-
భారత్ మార్గం సరైనదే!
సర్వేలో వెల్లడైన దేశ ప్రజల మనోగతం న్యూఢిల్లీ: భారత్ సరైన దిశలోనే వెళ్తోందని దేశ ప్రజల్లో అత్యధికం విశ్వసిస్తున్నారు. చైనా, సౌదీ అరేబియా దేశాలు కూడా సరైన గమ్యం దిశగానే వెళ్తున్నాయని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రపంచాన్ని భయపెడుతున్నదేమిటి?’ అన్న ప్రశ్నతో మార్కెట్ పరిశోధన సంస్థ ఇప్సోస్ 26 దేశాల్లో నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ప్రపంచ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న సమస్యల్లో నిరుద్యోగం, ఆర్థిక/రాజకీయ అవినీతి, పేదరికం/సామాజిక అసమానతలు ముఖ్యమైనవిగా ఈ సర్వేలో తేలింది. అవినీతి, నిరుద్యోగం, నేరాలు భారతీయులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. నైతిక విలువల పతనం, పర్యావరణం, నిరుద్యోగంపై చైనీయులు.. నిరుద్యోగం, ఉగ్రవాదం, పన్నుల గురించి సౌదీ అరేబియా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. తమ దేశాలు గాడిలోనే నడుస్తున్నాయని చైనా, భారత్, సౌదీ ప్రజలు అత్యంత సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్లో ఇలా విశ్వసించేవారు 74 శాతం మంది, చైనాలో 87 శాతం మంది, సౌదీలో 71 శాతం మంది ఉన్నారు. అయితే అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా పౌరులు తమ దేశాలు గాడి తప్పాయని అభిప్రాయపడ్డారు. -
సర్వే నాలుగు రోజుల్లో పూర్తి కావాలి
అనంతపురం అర్బన్ : ‘ప్రజాసాధికార సర్వేలో మీ పనితీరు సంతృప్తిగా లేదు. సర్వే ఇంత జాప్యం చేస్తే ఎలా..? నాలుగు రోజుల్లో వంద శాతం సర్వే పూర్తవ్వాలి. లేకపోతే చర్యలు తప్పవు’ అని మున్సిపల్ అధికారులను, సిబ్బందిని జాయింట్ కలెక్టర్ బి.లక్మీకాంతం హెచ్చరించారు. సోమవారం ఆయన డ్వామా హాల్లో ప్రజాసాధికార సర్వేపై ఆర్డీఓ మలోలాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ జనాభా 2.73 లక్షలు ఉంటుందని, ఇప్పటి వరకు ఎంత మేర సర్వే పూర్తి చేశారని ప్రశ్నించారు. ఇందుకు అదనపు కమిషనర్ పగడాల కృష్ణమూర్తి మాట్లాడుతూ 2.04 లక్షలు సర్వే చేశామని తెలిపారు. మిగిలిన జనాభాలో శాశ్వతంగా వలసలు వెళ్లిన వారి, మృతుల సంఖ్య వివరాలను మంగళవారం సాయంత్రంలోగా ఇవ్వాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్షి్మ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
► జిల్లాలో పూర్తి కావచ్చిన పల్స్ సర్వే ► సిబ్బందికి చెల్లించాల్సిన గౌరవ వేతనంలో జాప్యం ► ఎన్యూమరేటర్ల ఎదురుచూపు జనాలకు నిద్రపట్టినివ్వలేదు.. సిబ్బందిని పడుకోనివ్వలేదు.. సామాన్యుల్లో ఒకటే టెన్షన్. స్మార్ట్ సర్వేలో నమోదు అరుుతే చిక్కులు తప్పవని.. దాని తీరూ అలాగే ఉంది. ప్రస్తుతానికి ఆ విషయం పక్కనపెడితే రేరుుంబవళ్లు సర్వే పేరుతో ఒళ్లు గుల్ల చేసుకొని.. పని పూర్తి చేసిన సిబ్బందికి ప్రభుత్వ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. చేసిన శ్రమకు గౌరవ వేతనం ఇంకా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తోంది. - ఒంగోలు టౌన్ ‘ప్రస్తుతం జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే చివరి దశకు చేరుకొంది. ఆరునెలలపాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగింది. అరుుతే కష్టపడిన ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఊసే ఎత్తడం లేదు. దీని కోసం వారంతా ఎదురు చూస్తున్నారు’ జేబులో డబ్బుతో.. సర్వే చేసిన సమయంలో సిబ్బంది కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. సిగ్నల్స్ దొరక్కపోవడంతో పాటు జేబులో డబ్బు పెట్టి మరీ నెట్ బిల్లు చెల్లించి సర్వే పూర్తి చేశారు. అరుుతే ఈ నగదు కూడా తమ ఖాతాలో జమ అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సర్వే ప్రారంభం కాగా.. 8,60,463 ఇళ్లను సందర్శించి 33,59,220 మంది వివరాలు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారిలో 2251 మంది ఎన్యూమరేటర్లను, వారి పనితీరును పరిశీలిస్తూ సలహాలు సూచనలు అందించేందుకు 295 మంది సూపర్వైజర్లను నియమించారు. ఒక్క పేరుకు రూ. 4 ఒక్కో ఎన్యూమరేటర్ ఒక పేరు సర్వేలో పొందుపరిస్తే నాలుగు రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్యూమరేటర్ చేసిన సర్వేలో దానిలో పదిశాతం సూపర్వైజర్కు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీంతో కొన్ని శాఖలకు చెందినవారు తమ విధులను పక్కనపెట్టి పూర్తి స్థారుులో సర్వేలో పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులంతా అందుబాటులో లేకపోవడంతో ఒక్కో ఇంటికి నాలుగైదుసార్లు తిరిగిన సందర్భాలున్నారుు. పైగా కొంతమంది అథంటికేషన్(థంబ్, ఐరిష్) వంటివి లేకపోవడంతో మరోమారు వివరాలను సేకరించాల్సి వచ్చింది. రూ 3.47కోట్లకు రూ. 1.70 కోట్లే! జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి 3.47 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్ల రెమ్యునరేషన్ నుంచి మెటీరియల్ తదితర వాటికి లెక్కలు వేసి నివేదించారు. అరుుతే ప్రభుత్వం కోటి 70లక్షల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం వచ్చిన ఈ మొత్తాన్ని ఏవిధంగా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు సర్వే ప్రారంభించిన సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా నియమించిన వారిలో కొంతమంది శాఖాపరమైన విధి నిర్వహణకు సంబంధించి ఒత్తిళ్లు ఉండటంతో స్మార్ట్ పల్స్ సర్వే నుంచి తప్పుకున్నారు. దాంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించారు. సర్వే చేస్తూ మధ్యలో మానివేసిన వారి వివరాలు, ప్రస్తుతం సర్వే చేస్తున్న వారి వివరాలను సేకరిస్తూ వారి ఖాతాల్లో రెమ్యునరేషన్ వేసే విషయంలో గందరగోళం నెలకొంది. -
సర్వేకు అందని ప్రజా సహకారం
► వెనుకడుగు వేసిన ప్రభుత్వం ► జిల్లాలో ఇప్పటికి 81.09 శాతమే నమోదు ► ఊపిరి పీల్చుకున్నఅదికారులు ► వందశాతం పూర్తి ఎప్పటికో? విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వం ఎంత తొందర పెట్టినా.. అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినా ప్రజాసాధికార సర్వే జిల్లాలో శతశాతం పూర్తి కాలేదు. పొట్టకూటి కోసం జనం వలస బాట పట్టడంతో ఇప్పటివరకు 81.09 శాతం మాత్రమే పూర్తరుుంది. నిర్దేశిత గడువు పూర్తి కావడంతో ప్రస్తుతం ఇంటింటి సర్వేను అధికారులు తాత్కాలికంగా ఆపారు. ప్రజల నుంచి సహకారం లేకపోవడం, అధికార వర్గాల నుంచి లోలోపల వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం కూడా దీనిపై ఒత్తిడి తగ్గించింది. దీంతో శతశాతం పూర్తి కావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నారుు. ప్రజల పూర్తి వివరాలు సేకరించడానికి ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే చేపట్టిన విషయం విదితమే. ఇందులోభాగంగా జిల్లాలో జులై 8వతేదీన ఈ సర్వే ప్రారంభమైంది. ఆరంభంలో ఆ నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించిన ప్రభుత్వం తర్వాత అనేక పర్యాయాలు వారుుదాలు వేసుకుంటూ వచ్చింది. చివరిగా గత నెలలో మాత్రం అధికారులపై ఒత్తిడి పెంచింది. నవంబరు నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించింది. ఈమేరకు మండలస్థారుు అధికారులు, ఎన్యుమరేటర్లుపై జిల్లా అధికారులు తీవ్ర ఒత్తిడి పెంచారు. వలస వెళ్లిన వారినిసైతం తెప్పించి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో అధికారులు కూడా సర్వే చేయడం లేదు. మరో వైపు నగదు రహిత లావాదేవీలపై ప్రచారం కోసం ప్రభుత్వం అధికారులను పురమారుుంచడంతో సర్వే పనిని ప్రస్తుతం వారు చేయడం లేదు. అరుుతే తదుపరి కూడా ప్రత్యేకించి సర్వే ఉండదని అధికారులు చెబుతున్నారు. నిరంతర పక్రియ అరుునా వచ్చిన వారికి మాత్రమే నమోదు చేసే అవకాశముందంటున్నారు. సెంట్రలైజ్ చేసి ఏదో ఒక కేంద్రంలో నమోదు చేస్తారని ఒక అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు అమరావతిలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిన విషయం విదితమే. ప్రజలు, అధికారుల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సర్వేపై వెనుకడుగు వేసి తదుపరి గడువు తేదీలు చెప్పకుండా వదిలేసినట్లు కొందరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యం లో శతశాతం సర్వే ఎప్పటికి పూర్తి కానుందోనన్న ప్రశ్న ఇంకా అలాగే మిగిలిఉంది. -
పండుటాకులకు ఎన్ని కష్టాలో..
ఈ చిత్రంలో కనిస్తున్న వ్యక్తి పేరు మహ్మద్ అలీ. మచిలీపట్నంలోని 29వ వార్డు శివారు నూరినగర్ నివాసి. ప్రమాదవశాత్తు ఒక కాలు కోల్పోయాడు. ప్రస్తుతం చంక కర్రల సాయంతోనే నడవగలడు. ఎక్కడికైనా వెళ్లాలంటే మూడు చక్రాల సైకిలే ఆధారం. 2013 నవంబరు నుంచి వస్తున్న వికలాంగుల పింఛనును ఇటీవలి సర్వేలో నిలిపివేశారు. అప్పటినుంచీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా భరోసా ఇచ్చే నాథుడే కనిపించడం లేదు. ఈమె పేరు వల్లూరి వెంకటరత్నమ్మ. బందరు మండలం శ్రీనివాసనగర్ నివాసి. వయస్సు 90 సంవత్సరాలు. గత ఏడేళ్లుగా వృద్ధాప్య పింఛను తీసుకుంటోంది. గత నెల పింఛన్ల జాబితాలో ఆమె పేరు తొలగించారు. ఈ వయసులో తనకు పింఛను తొలగించడంపై స్థానిక పెద్దల వద్ద గోడు వెళ్లబోసుకుంది. వాళ్లు వస్తుందని చెప్పడమే తప్ప ఇప్పటివరకు ఇవ్వలేదని ఆమె వాపోతోంది. ఈమె పేరు అమ్మనాతి బేగం. మచిలీపట్నం 29వ వార్డు నివాసి. గత ఏడేళ్లుగా వితంతు పింఛను తీసుకుంటోంది. ఇటీవలి సర్వేలో ఆమె పేరును పింఛృు జాబితా నుంచి తొలగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు పింఛను సొమ్ము మందులకు ఉపయోగపడేదని, దానిని నిలిపివేయడంతో ఇప్పుడు ఇక్కట్ల పాలవుతున్నానని కన్నీటి పర్యంతమవుతోంది. అధికారులకు తన గోడు చెప్పుకొన్నా పింఛను సొమ్ము ఇంకా చేతికందలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ...ఇలాపింఛన్లు రద్దయి.. ఆసరా కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారు జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది ఉన్నారు. అందరూ తమకు నిలిపివేసిన పింఛన్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు. పింఛన్ల కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. పండుటాకులకు కష్టం వచ్చి పడింది. ముదిమి వయసులో ఆసరాగా ఉన్న పింఛను ఒక్కసారిగా రద్దవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక ఇక్కట్ల పాలవుతున్నారు. పింఛను సొమ్ము ఐదు రెట్లు పెంచి ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన పాలకులు అన్ని అర్హతలూ ఉన్న తమకు వస్తున్న సొమ్ము కూడా రద్దు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తిరిగి పింఛను ఇప్పించాలని కోరుతున్నా ఇదిగో అదిగో అనడమే తప్ప స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. పింఛన్ల సర్వే పేరుతో గ్రామ, వార్డు కమిటీల సభ్యులు తీసుకున్న నిర్ణయాలు పలువురికి చేటు తెచ్చి పెట్టాయి. నెలనెలా వచ్చే పింఛను రాకుండా చేశాయి. జిల్లాలో 3.13 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు ఆగస్టు వరకు అందాయి. సెప్టెంబరులో చేపట్టిన సర్వే కారణంగా ఈ సంఖ్యను 2.77 లక్షలకు కుదించారు. 16 వేల మందిని అనర్హులుగా గుర్తించి వారి పింఛన్లు రద్దు చేశారు. మిగిలిన 34 వేల మంది వివరాలు సక్రమంగా లేవని, ఆధార్ నంబరు సమర్పించలేదని పింఛను నిలిపివేశారు. సెప్టెంబరు నెల పింఛను సొమ్మును నవంబరు 12 వరకు అందజేశారు. అక్టోబరు నెలకు సంబంధించి పింఛన్ల జాబితాలను తయారు చేశామని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి పింఛన్లు అందజేయాలని ఇంకా ఉత్తర్వులు రాలేదని పేర్కొంటున్నారు. అర్హత ఉండి పింఛను రద్దయిన వారి పూర్తిస్థాయి వివరాలు తమ వద్ద లేవని వారు స్పష్టం చేస్తున్నారు. అన్ని అర్హతలూ ఉండి పింఛను రద్దయిన వారు మున్సిపాలిటీ, మండల అధికారులను సంప్రదించాలని, వారు విచారణ చేసి పింఛను మంజూరు చేయవచ్చని పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన జన్మభూమిలో నూతనంగా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ 42 వేల 220 దరఖాస్తులు వచ్చాయి. వీటిన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిచి, అర్హులను నిర్ధారించి వారికి పింఛను మంజూరుకు ఎంత సమయం పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. - మచిలీపట్నం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఒక విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
Advertisement