-
ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాల్లేక..
సుకన్య.. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్. తమిళంలోనే కాకుండా, మలయాళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. ఒకప్పుడు ఎంతో ఫేమ్ అందుకున్న ఈ బ్యూటీ కొంతకాలంగా మాత్రం వెండితెరపై కనిపించడమే లేదు. అప్పటి హీరోయిన్లంతా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం కనిపించకుండా పోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత తమిళంలో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ తర్వాత ఆమె ఊసే లేదు. కెరీర్లో వెనుకబడిపోయిన ఆమె వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. శ్రీధర్ రాజగోపాలన్ను పెళ్లాడి అమెరికాలో సెటిలైన ఈ నటి ఏడాదికే(2003లో) అతడికి విడాకులిచ్చేయడం గమనార్హం. అయినా సరే తనకు ఇష్టమైన యాక్టింగ్ను విడిచిపెట్టలేదు. మళ్లీ సినిమాల్లో ట్రై చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. కొన్ని టీవీ షోలలోనూ మెరిసింది. ప్రస్తుతం సినీ అవకాశాల్లేక ఓ సీరియల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. పలు భాషల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నాను. సినిమా వల్లే నాకంటూ గుర్తింపు వచ్చింది. నాకు అవకాశాలు రాకపోవడం వల్లే సినిమాలు చేయడం లేదు. ఎవరూ నన్ను పిలవడం లేదు. మంచి ఛాన్స్ వస్తే మళ్లీ మూవీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను' అని సుకన్య చెప్పుకొచ్చింది. చదవండి: డేనియల్ బాలాజీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. సంపాదించిన డబ్బంతా ఏమైంది? -
శ్రీరాముని కోసం సీనియర్ నటి ప్రత్యేక గీతం..!
సీనియర్ నటి సుకన్య దక్షిణాది సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కథానాయకిగా పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు. ఇకపోతే సుకన్యలో నాట్య, సంగీత కళాకారిణి, గాయని, గీత రచయిత కూడా ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా నటి సుకన్య శ్రీరాముని కోసం ఓ భక్తి గీతాన్ని రూపొందించింది. అయోధ్య శ్రీరామచంద్రుని ఆలయ నిర్మాణం సాకారమవుతున్న తరుణంలో ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ ఆలయం నిర్మాణం ప్రారంభించిన సమయంలో తన ముఖంపై గీసుకున్న శ్రీరామ్ అనే చిత్రలేఖనం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రాచుర్యం పొందిందన్నారు. తాజాగా 500 ఏళ్ల నాటి కల జనవరి 22న సాకారం కాబోతోన్న వేళ తాను రూపొందించిన జై శ్రీరామ్ భక్తిరస గీతాన్ని వీడియోగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. శ్రీరామ నామ మహిమ, ఆయన పరాక్రమం, రామాయణం కథను ఆవిష్కరించే విధంగా తాను రూపందిస్తున్న జై శ్రీరామ్ ఆడియోను ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణంలో భాగంగా సమర్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ
మిగతా వాళ్ల సంగతేమో గానీ సెలబ్రిటీలు ఏం చేసినా సరే అది వార్త అవుతూ ఉంటుంది. ఇక వాళ్లు రిలేషన్లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా, విడాకులు ఇచ్చినా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. అయితే పలు తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఓ సీనియర్ నటి.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందనే న్యూస్ తెగ వైరల్ అయింది. పైన ఫొటోలో కనిపిస్తున్న నటి.. 'శ్రీమంతుడు' సినిమాలో మహేశ్కి తల్లిగా నటించింది. అయితే గతంలో ఈమె పలు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. సహాయ పాత్రల్లోనూ మెప్పించింది. టాలీవుడ్లో పెద్దరికం, అమ్మకొడుకు, సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఎక్కువగా మలయాళ మూవీస్తో ఫేమ్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టైంలోనే అంటే 2002లో సుకన్య.. శ్రీధరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఏమైందో ఏమోగానీ ఏడాదిలోనే ఆయన్నుంచి విడిపోయి, తిరిగి స్వదేశానికి వచ్చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సౌత్ సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ, మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సుకన్యకు 50 ఏళ్లు. అయితే ఈమె త్వరలో పెళ్లి చేసుకోనుందనే రూమర్ బయటకొచ్చింది. ఇది ఆ నోట ఈ నోట పడి.. ఆమె వరకు చేరుకుంది. దీంతో ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టింది. 'అలాంటి ఆలోచన నాకు లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు.. అమ్మ అని పిలుస్తారా? అమ్మమ్మ అని పిలుస్తారా?' అని కౌంటర్స్ వేసింది. దీంతో ఈమె పెళ్లి కేవలం పుకారు మాత్రమే అని తేలిపోయింది. (ఇదీ చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!) -
కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..
సాక్షి, కర్నూలు(పెద్దకడబూరు): ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకునిపై అమ్మాయి తండ్రి, బంధువులు కొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని హెచ్.మురవణి నాలుగవ మైలు రాయి వద్ద గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసలు, బాధితురాలు తెలిపిన వివరాలు.. హెచ్.మురవణి గ్రామానికి చెందిన ఉసేని కూతురు సుకన్య(24) గత ఏడాది డిసెంబర్లో కాంట్రాక్ట్ పద్ధతిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ఓ(కమ్మునిటీ హెల్త్ ఆఫీసర్)గా విధుల్లో చేరారు. అదే గ్రామానికి చెందిన పెద్ద ఈరన్న కుమారుడు వీరేష్(28)ను ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం అమ్మా యి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణంలో వేరు కాపురం పెట్టారు. వీరేష్ తన భార్యను రోజూ ఉదయం ద్విచక్ర వాహనంపై హెచ్.మురవణికి వెళ్లి డ్యూటీకి వదిలిపెట్టి సాయంత్రం తీసుకొని వచ్చేవాడు. అందులో భాగంగా గురువారం సాయంత్రం తన భార్యను బైక్పై తీసుకొస్తుండగా అమ్మాయి తండ్రి ఉసేని, వారి బంధువులు ఆటోతో హెచ్.మురవణి నాలుగవ మైలురాయి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఇద్దరూ కింద పడిపోవడంతో వీరేష్పై విచక్షణ రహితంగా దాడిచేసి చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయారు. సుకన్య భయంతో పరుగులు తీసింది. ఎమ్మిగనూరు రూరల్ పోలీస్స్టేషన్కు చేరుకుని పోలీసులకు చెప్పింది. రహదారిలో వెళ్తున్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో పాటు చికిత్స నిమిత్తం వీరేష్ను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. భార్య సుకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘బయల్దేరుదామా రజతి’ అంటుంది 34 ఏళ్ల సుకన్య డ్యూటీ ఎక్కబోతూ...
అలుపెరగని కెరటాలు. ఆహ్లాదానికి వచ్చే జనాలు. ఉత్సాహం శృతి మించితే ప్రాణానికే ప్రమాదం. అదుపు చేయాలి పిల్లల్ని పెద్దల్ని. చెన్నై మెరీనా బీచ్ ప్రతి ఉదయం సాయంత్రం జన సముద్రం. వారు ప్రమాదాల బారిన పడకుండా అశ్వదళం నిత్యం గస్తీ కాస్తుంటుంది. వారిలో ఐదుగురు మహిళా పోలీసులు ఉన్నారు. అశ్వాన్ని అధిరోహించి ఈ చివర నుంచి ఆ చివరకు కెరటాల మీద రేఖ గీస్తుంటారు. మగ పోలీసుల మాట కంటే ఈ మహిళా పోలీసుల మాటే జనం ఎక్కువగా వింటారు. జీను మీద కూచుని వీరు సాగించే సవారీ కష్టమైనది. స్ఫూర్తిదాయకమైనది. వారి పరిచయం. ‘బయల్దేరుదామా రజతి’ అంటుంది 34 ఏళ్ల సుకన్య డ్యూటీ ఎక్కబోతూ. 12 ఏళ్లుగా అశ్వదళంలో పని చేస్తున్న సుకన్యకు ప్రియమైన అశ్వం రజతి. డ్యూటీ వాళ్లిద్దరూ కలిసి చేయాలి. ఒకరు లేకుండా మరొకరికి డ్యూటీ అసంపూర్ణం. ‘గ్రేటర్ చెన్నై మౌంటెడ్ బ్రాంచ్’ (అశ్వదళం)లో ఇప్పుడు 26 అశ్వాలు ఉన్నాయి. వాటితో డ్యూటీ చేస్తున్న సిబ్బంది సంఖ్య 30. వారిలో ఐదుగురు మహిళా పోలీసులు. వీరి శాఖ పుదుపేటలో ఉంటుంది. వీరి ప్రధాన డ్యూటీ మెరీనా బీచ్ను కాపు కాయడమే. పోకిరీల నుంచి కాపాడాలి బంగాళాఖాతంలో అలల తాకిడి ఎక్కువ. విహారానికి వచ్చినవారు అత్యుత్సాహంతో లోపలికి వెళితే ప్రాణాలకు ప్రమాదం. అందుకని సుకన్య, ఇతర గస్తీ సిబ్బంది అలల్లో తడుస్తూనే తిరుగుతూ సందర్శకులను తీరం వైపు తరుముతుంటారు. ‘అది ఒక్కటే కాదు... అమ్మాయిలను వేధించే పోకిరీల నుంచి, చైన్ స్నాచర్ల నుంచి, పార్కింగ్ దగ్గర వాహనాలు ఎత్తుకెళ్లే దొంగల నుంచి కూడా జనాన్ని కాపాడాలి. అలాగే తప్పిపోయిన పిల్లలను వెతికి పెట్టాలి. ఒక్కోసారి జనం తాకిడి ఎక్కువైతే చాలామంది పిల్లలు తప్పిపోతూ ఉంటారు’ అంటుంది సుకన్య. ‘నేను మామూలు లాఠీ పట్టుకుని నేల మీద యూనిఫామ్తో నడుస్తూ వస్తే ఏ పోకిరీ మాట వినడు. అదే గుర్రం మీద వస్తే ఆ కథే వేరు. పరిగెడతారు’ అంటుంది నవ్వుతూ. ప్రమాదాలు ఉంటాయి అయితే ఈ ఉద్యోగం అంత సామాన్యం కాదు. మన మూడ్ బాగలేకపోతే గుర్రం గ్రహిస్తుంది. అలాగే గుర్రం మూడ్ పాడైతే మనం గ్రహించాలి. ఈ రెంటి మధ్య సమన్వయం లేకపోతే ప్రమాదం. ‘ఒకసారి న్యూ ఇయర్ నైట్ జనం విపరీతంగా వచ్చారు బీచ్కి. గుర్రం బెదిరి భయంకరంగా పరిగెత్తింది. దాని మీద ఉన్న నా గుండెలు అవిసిపోయాయి. అది ఎక్కడ ఆగుతుందో చెప్పలేము. అది ఆగాక ఒక్కసారిగా గెంతి, దాని మెడ నిమిరి అదుపులోకి తెచ్చాను’ అంటుంది సుకన్య. ఆమెతో పని చేసే జాస్మిన్ అనే కానిస్టేబుల్ను అయితే గుర్రం అలల్లోకి విసిరికొట్టింది. మణికట్టు విరిగితే ఆరునెలలక్కానీ మళ్లీ కళ్లేలు పట్టుకోవడం వీలు కాలేదు. మొత్తం ఐదుమంది ఇప్పుడు అశ్వదళంలో సుకన్య, జాస్మిన్, మాళవిక, పునీత, మహలక్ష్మి పని చేస్తున్నారు. సుకన్య, జాస్మిన్ సీనియర్లు అయితే మిగిలిన ముగ్గురూ జూనియర్లు. వీరంతా తమ తమ గుర్రాల మంచి చెడ్డలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వీటికి ప్రతి రోజూ ఆహారం అందించాలి. అందుకు ఒక్కో గుర్రానికి 600 రూపాయలు ఖర్చుపెడుతోంది పోలీస్ శాఖ. గుర్రాలకు స్నానం చేయించడం, మసాజ్, గారం చేయడం ఇవన్నీ చేస్తేనే అవి స్నేహాన్ని పాటిస్తాయి. ‘మేమందరం డ్యూటీ దిగాక గుర్రాలను కాసేపు బుజ్జగించి ఇళ్లకు వెళతాం’ అంటుంది సుకన్య. ఈ గుర్రాలను ఉత్తర ప్రదేశ్ సహరన్పూర్ నుంచి, తమిళనాడు చెట్టినాడ్ నుంచి కొని తెస్తూ ఉంటారు. వీటి కోసంగా ఊటీ నుంచి రోజూ ప్రత్యేకం క్యారట్, గడ్డీ వస్తుంటుంది. పశువైద్యులు చెకప్లు నిర్వహిస్తారు. ‘నగరంలో కాసింత ఊపిరి పీల్చుకోవడానికి స్త్రీలు చాలామంది బీచ్కు వస్తారు. వాళ్లకు మమ్మల్ని చూస్తే ధైర్యం. డ్యూటీ తృప్తిగా చేయడానికి ఇంతకు మించి కారణం ఏముంది’ అంటారు మెరీనా ధీరలు. ఈసారి చెన్నై వెళితే వారిని చూడండి. సూపర్ సుకన్య కోయంబత్తూరుకు చెందిన సుకన్య అంతవరకూ మగవాళ్లు మాత్రమే పని చేసే అశ్వదళంలో మొదటిసారిగా చేరింది. ‘నేను సినిమాల్లోనే గుర్రాలు చూశాను అప్పటి వరకూ’ అంటుంది సుకన్య. కాని రెండు మూడు నెలల్లోనే ట్రైనింగ్లో సుకన్య గుర్రాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో నేర్చుకుంది. మూడేళ్ల క్రితం వరకూ కూడా మొత్తం అశ్వదళంలో ఆమె ఒక్కర్తే మహిళా పోలీస్. ‘మా ఇంట్లో వాళ్లు మొదట్లో ఈ ఉద్యోగానికి ఒప్పుకోలేదు. ఆడపిల్ల గుర్రం ఎక్కి గస్తీ కాయడం ఏంటి అని ఇప్పటికీ మా అమ్మానాన్నలు అనుకుంటారు. కాని నాకు ఈ ఉద్యోగమే ఇష్టం’ అంటుంది సుకన్య. ఉదయం నాలుగున్నరకు డ్యూటీ మొదలవుతుంది ఆమెది. గుర్రం ఎక్కి మెరీనా బీచ్లో వాకింగ్కి, విహారానికి, స్నానానికి వచ్చేవారిని అదుపు చేయాలి. వారిని కాపాడాలి. మెరీనా బీచ్ సుదీర్ఘమైన బీచ్. అందుకని గుర్రాలు గస్తీకి బాగా ఉపయోగపడతాయి. అశ్వదళం బ్రిటిష్ హయాం నుంచి ఉన్నా 1926 నుంచి మెరీనా బీచ్ గస్తీకి ఉపయోగిస్తున్నారు. కాని 2011 వరకూ మహిళలు ఎవరూ అందులో చేరలేదు. సుకన్యదే ఆ రికార్డు. ఉదయం 8 వరకూ డ్యూటీ ముగించుకుని మళ్లీ సాయంత్రం 4 గంటలకు గుర్రం ఎక్కుతుంది సుకన్య. 7 గంటల వరకూ డ్యూటీ చేస్తుంది. మొత్తం మీద గుర్రంతో ఆమె రోజూ ఆరు నుంచి ఏడు గంటల పాటు తీరంలో తిరుగుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement