-
ఇరీడియం లోహం పట్టివేత
గోదావరిఖని(రామగుండం): బంగారం బరువు ఎక్కువగా ఉండేందుకు దానిలో కలిపే విలువైన ఇరీడియం లోహాన్ని తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చత్తీస్ఘడ్ నుంచి తీసుకువచ్చి గోదావరిఖనిలో విక్రయించేందుకు సిద్ధమవుతుండగా అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ రక్షిత కె.మూర్తి తెలిపారు. బుధవారం ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. స్నేహితుల ద్వారా.. గోదావరిఖని హనుమాన్నగర్కు చెందిన కన్నం విజయ్ హార్వేస్టర్ వ్యాపారం చేస్తాడు. గోదావరిఖనిలో బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండడంతో అందులో కలిపేందుకు ప్రభుత్వం నిషేధించిన ఇరీడియం లోహాన్ని అమ్మేందుకు అతని స్నేహితులు ఆదిలాబాద్ జిల్లా పిట్టలవాడకు చెందిన సింగిరెడ్డి లచ్చిరెడ్డి, మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి చెందిన ఏ.కిషన్, నస్పూర్ మండలం సింగాపురం గ్రామానికి చెందిన ఎస్.తిరుపతి, ఆదిలాబాద్ జిల్లా భీమేశ్వరం ప్రాంతానికి చెందిన జె.గంగన్న, జైనథ్కు చెందిన బి.అజయ్, బీంపూర్కు చెందిన ఎస్.లింగారెడ్డి విజయ్ని కలిశారు. ఈనెల 14న ఎన్టీపీసీలోని ఓ లాడ్జిలో కన్నం విజయ్ నుంచి రూ.30వేలు తీసుకుని కొంత ఇరీడియం లోహన్ని అందజేశారు. డొంక ఇలా కదిలింది... రెండ్రోజుల తరువాత మరికొంత లోహాన్ని తీసుకొస్తామని చెప్పి రాకపోవడంతో విజయ్ ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు ఆ కేసును సీసీఎస్కు అప్పగించారు. వారిపై నిఘా ఉంచిన పోలీసులు లోహాన్ని తరలిస్తున్న పై ఆరుగురిని బుధవారం ఎన్టీపీసీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు కిలోల ఇరీడియం లోహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఇరీడియం అసలా..? నకిలీనా..? అని తేల్చేందుకు ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. అసలుదైతే దాని విలువ రూ.50లక్షలు ఉంటుందనే అంచనా వేస్తున్నామని అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ రక్షిత కె.మూర్తి వివరించారు. ఛత్తీస్గఢ్నుంచి నుంచి రవాణా... అరుదుగా లభించే ఈ లోహాన్ని చత్తీస్గఢ్ గుట్టల నుంచి సేకరించి ఏటూరు నాగారం మీదుగా రవాణా చేస్తున్నారని తెలిపారు. ఇరీడియమ్ లోహం సేకరించే తిరుమణి నవీన్కుమార్, తునికి శంకరాచారి, మామిడిపెల్లి శ్రీనివాస్ పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. సీసీఎస్ ఏసీపీ చంద్రయ్య, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐలు ఎస్.ప్రసాద్, రమేష్ను అభినందించారు. -
రూ.2.50 కోట్ల గంజాయి పట్టివేత
- తణుకు నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా - పట్టుబడిన నిందితులు - 165 బస్తాల గంజాయి, లారీ స్వాధీనం నలుగురి అరెస్ట్ తొర్రూరు : అక్రమంగా తరలిస్తున్న రూ.2.50 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన తొర్రూరు మండల సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ శ్రీధర్రావు, ఎస్సై సుబ్బారెడ్డి కథనం ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా తణుకు నుంచి ఏపీ16టీఏ 0678 నంబర్ గల లారీలో అరటి పండ్ల గెలల మధ్య గం జాయి బస్తాలను ఖమ్మం వైపు నుంచి తొర్రూరు మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సై సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తెల్లవారుజామున దుబ్బతండా సమీపంలో వాహనాలను తని ఖీ చేస్తుండగా ఖమ్మం వైపు నుంచి వచ్చిన లారీలో గంజారుు తరలిస్తున్నట్లు బహిర్గతమైంది. దీంతో తణుకు ప్రాంతానికి చెం దిన లారీ డ్రైవర్ శ్రీనివాస్తోపాటు సురేష్, సతీష్, దుర్గాప్రసాద్తోపాటు లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీధర్రావు, ఎస్సై సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్ధార్ మేడిపె ల్లి సునీత సమక్షంలో పంచనామా చేయగా... మొత్తం 165 బస్తాలు ఉన్నారు. ఒక్కో బస్తాలో రెండు కేజీల చొప్పున 12 ప్యాకెట్లతో 24 కేజీల గంజాయి ఉంది. సుమారు 4 టన్నుల గంజాయి ఉంది. పట్టుబడిన గంజాయి విలువ రూ. 2.50 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తుండగా... మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కార్యక్రమంలో ఏఎస్సైలు లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, ఆర్ఐ శ్రీనివాస్, వీఆర్వో, పోలీసులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement