-
ఆ ఒక్క జవాను.. పాక్ ఆశలను పటాపంచలు చేశాడు!
భారతదేశ వీర జవానులు యుద్ధభూమిలో ధైర్యసాహసాలకు ప్రతిబింబంగా నిలిచారు. 1965లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో భారత సైనికుడు అబ్దుల్ హమీద్ చూపిన తెగువ మరువలేనిది. 1965లో ఆపరేషన్ జిబ్రాల్టర్ వ్యూహం ద్వారా పాకిస్తాన్ భారత్పై దాడికి దిగింది. జమ్మూ కాశ్మీర్పై దాడి చేసి, అక్కడ తిరుగుబాటును సృష్టించి, కొన్ని సరిహద్దులను తెరవడం ద్వారా భారత సైన్యాన్ని చిక్కుల్లో పెట్టడం దీని లక్ష్యం. 1965 సెప్టెంబరు 8 న పాకిస్తాన్ సైన్యం ఖేమ్కరణ్ సెక్టార్లోని అసల్ ఉత్తాడ్ గ్రామంపై అమెరికన్ ప్యాటన్ ట్యాంకులతో దాడికి దిగింది. ఈ దాడుల సమయంలో హమీద్ పంజాబ్లోని తరన్తారణ్ జిల్లాలోని ఖేమ్ కరణ్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్నారు. అసల్ ఉత్తాడ్పై ఈ దాడి హఠాత్తుగా జరిగింది. దీంతో అక్కడ మోహరించిన భారత సైనికులు దీనిని ఊహించలేకపోయారు. వారి వద్ద ట్యాంకులు,పెద్ద ఆయుధాలు అందుబాటులో లేవు. వారి దగ్గర తేలికపాటి మెషిన్ గన్లు మాత్రమే ఉన్నాయి. యాంటీ ట్యాంక్ డిటాచ్మెంట్ కమాండర్ లేకపోవడంతో, ట్యాంకుల నిర్వహణ బాధ్యతను హమీద్ తీసుకున్నారు. 1965 సెప్టెంబరు 8న హమీద్ పాక్కు చెందిన రెండు ట్యాంకులను ధ్వంసం చేశారు. నాలుగు ట్యాంకులను నిర్వీర్యం చేశారు. మరుసటి రోజు పాకిస్తాన్ వైమానిక దళం సాబర్ జెట్ దాడులను ప్రారంభించింది. ఆ సమయంలోనూ హమీద్, అతని సహచరులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. పాకిస్తాన్ సైన్యాన్ని నిలువరించారు. సెప్టెంబర్ 10న అసర్ అసల్ ఉత్తాడ్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పాకిస్తాన్.. ప్యాటన్ ట్యాంకులతో కాల్పులకు తెగబడింది. ఈసారి హమీద్ మరో ట్యాంక్ను ధ్వంసం చేశారు. ఈ నేపధ్యంలో పాక్ సైనికులు జరిపిన దాడిలో హమీద్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ యుద్ధంలో అమెరికా అందించిన ప్యాటన్ ట్యాంకులపై పాకిస్తాన్కు గట్టినమ్మకం ఉంది. 1965 యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన మొత్తం 165 ప్యాటన్ ట్యాంకులు ధ్వంసమయ్యాయని లేదా నిరుపయోగంగా మారాయని చెబుతారు. వాటిలో సగానికి పైగా ట్యాంకుటు ఖేమ్ కరణ్ సెక్టార్లోనే ధ్వంసమయ్యాయి. హమీద్ ధైర్యసాహసాలు ఈ యుద్ధంలో నిరూపితమయ్యాయి. భారత సైన్యానికి సత్తా చాటేందుకు పూర్తి అవకాశం లభించింది. పాకిస్తాన్ సైన్యం భారత సైన్యంతో పోరాడలేక తిరోగమించవలసి వచ్చింది. భారత సైన్యం చేతిలో పాక్ ట్యాంకులు ధ్వంసం కావడం ఆ దేశ సైన్యాన్ని నైతికంగా దెబ్బతీసింది. పాక్ వ్యూహం విఫలమవడంతో పాక్ ఆర్మీ ఖేమ్ కరణ్లోకి ప్రవేశించేందుకు సాహసించలేదు. భారత సైన్యం దృష్టిని మరల్చాలనే పాక్ వ్యూహం కలగానే మిగిలిపోయింది. ఫలితంగా భారత సైన్యం ఈ యుద్ధంలో ఆధిపత్యం చెలాయించింది. భారత సైన్యం పాక్లోకి ప్రవేశించడంతో పాక్ ఓటమి చవిచూసింది. ఇది కూడా చదవండి: దేశ విభజనకు మౌంట్ బాటన్ కారకుడా? -
ఉక్రెయిన్కు నాటో భారీ ఆయుధ సాయం
కీవ్: రష్యాపై ఎదురుదాడి ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు నాటో భారీ సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్కు 1,550 పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్కు ఇచ్చిన హామీల్లో 98% వరకు నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ–జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ చెప్పారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు చెందిన 30 వేల బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్ పైచేయిగా నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా ఉండగా, బుధ, గురువారాల్లో రష్యా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్ల దాడిలో ఉక్రెయిన్లోని మైకోలైవ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.. కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల భవనాలు, 12 ప్రైవేట్ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి. -
అదానీకి హిండెన్బర్గ్ షాక్, మరో బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: హిండెన్బర్గ్ రిపోర్ట్ సృష్టించిన అలజడితో అత్యంత సంపన్నుడైన గౌతం అదానీ సంపద కీలకమైన 100 బిలియన్ల మార్క్కు దిగువకు పడిపోయింది. తాజా డేటా ప్రకారం ఆసియా, భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్- గౌతం అదానీ సంపద శుక్రవారం మరింత పతన మైంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అతని ర్యాంకింగ్ శుక్రవారం ఏడో స్థానానికి పడిపోయింది. తద్వారా ప్రపంచంలోని మొదటి ఐదుగురు సంపన్నుల జాబితా నుంచి అదానీ తప్పుకున్నారు. 100 బిలియన్ డాలర్ల దిగువకు ఫోర్బ్స్ రియల్ టైమ్స్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, అదానీ సంపద రోజులో 22.5 బిలియన్ల డాలర్లకు పైగా క్షీణించి 96.8 బిలియన్ల డాలర్లకు చేరింది. ఫలితంగా అదానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంటే దిగువ స్థానంలో ఉన్నారు. అదానీ షేర్ల భారీ ర్యాలీతో మొదట 2వ స్థానానికి చేరుకున్నారు గౌతం అదానీ. ఆ తరువాత చాలా కాలం పాటు 3వ స్థానంలో కొనసాగి, ఇటీవల నాలుగోప్లేస్కు దిగజారిన సంగతి తెలిసిందే. బిల్ అక్మాన్ వ్యాఖ్యలు అదానీ గ్రూప్ అవకతవకలపై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హింబెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపణలపై బిలియనీర్, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు బిల్ అక్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక "అత్యంత విశ్వసనీయమైనది, చాలా లోతుగా పరిశోధించబడింది" అంటూ బిల్ అక్మాన్ ట్వీట్ చేశారు. హిండెన్బర్గ్ ఫారెన్సిక్ రీసెర్చ్ పూర్తి రిపోర్ట్ ఆధారంగానే, తప్ప తామెలాంటి ఇండిపెండెంట్ పరిశోధన చేయలేదంటూ అదానీ-హిండెన్బర్గ్ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అదానీ కంపెనీల్లో, లేదా హెర్బా లైఫ్లో తమకు ఎలాంటి పెట్టుబడులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్ భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఎఫ్పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్) కు ముందు హిండెన్బర్గ్ రిపోర్ట్ రావడం గమనార్హం. నేటినుంచి( జనవరి 27) 31 వరకు నిర్వహించే ఎఫ్పీవోలో రూ.20 వేల కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. రూ. 3.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న అదానీ ఎంటర్ ప్రైజెస్ ఆఫర్ ప్రైస్ను ధరను రూ.3,112 నుంచి రూ.3,276గా నిర్ణయించింది. -
కదన రంగంలోకి అత్యంత శక్తిమంతమైన రష్యా యుద్ధ ట్యాంకులు! షాక్లో ఉక్రెయిన్
మాస్కో: గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ యద్ధంలో సేనలు రష్యా బలగాలను నియంత్రిస్తూ...పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున్న సైనిక బలగాలను సమీకరించి అంతుచూస్తానంటూ రష్యా అధ్యక్షుడు బహిరంగాగానే చెప్పారు. అందులో భాగంగానే ఈ యుద్ధ ట్యాంకులను అధిక సంఖ్యలో రంగంలోకి దింపుతోంది రష్యా. వాస్తవానికి ఫిబ్రవరి 27న యద్ధ మొదలైనప్పటి నుంచి రష్యా దాదాపు రెండు వేలకు పైగా యుద్ధ ట్యాంకులను కోల్పోయింది. దీంతో రష్యా అత్యంత శక్తిమంతమమైన టీ 62 యుద్ధ ట్యాంకులను కథనం రంగంలోకి ప్రవేశ పెట్టనుంది. ఇవి ఆధునిక ఆయుధాలను సైతం నిలువరించగలదని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల ముఖ్య సలహదారు అంటోన్ గెరాష్చెంకో అన్నారు. ఈ ట్యాంకుతో రష్యా యుద్ధంలో మోరించి తమ పోరాట పటిమను చూపించుకోవాలని ఆరాటపడుతోందన్నారు. అంతేకాదు బ్రిటీష్ మత్రిత్వశాఖ అలాంటి యుద్ధ ట్యాంకులు అత్యంత ప్రమాదకరమైనవని, ఆయుధాలను నియంత్రించగల సామర్థ్యంగలవి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా ఓడిపోతానన్న అనుమానం ప్రాంభమైన వెంటనే విధ్యంసకర దాడికైన దిగుతుందంటూ...ప్రపంచ దేశాలు వ్యక్తం చేసిన అనుమానాల్ని నిజం చేసేలా రష్యా వ్యూహం సిద్ధ చేసుకుంటోంది. సోవియట్ యూనియన్ ఉత్పత్తి చేసిన చివరి మీడియం ట్యాంకులే ఈ యుద్ధ ట్యాంకులు. ఈ టీ 62 ట్యాంకులు సెమీ ఆటోమేటిక్ 115 ఎంఎం స్మూత్బోర్ గన్తో నిర్మితమైన ట్యాంకులు. పైగా ఆ ట్యాంకులకు సంబంధించిన వీడియోని కూడా ఉక్రెయిన్ ప్రభుత్వ సలహాదారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Old Soviet tanks taken out of conservation by Russia - with no protection against modern weapons. And new Russian conscripts (also with no protection against modern weapons and a modern army - we've seen what they fight in). Perfect combination, doomed for success, I would say. pic.twitter.com/Lh3tNLA0AE — Anton Gerashchenko (@Gerashchenko_en) September 23, 2022 (చదవండి: రష్యా దూకుడు...ఉక్రెయిన్ భూభాగాలపై రిఫరెండమ్ షురూ) -
జనాల మీదకు యుద్ధ ట్యాంకర్లు.. మళ్లీ మారణహోమం?!
బీజింగ్: చైనాలో వరుస సంక్షోభాలు అక్కడి ప్రజలను అరిగోస పెడుతున్నాయి. తాజాగా కొన్ని బ్యాంకులు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో.. ఖాతాదారులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోనుపోనూ ఈ నిరసనలు పెను ఉద్యమంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రజలను నిలువరించేందుకు యద్ధ ట్యాంకర్లను రంగంలోకి దించించి జింగ్పిన్ సర్కార్. కొన్ని బ్యాంకులు ఏప్రిల్ నుంచి తమ ఖాతాదారులు నగదును విత్డ్రా చేసుకోకుండా అడ్డుకుంటున్నాయి.హెనన్ ప్రావిన్స్లో గ్రామీణ, పట్టణ బ్యాంకులు కారణాలు చెప్పకుండా ఖాతాదారులకు షాకులు ఇస్తున్నాయి. ఈ బ్యాంకుల స్కామ్కు ప్రభుత్వం నుంచి అండ లభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నివారాలుగా బ్యాంక్ ఖాతాదారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలుచోటు చేసుకుంటున్నాయి. బ్యాంకుల మీద దాడులు జరుగుతాయనే ఉద్దేశం, బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవద్దనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో.. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుద్ధ ట్యాంకర్లను బ్యాంకుల వద్ద మోహరిస్తోంది. నిరసనకారులు దాడులకు పాల్పడకుండా భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే నిరసనకారులు మాత్రం ఎంతకీ తగ్గడం లేదు. నిధుల నిలిపివేతను ఉపసంహరించుకుని.. తమ డబ్బుల్ని ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 🚨🚨🚨🚨Breaking news🚨🚨🚨🚨 Tanks are being put on the streets in China to protect the banks. This is because the Henan branch of the Bank of China declaring that people's savings in their branch are now 'investment products' and can't be withdrawn. 🔊sound pic.twitter.com/cwTPjGz84K — Wall Street Silver (@WallStreetSilv) July 20, 2022 చరిత్ర పునరావృతం అయ్యేనా.. తాజా వీడియోలతో అక్కడి జనాల వెన్నులో వణుకుపుడుతోంది. అందుకు కారణం.. టియానన్మెన్ స్క్వేర్ మారణహోమం గుర్తుకు రావడం. ప్రజాస్వామ్య పద్దతులు కావాలని, స్వేచ్ఛను కోరుతూ వేల మంది విద్యార్థులు బీజింగ్లోని టియానన్మెన్ స్క్వేర్ వద్ద నిరసనలు కొనసాగించారు. వాళ్లను అక్కడి నుంచి క్లియర్ చేయడానికి భారీగా ఆర్మీని రంగంలోకి దించింది ప్రభుత్వం. సుమారు నెలపాటు జరిగిన మారణ హోమంలో వందల మంది(వేల మంది అని చెప్తుంటారు) మరణించారు. వాళ్లకు స్మారకంగా.. అక్కడొక స్థూపాన్ని సైతం నిర్మించేందుకు అనుమతించలేదు. దీంతో హాంకాంగ్లో ఓ యూనివర్సిటీ బయట ఏర్పాటు చేశారు. అయితే.. ఆ స్మారకాన్ని సైతం బలవంతంగా తొలగించింది చైనా. అన్నట్లు మొన్న జూన్ 4వ తేదీకి టియానన్ మారణహోమానికి 33 ఏళ్లు నిండాయి. ఆ ఘటనలో.. యుద్ధ ట్యాంకర్ల ఎదురుగా ఓ వ్యక్తి ధైర్యంగా నిల్చున్న ఫొటో ఒకటి చరిత్రకెక్కింది కూడా.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement