-
మహిళా పక్షపాతి సీఎం జగన్
సాక్షి, అమరావతి/పెనమలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతి అని, నామినేటెడ్ పదవులతోపాటు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతానికి మించి అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి కొనియాడారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్కు మహిళలంతా ఎప్పుడూ రుణపడి ఉంటారన్నారు. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్పర్సన్, ఆర్టీసీ బోర్డు డైరెక్టర్గాను నియమితులైన ఆమె శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పెనమలూరులో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా కార్మికుల బాధలు తీర్చేందుకు చొరవ తీసుకున్నారన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం చేయడానికి, ఆర్టీసీ స్థలాల్లో వాణిజ్య, వ్యాపార నిర్వహణ ద్వారా ఆదాయం పెంపునకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ఆదుకున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్కుమార్, డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ టి.కల్పలత, ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, వైస్ చైర్మన్ చిన్నపరెడ్డి విజయానందరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు. -
వంతెన నిర్మాణానికి అధికారుల హామీ
వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని తోట్లవల్లూరు : తోట్లవల్లూరు-పాములలంక మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి అధికారులు హామీ ఇచ్చారని వైఎస్సార్సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి తెలియజేశారు. ఆదివారం మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో లంక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వంతెన నిర్మాణ ఆవశ్యకత గురించి ఇరిగేషన్ ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన వంతెన నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు వచ్చాయని చెప్పారన్నారు. రూ.14 కోట్లకుపైగా వ్యయంతో మరో మూడు నెలల్లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారని పద్మావతి తెలిపారు. వంతెన నిర్మాణంతో లంక గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని పద్మావతి ఆశాభావం వ్యక్తం చేశారు. -
నట్టేట ముంచిన చంద్రబాబు
రుణమాఫీ పేరుతో వంచన అధికారం కోసమే దొంగ హామీలు అమలు చేయాల్సిందే జెడ్పీ ఫ్లోర్ లీడర్ పద్మావతి తోట్లవల్లూరు : రుణమాఫీ పేరుతో సీఎం నారా చంద్రబాబునాయుడు రైతులను, మహిళలను నట్టేట ముంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యురాలు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి విమర్శించారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రుణమాఫీ ఓ పెద్దడ్రామాలా కనబడుతుందన్నారు. రిజర్వుబ్యాంకు రీషెడ్యూల్కు కూడా ససేమిరా అంటుంటే టీడీపీ నేతలు మాత్రం రీషెడ్యూల్ అని ఒకరోజు, మాఫీ చేస్తామంటూ మరొక రోజు అస్పష్టమైన ప్రకటనలు చేస్తూ రైతులను అయోమయంలోకి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన అనివార్యమని, కొత్త రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉంటుందని తెలిసి కూడా అధికారమే పరమావధిగా బాబు ఎన్నికల్లో రుణమాఫీ హామీలను ఇచ్చారన్నారు. మోడీతో నిధులు రాబట్టుకుందామనుకున్న బాబుకు అక్కడా నిరాశ తప్పడం లేదన్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏకంగా రైతులను రుణాలే చెల్లించేయమని ఉచిత సలహాలు ఇస్తున్నారని, అమలు చేయలేని హామీలు ఎందుకిచ్చారో వారిని ప్రజలు నిలదీయాలని సూచించారు. రైతులు రుణాలు చెల్లించే పరిస్థితి ఉంటే రుణమాఫీ కోసం ఎందుకు ఎదురుచూస్తారని పద్మావతి మంత్రిని ప్రశ్నించారు. రుణమాఫీ సాధ్యం కాదనే ద్దేశంతోనే జననేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రుణమాఫీ హామీ ఇవ్వలేదని గుర్తు చేశారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే 7 శాతం వడ్డీతో సరిపోయేదని, ఇప్పుడు బ్యాంకులు 13 శాతం వడ్డీని వసూలు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారో చెప్పాలని ఆమె చంద్రబాబును నిలదీశారు. త్వరలోనే రైతులు, డ్వాక్రా మహిళల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను చంద్రబాబు చవిచూడాల్సి వస్తుందని పద్మావతి చెప్పారు. రుణమాఫీని వెంటనే అమలుచేసి రైతుల్ని, మహిళల్ని రుణవిముక్తుల్ని చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ పిఎస్.కోటేశ్వరావు, సోలే నాగరాజు పాల్గొన్నారు. -
నేడు మలివిడత పరిషత్ పోరు
నేడు గుడివాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్ల ఎన్నికలు 23 జెడ్పీటీసీ స్థానాలకు 78 మంది అభ్యర్థుల పోటీ 354 ఎంపీటీసీ స్థానాలకు బరిలో 919 మంది అభ్యర్థులు వైఎస్సార్ సీపీ, టీడీపీ ముఖాముఖి పోరు సాక్షి, మచిలీపట్నం : ప్రాదేశిక పోరు తుది అంకం నేటితో ముగియనుంది. మలిదశ పోరు హోరాహోరీగా శుక్రవారం జరగనుంది. జిల్లాలోని గుడివాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్లలోని 23 మండలాల్లో పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 6న జిల్లాలోని 26 మండలాల్లో పరిషత్ పోరు తొలిదశ ఎన్నికలు పూర్తఅయిన సంగతి తెల్సిందే. వైఎస్సార్సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా తాతినేని పద్మావతి పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు జెడ్పీటీసీగా పోటీ చేసిన సంగతి తెల్సిందే. టీడీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి గద్దే అనురాధ గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. తొలి విడతలో తాతినేని పద్మావతి పోటీ చేసిన తొట్లవల్లూరు మండలం ఎన్నికలు పూర్తవగా మలివిడత పోరులో గద్దే అనురాధ పోటీ చేస్తున్న ఉంగుటూరు మండలం ఎన్నికలు జరగనున్నారుు. వైఎస్సార్ సీపీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి రెండు విడతల్లోనూ జిల్లా అంతటా విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహించారు. మలి విడత పోరులో పట్టు సాధించేందుకు వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. జిల్లాలో మలి విడత పోరులో గుడివాడ, నూజివీడు డివిజన్లలో 23 జెడ్పీటీసీ స్థానాలకు 78 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 363 ఎంపీటీసీ స్థానాలకు 9 ఏకగ్రీవమవగా 354 ఎంపీటీసీ స్థానాలకు 919 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. 1,230 పోలింగ్ కేంద్రాల్లో 9,36,252 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నూజివీడు డివిజన్లో ఎ.కొండూరు, ఆగిరిపల్లి, బాపులపాడు, చాట్రాయి, గంపలగూడెం, గన్నవరం, ముసునూరు, నూజివీడు, పమిడిముక్కల, రెడ్డిగూడెం, తిరువూరు, ఉంగుటూరు, విస్సన్నపేట, ఉయ్యూరు మండలాల్లో మలి విడత పోరు జరగనుంది. నూజివీడు మండలంలో 14 జెడ్పీటీసీ స్థానాలకు 51 మంది అభ్యర్థులు, 234 ఎంపీటీసీ స్థానాలకుగాను రెండు ఏకగ్రీవం కావడంతో 232 స్థానాలకు 610 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 765 పోలింగ్ కేంద్రాల్లో 5,93,55 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుడివాడ రెవెన్యూ డివిజన్లో గుడివాడ, గుడ్లవల్లేరు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నందివాడ, పామర్రు, పెదపారుపూడి మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గుడివాడ డివిజన్లో 9 జెడ్పీటీసీ స్థానాలకు 27 మంది పోటీ పడుతున్నారు. 129 ఎంపీటీసీ స్థానాలకు ఏడు ఏకగ్రీవమవడంతో మిగిలిన 122 ఎంపీటీసీ స్థానాల్లో 309 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 312 పోలింగ్ కేంద్రాల్లో 3,42,797 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త గొన్నూరుకు పోలింగ్ కేంద్రం గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరు గ్రామంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని మార్పు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందనరావు స్థానిక ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుడ్లవల్లేరు మండలం, చినగొన్నూరు పోలింగ్ బూత్ పరిధిలోని కొత్త గొన్నూరు ప్రాంతంలో నాలుగు వందల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఎన్నికలు గతంలో కొత్తగొన్నూరులోనే జరిగేవి. పరిషత్ ఎన్నికల్లో మాత్రం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటి సమీపంలో ఉన్న పాత గొన్నూరుకు పోలింగ్ కేంద్రాన్ని మార్పు చేశారు. నాలుగు వందల ఓటర్లు ఉన్న కొత్త గొన్నూరును కాదని, కేవలం వంద మంది ఓటర్లు ఉన్న పాత గొన్నూరులో పోలింగ్ కేంద్రం పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందిం చిన కలెక్టర్ గత అనవాయితీని కొనసాగిస్తూ యాథావిధిగా కొత్త గొన్నూరు ప్రాంతంలోనే పోలింగ్ కేంద్రం ఉండేలా మార్పు చేశారు. దీంతో పోలింగ్ కేంద్రం విషయంలో వివాదం సద్దుమణిగింది. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి గుడ్లవల్లేరు, ఉయ్యూరు, కలిదిండి మండలాల్లో ప్రచారం మచిలీపట్నం, న్యూస్లైన్ : జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి అన్నారు. రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగే గుడివాడ రెవెన్యూ డివి జన్లలోని గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర, ఉయ్యూరు మండలం కాటూరు, కలిదిండి మండలం పెదలంక, మూలలంక, భాస్కరరావుపేట తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులతో కలిసి పద్మావతి బుధవారం ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు రూ.100 మాత్రమే విద్యుత్ బిల్లు వసూలు చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని, రైతులను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు తప్పక అమలవుతాయని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు అల్లూరి శిరీష, బి.శ్రీసంధ్య, ఉయ్యూరులో మండలంలో పార్టీ పెనమలూరు నియోజకవర్గ కన్వీనర్ పడమట సురేష్బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి వల్లే శ్రీనివాసరావు, కలిదిండి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి మోకా లక్ష్మి పాల్గొన్నారు. కైకలూరులో జెడ్పీటీసీ అభ్యర్థి మీగడ చంద్రావతి, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరులో ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థిం చారు. ముదినేపల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థి మోతుకూరి స్వర్ణలక్ష్మి, మండవల్లి జెడ్పీటీసీ అభ్యర్థి ఎం.నాంచారమ్మ, పార్టీ నాయకులు పలువురు ప్రచారం నిర్వహించారు. ఆగిరిపల్లిలో తోట చంద్రశేఖర్ ప్రచారం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనరు తోట చంద్రశేఖర్ ఆగిరిపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్అప్పారావు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. గంపలగూడెం మండలంలో తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త రక్షణనిధి ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెం మండలంలో కోనేరు ప్రచారం మండలంలోని నాగులూరు, తాడిగూడెం, బూరుగగూడెం, రంగాపురం, రెడ్డిగూడెం, అన్నేరావుపేట, సీతారామపురం, మద్దులపర్వ, శ్రీరామపురం,ముచ్చనపల్లి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరుఫున పార్టీ విజ యవాడ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కోనేరు రాజేంద్రప్రసాద్ బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఈ గ్రామాల్లో మోటారుసైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 1600 కిలో మీటర్ల పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, పూర్తిస్థాయిలో అమలు చేశారని గుర్తుచేశారు. ఆ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయగల సమర్థుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ అతి త్వరలో రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని, పేదల కష్టాలు తీరుతాయని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి ఎంపీటీసీ, జెట్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోనేరు, జోగి కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement