-
మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ పెరగాలి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ పెరగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. నానక్రాంగూడలో నూతనంగా విస్తరించిన మెడ్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను గురువారం ఆయన అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో ఎంఈఐసీ ఉండటం మెడ్టెక్ ఆవిష్కరణలకు హాట్స్పాట్గా ఎదుగుతుందనడానికి నిదర్శనమన్నారు. ఈ ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందన్నారు. వైద్య పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధికి ఆదర్శవంతమైన గమ్య స్థానంగా హైదరాబాద్ను ప్రపంచపటంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెడ్ట్రానిక్ సంస్థ అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంస్థ పురోభివృద్ధికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సి ద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ, అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్లను భారత్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నా రు. మెడ్ట్రానిక్ చైర్మన్, సీఈఓ జెఫ్మార్తా మాట్లా డుతూ ఆర్అండ్డీ సౌకర్యాన్ని విస్తరించడానికి, భవిష్యత్తులో 1,500 మందికి ఉపాధి కల్పించడానికి మెడ్ట్రానిక్ ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఈఐసీ ఉపాధ్యక్షుడు, సైట్ లీడర్ దివ్యప్రకాశ్ జోషి మాట్లాడారు. అనంతరం మంత్రి మెడ్ట్రానిక్ సంస్థ ద్వారా ఉత్పత్తి చేసిన యంత్ర పరికరాలు వాటి పనితీరును వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఫోర్సిస్ ఇంక్ నూతన కార్యాలయం ప్రారంభం తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు పూర్తిగా అనుకూలంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఫోర్సిస్ ఇంక్నూతన కార్యాలయాన్ని శ్రీధర్బాబు, అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సా మాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు రావాలన్నారు. జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ భారతదేశం, అమెరికా భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా బలమైన ద్వైపాక్షిక స్నేహంగా ముందుకు సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఫోర్సిస్ సంస్థ వ్యవస్థాపకులు జేపీ వేజెండ్ల, ఐల్యా బ్స్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడారు. -
‘పార్లమెంట్’పై కాంగ్రెస్ గురి! ఆ స్థానాలకు పోటాపోటీగా..
సాక్షిప్రతినిధి, వరంగల్: పార్లమెంట్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ గురి పెట్టింది. శాసనసభ ఎన్నికల్లో వరించిన విజయంతో అధికార పగ్గాలు చేజిక్కించుకున్న ఆ పార్టీ దూకుడుగా ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్పై వేగంగా పావులు కదుపుతోంది. 12 అసెంబ్లీ స్థానాలకు పదింటిలో గెలిచిన కాంగ్రెస్ వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల ను గెలుచుకోవాలని కుతూహలపడుతోంది. అందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను నియమించిన ఆ పార్టీ అధిష్టానం వరంగల్, మహబూబాబాద్కు సైతం నియమించింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్కు ఖమ్మం జిల్లాకు చెందిన రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ధనసరి సీతక్కను ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్గా నియమించింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జ్లుగా నియమితులైన పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆ లోక్సభ స్థానం పరిధి ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాలు, మండలాల నేతలతో సమన్వయం చేయనున్నారు. పీఏసీలో ఓరుగల్లు ప్రస్తావన.. వరంగల్, మహబూబాబాద్.. పార్లమెంట్ స్థానాలను గెలవడం కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకుంది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇదే అంశాన్ని సూచించడం గమనార్హం. 12 స్థానాలకు 10 అసెంబ్లీ సీట్లను గెలిచామన్న భావనతో పార్లమెంట్ ఎన్నికలను నిర్లక్ష్యం చేయరాదని ఈ కమిటీలో సూచించినట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ 131 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 28న నాగ్పూర్లో జరిగే వేడుకలకు వరంగల్, మహబూబాబాద్ నుంచి పదివేలకు తగ్గకుండా మందిని రైలుమార్గంలో తరలించాలన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలకంటే ముందుగానే అసెంబ్లీ టికెట్లను వదులుకున్న వారిని నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేయాలని, అందుకు సంబంధించిన ఉమ్మడి జిల్లా జాబితా కూడా సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రతీ కార్యకర్త అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన పట్టుదల, తెగువ, కృషి.. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపుగా చూపాలని సూచించింది. పోటాపోటీగా ఆశావహులు.. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. మాజీ ఎంపీలు, సీనియర్లు, టీపీసీసీ, ఏఐసీసీ నేతలను సంప్రదిస్తున్నారు. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి, కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. స్టేషన్ఘన్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శనిగపురం ఇందిర పేరు కూడా వినిపిస్తున్నది. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, నెహ్రూనాయక్, బెల్లయ్యనాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నలుగురు సీనియర్లు కూడా వరంగల్, మహబూబాబాద్ కాంగ్రెస్ టికెట్ల కోసం లోపాయికారిగా మాట్లాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో 17 స్థానాల్లో దాదాపు 15–16 స్థానాలు కై వసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వరంగల్, మహబూబాబాద్ ఎంపీలను గెలిపించుకోవడానికి పావులు కదుపుతోంది. ఇవి కూడా చదవండి: మెదక్కు దామోదర.. జహీరాబాద్కు సుదర్శన్రెడ్డి -
ఇక ఢిల్లీలో ‘కల్లాల’ గళం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తానని ఢిల్లీ వెళ్లి.. ఉత్తి చేతులతో తిరిగి వచ్చేసిన సీఎం కేసీఆర్లాగా తాము మోసం చేయలేమని, తెలంగాణ రైతాంగం పక్షాన ఢిల్లీలో గళం వినిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్న డిమాండ్తో డిసెంబర్ 9 నుంచి 13వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేస్తామని ఆయన ప్రకటించారు. టీపీసీసీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన రెండు రోజుల ‘వరి దీక్ష’ఆదివారం సాయంత్రం ముగిసింది. దీక్షలో పాల్గొన్న రేవంత్రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్, బీజేపీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. వరి పండించవద్దని చెప్పి నా తన మాట వినకుండా గత యాసంగిలో వరి పంట వేసిన రైతులపై కక్ష తీర్చుకోవడంలో భాగంగానే కేసీఆర్ ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు పెడుతు న్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ, కేసీఆర్లు కలసి దేశంలోని రైతాంగం పండించే పంటలను అదానీ, అంబానీలనే కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని, మోదీ, కేసీఆర్, అదానీ, అంబానీలది దుష్టచతుష్టయమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని పైకి చెబుతున్నా.. సీఎం కేసీఆర్తో కలసి దొడ్డిదారిలో ఆ చట్టాల్ని ప్రజలపై రుద్దుతోందని విమర్శించారు. వచ్చే సీజన్ నుంచి ధాన్యం కొనేది లేదని సీఎస్ సోమేశ్కుమార్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ప్రధాని మోదీ మెడలు వంచి ధాన్యం సమస్యను పరిష్కరిస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కనీసం ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా అడగలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్లాలపై రైతులు చనిపోయిన ఘటనలకు కేసీఆరే బాధ్యుడని అన్నారు. కాగా, రైతులు కష్టాల్లో ఉంటే బీజేపీ నేతలు పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టారని రేవంత్ విమర్శించారు. రైతుల శవాల మీద గద్దెనెక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దు య్యబట్టారు. తెలంగాణలో రైతులతో పెట్టు కున్నోడు రాజ్యమేలిన దాఖలాలు లేవని, గతంలో చంద్రబాబు కూడా రైతులతో పెట్టుకునే తుడిచిపెట్టుకుపోయారని అన్నారు. ఈ దీక్షతో కనువిప్పు కలగాలి: జానా సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ వరి దీక్షతో ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని అన్నారు. తమ పార్టీ దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజాసంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. మానవత్వం లేని కేసీఆర్ పని ఖతం అయిందని అన్నారు. వరి వేస్తే ఉరి.. రైతులకు కాదని, కేసీఆర్ను, ఆయన ప్రభుత్వాన్ని ఉరి వేసేందుకు రైతులు సిద్ధం గా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మనస్ఫర్థలు సాధారణమేనని, అందరం కలసి పని చేస్తామని చెప్పిన కోమటిరెడ్డి తన రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. ఢిల్లీలో ధర్నాకు రాహుల్, ప్రియాంక గాంధీలను ఆ హ్వానించి తెలంగాణ రైతాంగం పక్షాన కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామన్నారు. కాంగ్రెస్ నేతలు జీవన్రెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, కోదండరెడ్డి, అన్వేశ్రెడ్డి, జి.చి న్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, సుదర్శన్రెడ్డి, సునీతారావు, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్రావులతో పాటు పలువురు ఇతర నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్షలో భాగంగా మొత్తం 9 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. రైతుల సమస్యలు, శాశ్వత పరిష్కారం గురించి నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన 92 ఏళ్ల రైతు రాంరెడ్డి పాడిన పాటను అభినందించిన రేవంత్ ఆయనకు పాదాభివందనం చేశారు. -
సత్తా చాటాల్సిందే
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో మంచి ఫలితం సాధించే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటోంది. మొదటి నుంచీ పట్టున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కేడర్ను కాపాడుకోవడం ద్వారా వీలైనన్ని ఎక్కువ ఓట్లు రాబట్టవచ్చని, టీఆర్ఎస్–బీజేపీల బంధాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓట్ల శాతాన్ని పెంచుకోవచ్చనే వ్యూహంతో ముందుకెళుతోంది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 30 శాతానికి తగ్గకుండా ఓట్లు వచ్చిన పరిస్థితుల్లో ఈసారి కూడా ఆ ఓట్లను నిలబెట్టుకోవాలని, టీఆర్ఎస్–బీజేపీల మధ్య ఓట్ల చీలికను ఆసరాగా చేసుకొని గెలుపు తీరం చేరుకోవాలని ఆశిస్తోంది. మూడంచెల వ్యూహం... ఉపఎన్నికను మూడంచెల వ్యూహంతో ఎదు ర్కోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణలో మండలాలు, గ్రామాలవారీగా పని విభజన చేసుకొని ముందుకెళ్లేలా వ్యూహం రూపొందించారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణను స్వయంగా చేపడుతూ మండలాలవారీగా ఇన్చార్జీలను, చీఫ్ కో–ఆర్డినేటర్లను నియమించారు. ఇందులో కమలాపూర్కు ఎమ్మెల్యే సీతక్క, జమ్మికుంటకు శ్రీధర్బాబు, హుజూరాబాద్ పట్టణ, మండలానికి జగ్గారెడ్డి, ఇల్లంతుకుంట మండలానికి వేం నరేందర్రెడ్డి, వీణవంక మండలానికి ఎమ్మెల్సీ జీవన్రెడ్డిలను నియమించారు. వారికి అనుబంధంగా మరో ఐదారుగురు నేతలను మండలాలవారీగా నియమించారు. వారి సమన్వయంతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో పని విభజన చేయనున్నారు. ప్రతి గ్రామానికి టీపీసీసీ స్థాయి నాయకుడిని ఇన్చార్జిగా నియమించాలని, నియోజకవర్గవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పార్టీ అనుబంధ సంఘాలను రంగంలోకి దింపాలని ఆయన ఇప్పటికే ఆదేశించారు. గాంధీభవన్లో కీలక నేతల భేటీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు శనివారం గాంధీ భవన్లో సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, అజ్మతుల్లా హుస్సేన్లు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా రానున్న 20 రోజులపాటు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. స్టార్ క్యాంపెయినర్లు వీరే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ పక్షాన ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి. వేణుగోపాల్ ఈ పేర్లతో కూడిన లేఖను ఎన్ని కల సంఘానికి పంపినట్టు టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. మొత్తం 20 మందితో కూడిన ఈ జాబితాలో మాణిక్యం ఠాగూర్, రేవంత్రెడ్డి, భట్టి, శ్రీనివాస కృష్ణన్, జీవన్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వీహెచ్, పొన్నాల, అజహరుద్దీన్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్రెడ్డి ఉన్నారు. -
గుర్రపు బండిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్బంద్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గాంధీభవన్ నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండి ఎక్కి వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, సీతక్క ఇందులో పాల్గొన్నారు. అయితే అసెంబ్లీ ముందుకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. గుర్రపుబండిలో అసెంబ్లీలోనికి వెళ్లేందుకు వీల్లేదనడంతో కాంగ్రెస్ నేతలు వాగ్వివాదానికి దిగారు. అసెంబ్లీ సమావేశాలకు ఎలా హాజరు కావాలన్నది తమ ఇష్టమని, తమను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అయినప్పటికీ పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో భట్టి సహా నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రాంగోపాల్పేట పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ కారణంగా సోమవారం జరిగిన అసెంబ్లీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనలేకపోయారు. స్పీకర్, చైర్మన్ సమాధానం చెప్పాలి: భట్టి పోలీస్స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీకి ఎలా వెళ్లాలనేది సభ్యుల ఇష్టమని, తాము అసెంబ్లీకి హాజరు కాకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని భట్టి అన్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా వెళ్లినా తమను అరెస్టు చేసిన విధానంపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కుల తీర్మానం ఇస్తాం: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ ఆమోదిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్న దానిపై వివరణ ఇవ్వాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. సభకు హాజరుకానివ్వకుండా తమ హక్కులను కాలరాసినందుకు అసెంబ్లీలో, మండలిలో హక్కుల తీర్మానం పెడతామని చెప్పారు. శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎలా రావాలన్న దానిపై నిబంధనలు ఏమైనా ఉన్నాయేమో స్పీకర్, చైర్మన్లు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని జగ్గారెడ్డి విమర్శించారు. సీతక్క మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే, ప్రజలతో కలిసి పోరాడాల్సిన కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని విమర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement