-
USA: మాస్కో ఉగ్ర దాడులు.. ట్రంప్ పాత వీడియో వైరల్
వాషింగ్టన్: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రవాదుల దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు. ‘ఒబామా ఐసిస్ ఫౌండర్. ఐసిస్ ఆయనను గౌరవిస్తోంది. ఐసిస్ కో ఫౌండర్ హిల్లరీ క్లింటన్’ అని వీడియోలో ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మాస్కో దాడుల తర్వాత ట్రంప్ స్పందన అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది తాజా వీడియో కాదని, మాస్కో దాడులపై ట్రంప్ మాట్లాడిన వీడియో కాదని తేలింది. ఈ వీడియో 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడిన వీడియో అని, దీనిని మాస్కోలో తాజాగా జరిగిన ఐసిస్ మారణహోమానికి ముడిపెట్టి మళ్లీ వైరల్ చేస్తున్నారని తేల్చారు. మాస్కోలో శనివారం(మార్చ్ 23) జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ట్రంప్ ఇంకా తన స్పందన తెలియజేయలేదు. Big Statement By Donald Trump. He said, "Obama is the fuckin founder of ISIS. I'll never let you go Obama "#Russia #Moskau #MoscowAttack pic.twitter.com/4dRJRY5Phu — Umair Ali (@UmairAli_7) March 23, 2024 ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
నువ్ తొత్తువి నిన్ను లేపేస్తా!
నువ్ తొత్తువి నిన్ను లేపేస్తా! -
ఈ తోక వంకర తీసేదెట్లా?
కొత్త ఏడాది ఇలా ఆరంభమవుతుందని కశ్మీర్ ప్రజలు ఊహించలేదు. అందరూ శాంతి, సంతోషాలను కోరుకుంటున్న వేళ జమ్ములో తీవ్రవాదం జడలు విప్పి, 12 గంటల్లో ఆరుగురిని పొట్టనబెట్టుకున్న తీరు మనసును కలచివేస్తుంది. కశ్మీర్ లోయతో పోలిస్తే ప్రశాంతమైన జమ్ములో ఇలాంటి ఘటన జరగడం విషాదం. 2019లో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ ప్రకటించిన జమ్ము– కశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా తీవ్రవాదులు ఈ దుశ్చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. ఇది పాక్ ప్రేరేపిత తీవ్రవాద చర్య అని అర్థం చేసుకోవడం బ్రహ్మవిద్యేమీ కాదు. కాకపోతే, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ, తీవ్రవాద కేంద్రస్థానంగా పాకిస్తాన్ను ప్రస్తావించి, ఈ ధోరణిని మార్చుకోవాలంటూ హితవు చెప్పిన పక్షం రోజులకే ఈ ఘాతుకం జరగడం శోచనీయం. మారని పాక్ వక్రబుద్ధికి మరో తార్కాణం. తాజా ఘటన పూర్వాపరాలు దిగ్భ్రాంతికరం. జమ్ము–కశ్మీర్ సరిహద్దు జిల్లాలో రజౌరీ పట్నానికి 8 కిలోమీటర్ల దూరంలోని ధాంగ్రీలో జనవరి 1 సాయంత్రం 7 గంటల వేళ ఖాకీ దుస్తులు ధరించిన తీవ్రవాదులు అక్కడి అల్పసంఖ్యాక వర్గానికి చెందిన మూడు ఇళ్ళలోకి జొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి, నలుగురు పౌరుల ప్రాణాలు తీశారు. పలువురిని గాయపరిచి, అక్కడ నుంచి ఉడాయించారు. ఆ తుపాకీ దాడులు ముగిసిన కొద్ది గంటల్లోనే ఆ ఇళ్ళ దగ్గరే ఒక చోట తీవ్రవాదులు ఉంచిన బాంబులు పేలి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. దర్యాప్తుకు వచ్చే భద్రతాదళ ఉన్నతాధికారులే లక్ష్యంగా ఆ బాంబులు పెట్టడం, ఆధార్ కార్డుల ద్వారా గుర్తుపట్టి మరీ ఎంపిక చేసినవారినే తుపాకీ కాల్పులతో చంపడం తీవ్రవాదుల కక్షను తేటతెల్లం చేస్తోంది. కశ్మీర్లో తీవ్రవాదం వైపు కొత్తగా ఆకర్షితులవుతున్నవారిని వేగంగా నిర్వీర్యం చేస్తున్నామని అక్కడి ఉన్నతాధికారుల ఉవాచ. నిన్న గాక మొన్న ముగిసిన 2022లో 100 మంది కొత్తగా తీవ్రవాద మార్గంలోకి రాగా, 65 మందిని ఎన్కౌంటర్ చేశామనీ, వారిలోనూ 58 మందిని (89 శాతం) చెడు దోవ తొక్కిన తొలి నెలలోనే మట్టికరిపించామనీ లెక్కలు చెబుతున్నారు. ఎంతమంది తీవ్ర వాదులు కొత్తగా వస్తున్నదీ, పోతున్నదీ మన పాలకులు, పోలీసులు ఇంత నిర్దుష్టంగా చెప్పగలగడం ఆశ్చర్య మైతే, వారి ప్రతి అడుగూ ఇంత తెలిసినవారు అడ్డుకట్ట వేయలేకపోవడం అమితాశ్చర్యం. పైగా, ఆదివారం దాడి తర్వాత ఆ రాత్రి అణువణువూ జల్లెడ పట్టామని భద్రతా దళాలు చెప్పినా, ఆ దగ్గరే దుండగులు పెట్టిన బాంబులు మర్నాడు పేలి మృతులు పెరగడం మన పనితీరును ప్రశ్నిస్తోంది. రజౌరీ జిల్లాలో కొన్నిచోట్ల ముప్పుందని కొంతకాలంగా అనుమానిస్తున్నారు. గాలింపులూ జరిగాయి. అయినా సరే ఇలా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు సాగడం అటు తీవ్రవాదుల తెగింపుకూ, ఇటు మన భద్రతా వైఫల్యానికీ నిలువుటద్దం. జిల్లాలో ఓ సైనిక శిబిరం బయట కాల్పుల్లో ఇద్దరు పౌరుల ప్రాణాలు పోయిన రెండు వారాల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. సరిహద్దులోని అల్పసంఖ్యాకులే గురిగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు చేస్తున్న ఈ అరాచకం దాయాది దేశం సాధించదలుచుకున్నదేమిటో చెప్పకనే చెబుతోంది. పొరుగు దేశాలన్నిటితో భారత్ సదా సత్సంబంధాలే కోరుకుంటుంది. అలాగని తీవ్రవాదాన్ని బూచిగా చూపించి మనల్ని చర్చలకు తలొగ్గేలా చేయాలనుకుంటే కుదిరేపని కాదు. ఆ మాటే ఆ మధ్య జైశంకర్ కుండబద్దలు కొట్టారు. జైశంకర్ సోమవారం వ్యాఖ్యానించినట్టు, అనేక దశాబ్దాలుగా సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పద్ధతులను యూరోపియన్ దేశాలు సహా అంతర్జాతీయ సమాజం నిర్ద్వం ద్వంగా ఖండించకపోవడం మరీ ఘోరం. తీవ్రవాదాన్ని సహించబోమని జబ్బలు చరిచే అమెరికా సైతం భారత్తో భుజం భుజం కలుపుతూనే, పాక్తోనూ మంచిగా ఉంటోంది. 2018లో ట్రంప్ హయాంలో పెట్టిన నిషేధాన్ని తొలగిస్తూ, బైడెన్ హయాంలో అమెరికా గత ఏడాది పాక్తో ఎఫ్16 విమానాల ఒప్పందం పునరుద్ధరించింది. తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో పాక్ భాగస్వామి గనకనే ఈ సైనిక, రక్షణ సాయమన్న అమెరికా మాట అతి పెద్ద జోక్. ఇక, ఇటీవలే భారత్, పాక్లలో దేన్నీ తాము వదులుకోలేమంటూ విదేశాంగ ప్రతినిధి చేసిన వ్యాఖ్య అగ్రరాజ్యపు నైజానికి తార్కాణం. మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల వ్యాపారం సహా అంతర్జాతీయ నేరాలెన్నో ముడిపడిన సీమాంతర తీవ్రవాదాన్ని కేవలం ఫలానా దేశపు తలనొప్పి లెమ్మని ఊరకుంటే ముప్పు మీదకొ స్తుంది. రోజూ తీవ్రవాదుల్ని భారత్కు ఎగుమతి చేస్తున్న పొరుగుదేశం పక్కలో పాము లాంటిదే. గతంలో హిల్లరీ క్లింటన్ అన్నట్లు, ‘పెరట్లో పాములను పెట్టుకొని, అవి కేవలం పొరుగువాణ్ణే కాటేస్తాయనుకుంటే పొరపాటే!’ ఆ సంగతి అమెరికా సహా అంతర్జాతీయ దేశాలన్నీ గ్రహించాలి. భారత్ సైతం పాక్పై అంతర్జాతీయ వేదికలపై ధ్వజమెత్తుతూనే, అమెరికా పైనా కన్నేసి ఉంచాలి. మన పాలకులు కశ్మీర్ లోయలో పండిట్లు సహా స్థానికులపై తీవ్రవాద దాడులు 2019 తర్వాత పెరిగిన చేదునిజాన్ని గుర్తించాలి. తీవ్రవాదుల్ని కాక తీవ్రవాదాన్ని అంతం చేసే పనికి దిగాలి. స్థానికుల ఆశలు, ఆకాంక్షలకు పెద్ద పీట వేస్తూ, వారే పాలకులయ్యేలా చూడాలి. సానుకూల వాతావరణం కల్పించి, ఇప్పటికే అపరిమితంగా ఆలస్యమైన అసెంబ్లీ ఎన్నికలను జరిపించి, స్థానిక ప్రభుత్వ ఏర్పాటుతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అదే మార్గం. -
Targeted Attacks: నిన్న ఇంట్లోకి చొరబడి కాల్పులు.. నేడు బాంబు దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో మైనారిటీ వర్గం లక్ష్యంగా ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. రాజౌరికి 8 కిలోమీటర్ల దూరంలోని అప్పర్ డాంగ్రి గ్రామంలో ఆదివారం ఇళ్లల్లోకి చొరబడి కాల్పులు జరిపిన సంఘటన నుంచి తేరుకోకముందే మరోమారు దాడి చేశారు. బాధితుల ఇంటి సమీపంలోనే సోమవారం భారీ పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నాటి కాల్పుల్లో మొత్తం నలుగురు మృతి చెందగా.. సోమవారం నాటి బాంబు దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘మొదటి కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలోనే పేలుడు జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రాంతంలోనే మరో ఐఈడీని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశాం.’అని స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం నాటి ఘటన బాధ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలోనే ఈ భారీ పేలుడు జరగటం తీవ్ర కలకలం రేపింది. రూ.10లక్ష పరిహారం, ప్రభుత్వం ఉద్యోగం.. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం, ఇంట్లో అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. గాయపడిన వారికి రూ.1 లక్ష సాయం అందిస్తామని తెలిపారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, కారకులను చట్టంముందు నిలబెడతామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఆందోళనలు.. మైనారిటీలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరగటంపై రాజౌరీలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు స్థానికులు. తమ ప్రాణాలు రక్షించటంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. నిరసనకారులను కలిసేందుకు వెళ్లిన క్రమంలో జమ్ముకశ్మీర్ బీజేపీ చీఫ్ రవిందర్ రైనాను అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, లెఫ్టినెంట్ గవర్నర్ తమ వద్దకు వచ్చి డిమాండ్లు వినాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి -
'2009 తర్వాత మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారాయి'
2009లో పాకిస్తాన్లో పర్యటనకు వచ్చిన లంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆరోజు బస్సుపై కురిసిన బులెట్ల వర్షానికి లంక జట్టులో పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. వీరిలో థిల్లాన్ సమరవీర, తిలకరత్నే దిల్షాన్, అజంతా మెండిస్, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, సురంగ లక్మల్, చమిందా వాస్ సహా మరికొంత మంది క్రికెటర్లు ఉన్నారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు చనిపోగా.. ఇద్దరు పౌరులు బలయ్యారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు మిగతా దేశాలు నిరాకరించాయి. అప్పటినుంచి దాదాపు 2019 వరకు అంటే పదేళ్ల పాటు ఏ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటించడానికి ఇష్టపడలేదు. పాక్ ఏదైనా హోం సిరీస్ ఆడాలంటే యూఏఈకి రావాల్సిందే. దీంతో పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్లు జరగక అక్కడి మైదానాలన్ని వెలవెలబోయాయి. బోర్డు నుంచి సహాయం లేకపోవడంతో క్రికెట్ మైదానాలను మూసే పరిస్థితి కూడా వచ్చింది. తాజా పరిస్థితి చూస్తే పాకిస్తాన్లో కాస్త మార్పు కనిపిస్తుంది. 2019లో శ్రీలంక రెండు టెస్టులు ఆడేందుకు పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే.. పాక్లో ఆడేందుకు జంకిన ఇతర దేశాలు లంకతో సిరీస్ను పాక్ నిర్వహించిన తీరుపై నమ్మకం వచ్చి క్రికెట్ ఆడేందుకు ఒప్పుకున్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లు కూడా పాక్ గడ్డపై పర్యటించాయి. దశాబ్దం నుంచి క్రికెట్ మ్యాచ్లు లేక మూగబోయిన మైదానాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ అంశంపై స్పందించాడు. ''2009లో లంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. మా దేశంలోని మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారిపోయాయి. మా మైదానాల్లో క్రికెట్ ఆడాలని మాకున్నప్పటికి పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. మైదానాల్లో ప్రేక్షకులు మిస్సయ్యాం. అప్పటి బాధ వర్ణణాతీతం. ఈ పదేళ్లలో దేశంలో ఎంతో మార్పు వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు దేశ ప్రభుత్వం క్రికెట్ను బతికించేందుకు చొరవ తీసుకుంది. మేము కూడా విదేశీ లీగ్ల్లో ఆడే సమయంలో విదేశీ ఆటగాళ్లతో మాట్లాడేవాళ్లం. వాళ్లను క్రికెట్ ఆడేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాం. పాక్లో మళ్లీ క్రికెట్ ఆడేందుకు పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో పాకిస్తాన్ నుంచి మిగతా దేశాలకు క్రికెట్ సురక్షితంగా ఆడుకోవచ్చు అనే భరోసా కల్పించేలా చేశాం. ఇప్పుడు ఆ ఇబ్బందికర దశ మారింది. పాకిస్తాన్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లు పర్యటించాయి. రానున్న కాలంలో మరిన్ని జట్లు పర్యటనకు వస్తాయని ఆశిస్తున్నా. ఇక క్రికెట్ గ్రౌండ్స్ ప్రేక్షకులతో నిండిపోతుండడం సంతోషంగా అనిపిస్తుంది. ''అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ ఆఖరిమెట్టుపై బోల్తా పడింది. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలయ్యింది. బెన్ స్టోక్స్, సామ్ కరన్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ రెండోసారి చాంపియన్గా అవతరించింది. సూపర్-12 దశలోనే ఇంటిముఖం పట్టాల్సిన పాకిస్తాన్ అనూహ్యంగా సెమీస్ చేరడం.. అక్కడ కివీస్ను ఓడించడం.. ఆపై ఫైనల్కు వెళ్లింది. ఇక ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన పాక్ రన్నరప్గా నిలిచింది. చదవండి: టీమిండియా ఫేవరెట్ ఏంటి..? ఆ జట్టుకు అంత సీన్ లేదు.. నాన్సెన్స్..!
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సీఎస్కేతో ఎస్ఆర్హెచ్ పోరు.. తుది జట్లు ఇవే
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement