-
రొయ్య రైతుల సమాఖ్య ఆవిర్భావం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రొయ్య రైతుల సమాఖ్య (ఏపీ పీఎఫ్ఎఫ్) ఆవిర్భవించింది. విజయవాడలో మంగళవారం జరిగిన రాష్ట్ర రొయ్య రైతుల సమావేశంలో జాతీయ రొయ్య రైతుల సమాఖ్యకు అనుబంధంగా దీనిని ఏర్పాటు చేశారు. ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ సమక్షంలో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సమాఖ్య అధ్యక్షునిగా కె.భాస్కరరాజు (కృష్ణా), ప్రధాన కార్యదర్శిగా జీవీ సుబ్బరాజు (పశ్చిమ గోదావరి), ఉపాధ్యక్షులుగా ఎం.వెంకటేశ్వరరావు (కృష్ణా), ఆర్.నానిరాజు (అంబేడ్కర్ కోనసీమ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి.గోపీనాథ్ (ప్రకాశం), కోశాధికారిగా వై.వెంకటానందం (అంబేడ్కర్ కోనసీమ), సహాయ కార్యదర్శులుగా ఇ.ఇమ్మానియేల్ (బాపట్ల), యు.రాంబాబు (పశ్చిమ గోదావరి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమాఖ్య గౌరవ అధ్యక్షునిగా అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, సలహాదారులుగా జాతీయ రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఐపీఆర్ మోహనరాజు, శ్రీనాథ్రెడ్డి, నాగభూషణం, సీహెచ్ సూర్యారావు, డీవీ లక్ష్మీపతిరాజు వ్యవహరిస్తారు. గతంలో ఎన్నడూలేని విధంగా గడిచిన నాలుగేళ్లుగా ఆక్వా రంగానికి, ఆక్వా రైతులకు అన్ని విధాలుగా చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ రొయ్య రైతుల సమాఖ్య నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. కాగా, రొయ్యల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్రాన్ ఫెస్టివల్స్కు జిల్లా రొయ్య రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉచితంగా రొయ్యలు సరఫరా చేయాలని నిర్ణయించారు. -
సునీల్ రోడ్డు మధ్యలో కారుని ఆపి డాన్సులు చేసేవాడు
-
ఎన్నో అవార్డులు తెచ్చిన జిగర్తాండ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడంటే
తమిళంలో సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ సినిమాను ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తమిళ హీరో సిద్ధార్థ్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించగా.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇదే సినిమాను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేశ్ పేరుతో తెరకెక్కింది. హరీశ్ శంకర్ దీనిని రీమెక్ చేయగా.. టాలీవుడ్లో కూడా మంచి విజయాన్ని సాధించింది. (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్లాక్ చేసేదాన్ని:నటి) తాజాగా దీనికి సిక్వెల్ రెడీ చేశారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్గా జిగర్తాండ డబుల్ ఎక్స్ రూపొందుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తూ తన స్టోన్ బెంచ్ ఫిలింస్పై అలంకార్ పాండియన్కు చెందిన ఇన్వలియో ఆరిజిన్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి కార్తికేయన్ సంతానం సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, తిరు చాయాగ్రహణ అందిస్తున్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. (ఇదీ చదవండి:విజయ్ను డైరెక్ట్ చేసే లాస్ట్ ఛాన్స్ ఆ దర్శకుడికే..) ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్రం సంతృప్తికరమైన అనుభవాన్ని కలిగించిందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. చిత్రాన్ని పలు ప్రాంతాల్లో భారీ వ్యయంతో రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాన్ని దీపావళికి థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగులో కూడా ఈ సినిమా రానుంది. -
డ్రగ్స్ కేసులో నన్ను లోపలేసినా పోయేదేం లేదు: సుబ్బరాజు
'ఖడ్గం'తో తన కెరీర్ను మొదలుపెట్టాడు నటుడు సుబ్బరాజు. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, శ్రీ ఆంజనేయం, చంటి.. ఇలా అనేక చిత్రాలతో పాపులారిటీ దక్కించుకున్నాడు. పోకిరి, దేశముదురు.. వంటి సినిమాలతో టాప్ హీరోలతోనూ నటించాడు. తక్కువ కాలంలోనే ప్రధాన క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను గురించి పంచుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతోంది. ఫిట్నెస్ను కాపాడుకుంటూ మంచి పాత్రలు చేస్తున్నాను. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్గా ఉంటే మంచి రోల్స్ చేయొచ్చు, లేదంటే తండ్రి పాత్రలు చేయాల్సి వస్తుంది. భీమవరంలో నాన్న డీఎన్ఏ కాలేజీలో లెక్చరర్. సైకిల్ స్పీడ్గా తొక్కినా కూడా ఏంటి అంత వేగంగా తొక్కుతున్నావని అడిగేవారు. చిన్నప్పుడు గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారా? అని అడుగుతుంటారు. కానీ నాకు ఫ్రెండ్సే తక్కువ, అలాంటిది గర్ల్ఫ్రెండ్స్ కూడానా! ప్రేమించి కొన్నాళ్లు ఆరాధించడం తప్ప అంతకుమించేమీ లేదు. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు, అందుకే ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాను. నాకు మంచి పాత్రలివ్వమని డైరెక్టర్లను అడగబుద్ధి కాదు. నాకు మొహమాటం ఎక్కువ. డ్రగ్స్ కేసులో చాలా డిస్టర్బ్ అయ్యాను. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే దానికంటే నా పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారన్న బాధ ఎక్కువైంది. వాళ్లకు ఏం చెప్పి ధైర్యం చెప్పాలి? ఇంటి తలుపు తట్టి మరీ మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడంటగా అని అడుగుతారు. అయినా నన్ను ఇరికించి లోపల పడేసినా పెద్ద పోయేదేం లేదు' అని చెప్పుకొచ్చాడు సుబ్బరాజు. చదవండి: తండ్రి వైద్యం కోసం అభిమాని ఎదురుచూపులు, ఆదుకున్న బన్నీ -
అల్లు అర్జున్పై ట్రోల్స్, నెటిజన్ల మండిపాటు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ట్రోల్స్ బారిన పడ్డాడు. తాజాగా బన్నీ నటించిన జోమాటో యాడ్పై నెటిజన్లు, సౌత్ సినీ ప్రియులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో బన్నీ చెప్పిన ఓ డైలాగ్పై సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల మండిపడుతున్నారు. ఇంతకి అసలు విసయం ఎంటంటే.. అల్లు అర్జున్ తాజాగా నటించిన ఈ కమర్షియల్ యాడ్లో నటుడు సుబ్బరాజు కూడా నటించిన సంగతి తెలిసిందే. చదవండి: Allu Arjun Zomato Ad: మనసు కోరితే తగ్గేదేలే.. అదరగొట్టిన అల్లు అర్జున్.. ఇందులో ఇద్దరి మధ్య ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఈ ప్రకటనలో బన్నీ, సుబ్బరాజును అమాంతం గాల్లోకి ఎత్తేస్తాడు. దీంతో తనను త్వరగా కిందకు దించాలని సుబ్బరాజు అడుగుతాడు. అప్పుడు బన్నీ ‘సౌత్ సినిమా కదా. ఎక్కువ సేపు ఎగరాలి అని డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు ఇదే తీవ్ర విమర్శలకు కారణమయ్యింది. ఈ డైలాగ్తో సౌత్ ఇండియా సినిమాలను బన్నీ కించపరిచాడంటూ సౌత్ సినీ ప్రియులు, ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాది నుంచే స్టార్ స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్.. మూలాలు మరిచిపోతే ఎలా.. అంటూ ఓ నెటిజన్ ఈ యాడ్పై కామెంట్ చేశాడు. చదవండి: టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్వార్, వరస ట్వీట్స్తో మాటల యుద్ధం.. దీంతో అల్లు అర్జున్ సౌత్ సినిమాను అవమానించారంటూ.. జొమాటో యాప్ను అన్ఇన్స్టాల్ చేస్తున్నట్టు ట్వీట్లో మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా బన్నీ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాడు. గతంలోనూ.. బన్నీ నటించిన ఓ యాడ్ వివాదానికి కారణమైంది. రాపిడో సంస్థకు చెందిన ఈ ప్రకటనలో.. ఆర్టీసీని అవమానించారంటూ.. తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా.. డైరెక్ట్ గా విమర్శలు చేశారు. ఇప్పుడు అదే బన్నీ అంబాసిడర్ గా నటించిన జొమాటో యాడ్ వంతు వచ్చింది. దీనికి ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది.. బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. manasu korithe, thaggedele! 🔥 @alluarjun pic.twitter.com/i30UGZEQKD — zomato (@zomato) February 4, 2022
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement