-
సంక్రాంతికి టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్
అఫ్జల్గంజ్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. రానూపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్కి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. పెద్ద పండుగకి ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు గానూ 10 శాతం రాయితీని ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. -
హై..హై..వైఫై
- ప్రయాణికులకు 5జీ సేవలు - త్వరలో ఎంజీబీఎస్, జేబీఎస్లలోఅందుబాటులోకి.. - మొదటి 15 నిమిషాలు ఉచితం సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులకు వైఫై సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. 5జీ సామర్ధ్యం కలిగిన వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానుంది. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లలో త్వరలో ఈ సేవలను ప్రారంభించనున్నారు. దీంతో మొదటి 15 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి. ఆ తరువాత నెట్వర్క్ను కొనసాగించదలుచుకున్న వారు కూపన్లు కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో ఎంజీబీఎస్లో నిత్యం సుమారు లక్షా 25 వేల మందికి... జేబీఎస్లో మరో 40 వేల మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగనుంది. స్మార్ట్ఫోన్లు ఉన్న వారు నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం రాష్ర్ట రాజధానిలోని ప్రధాన బస్స్టేషన్లకే పరిమితమైన వైఫై సేవలను దశల వారీగా అన్ని జిల్లా కేంద్రాలకు... అక్కడి ప్రధాన బస్స్టేషన్లకు విస్తరించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. 5జీ సామర్ధ్యం కలిగిన సేవలను ఆర్టీసీయే మొట్టమొదట వినియోగంలోకి తె స్తోందని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్వర్క్తో బస్స్టేషన్లను అనుసంధానం చేయనున్నారు. పటిష్టంగా భద్రత... మరోవైపు బస్స్టేషన్లలో ప్రయాణికుల భద్రతకు మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మహాత్మాగాంధీ బస్స్టేషన్లో ప్రస్తుతం 15 సీసీ కెమెరాలు ఉన్నాయి. త్వరలో మరో 40 ఏర్పాటు చేయనున్నారు. జేబీఎస్లోనూ ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనంగా 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. దీంతో బస్స్టేషన్లలోని అన్ని వైపులా నిఘా మరింత కట్టుదిట్టం కానుంది. -
స్మార్ట్ ఫోన్లో.. సిటీబస్సు సమాచారమ్
మహానగరంలో సిటీబస్సు ప్రయాణం అంటే కత్తి మీద సాము లాంటిదే. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో చెప్పలేం. అసలు పలానా రూట్లో సిటీ బస్సు సౌకర్యం ఉందా? లేదా అన్నదీ చెప్పడం కష్టమే. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణ సంస్థ ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఇది నగర ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మరి ఈ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..? ఎలా వాడు కోవాలి..? తదితర విషయాలు మీకోసం... ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. ⇒ మొదట https://play.google.com/store/apps/details?id=com.apsrtc&hl=en&rdid=com.apsrtc లింక్ను క్లిక్ చేయండి. ⇒ ఇక్కడ విండోలో ‘హైదరాబాద్ ఆర్టీసీ ఇన్ఫో’ అని కనిపిస్తుంది. దానికింద ఉన్న ‘ఇన్స్టాల్’ ఆఫ్షన్ను క్లిక్ చేయండి. ⇒ ఇప్పుడు మిమ్మల్ని ‘సైన్ ఇన్’ అవ్వమని కోరుతుంది. ⇒ మీకున్న జీ మెయిల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి. ⇒ తిరిగి ఇన్స్టాల్ ఆఫ్షన్ను క్లిక్ చేస్తే మీ మొబైల్లో యాప్ ‘డౌన్లోడ్’ అవుతుంది. యాప్ను ఇలా వాడుకోండి.. ⇒ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత మొబైల్ స్క్రీన్పై ‘హైదరాబాద్ ఆర్టీసీ’ విండో కనిపిస్తుంది. ⇒ ఇక్కడ మీకు ‘బస్సు డిటైల్స్’, ‘ఫ్రం-టూ’, ‘లొకేషన్’, ‘రియల్ టైం’, ‘మై అకౌంట్’, ‘ఫీడ్బ్యాక్’, ‘క్లోజ్’ ఆఫ్షన్స్ కనిపిస్తాయి. ⇒ మొదటి రెండు ఆఫ్షన్లు మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి. బస్ వివరాలు ఇలా.. ⇒ ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న ‘సెలక్ట్’ ఆఫ్షన్లో మనకు కావాల్సిన బస్ నంబరును ఎంచుకోవాలి. ⇒ ఇప్పుడు ఫోన్ స్క్రీన్పై సంబంధిత బస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సర్వీసు ఉంది, ఏయే రూట్లలో వెళ్తుంది, ముఖ్యమైన బస్ స్టాపుల వివరాలు కనిపిస్తాయి. ఫ్రం-టూ.. ⇒ ఇక్కడ కనిపిస్తున్న ‘ఫ్రం’ ఆఫ్షన్లో మీరు ఎక్కడ నుంచి బస్ ఎక్కదలిచారో ఆ ప్రాంతాన్ని ఎంటర్ చేయాలి. ⇒ ‘టూ’ ఆఫ్షన్లో ఎక్కడికి వెళ్లాలో ఆ ప్రాంతం పేరు ఎంటర్ చేయాలి. ⇒ ఇప్పుడు మీరు కోరుకున్న రూట్లో ఏయే బస్సులు అందుబాటులో ఉన్నాయి, వాటి సర్వీసు నెంబరు, అవి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తాయి తదితర వివరాలు కనిపిస్తాయి. లొకేషన్.. ‘లొకేషన్’ ఆఫ్షన్లో కనిపిస్తున్న బస్ డిపోను ఎంచుకోవాలి. ఇక ఆ డిపో నుంచి ఏయే బస్ సర్వీసులు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నాయి తదితర విషయాలు స్క్రీన్పై కనిపిస్తాయి. నోట్: అందుబాటులో ఉన్న సర్వీసులతో పాటుగా వాటి వయా రూట్ వివరాలు, వాటి టికెట్ ధరలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే దీన్ని సులువుగా ఉపయోగించుకోవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement