-
జీవన్రెడ్డికి ఫోన్ చేయించిన మంత్రి..
కలెక్టరేట్ చేరుకుని మంత్రితో మాట్లాడిన ఎమ్మెల్యే జగిత్యాల అర్బన్ : జగిత్యాల జిల్లా కలెక్టరేట్ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించేందుకు సోమవారం వచ్చారు. అయితే జిల్లాగా ఏర్పడుతున్న జగిత్యాలలో కార్యాలయూలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి వాటిని సందర్శించిన దాఖలాలు లేవు. దీంతో స్పందించిన మంత్రి జీవన్రెడ్డికి ఫోన్ చేయమని డీఎస్పీ రాజేంద్రప్రసాద్కు సూచించారు. డీఎస్పీ ఫోన్లో మాట్లాడగా..వెంటనే జీవన్రెడ్డి కలెక్టరేట్కు చేరుకుని జిల్లా ఏర్పాటుకు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నారు. -
'టీఆర్ఎస్ వినిపించుకోవడం లేదు'
హైదరాబాద్ : గద్వాల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఏడాది నుంచి పోరాడుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ ఆరోపించారు. శనివారం టీ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిల పక్షంలో చర్చించాల్సిన అంశాలను ఈ సందర్భంగా టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా డి.కె.అరుణ మాట్లాడుతూ...ఆలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే సదరు నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. నోటిఫికేషన్లో గద్వాల్ జిల్లా లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డీకే అరుణ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ ఈ అఖిల పక్ష సమావేశానికి హజరుకానున్నారు. -
'ఏ ప్రాంతం వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలి'
హైదరాబాద్ : న్యాయాధికారుల సస్పెన్షన్ సమంజసం కాదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆప్షన్ అడిగినప్పుడే సీఎం కేసీఆర్ స్పందించి ఉండాల్సిందని ఆయన అన్నారు. బుధవారం హైదరాబాద్లో టి. జీవన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు సద్దుమణిగిన విధంగా హైకోర్టు విభజన సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆయుత చండీయాగానికి రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించిన సంగతి ఈ సందర్భంగా టి.జీవన్ రెడ్డి గుర్తు చేశారు. అయితే హైకోర్టు విభజనపై చంద్రబాబుతో ఎందుకు మాట్లాడలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. హైకోర్టు విభజన జరిగేంత వరకు న్యాయాధికారుల విభజన ఆపాలని కేంద్రప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ ప్రాంతం వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలన్నారు. కేసీఆర్ భేషజాలకు పోకుండా ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడకుండా హైకోర్టు విభజన సమస్య పరిష్కారం కోసం చంద్రబాబుతోనూ కేంద్రంతోనూ చర్చించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజేసే విధంగా ఇద్దరు సీఎంలు వ్యవహరించడం సరికాదని టి.జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
టి. కాంగ్రెస్పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకుడు, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం హైదరాబాద్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బాగు చేయాలంటే తక్షణమే సర్జరీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. టి. కాంగ్రెస్ను ప్రక్షాళన చేయకపోతే పార్టీని పోస్ట్మార్టం చేసే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను మించిన అసమర్థుడు ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అని ఆయన ఆరోపించారు. పార్టీ వరుస ఓటములకు బాధ్యత వహించి... పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందని ఉత్తమ్కు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. పార్టీ నాయకులు సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైందన్నారు. నేనే పీసీసీ చీఫ్ అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేవాణ్ణి... లేదంటే రాజీనామా చేసేవాణ్ణి అని చెప్పారు. పొన్నాల, ఉత్తమ్కుమార్ రెడ్డి నాయకత్వంలోనే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత పార్టీ పరిస్థితిపై తక్షణమే పార్టీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పాలని ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలోని 15, 20 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తామే సీఎం అభ్యర్థి అని అనుకుంటున్నారని వెల్లడించారు. గాంధీభవన్లో ప్రెస్మీట్లతో కాంగ్రెస్ పార్టీ ఒలపడదని... ఓట్లు కూడా రావని ఆయన పేర్కొన్నారు. భువనగిరి లోక్సభ ఎన్నికల్లో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటమికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ గ్రూప్ రాజకీయాలే కారణమని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ సందర్భంగా అధిష్టానానికి సూచించారు. -
'హరీష్రావుతో భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు'
హైదరాబాద్ : తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావుతో భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. హరీష్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకే ఆయనను కలసినట్లు ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను హరీష్ రావు సందర్శించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనను కలసి కృతజ్ఞతలు చెప్పినట్లు చెప్పారు. టీఆర్ఎస్లో చేరతారా ? అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు... టీఆర్ఎస్లో చేరతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. అలాగే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అని విలేకర్లు ప్రశ్నించగా... ఈ అంశంపై నో కామెంట్ అంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జవాబు దాటి వేశారు.
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement