-
బీడీ కార్మికులకు న్యాయం చేయండి
ఖలీల్వాడి: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయాలని, కురుకురే ప్యాకెట్లు కొనాలని బీడీ కార్మికులపై ఒత్తిడి చేస్తున్న దేశాయి బీడీ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు బుధవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఏవో ప్రశాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కురుకురే ప్యాకెట్లు కొంటేనే కార్మికులకు ఆకు, తంబాకు వేస్తామని దేశాయ్ బీడీ యజమాన్యం కార్మికులను బెదిరిస్తున్నారని, 1000 బీడీలకు రూ.9చొప్పున తీసుకుంటున్నారని ఆరోపించారు. యజమాన్యంపై చర్యలు తీ సుకోకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హె చ్చరించారు. నాయకులు లక్ష్మి, సుజాత, ధనలక్ష్మి, విమలమ్మ, పద్మ, వసంత తదితరులున్నారు. -
కేజీఎఫ్ 2 టీజర్ ఎఫెక్ట్: యశ్కు నోటీసులు
బెంగళూరు: కేజీఎఫ్ 2 టీజర్ రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో రికార్డులు తిరగరాస్తున్నాడు రాఖీ భాయ్. యశ్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇక యూట్యూబ్లో కూడా కేజీఎఫ్ 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 48 గంటల్లోపే ఈ టీజర్ 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. ఈ రోజు వరకు యూట్యూబ్లో 147 మిలియన్స్కు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. 2.16 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. తొలి భాగానికి పది రెట్లు అదిరిపోయేలా కేజీఎఫ్-2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. (చదవండి: కేజీఎఫ్ ‘గరుడ’ ఎవరో తెలుసా..?!) అయితే రికార్డులు సృష్టిస్తోన్న`కేజీఎఫ్-2` టీజర్ వల్ల దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ మాత్రం చిక్కుల్లో పడ్డారు. వీరికి కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ నోటీసులు జారీ చేశారు. దానికి కారణం టీజర్ చివర్లో చూపించిన ఓ సన్నివేశం. టీజర్ చివర్లో హీరో యశ్ గన్తో వరుసగా వాహనాలను షూట్ చేసి వచ్చి ఆ తుపాకీ గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు. ఆ సీన్ చూపించేటపుడు `యాంటీ స్మోకింగ్ వార్నింగ్` వేయకపోవడమే ఈ అభ్యంతరానికి కారణమట. దాంతో స్టేట్ యాంటీ టొబాకో సెల్ వారికి నోటీసులు జారీ చేసింది. -
ఏం చేస్తారో?
నేడు పొగాకు బోర్డు సమావేశం రైతుల ఆశలన్నీ సమావేశం పేనే మర్రిపాడు: రాష్ట్రంలో 2016–17 పంట కాలానికి రైతులకు పొగాకు పండించేందుకు అనుమతులు, పొగాకు పంట పరిస్థితి, గిట్టుబాటు ధరలపై బుధవారం గుంటూరులో పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుండటంతో రైతుల ఆశలన్నీ సమావేశంపైనే ఉన్నాయి. పరిస్థితేంటంటే 2015–16 పంట కాలంలో దక్షిణ ప్రాంత తేలిక నేలలైన (ఎస్ఎల్ఎస్) ప్రాంతంలోని పొదిలి, కందుకూరు, కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో ఒక్కో బ్యారెన్కు 3400 కిలోలు పొగాకు పండించేందుకు అనుమతి ఇచ్చారు. అయినా అధిక శాతం రైతులు నష్టాల పాలయ్యారు. మార్కెట్లో ధరలు అంతంత మాత్రం ఉండడంతో రైతుల బాగోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా పొగాకు పంటపై శీతకన్ను వేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఏడాదైనా పరిస్థితి మారుతుందా? ఈ ఏడాది ప్రస్తుతం పొగాకు పంట అదును సమీపిస్తుండడంతో రైతుల పరిస్థితి ఏమిటోనంటూ సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నెల్లూరు జిల్లాలోని డీసీపల్లి కలిగిరి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు రైతులు పంట పండించేందుకు విస్తీర్ణం తగ్గిస్తారని, అంతే కాకుండా పొగాకు పంటకు అనుమతి కూడా తగ్గిస్తారని ప్రచారం సాగుతుండడంతో రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. 3400 కిలోలు బ్యారెన్కు అనుమతిస్తేనే గిట్టుబాటు కావడం లేదని, ఇంకా తగ్గిస్తే గిట్టుబాటు కాక పొగాకు పంటను సరిపెట్టుకోవాల్సి వస్తుందంటూ పలువురు రైతులు పేర్కొంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పొగాకు పంటను తగ్గించాలనే ఆశయంతోనే పొగాకు బోర్డుపై ఒత్తిడి తెచ్చి రైతులు పంట పండించేందుకు అనుమతి కూడా ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది పంట అనుమతి తగ్గిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల కనికరం చూపి పంట అనుమతిని తగ్గించుకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
నిలిచిన పొగాకు వేలం
ప్రకాశం: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి ఒకటో వేలం కేంద్రంలో పొగాకు వేలం మరోసారి నిలిచిపోయింది. వ్యాపారస్థులు కొనుగోళ్లను నిలిపివేశారు. తాము తీసుకొచ్చిన పొగాకును బయ్యర్లు కొనుగోలు చేయకపోవడంపై ముళ్లమూరు మండలం పోలవరం, బత్తూరివారిపాలెం క్లస్టర్కు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకొచ్చిన పొగాకు బేళ్లను తిరిగి ఇళ్లకు తీసుకెళ్లి మళ్లీ వేలం కేంద్రానికి తీసుకురావాలంటే ఒక్కో బేడుకు ఐదారు కేజీల వరకూ తరుగు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీల గుమస్తాలు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆగ్రహంతో పొగాకు బేళ్లను వేలం కేంద్రం వద్దే వదిలేసి వెళ్లిపోయారు. -
మద్దిపాడులో నిలిచిన పొగాకు కొనుగోళ్లు
మద్దిపాడు (ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా మద్దిపాడులోని పొగాకు రెండో వేలం కేంద్రం వద్ద గురువారం ఉదయం కొద్దిసేపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. సరైన ధర లభించకపోవటంతో గిట్టుబాటు కావటం లేదని రైతులు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలం కేంద్రం సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు జోక్యం చేసుకున్నారు. ప్రైవేటు కంపెనీలతో మాట్లాడి, సరైన ధర చెల్లించాలని కోరారు. ఫలితంగా రైతులు ఆందోళన విరమించటంతో గంట తర్వాత కేంద్రంలో కొనుగోళ్లు మొదలయ్యాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement