-
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.. సీఎం జగన్ నివాళి
అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొట్టతొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భాంగా ఆ మహనీయుడికి ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడని కొనియాడుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/oFfEdyidHz — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2023 ఇది కూడా చదవండి: అవును.. సీఎం జగన్ మహిళా పక్షపాతే -
ముఖ్యమంత్రిగా పని చేసి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని స్థితిలో..
స్వాతంత్య్రోద్యమ పోరాటంలో దమ్ముంటే కాల్చండి.. రండిరా అంటూ పోలీసులకే ఎదురెళ్లి చొక్కా విప్పి రొమ్ము చరిచి నిలబడ్డ ఘనుడు టంగుటూరి ప్రకాశం పంతులు. సంతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రజల కోసం తన యావదాస్తిని ఖర్చు చేసిన మహాశిలి ఈ ఆంధ్రకేసరి. కటిక పేదరికంలో జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన పట్టుదలతో బారిష్టర్ చదివి డబ్బు సంపాదించారు. ఆంధ్రరాష్ట తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు తన చివరి రోజుల్లో తినడానికి తిండి లేక అల్లాడిపోయారు. కటిక పేదరికంలోనే కన్నుమూశారు. నిరుపేదల లాయర్ టంగుటూరి ప్రకాశం చివరి రోజుల్లో ఎంత ఇబ్బందులపాలయ్యాడో వివరించాడు సినీ గేయరచయిత టంగుటూరి వెంకట రామదాస్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'టంగుటూరి ప్రకాశం గొప్ప లాయర్. ఆయన న్యాయవాదిగా పని చేసేటప్పుడు ధనవంతుల దగ్గర ఎంత డబ్బు తీసుకునేవారో లేనివాళ్ల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకునేవారు కాదు. ఒకసారి ఆయన కోర్టులో వాదిస్తున్నప్పుడు తన ఇంట్లో ఎవరో చనిపోయిన వార్త అందింది. పూలకు బదులు పండ్లు తేవచ్చుగా అయినా సరే ఆయన వెళ్లకపోవడంతో జడ్జి ఇంకా ఇక్కడే ఎందుకున్నావని అడిగారు. దానికాయన.. చనిపోయినవాళ్లను ఎలాగో తిరిగి తీసుకురాలేను. ఈ కేసు ఓడిపోతే వీరి జీవితం అన్యాయం అయిపోతుందని బదులిచ్చారు. అలాంటి నిస్వార్థ వ్యక్తి చివరి రోజుల్లో తినడానికి తిండి లేని దయనీయస్థితిలో గడిపారు. కటిక దరిద్రంలో ప్రాణాలు విడిచారు. ఒకసారి ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానం చేశారు. ఈ పూలకు బదులుగా అర డజను అరటిపండ్లు తెస్తే తినేవాడిని కదరా అన్నారు. ఆ మాటతో ఆయన వాస్తవ స్థితి అర్థమై అక్కడున్నవారంతా ఏడ్చేశారు. అలా సంపాదించిందంతా పోయింది ఈ పరిస్థితికి రావడానికి గల కారణం.. టంగుటూరి ప్రకాశంకు ఉన్న మితిమీరిన జాలి, దయాగుణం. ఎవరైనా సాయమడిగితే తన దగ్గర ఎంతుంటే అంత ఇచ్చేవారు. బీరువాలో ఎంతుంటే అది రెండు చేతులతో తీసిచ్చేవారు. తన కోసం, తన కుటుంబం కోసం ఏదీ దాచుకోలేదు. అలా సంపాదించిందంతా పోయింది' అని పేర్కొన్నారు. కాగా టంగుటూరి వెంకటరామదాస్.. కౌసల్య, గోదావరి, శివలింగాపురం, మహదేవపురం, ఆది నీవే అంతం నీవే, నీకు నేను నాకు నువ్వు వంటి పలు చిత్రాల్లో గేయ రచయితగా పని చేశారు. చదవండి: ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ప్లానింగ్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! -
టంగుటూరి ప్రకాశం పంతులు చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఆయన వేసిన పునాదులు విశేషమైనవి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర సమరయోధులు, ధీశాలి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్. స్వాతంత్ర్య సంగ్రామపథంలో తెలుగువారి కీర్తి పతాక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడ్డ ఆంధ్రరాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారు వేసిన పునాదులు విశేషమైనవి. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2022 -
గురు శిష్యులు ఒకే రోజు...
భారత స్వాతంత్య్ర సమరంలో నిరుపమాన పోరాటాలు చేసిన యోధులు బిపిన్ చంద్ర పాల్, టంగుటూరి ప్రకాశం పంతులు గురుశిష్యులలాంటివారు. వారిరువురూ మే 20వ తేదీనే అసువులు బాయడం కాకతాళీయమే! 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లాలోని వినోదరాయ పాలెంలో జన్మించిన ప్రకాశం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. బారిస్టర్ కోర్సు చదవడం కోసం 1907లో ఇంగ్లండ్ వెళ్లారు. ఇండియా వచ్చి న్యాయవాదిగా మంచి పేరూ, డబ్బూ సంపాదించారు. ఆ కాలంలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలకు యువత స్వాతంత్య్ర సమరంలో దూకుతుండేవారు. ప్రకాశం పంతులు పాల్ ఉపన్యాసాలు విని... వేల రూపాయల ఆదాయం ఇచ్చే న్యాయ వాద వృత్తిని వదిలి స్వాతంత్య్రోద్యమంలో అడుగుపెట్టారు. కొన్ని రోజులు ‘స్వరాజ్య’ పత్రిక నడిపారు. గాంధీజీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహిం చారు. 1921 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, ఉపఖండంలో అనేక ప్రాంతాలు సందర్శించారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడు మరణిస్తే పోలీసు వాళ్ళు అక్కడికి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రకాశం పంతులు అది చూసి చలించి పోలీసు వలయాలను ఛేదించుకొని అమర వీరుని దగ్గరికి వెళ్తూ చొక్కా గుండీలు తీసి తెల్లోడి తుపాకీ గుండుకు తన గుండెను చూపించి ఇక్కడ కాల్చమని సవాల్ విసిరారు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చిన రాష్ట్ర ప్రజలు ‘ఆంధ్రకేసరి’ బిరుదునిచ్చారు.స్వాతంత్య్రానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1953–1954 మధ్య పని చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు పర్యటిస్తూ... వడదెబ్బకు గురై హైదరాబాదులో హాస్పిటల్లో చేరి 1957 మే 20న తుది శ్వాస విడిచారు. జాతీయోద్యమంలో ప్రసిద్ధ ‘లాల్, బాల్, పాల్’ త్రయంలో బిపిన్ చంద్రపాల్ ఒకరు. అస్సాంలోని టీ తోటల్లో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడంతో బిపిన్ చంద్రపాల్ ఉద్యమ ప్రస్థానం మొదలైంది. ‘వందేమాతరం’ ఉద్యమంలో భాగంగా దక్షిణ భారతదేశంలో విస్తృతంగా పర్యటించారు. మచిలీపట్నంలో ‘ఆంధ్ర జాతీయ కళాశాల’ బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలు, కృషి ఫలితంగానే స్థాపితమైంది. భారత అతివాద ఉద్యమకారుల్లో గ్రగామిగా ప్రసిద్ధి చెందిన బిపిన్ చంద్రపాల్ 1932 మే 20న మరణించారు. ప్రకాశం పంతులు, బిపిన్ చంద్రపాల్ల పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శప్రాయం. – కొమ్మాల సంధ్య, హన్మకొండ (మే 20న టంగుటూరి ప్రకాశం పంతులు, బిపిన్ చంద్రపాల్ల వర్ధంతి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement