-
నల్లమల ఘాట్ రోడ్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్
అసలే దట్టమైన నల్లమల అభయారణ్యం.. ఎత్తయిన ఘాట్ రోడ్డు.. భారీ మలుపులు.. వాహనదారుల అజాగ్రత్తలతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే రెండువైపులా భారీగా నిలిచిపోతున్న వాహనాలు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. సంఘటన స్థలానికి అంబులెన్స్, పోలీసు వాహనాలు చేరుకునేందుకు కూడా అష్టకష్టాలు పడాలి.. ఈలోపు క్షతగాత్రుల ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొని ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లలో వాహన ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయడం.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో చెక్ పెడుతున్నారు. పెద్దదోర్నాల: ► శ్రీశైలం వైపు వేగంగా వెళ్తున్న ఓ టూరిస్టు బస్సు ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోయి అదుపుతప్పి తుమ్మలబైలు వద్ద బోల్తాపడిన సంగతి పాఠకులకు విధితమే. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ► మూడు రోజుల కిందట ఓ కారు శ్రీశైలం ఘాట్ రోడ్డులో సాక్షి గణపతి ఆలయ సమీపంలో బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది. అధిక శాతం వాహనదారులకు ఘాట్ రోడ్లపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. అతివేగం కారణంగా జరుగుతున్న అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తోంది. ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని సమస్యాత్మక రోడ్లతో పాటు అత్యంత ప్రమాదకర రోడ్లుగా నల్లమల అభయారణ్యంలోని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లను గుర్తించారు. ఘాట్ రోడ్లలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు లేజర్ స్పీడ్ గన్లతో పరిశీలించి వాహనాల మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా జరిమానాలు విధించేందుకు బ్రీత్ ఎనరైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్తో వాహనదారులకు పరీక్షలు.. మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు కర్నూలు రహదారిపై వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం వలన అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తేలడంతో డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దానివలన ఏ తప్పూ చేయని ఎదుటి వ్యక్తుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఘాట్ రోడ్లపై 40 కి.మీ వేగానికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని, సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వేగంతోనే తరుచూ ప్రమాదాలు.. మితిమీరిన వేగం, వాహనాలను నడిపే సమయంలో నిర్లక్ష్యం కారణంగానే ఘాట్ రోడ్లపై ఎక్కువగా వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు గుర్తించారు. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు రోడ్డులోని రోళ్లపెంట నుంచి మండల కేంద్రం వరకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు రహదారులూ ఘాట్ రోడ్లే. ఈ మార్గాలలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు, భక్తులు వందలాది వాహనాల్లో శ్రీశైలం వెళ్తారు. కొన్నేళ్లుగా ఘాట్ రోడ్లలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని ముఖ్య రహదారులపై ప్రయాణించే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అధికారులు లేజర్ గన్లను వినియోగిస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలకు జరిమానాలు, ఈ–చలానాలు విధిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానికి వెళ్లే రహదారులతో పాటు, అత్యంత క్లిష్టమైన శ్రీశైలం ఘాట్ రోడ్డులో స్పీడ్ గన్లను ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. మితిమీరిన వేగంగా వెళ్తున్న వాహనాలను కంట్రోలు చేసేందుకు స్పీడు గన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వేగ నియంత్రణకు పటిష్ట చర్యలు మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల వలనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందువలన అతివేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు ఘాట్ రోడ్లలో స్పీడ్ గన్లను వినియోగిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించి జరిమానాలు విధిస్తున్నాం. దీనివలన రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలుగుతున్నాం. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం. సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపటం అనర్థదాయకం. - మారుతీకృష్ణ, సీఐ, యర్రగొండపాలెం -
హలో బాసూ.. వేగం ఎక్కువైంది.. అని కారు డ్రైవర్కు చెబితే!
బండెక్కితే వంద దాటాల్సిందే అనేవాళ్లు చాలా మందే ఉంటారు. రోడ్డు బాగుంటే, జనాలెవరూ లేకపోతే ఈ స్పీడు రెండింతలు కూడా అవుతుంటుంది. ఇలాంటి సమయంలోనే కాస్త అటూఇటైతే ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి ఇలాంటి ప్రమాదాలను అరికట్టే అవకాశమే లేదా?.. అంటే ‘మై హూనా’అంటోంది కార్ల కంపెనీ ఫోర్డ్. అత్యవసర సమయాల్లో వాహనం వేగాన్ని తగ్గించే ‘జియోఫెన్సింగ్’టెక్నాలజీని రూపొందించింది. సిటీల్లో ఏయే ప్రాంతాల్లో మెల్లగా వెళ్లాలో అక్కడి నిబంధనల ప్రకారం ఓ వర్చువల్ ప్రాంతాన్ని ఈ టెక్నాలజీ డిజైన్ చేస్తుంది. ఈ ప్రదేశాల్లోకి వాహనం వెళ్లినప్పుడు ఎక్కడైనా వేగం హద్దు మీరినట్టు అనిపిస్తే ‘హలో.. వేగం ఎక్కువైంది’అని డ్రైవర్కు ఓ సాఫ్ట్వేర్ రెస్పాన్స్ను ఈ టెక్నాలజీ చూపిస్తుంది. ఆ వెంటనే ఆ ప్రాంతానికి తగ్గట్టు వేగాన్ని తగ్గించేస్తుంది. వేగం ఎంత తగ్గుతోందో డ్రైవర్ ముందున్న డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. మరి కొన్నికొన్నిసార్లు రోడ్లు ఖాళీగా ఉన్నా, జనాలెవరూ లేకున్నా ఇలా వేగం తగ్గిస్తే పరిస్థితేంటి?.. అంటే ఈ టెక్నాలజీని ఆఫ్ చేసే వెసులుబాటు కూడా డ్రైవర్కు ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్తో అనుసంధానమైన వాహనాల్లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ఫోర్డ్ పరిశీలిస్తోంది. మంచి ఫలితాలొస్తున్నాయని కంపెనీ చెబుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కచ్చితంగా పాటించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో రోడ్లపై వాహనాల వేగంపై ప్రభుత్వం పరిమితి విధించింది. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేగ పరిమితిని ఖరారు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కార్లు– ఇతర వాహనాలను (సరుకు రవాణా వాహనాలు, బస్సులు, మూడు చక్రాల వాహనాలు, ద్విచక్రవాహనాలు) రెండు కేటగిరీలుగా విభజించి వేరువేరు వేగ పరిమితులను ఖరారు చేసింది. ► డివైడర్లతో ఉన్న రోడ్లు, డివైడర్లు లేని రోడ్లు, కాలనీ రోడ్లు.. ఇలా మూడు వేర్వేరు రోడ్లకు వేర్వేరు గరిష్ట వేగాలను ఇందులో పేర్కొనటం విశేషం. ► ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగి మరణాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు తెలుస్తోంది. ► రోడ్డు డివైడర్ ఉన్న రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 60 కి.మీ.గా, ఇతర వాహనాల వేగం 50 కి.మీ.గా నిర్ధారించారు. ► డివైడర్ లేని రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.గా, ఇతర వాహనాల వేగం 40 కి.మీ.గా, కాలనీ రోడ్లపై కార్లు, ఇతర వాహనాల గరిష్ట వేగం 30 కి.మీ.గా ఖరారు చేసింది. నాలుగున్నరేళ్ల తర్వాత.. ఆధునిక వాహనాలు అందుబాటులోకి రావటంతో రోడ్లపై వాటి వేగం పెరిగి ప్రమాదాలు చోటుచేసుకోవటం ద్వారా విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్న తీరును 2017లో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, నగర, పట్టణ రోడ్లపై వాహనాల గరిష్ట వేగంపై పరిమితి విధించాలని ఆయన అందులో ప్రభుత్వాన్ని కోరారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ఆయా రోడ్లపై వేగ పరిమితిని నిర్ధారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు 2017 నవంబరు 17న ఉత్తర్వు జారీ చేసింది. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రోడ్లు, పురపాలక సంఘాల రోడ్లపై వేగ పరిమితిని నిర్ధారించే బాధ్యతను ఆయా విభాగాల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు అప్పగించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆ సంస్థ ఎస్ఈకి అప్పగించింది. దీనికి సంబంధించి ఆయా అధికారులు కసరత్తులు పూర్తి చేసి ఎక్కడికక్కడ నివేదికలు సమర్పించారు. ఇంతకాలానికి జీహెచ్ఎంసీ పరిధిలో అధికారుల సిఫారసు ఆధారంగా వేగ పరిమితిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇక జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, పురపాలక రోడ్లకు సంబంధించి అధికారుల సిఫారసుల ఆధారంగా పరిమితులు అమలులోకి వస్తాయని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. (క్లిక్: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. అరుదైన ఘనతలు) మరింత స్పష్టత కావాలి.. ఈ వేగాలకు సంబంధించి మరింత స్పష్టత అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డివైడర్ ఉన్న రోడ్లపై గరిష్ట వేగాన్ని కార్లకు 60గా నిర్ధారించినా, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రార్థనా సంస్థలు, మార్కెట్ల చేరువలో అది సాధ్యం కాదని, అలాంటి వాటిపై మరింత స్పష్టత ఉండాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, పురపాలిక రోడ్లకు సంబంధించి, ఆయా ప్రాంతాల పరిస్థితుల ఆధారంగా ప్రతి రోడ్టుపై వేగ పరిమితిని ప్రకటించాలని వారు కోరుతున్నారు. (క్లిక్: ఏఐతో ‘రాస్తే’ సేఫ్.. పనిచేస్తుందిలా!) -
బైక్పై చిన్నారులతో వెళ్తున్నారా? అయితే, జాగ్రత్త!
న్యూఢిల్లీ: నాలుగేళ్లలోపు చిన్నారులు ప్రయాణించే మోటార్ బైక్ వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించరాదని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో పాటు, 9 నెలల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులైతే తప్పని సరిగా హెల్మెట్ ఉండేలా వాహనదారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దీంతోపాటు, వాహన చోదకుడు ఆ చిన్నారిని సేఫ్టీ పట్టీతో తన వీపునకు తగిలించుకోవాలని పేర్కొంది. దీనివల్ల, చిన్నారి మెడ, తలభాగాలకు పూర్తి రక్షణ కల్పించినట్లు అవుతుందని వివరించింది. దృఢమైన, తేలికపాటి, నీటిలో తడవని, అవసరానికి అనుగుణంగా సరి చేసుకోదగ్గ, కనీసం 30 కిలోల బరువును మోయగలిగే నైలాన్తో ఆ పట్టీ తయారయినదై ఉండాలని తెలిపింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ తెలిపింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది. (చదవండి: రెండు రోజులు తర్వాత పుట్టింటికి .. బావిలో శవాలుగా తేలిన తల్లీ, కూతురు) -
అంతకు మించి స్పీడ్గా వెళ్లలేరు..!
సాక్షి, నిజామాబాద్: వాహనాల దూకుడుకు త్వరలో కళ్లెం పడనుంది.. అతి వేగాన్ని నియంత్రించేందుకు రంగం సిద్ధమవుతోంది.. వాహనాల ‘హైస్పీడ్’కు బ్రేకులు వేసేందుకు రవాణా శాఖ సన్నద్ధవుతోంది.. త్వరలోనే వాహనాలకు వేగ నియంత్రణ పరికరాలు అమర్చుకునేలా చర్యలు చేపట్టనుంది. రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏటా వందల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వేల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న వాహనాల అతివేగానికి బ్రేకులు వేసేందుకు రవాణాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్పీడ్ గవర్నర్ పేరుతో వాహనాలకు స్పీడ్ కంట్రోల్ డివైస్ (వేగ నియంత్రణ పరికరం)లను అమర్చుకోవాలనే నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆగస్టు మొదటి వారం నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్పీడ్ కంట్రోల్ డివైస్లు బిగించుకోవాల్సిన వాహనాలు జిల్లాలో సుమారు 30 వేల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదట రవాణా వాహనాలకు.. స్పీడ్ కంట్రోల్ డివైస్లను అమర్చుకోవాలనే నిబంధనను మొదట రవాణా వాహనాలకు వర్తింపచేస్తోంది. ఎల్లో నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు, క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లు ఈ పరికరాన్ని అమర్చుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అలాగే డంపర్లు, టిప్పర్లు, స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు ఇలా రవాణా వాహనాలు వేగ నియంత్రణ పరికరాలు అమర్చుకోవడం తప్పనిసరి కానుంది. ఈ వాహనాలు గంటకు 80 కిలోమీటర్లకు మించి వేగంగా నడపకుండా ఈ పరికరం నియంత్రిస్తుంది. స్కూల్ బస్సులు, డంపర్లు, టిప్పర్లు వంటి వాహనాల వేగాన్ని గంటకు 60 కి.మీ.లకు మించకుండా పరికరం ద్వారా వేగాన్ని నియంత్రిస్తారు. డ్రైవర్ అంతకు మించి స్పీడ్గా వెళ్లాలని ప్రయత్నించినా ఆ వాహనం నిర్ణీత స్పీడ్ దాటి ముందుకు దూసుకెళ్లదు. రూ.2 వేల నుంచి మొదలు.. వేగ నియంత్రణ పరికరాల ధర రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు ఉంటుంది. ఈ పరికరాలను జిల్లాలో సరఫరా చేసేందుకు రెండు, మూడు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా కంపెనీలు పుణేలో ఉన్న ఆటోమెటిక్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా కంపెనీలకు అనుమతుల అంశం రవాణాశాఖలోని కమిషనరేట్ కార్యాలయం పరిశీలనలో ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement