లలోనూ ట్రిప్పుల సంఖ్యను తగ్గించారు. చిలుకానగర్, హేమానగర్, ఉప్పల్, తార్నాక మీదుగా నాంపల్లికి వెళ్లే (136), హేమానగర్– కోఠికి రాకపోకలు సాగించే (3ఎన్) రూట్లోనూ ఉదయం, రాత్రి బస్సుల సంఖ్యను తగ్గించారు. కేవలం ఈ రూట్లలోనే కాదు నగరంలోని 1100కుపైగా రూట్లలో ట్రిప్పుల రద్దుకు ఆర్టీసీ భారీ కసరత్తు చేపట్టింది. ఇప్పటికే పలు డిపోల్లో 100 నుంచి 200కుపైగా ట్రిప్పులను రద్దు చేశారు. మరిన్ని డిపోల్లో ట్రిప్పుల రద్దుపైన ప్రణాళికలను రూపొందిస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్లోని 29 డిపోల పరిధిలో సుమారు 6వేలకుపైగా ట్రిప్పులు రద్దు కానున్నట్లు అంచనా. అతితక్కువ మంది ఉన్న మార్గాల్లోనే బస్సులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ ఉదయం, రాత్రి వేళల్లో బస్సులు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి అఫ్జల్గంజ్ వరకుఉదయం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు రద్దీ ఉంటుంది. సికింద్రాబాద్– అఫ్జల్గంజ్ మధ్య బస్సులు ప్రయాణికుల రద్దీకిఅనుగుణంగా ఉన్నాయి. కానీ సికింద్రాబాద్ నుంచి రీసాలాబజార్కు, అఫ్జల్గంజ్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నడిచే బస్సులను తగ్గించారు. పలు డిపోల్లో ట్రిప్పుల రద్దు ఇలా.. ♦ కుషాయిగూడ డిపోలో 240 ట్రిప్పులు రద్దు చేశారు. కుషాయిగూడ నుంచి అఫ్జల్గంజ్ (3కే) ఏకంగా రూట్లో 16 ట్రిప్పులు రద్దయ్యాయి. దీంతో ఈ రూట్లో దీంతో కుషాయిగూడ, ఈసీఐఎల్, హబ్సిగూడ మీదుగా కోఠికి వెళ్లే ప్రయాణికులు కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్ మీదుగా సికింద్రాబాద్కు వచ్చి అక్కడి నుంచి కోఠికి వెళ్లాల్సివస్తోంది. లేదా సెవెన్ సీటర్ ఆటోలు, షేరింగ్ ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ♦ 16సీ రూట్లో రెండు ట్రిప్పులు, 16ఏ రూట్లో మరో 2 ట్రిప్పులను రద్దు చేశారు. 16ఏకే రూట్లో 3 ట్రిప్పులు రద్దయ్యాయి. ♦ 24ఎస్ రూట్లో 4 బస్సులను రెండింటికి తగ్గించారు. ♦ 17ఎస్ రూట్లో తిరిగే 10 బస్సులలో 5 తగ్గాయి. 117 రూట్లో 2 బస్సులను కుదించారు. ♦ కుషాయిగూడ నుంచి అఫ్జల్గంజ్కు ఉదయం 4:30 గంటలకు వెళ్లే బస్సు ప్రస్తుతం ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. ♦ ఉప్పల్ డిపోలో మొత్తం 150 బస్సులు ఉన్నాయి. 1,553 ట్రిప్పులు నడుస్తాయి. ఇందులో 168 ట్రిప్పులు రద్దు చేశారు. ♦ ఉప్పల్– కోఠి (115 రూట్), ఉప్పల్– మెహిదీపట్నం (113 ఎం), ఉప్పల్– కూకట్పల్లి, ఉప్పల్–వేవ్రాక్, ఉప్పల్–కొండాపూర్ తదితర రూట్లలో ట్రిప్పులను రద్దు చేసినట్లు డిపో మేనేజర్ వెంకారెడ్డి తెలిపారు. ♦ హయత్నగర్– 1, 2 డిపోలలో 30 ట్రిప్పులు రద్దు చేశారు. త్వరలో మరిన్ని ట్రిప్పులను రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ♦ కంటోన్మెంట్ డిపోలో మొత్తం 137 బస్సులు ఉండగా, సుమారు 30 బస్సుల వరకు తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ♦ కాచిగూడ డిపో పరిధిలో 27 సర్వీసులను రద్దు చేశారు. అందులో ఉదయం 3:30 గంటలకు బయలుదేరే బస్సులన్నింటినీ గంట ఆలస్యంగా ఉదయం 4:30 గంటలకు నడుపుతున్నారు. ప్రతి రోజు కనీసం 50 ట్రిప్పులు రద్దు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఎం శ్రీనివాస్తెలిపారు. ♦ బర్కత్పురా డిపో పరిధిలో ప్రస్తుతం 7 బస్సు సర్వీసులను నిలిపివేశారు. ♦ కూకట్పల్లి డిపో పరిధిలో 12 బస్సులు, 18 సర్వీసులను రద్దు చేశారు. జగద్గిరిగుట్ట నుంచి 10కె, 19కె, 158 రూట్లలో కొన్ని సర్వీసులను తగ్గించినట్లు డిపో సిబ్బంది చెప్పారు. డిపోలకే పరిమితమైన 500 బస్సులు.. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రస్తుతం 3,550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ట్రిప్పుల రద్దుతో ఇప్పటికే 500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దశలవారీగా మరిన్ని బస్సులను తగ్గించనున్నారు. లాభాలు లేని రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గించి లాభాలు వచ్చే మార్గాల్లో పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఆక్యుపెన్సీ సైతం 72 శాతం వరకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కి.మీపై రూ.16 చొప్పున రోజుకు సుమారు రూ.96 లక్షల నష్టాలను చవిచూస్తోంది. ఆదాయం లేని మార్గాల్లో, సమయాల్లో బస్సులు నడపడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఉదయం 4 నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు రాత్రి 10 నుంచి 11 గంటల వరకు పలు రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారు. బస్సుల్ని తగ్గిస్తున్నారు.. డిపోలవారీగా బస్సులను తగ్గిస్తున్నట్లు సమాచారం ఉంది. ప్రతి డిపోలో పది నుంచి 50 వరకు బస్సులను తగ్గిస్తున్నారు. కార్గోకు ఈ బస్సులను వాడే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. ఈ విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. డ్యూటీలు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రవాణా వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమవుతుంది. – నగేష్ పటేల్, డ్రైవర్, కంటోన్మెంట్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుట్టలుగా... అవినీతి కట్టలు
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
చెంచులతో మమేకమై.. ఓటు విలువ తెలిపి
జిల్లాకేంద్రంలో గాలి దుమారం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
తల్లడిల్లుతున్నారు..!
భారత బాక్సర్ల పసిడి పంచ్
పుతిన్ ఐదోసారి ప్రమాణం
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement