-
ఓటుకై తారలు తళుక్కుమన్న వేళ..
-
విజయకాంత్ రూటే సెపరేటు
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ రూటే సెపరేటు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి అంతం, పేదరిక నిర్మూలన నినాదంతో పార్టీ ఆవిర్భావకాలం నుంచి ముందుకు సాగుతూ వస్తున్నారు. అయితే, ఈ సారి ఆయన సీఎం పగ్గాలు చేపట్టేందుకు రేసులో పరుగులు తీస్తున్నారు. తానే సీఎం, తానే సర్వం అన్నట్టుగా ఓటర్ల ప్రసన్నంలో ఉన్న విజయకాంత్ ఈ సారి కీలక నిర్ణయం తీసుకుని అందర్నీ విస్మయంలో పడేశారు. ఓటుకు నోటు వద్దే..వద్దు అని ఎన్నికల యంత్రాంగం అందుకుని ఉన్న నినాదానికి మద్దతు పలుకుతూ, తానూ సైతం అని ఏకంగా ఓ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో ప్రతిజ్ఞ చేసి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఉలందూరు పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కెప్టెన్ రేసులో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఓట్ల వేటలో ఉన్న ఆయన అక్కడి లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకున్నారు. పూజాది కా ర్యక్రమాల అనంతరం దేవుడి ఎదుట ప్రమాణం చేస్తూ ప్రతిన బూనారు. తాను ఓటుకు నోటు ఇవ్వబోనని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటును కొనుగోలు చేయనని ఇదే తన ప్రతిజ్ఞ అంటూ, ఇదే తన శపథంగా వ్యాఖ్యానించారు. అలాగే, వెలుపలకు వచ్చిన విజయకాంత్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పంచె పెకైత్తి కట్టి మరీ కదన రంగంలో దూకేందుకు తాను సిద్ధం అని, తనను ఎవ్వడూ కదిలించ లేడని వీరావేశంతో ప్రసంగించారు. ఇంత వరకు బాగానే, ఉ న్నా, సోషల్ మీడియాల్లో కెప్టెన్ ప్రతి జ్ఞ, ఎవ్వరూ కదిలించలేడు అన్న అంశాలు చమత్కారాలకు దారి తీశాయి. కెప్టెన్ ఒక్కడే నోటుకు ఓటు ఇవ్వనని ప్రతిజ్ఞ చేస్తే ఎలా, మిగిలిన డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థుల చేత కూడా చేయించాలి మరీ..! అని వ్యంగ్యాస్త్రాలు సంధించే పనిలో పడ్డారు. అలాగే, ఎవ్వరూ విజయకాంత్ను కదిలించాల్సిన అవసరం లేదని, ఆయనే తుళ్లి పడతారులే అని చమత్కారాలు అందుకుని ఉండడం గమనార్హం. -
యువత ఓటెవరికి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: మరో వారం రోజుల్లో తమిళనాడులోని నేతల తలరాత ఏమిటో తెలిసిపోతుంది. ఈనెల 16వ తేదీన ప్రజలు తీర్పు చెప్పేరోజుకాగా, 19వ తేదీన ఆ తీర్పును ప్రకటిస్తారు. ఎప్పటి మాటెలా ఉన్నా, ఈసారి మాత్రం ఎన్నికల ఫలితాలను యువత శాసిస్తుందని ఆశిస్తున్నారు, అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద యువత శాతం అధికంగా ఉండేది భారత దేశంలోనేనని కొందరు ప్రముఖులు విశ్లేషించారు. దేశంలోని అన్నిశాఖలు, విభాగాల్లో యువతేజం వెల్లివిరుస్తోంది. భారతీయ యువత ప్రతిభను చేసి అమెరికా, చైనా దేశాలు విస్తుపోతున్నాయి. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో 18-23 వయస్సుగల దేశంలో యువత ఓటు 23 కోట్లుగా ఉండింది. తుపానులా ఎగిసిపడిన ఈ యువతలో 40శాతం నరేంద్రమోదీపై మోజుపడ్డారు. ఈ కారణంగానే కేంద్రంలో మోదీ ప్రధానిగా భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పడింది. కాగా, ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను యువత ఎలా శాసిస్తుందో అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మార్పు కోరుతున్న తమిళనాడు యువత: ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై యువత ప్రభావంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తమిళనాడులో 5.82 కోట్ల ఓటర్లు ఉండగా వీరిలో ఒకశాతం యువత ఉన్నారు. 18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు 21లక్షల మంది ఉన్నారు. కొత్తగా ఓటర్లైన యువతను ఆకట్టుకోగలమనే నమ్మకంతో అన్నాడీఎంకే, డీఎంకే, ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే, బీజేపీ ఉన్నాయి. అన్నాడీఎంకే, డీఎంకేలకు 30 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి అధికారంలో రావడం ఖాయమని అందరికీ తెలుసు. అయితే ఏపార్టీకి చెందని యువ ఓటర్లు 20 శాతం వరకు ఉన్నారు. వీరిలో 10 శాతం యువత ఓటు వేయకున్నా మిగిలిన 10 శాతం ఓటర్లే ఎమ్మెల్యేల గెలుపును నిర్దేశిస్తారు. యువత వేసే ఓట్లే నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రతిబంబిస్తాయని ఎన్నికల కమిషన్ విశ్వసిస్తోంది. అందుకే నూరుశాతం ఓట్లు పోలయ్యేందుకు అన్ని విధాల కృషి చేస్తోంది. 1.5 కోట్ల యువ ఓటర్లను పోలింగ్ బూత్ వరకు రప్పించేందుకు ‘వై రాజా మై’, ‘మిస్డ్కాల్’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సామాజిక మాధ్యమాలను వినియోగిస్తోంది. ఎన్నికల కమిషన్ యువతను ఆకర్షించే ప్రయత్నాలను గమనించిన పార్టీల వారు సైతం యువ ఓటర్లకు గాలం వేయడం ప్రారంభించారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం పది శాతం ఉన్న యువ ఓటర్లను ఆకట్టుకోవడంపై అన్నిపార్టీలు దృష్టిపెట్టాయి. డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే వ్యవస్థాపకులు డాక్టర్ రాందాస్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తదితరులంతా సామాజిక మాధ్యమాల ద్వారా యువతతో టచ్లో ఉన్నారు. ఈ మార్పును గమనించిన సంఘసేవకులు, న్యాయమూర్తులు సైతం మంచి నేతలను ఎన్నుకోండని ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీ మెరుగు, ఏ నేత ఎలాంటి వాడు అని యువ ఓటర్లు గమనిస్తున్నట్లుగా యువత మధ్య ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఎన్నికల మేనిఫెస్టోకు యువత అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ఆచరణలోకి రావని యువత నిర్దారించుకోవడమే ఇందుకు కారణం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అవినీతి, లంచగొండితనం, కుంభకోణాలను యువత తీవ్రస్థాయిలో చీదరించికుంటున్నట్లు సర్వేలో తేటతెల్లమైంది. ప్రభుత్వాల్లోని అవినీతిని రాజకీయ నేతలే పారద్రోలాలని యువత ఆశిస్తోంది. ఇందు కోసం గ్రామీణ యువతను సైతం కలుపుకుపోతోంది. అయితే రాష్ట్రంలో మార్పును కోరుకుంటున్నా, ఒక సునామీలా ఆ రెండు పార్టీలను తుడిచిపెట్టేలా ఎవ్వరూ కనపడటం లేదని యువత విరక్తిని ప్రదర్శిస్తోంది. రాజకీయాల్లోకి రావడంపై కూడా యువత అయిష్టతను వ్యక్తం చేస్తోంది. నేటి రాజకీయ నేతల నుండి ఏమి ఆశించవచ్చు, ఏది ఆశించకూడదనే అంశంపై యువత స్పష్టమైన అవగాహనతో ఉన్నట్లు తేలింది. ఓటర్లను మభ్యపెట్టేందుకు పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాలపై యువత అసక్తి చూపడంలేదు. సాగుభూమికి ఉచిత విద్యుత్, పేదలకు తక్కువ ధరకు ఆహారం, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా 20 కిలోల బియ్యం వంటివి మాత్రమే ప్రయోజనకరమనని భావిస్తున్నారు. పరిధికి మించి ఉచితాలను పంపిణీ చేయడం రాష్ట్ర ఆర్థికపరిస్థితిని దెబ్బతీయగలదని యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వంపై ప్రస్తుతం రూ.4లక్షల కోట్లు అప్పు ఉందని, ఈ అప్పుపై ప్రతినెల కొన్నివేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నారని యువత తెలుసుకుంది. ఇలాంటి పరిస్థితిలో ఉచితంగా వస్తువుల పంపిణీ ఎలా సాధ్యం, వాటికి నిధులు ఎక్కడి నుండి సమకూర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఉచితాలు పంచేకంటే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కోటి యువత నిరుద్యోగులుగా ఉండగా, వీరంతా ప్రతి నేత వద్ద ఉద్యోగాలు ఇవ్వండి బాబూ అంటూ మాత్రమే వేడుకుంటున్నారు. రాష్ట్రంలోని పరిస్థితిపై అన్ని కోణాల్లో అవగాహన పెంచుకున్న యువత ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనేది బహిర్గతం కావడం లేదు. అయితే ఒకటి మాత్రం నిజమని నమ్మవచ్చు. పాతను యువత వ్యతిరేకిస్తోంది, అలాగని కొత్తగా ఎవరిని అందలం ఎక్కించాని సందిగ్ధం నెలకొని ఉంది. అయితే యువత లోలోన ఏదోఒక నిర్ధారణకు వచ్చినట్లు కనపడుతోంది. ఈ నిర్ణయం ద్రవిడ పార్టీలకు అనుకూలమా, ప్రతికూలమా అని తెలుసుకోవాలంటే ఈనెల 19 వరకు ఆగాల్సిందే. రాష్ట్రంలో వయస్సుల వారీగా ఓట్లు 18-19 వయస్సు ఓటర్లు - 21,05,344 20-29 వయస్సు ఓటర్లు - 1,17,76,288 30-39 వయస్సు ఓటర్లు - 1,39,83,613 40-49 వయస్సు ఓటర్లు - 1,24,89,260 50-59 వయస్సు ఓటర్లు - 87,32,151 60-69 వయస్సు ఓటర్లు - 56,15,630 70-79 వయస్సు ఓటర్లు - 26,58,699 80 ఏళ్లు నుంచి ఆపై వయస్సున్న ఓటర్లు - 8,40,635 మొత్తం ఓట్లు: 5,82,01,620 పురుషులు: 2,88,62,973 స్త్రీల్లు: 2,93,33,927 -
మేము రెడీ.. మరి వాళ్లో!
సాక్షి, చెన్నై: అధికారంలోకి రాగానే, తమ వాళ్లకు చెందిన మద్యం తయారీ పరిశ్రమలన్నీ మూత వేయడానికి సిద్ధమయ్యామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి అంటున్నారు. ఇది, తానొక్కదాన్నే చెప్పడం లేదని, ఆయా సంస్థలకు చెందిన వాళ్లూ రెడీ అయ్యారని వ్యాఖ్యానిస్తూ, మరి మిడాస్కు తాళం ఎప్పుడు పడుతుందో అని ప్రశ్నించారు. రాష్ర్టంలో సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో అన్ని పార్టీలు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో డీఎంకే కూడా ఉంది. అన్నాడీఎంకే మాత్రం దశల వారీ అన్న నినాదాన్ని ప్రకటించి ఉన్నది. డీఎంకే అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం లక్ష్యంగా చట్టం తీసుకొచ్చేందుకు నిర్ణయించి, ప్రజల్లోకి ఆ నినాదాన్ని తీసుకెళ్లే పనిలో పడ్డారు. అయితే, డిఎంకేకు చెందిన నాయకులు అన్నాడీఎంకే వర్గాలపై, అన్నాడీఎంకే నాయకులు డీఎంకే వర్గాలకు సవాళ్లు విసురుతూ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం, అధికారంలోకి రాగానే తమ మద్యం ఫ్యాక్టరీలను మూసి వేయడానికి సిద్ధం అని డీఎంకే నినాదం అందుకోగా, మరీ తమరెప్పుడు అంటూ అన్నాడీఎంకే మద్యం ఫ్యాక్టరీ యజామానుల్ని ప్రశ్నించే పనిలో పడ్డారు. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి, ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే తమ వాళ్లందరూ మద్యం ఫ్యాక్టరీలను మూసి వేయడానికి సిద్ధం అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ మాట అన్నది తాను మాత్రమే కాదు అని, సంబంధిత వ్యక్తులు కూడా స్పష్టం చేసి ఉన్నారన్నారు. అయితే, తాము రెడీ అయ్యామని, అలాంటప్పుడు వాళ్లకు చెందిన ‘మిడాస్’ ఎప్పుడు మూసి వేయబోతున్నారో ప్రశ్నించడంటూ మీడియాకు సూచించారు. అన్నాడీఎంకే వర్గాలకు చెందిన మిడాస్లో అనేక బ్రాండ్ల మద్యం తయారు అవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు మద్యం సరఫరా అవుతున్నది. ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్న మిడాస్ను ఎప్పుడు మూస్తారో అంటూ కనిమొళి ప్రశ్నించడం విశేషం. అయితే, డీఎంకే అధికారంలో వస్తే, సర్వాధికారాలు వారి చేతికి వచ్చినట్టే. అలాంటప్పుడు ‘మిడాస్’ను మూయించ లేరా..?, మరీ, వాళ్లే ఎందుకు తాళం వేసుకోవాలో..? అని పెదవి విప్పే వాళ్లే అధికం. -
మౌనం వీడండి!
ప్రధానికి కరుణ సూచన కొనసాగుతున్న దాడులు తనిఖీలు ముమ్మరం సాక్షి, చెన్నై: తమిళనాట ఎన్నికల్లో అధికార పక్షం అవినీతి సొమ్ము బయట ప డుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి సూచించారు. ఇప్పటి కైనా మౌనం వీడి తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నగదు బట్వాడా లక్ష్యం గా ఈసీ కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల మేరకు నగదు పట్టుబడుతున్నా, ఇంత వరకు కేసులు మాత్రం నమోదు కాలేదని చెప్పవచ్చు. ఇవన్నీ అన్నాడీఎంకే వర్గాలకు చెందిన సొమ్ముగా మీడియాల్లో కథనా లు వెలువడుతూ వస్తున్నాయి. ఆదివా రం కూడా పెద్ద ఎత్తున నగదు, తాయిలాలు పట్టుబడ్డాయి. మదురైలో రెండాకుల చిహ్నంతో కూడిన 60 ఫ్రిడ్జ్లు, నాట్రాంపల్లిలో రెండాకుల చిహ్నంతో కూడి రూ. కోటి 11 లక్షలు విలువగల వస్త్రాలు, కడలూరులో మంత్రి సంపత్ ఇంటికి సమీపంలో మినీలారీలో ఉన్న వస్తువులు, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం ఇలాక బోడి నాయకనూరులో రెండు లారీల్లో తీసుకొచ్చిన చీరలు, టో పీలను, పందలూరులో ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, రాశిపురంలో అన్నాడీఎంకేకు చెందిన నాయకుడి పరిశ్రమ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అ యితే, ఇంతవరకు పట్టుబడ్డ నగదు, వస్తువులు, వస్త్రాలు ఎవరివో అన్న వివరాలు మాత్రం బయటకు రావడం లే దు. కేసులు కూడా నమోదు కాలేదని చె ప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఇదే అంశాల్ని ఎత్తి చూపుతూ డీఎంకే అధినే త ఎం కరుణానిధి ఎన్నికల యంత్రాం గానికి ప్రశ్నల్ని సంధించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మౌనంగా ఉండడంపై ప్రజ ల తరఫున నిలదీస్తూ ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే సర్కారు ఐదేళ్లల్లో సాగించిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని వివరించారు. పట్టుబడుతున్న నగదు, తాయిలాలు అన్నీ ఆ పార్టీ వారికి చెందినవిగా సంకేతాలు వ స్తున్నాయని, అయితే, ఇంత వరకు వివరాలు ప్రకటించక పోవడం శోచనీయమన్నారు. తమిళనాట సాగిన అవినీతి అక్రమాలపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచి స్తూ, తాజాగా సాగుతున్న వ్యవహారాల పై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌ నంగా ఉన్నారో అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి కల్పించుకోవద్దని హితవు పలికారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement