-
బెంగళూరు కేఫ్ టెర్రరిస్టులు ఎలా దొరికారంటే?
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబు పేలుడు గుర్తుంది కదా..! మార్చి 1, 2024న బెంగళూరు వైట్ఫీల్డ్లోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే ఉగ్రవాద ఘటనలకు చాలా రోజులుగా బ్రేక్ పడ్డ తర్వాత ఈ ఘటన జరగడం అందరినీ షాక్కు గురి చేసింది. ఈ కేసులో నిందితులు తాము చేసిన ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయారు. పక్కాగా ప్లాన్ చేసి తప్పించుకున్నారు ముసావీర్ హుసేన్ షాజీబ్, అబ్దుల్ మతీన్ తాహ.. ఇద్దరు ఉగ్రవాద శిక్షణలో ఆరితేరారు. పక్కాగా స్కెచ్ వేసి బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ను ఎంచుకున్నారు. ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలన్నది వీళ్ల కుట్ర. రెక్కీల తర్వాత మార్చి 1, శుక్రవారం రోజున తమ ప్లాన్ అమలు చేశారు. రామేశ్వరం కేఫ్లో బాంబు పేలగానే జారుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి కేసు దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే నిందితులు సరిహద్దులు దాటేశారు. సిసి టీవీ ఫుటేజ్ సేకరించిన NIA.. నిందితుల జాడ చెప్పిన వారికి పది లక్షల బహుమానం ప్రకటించింది. అబ్బో.. ఎన్ని జాగ్రత్తలో.? బెంగళూరు నుంచి బయటపడ్డ నిందితులిద్దరూ.. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాంబు అమర్చిన హుస్సేన్ షాజీబీ (30), తెర వెనక మాస్టర్మైండ్ మథీన్ థాహ (30) తమ ఆహార్యాన్ని మార్చేశారు. పశ్చిమబెంగాల్లోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 సిమ్ కార్డులు మార్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. కొత్త పేర్లు చెప్పి లాడ్జ్లు తీసుకున్నారు. వీలైనంత వరకు తక్కువ ఖరీదు ఉండే మాస్ ఏరియాల్లో.. పోలీసు గస్తీ ఎక్కడయితే తక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రమే ఎంచుకున్నారు. స్కాన్ చేసి చెల్లించే UPI పేమెంట్ ఎక్కడా చేయలేదు, కేవలం నగదు మాత్రమే చెల్లించి భోజనం, కావాల్సిన వస్తువులు కొన్నారు. ఓ జిరాక్స్ సెంటర్లో ఆధార్ కార్డులను, డ్రైవింగ్ లైసెన్స్లను సేకరించిన వీరిద్దరు.. వాటితో ఫేక్ ఐడెంటిటీ కార్డులను తయారు చేసి వాడారు. వీరికి ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు సమకూరేవని దర్యాప్తులో తేలింది. చిక్కరు.. దొరకరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్కు వచ్చిన నిందితులు అక్కడ ఒక హోటల్లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. ఒకసారి ఒక పని మీద వాడిన సిమ్ను వెంటనే మార్చేవారు. అలా 35 సిమ్కార్డులను చేతిలో ఉంచుకున్నారు. ఒక్కో పనికి ఒక్కో సిమ్ చొప్పున వాడడం పక్కనబెట్టడం. పని పూర్తి కాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం. ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పైగా ఈ సిమ్ కార్డులన్నీ నకిలీ అడ్రస్లు ఉపయోగించి సేకరించినవే. కొన్ని తమిళనాడు పేరుతో ఉన్నవయితే.. మరికొన్ని మహారాష్ట్ర, ఢిల్లీలోని ఫేక్ అడ్రస్లు, ఆధార్లతో సేకరించిన సిమ్ కార్డులు. ఈ సిమ్లను వినియోగించినా.. వీళ్ల ఆచూకీ NIA పసిగట్టలేకపోయింది. ఏ చిన్న ఆధారం దొరికినా.. తప్పుడు అడ్రస్ల కారణంగా దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. ఆడింది ఆట.. పాడింది పాట హోటల్లో రూం తీసుకునేటప్పుడు రిజిస్టర్లో తమ పేర్లు కాకుండా నకిలీ పేర్లు రాశారు. కొన్ని సార్లు పొరపాటున అసలు పేరు రాసి కొట్టివేసి నకిలీ పేర్లు రాశారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చెన్నెకు వెళుతున్నామని.. ఇలా తోచిన కారణాలను హోటల్ సిబ్బందికి చెప్పారు. నకిలీ ఆధార్ కార్డులు చూపారు. స్థానికంగా వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తూ జల్సా చేశారు. కోల్కతాలో మూడు హోటల్స్లో ఎప్పటికప్పుడు మకాం మార్చారు. చిన్న కారణంతో చిక్కారు మకాం మార్చుతూ పశ్చిమబెంగాల్లోని చాంద్నీ అనే ప్రాంతానికి వచ్చిన వీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వీళ్లిద్దరిలో ఒకరు వాడుతున్న మొబైల్ కింద పడడంతో ఫోన్లో స్పీకర్ పాడయింది. దీన్ని రిపేర్ చేయించేందుకు.. ఫోన్లోని సిమ్ కార్డు తీసేసి.. దగ్గరలోని రిపేర్ షాప్ మైక్రోమాజిక్ ఇన్ఫోటెక్ అనే చిన్న మొబైల్ షాప్కు తీసుకెళ్లారు. ఫోన్ను పరిశీలించిన మొబైల్ షాపు మెకానిక్.. స్పీకర్ పని చేస్తుందా లేదా అని తెలియడానికి షాప్ కీపర్ తన దగ్గరున్న సిమ్ను ఫోన్లో వేసి రిపేర్ చేశాడు. అప్పటికే IMEA నంబర్పై నిఘా పెట్టిన NIA అధికారులు.. సిమ్ వేయగానే దాని ఆధారంగా అడ్రస్ కనిపెట్టారు. ఈ సారి మాత్రం పక్కాగా ఒరిజినల్ అడ్రస్ దొరికింది. మొబైల్ లొకేషన్ను సంపాదించిన అధికారులు.. కొన్ని గంటల్లోనే చాంద్నీ ప్రాంతానికి చేరుకున్నారు. షాప్ కీపర్ ఇచ్చిన విలువైన సమాచారంతో నిందితుల జాడ పట్టేశారు. వేర్వేరు హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, ఎన్ఐఏ బృందాలు సేకరించారు, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ఉగ్రవాదులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో దాడులకు పాల్పడ్డ నలుగురిలో ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దాడులకు పాల్పడ్డ అనుమానితుల్ని అరెస్టు చేసిన అనంతరం ఆదివారం(మార్చి 24) వారిని మాస్కోలోని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కచేరిలో కాల్పులు జరిపింది తామేనని ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు ఒప్పుకున్నారు. దీంతో.. మొత్తం నలుగురికీ మే 22 వరకు కోర్టు ప్రి ట్రయల్ కస్టడీ విధించింది. కాల్పులకు పాల్పడిన నలుగురు తజికిస్థాన్కు చెందినవారని తేల్చారు. కోర్టుకు తీసుకువచ్చినపుడు నలుగురి శరీరాలు గాయాలమయమై రక్తమోడుతున్నాయి. ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 22 రాత్రి మాస్కో శివార్లలోని ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు తామే కారణమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే దాడులకు ఉక్రెయిన్కు లింకు ఉందని, దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్కు పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఇదీ చదవండి.. ఉక్రెయిన్పై రష్యా మిసైళ్ల వర్షం -
Putin: ‘మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్తో లింక్’
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. మాస్కోలో చోటు చేసుకున్న నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదలకు ఉక్రెయిన్తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. ‘మాస్కోలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉక్రెయిన్ వైపు పారిపోవడానికి యత్నించారు. తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఉక్రెయిన్-రష్యా సరిహద్దులను క్రాస్ చేసి ఉక్రెయిన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు’ పుతిన్ స్థానిక టెలివిజన్తో మాట్లాడుతూ ఆరోపించారు. ‘ఈ ఉగ్రదాడి వల్ల వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాధకరమైన రోజు. ఈ దారుణమైన దాడికి పాల్పన వ్యక్తులు, ఉగ్రసంస్థలను శిక్షిస్తాం. వారు ఎవరైనా.. వారికి వెనక ఎవరున్నా కోరుకోం. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తాం. రష్యా ప్రజలకు వ్యతిరేకంగా దాడులకు ప్రణాళిక వేసిన వారిని గుర్తించి శిక్షిస్తాం’ అని పుతిన్ హెచ్చరించారు. మాస్కో దాడి వెనకాల ఉక్రెయిన్కు లింక్ ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ‘మాస్కో ఉగ్రదాడిలో ఉక్రెయిన్కు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఉగ్రదాడికి మాకు లింక్ ఉందన్న ఆరోపణలు నిరాధారమైనవి’ అన ఉక్రెయిన్ మిలిటరీ స్పై ఏజెన్సీ స్పష్టం చేసింది. రష్యాలోని మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 133 మంది మరణించారు. వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మరోవైపు.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
Russia: మాస్కోలో ఐసిస్ భారీ ఉగ్రదాడి
మాస్కో: రష్యా రాజధానిలో ఉగ్రవాదులు(ISIS) నరమేధానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందగా, వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు. మాస్కో శివారులోని క్రోకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో సైనిక దుస్తుల్లో కాన్సర్ట్హాల్లోకి వచ్చిన ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. తుపాకుల మోత నడుమ.. ఏం జరుగుతుందో అర్థకాక తీవ్ర భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హాల్లో చిక్కకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారి కోసం భారీగా అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. అతి సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపిన దాడి వీడియోలు బయటికొచ్చాయి. Horrifying visuals of the terror attack coming out of Moscow. The carnage is unimaginable. Devastating to say the least. This world needs peace and sanity. pic.twitter.com/sWFc4mTjVK — Supriya Shrinate (@SupriyaShrinate) March 22, 2024 The scary footage where people are running during the attack.#Moscou #Moskou #CrocusCityHall #Moscow #Russia #terrorist pic.twitter.com/gJchCa8zrU — Reality Talks (@RealityTallk) March 23, 2024 Very sad to hear what happened in #Moscow Praying for them 💔 pic.twitter.com/UUMcl9RsmI — Follow Back (@FzlMah) March 22, 2024 దాడి సమాచారం అందుకున్న ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారాయన. దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని పుతిన్ పేర్కొన్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పుతిన్ దేశాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రష్యాలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే అని చెబుతున్నారు. దాడి మా పనే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ISIS-Islamic State of Iraq and Syria) మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్కు ఉగ్ర బెదిరింపులు
భారత్-ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్కు ఉగ్రవాద బెదింపులు వచ్చాయి. ఈ మ్యాచ్కు ఆటంకం కలిగిస్తానని నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ సోషల్మీడియాలో ఓ బెదిరింపు వీడియోను పోస్ట్ చేశాడు. మ్యాచ్కు అంతరాయం కలిగించాలని పన్నున్ సీపీఐ మావోయిస్ట్ పార్టీకి విజ్ఞప్తి చేశాడు. ఈ ఉదంతంతో అలర్ట్ అయిన రాంచీ పోలీసులు టెస్ట్ మ్యాచ్కు భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనంగా వెయ్యి మంది పోలీసులను మొహరించినట్లు రాంచీ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పన్నున్పై బెదిరింపు కేసును నమోదు చేశారు. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఎవరీ పన్నున్.. భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్కు ఆటంకం కలిగిస్తానని బెదిరించిన పన్నున్.. కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు. ఇతను అమెరికా, కెనడా దేశాల్లో ఉంటూ పంజాబ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేక ఖలిస్తాన్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటాడు. ఇతనిపై యాంటి టెర్రర్ ఫెడరల్ ఏజెన్సీ 2019లో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి పన్నున్ ఎన్ఐఏ నిఘాలో ఉన్నాడు. ఫిబ్రవరి 3, 2021న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు పన్నున్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2023 నవంబర్ 29న పన్నున్ను ప్రత్యేక నేరస్థుడిగా ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటికే మూడు టెస్ట్ మ్యాచ్లు అయిపోయాయి. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్కోట్లో జరిగిన మూడో టెస్ట్ల్లో టీమిండియా విజయాలు సాధించింది. ఈ సిరీస్లోని నాలుగో టెస్ట్ రాంచీలో, ఐదు టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement