-
గంజాయిపై గట్టి నిఘా
గంజాయి సాగు, రవాణాపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టడంతో మన్యంలో సాగుదారులు, స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 20 రోజుల్లో ఏజెన్సీలో మూడు వేల కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు స్మగ్లర్లు పోలీసుల కదలికలను పసిగట్టి వారి కళ్లుగప్పి గంజాయిని తరలిస్తుండగా, మరి కొందరు గంజాయి రవాణాకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో ఈ ఏడాది గంజాయి సాగు, రవాణా భారీగా పెరిగింది. పోలీసులు కూడా విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ కొంతవరకు అడ్డుకట్ట వేయగలుగుతున్నా దొరికేదాని కంటే సరిహద్దులు దాటి వెళ్లేదే ఎక్కువ. ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులను, యువకులను వ్యాపారులు, ఏజెంట్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు మభ్యపెట్టి, డబ్బు ఎరచూపి గంజాయి సాగు, రవాణా చేయటానికి దింపుతున్నారు. గతంలో మన్యంలో జి.కె.వీధి, చింతపల్లి, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లో 20 నుండి 30 గ్రామాలకు మాత్రమే పరిమితమైన గంజాయి సాగు ఈ ఏడాది ప్రతీ మండలంలోను 20 నుండి 50 గ్రామాలకు పాకింది. గంజాయి స్మగ్లర్లు పెట్టుబడులు అందించి ప్రోత్సహించటంతో మారుమూల గ్రామాల్లో కొండపోడు, పంట భూముల్లో గంజాయి సాగు విస్తృతం చేశారు. ఈ ప్రాంతంలో శీలవతి, పిక్క వంటి విలువైన గంజాయి రకాలు పండిస్తున్నారు. గంజాయి రవాణాకు ఏజెంట్లే కీలకం గిరిజన ప్రాంతాల్లో పండించే గంజాయిని కొనుగోలు చేసి వాహనాలు, మోతబరువుతో హైదరాబాద్, విశాఖపట్నం, వంటి మైదాన ప్రాంతాలకు తరలించటానికి స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు కీలకంగా మారారు. వీరు గంజాయి సాగుదార్ల నుండి సులువుగా కొనుగోలు చేసి రహస్య ప్రాంతాలకు తరలించి 2కిలోలు బరువు ఉండేలా కూలీలతో ప్యాక్ చేయిస్తారు. పోలీస్, ఎక్సైజ్ పోలీస్ల కదలికలను పసిగట్టి జీపులు, కార్లు, వ్యాన్ల, లారీ, అటో వంటి వాహనాల్లో స్మగ్లర్లు చెప్పిన చోటకు తరలిస్తుంటారు. గంజాయి సాగుదార్ల కంటే ఏజెంట్లు, దళారీ వ్యాపారులకే అధిక మొత్తంలో నగదు ముడుతుంది. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో స్మగ్లర్లు ఏర్పాటు చేసుకొన్న ఏజెంట్లు స్థిరాస్తులుతో పాటు రూ.లక్షల్లో సొమ్ము కూడపెడుతున్నారు. వాహనాలపై ప్రెస్, పోలీస్, ప్రభుత్వవాహనం, ప్రొహిబిషన్, ఎక్సైజ్ వంటి పేర్లతో పోలీసులు అభ్యంతరం చెప్పని వాహనాల్లో ముందు, వెనుక పెలైట్ ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేసుకొని రూ.లక్షల విలువ చేసే గంజాయి తరలిస్తుంటారు. మండలంలో అనేక గ్రామాల్లో రవాణాకు సిద్ధం చేసిన గంజాయి నిల్వలు ఉన్నట్టు తెలిసింది. మండలాల్లో గంజాయి వ్యాపారులు, స్మగ్లర్లు ఏజెంట్లను గుర్తిస్తున్నామని పోలీస్, ఎక్సైజ్ పోలీస్లు అధికారులు చెప్పడం తప్ప ఇప్పటివరకు పెద్దగా చర్యలు చేపట్టకపోవటం విమర్శలకు తావిస్త్తోంది. గంజాయి వ్యాపారులు, స్మగ్లర్లు, ఏజెంట్లు ఎవరన్నది బహిరంగ రహస్యమే అయినా వారిని విచారించడం, వారి సంపాదన, కదలికలపై దృష్టిపెట్టడం, కూడబెట్టిన ఆస్తులు జప్తు చేయటం, కేసులు నమోదు వంటి చర్యలు లేకపోవడం గంజాయి వ్యాపారులకు వరంగా మారింది, చిన్న వ్యాపారాలు.. పెద్ద ఆస్తులు గ్రామాలు, మండల కేంద్రాల్లో పైకి చిన్న వ్యాపారాలు నడుపుకుంటూ పెద్దపెద్ద ఆస్తులు సంపాదించారంటే దీని వెనుక రహస్యమేమిటో అర్థం చేసుకొవచ్చు. వీరికి మైదాన ప్రాంతాల్లో రూ. కోట్ల ఆస్తులున్నాయంటే అది గంజాయి సొమ్మేనని ఈ ప్రాంతంలో చెప్పుకుంటారు. అమాయకుల బలి! గంజాయిని వాహనాలు, మోత బరువుతో మైదాన ప్రాంతాలకు తరలించే సమయంలో పోలీసులకు పట్టుబడితే అసలు స్మగ్లర్లు, ఏజెంట్లు తప్పించుకొని అమాయక గిరిజనులు బలైపోతున్నారు. గంజాయి మూటలు (ఒక్కో మూట 25 కిలోలు) వ్యాపారులు చెప్పిన చోటికి చేర్చటానికి కూలీలకు రూ. మూడు నుంచి నాలుగు వేల వరకు ముట్టచెబుతారని తెలిసింది. గంజాయి దాడుల్లో ఎక్కువ మంది అమాయక గిరిజనులే విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. జి.మాడుగుల మండలంలో పలు ప్రాంతాల్లో 20 రోజుల్లో నిర్వహించిన పోలీస్, ఎక్సైజ్ దాడుల్లో భారీ ఎత్తున రవాణాకు సిద్ధం చేసిన సుమారు మూడ వేల కిలోల గంజాయి పట్టుబడగా 14 మందిని అరెస్టు చేశారు. ఏదేమైనా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇటీవల దాడులు పెరిగాయనే చెప్పొచ్చు. దీంతో స్మగ్లర్లలో కూడా వణుకు ప్రారంభమైంది. కొందరు ఆచితూచి అతి జాగ్రత్తగా గంజాయిని తరలిస్తుండగా, మరి కొందరు కొత్తకొత్త ఎత్తుగడలతో పోలీసుల కళ్లుగప్పి గంజాయిని పెద్ద ఎత్తున తరలిస్తున్నారని తెలిసింది. -
నిఘా కళ్లు..!
ప్రశాంత ఎన్నికలకు పోలీస్ వ్యూహం సాంకేతికంగా ‘సున్నిత’ విశ్లేషణ కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ గ్రేటర్ ఎన్నికల వేళ..నగరంపై నిఘా పెరిగింది. శాంతిభద్రతల పరిరక్షణకు...ప్రశాంత పోలింగ్కు పోలీసు విభాగం సరికొత్త పంథాలో సిద్ధమవుతోంది. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను పోలింగ్బూత్ల వారీగా గుర్తిస్తోంది. పోలింగ్ రోజున 20 వేల మందితో బందోబస్తుకు వ్యూహరచన చేస్తోంది. గతంలో సమస్యలు ఉత్పన్నమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించేలా..ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -సాక్షి, సిటీబ్యూరో ఎన్నికలు వచ్చాయంటే చాలు...నగరంలోని సమస్యాత్మక, అతి సున్నిత, సున్నిత పోలింగ్ బూత్ల ఎంపిక తప్పనిసరి. ఇప్పటి వరకు మూసధోరణిలో సాగిన ఈ విశ్లేషణకు నగర పోలీసులు కొత్త పంథా ప్రారంభించారు. పోలింగ్ రోజున 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుకు వ్యూహరచన చేస్తున్న అధికారులు.. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్సీసీ, స్కౌట్స్ తదితర బలగాల సేవలూ వినియోగించుకోవాలని నిర్ణయించారు. సిటీలో అందుబాటులో ఉన్న పోలీసు, కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక నిఘా కోసం వాడాలని నిర్ణయించారు. నేర చరిత్ర ఉన్న వారిని, అసాంఘిక శక్తులను బైండోవర్ చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ... నగరంలో గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో చోటు చేసుకున్న ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలు, ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో సీసీ కెమెరాల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ తీసువాల్సిన చర్యల్ని నిర్ణయిస్తున్నారు. ఈసీ నుంచి అందిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పక్కాగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతున్న ఫ్లయింగ్ స్వ్కాడ్స్, పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరచడానికీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కౌంటిగ్ కేంద్రం వద్ద ఫెన్సింగ్, బారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మూడంచెల భద్రత ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి, ఎలక్షన్ సెల్ ఇన్చార్జ్గా ఉన్న అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అంజనీకుమార్, స్పెషల్ బ్రాంచ్ అదనపు కమిషనర్ వై.నాగిరెడ్డి నిత్యం సమీక్షిస్తూ అవసరమైన మార్పుచేర్పులు చేస్తున్నారు. రొటీన్కు భిన్నంగా ఎంపిక నగరంలోని 1400 ప్రాంతాల్లో 4143 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. బందోబస్తు, భద్రతా ఏర్పాట్లలో పోలింగ్ స్టేషన్ నైజం తెలుసుకోవడం అత్యంత కీలకం. దీని ఆధారంగానే ఆ ప్రాంతంలో ఎంత మంది? ఏ స్థాయి? అధికారుల్ని ఏర్పాటు చేయాలన్నది స్పష్టమవుతుంది. దీనికోసం సాధారణంగా పోలీసు విభాగం గతంలో ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలతో పాటు భిన్న వర్గాలకు చెందిన వాటిని పరిగణలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఆ పోలింగ్ స్టేషన్ సమస్యాత్మకమా? అతి సున్నితమా? సున్నితమా? అన్నది నిర్థారిస్తుంటారు. ఈ జాబితాను బట్టే అక్కడి విధులకు సిబ్బందిని కేటాయించడం పరిపాటి. ఈసారి పోలింగ్ స్టేషన్ నైజాన్ని తెలుసుకోవడానికి నగర పోలీసులు సాంకేతికంగా వ్యవహరిస్తున్నారు. ఆ వార్డులో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, రెబెల్స్, ప్రత్యర్థుల శక్తిసామర్థ్యాలతో పాటు ప్రభావితం చేసే అంశాలనూ పరిగణలోకి తీసుకుని పోలీసుస్టేషన్ల వారీగా అధ్యయనం చేస్తున్నారు. మరో రెండుమూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా కొత్వాల్ మహేందర్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 20 వేల మందితో బందోబస్తు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి పోలీసు విభాగం 20 వేల మంది సిబ్బందిని వినియోగిస్తోంది. కమిషనరేట్లో ఉన్న 15 వేల మందికి అదనంగా జిల్లాలు, ఇతర విభాగాల నుంచి ఐదు వేల మందిని తీసుకువస్తున్నారు. ప్రచార ఘట్టాన్ని సైతం శాంతియుతంగా పూర్తి చేయడానికి ప్రణాళికల్ని ఎలక్షన్ సెల్ సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలను క్రమబద్ధీకరించడం కోసం ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, మాజీ సైనికోద్యోగుల సేవలు వినియోగించుకోనున్నారు. -
మేడికొండూరులో పోలీస్ పికెట్
మేడికొండూరు: మేడికొండూరు మండలంపై పోలీసుల ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. మేడికొండూరులో ఈద్గాపై గుర్తు తెలియని వ్యక్తులు అనుచిత రాతలు రాసిన విషయం విదితమే. ఈ మేరకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనను పోలీసులు సవాలుగా స్వీకరించి అనుచిత రాతలు రాసిన గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా విడిపోయి దర్యాప్తును ప్రారంభించారు. వివాదస్పద, అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అర్బన్ పరిధిలో ఉన్న పలువురు పోలీసు అధికారులు మేడికొండూరులో తిష్టవేశారు. ఈద్గా వద్ద పోలీసులకు దొరికిన కీలకమైన ఆధారంగా కేసును దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారని గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ జె.భాస్కరరావు తెలిపారు. కేసులు బనాయిస్తున్నారంటూ ఆందోళన మండల కేంద్రమైన మేడికొండూరు ఈద్గాపై గుర్తు తెలియని వ్యక్తులు అనుచితరాతలు రాసిన ఘటనపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు పేరేచర్ల ఎస్సీ కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులను, సిరిపురంకు చెందిన ముగ్గురిని, మందపాడు గ్రామానికి చెందిన ఇద్దరిని అనూమానంతో స్టేషన్కు తీసుకువచ్చారు. దీంతో తమ పిల్లలు ఏ నేరం చేశారని పోలీసు స్టేషన్ వద్ద వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విచారణ నిమిత్తంగా తీసుకొచ్చామని విచారణ పూర్తయిన అనంతరం పంపుతామని వారితో సీఐ రమేష్బాబు చెప్పారు. -
అక్రమార్కులకు ‘పండుగ’
⇒ ఏటీబీల నిలువు దోపిడీ ⇒కృత్రిమ ధరలతో ప్రయాణికుల జేబులకు చిల్లు ⇒టిక్కెట్ బుకింగ్ కేంద్రాలపై నిఘా ⇒ రంగంలోకి ప్రత్యేక బృందాలు సాక్షి, సిటీబ్యూరో: సొంత ఊళ్లకు వెళ్లే నగర వాసుల సంక్రాంతి సంబరాల సంగతి ఎలా ఉన్నా...ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్, టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీలు మాత్రం అక్రమార్జనతో ‘పండగ’ చేసుకుంటున్నాయి. సాధారణ చార్జీలపై 50 శాతం అదనపు భారాన్ని మోపుతూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ... పండుగకు వారం, పది రోజుల ముందు నుంచే చార్జీలను అమాంతంగా రెండింతలు చేసే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రయాణికుల జేబులు లూఠీ చేస్తున్నారు. వీరికి ఏమాత్రం తీసిపోమనే రీతిలో ఏజెన్సీలు సైతం ప్రయాణికులపై ప్రతాపం చూపుతున్నాయి. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్నాయి. సాధారణంగా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల్లో కనిపించే ఇలాంటి అక్రమ వ్యాపార ధోరణి కొంతకాలంగా ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీలకూ విస్తరించింది. నగరంలోని వందలాది ఏటీబీ కేంద్రాలలో కొనసాగుతున్న ఈ అక్రమ వ్యాపారం ఆర్టీసీపై ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. బినామీ పేర్లతో బుకింగ్ పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రధానరూట్లలో బినామీ పేర్లతో సీట్లు బుక్ చేస్తున్నారు. నిజమైన ప్రయాణికులు బుకింగ్ కోసం వెళ్లినప్పుడు అప్పటికే సీట్లు నిండిపోయాయని, ఎవరైనా రద్దు చేసుకుంటే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఒక్కో సీటుపైన రూ.100 అదనంగా చెల్లిస్తే రద్దు చేసుకున్న ప్రయాణికుల స్థానంలో సీట్లు ఇస్తామని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో చాలా మంది ఇలా అదనంగా చెల్లించి వెళ్లవలసి వస్తోంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే ఏకంగా రూ.400 అదనంగా చెల్లించవలసిందే. ఏటా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతూనే ఉంది. ఈసారి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ 5,560 ప్రత్యేకబస్సులను ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 13 వరకు ఈ బస్సులు విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, కర్నూలు, కడప, ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిజామాబాద్, బెంగళూర్, చెన్నై, తదితర ప్రాంతాలకు బయలుదేరుతాయి. రెగ్యులర్గా వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి. సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లకు ప్రత్యేక బస్సులు తప్ప మరో అవకాశం లేదు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఇప్పటికే నిండిపోవడంతో ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులే శరణ్యం. మహాత్మాగాంధీ బస్స్టేషన్లో రద్దీ, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా చాలా వరకు దూర ప్రాంత బస్సులు ఏటీబీ కేంద్రాల నుంచే బయలుదేరుతాయి. దీంతో వీటి నిర్వహణ, ప్రయాణికుల భర్తీ వంటి వాటిపైన ఏటీబీల ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రత్యేక నిఘా ఇలా ఉండగా.. అక్రమాలకు పాల్పడే ఏటీబీ ఏజెంట్లపై నిఘా పెట్టినట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు చెప్పారు. ప్రత్యేక బస్సుల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా ఏటీబీ ఏజెంట్లు టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, ఇవి ఏటీబీ కేంద్రాలపై నిఘా ఉంచడంతో పాటు, ప్రయాణికుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సంబంధిత ఏటీబీ కేంద్రాలను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా
చెన్నూర్/మందమర్రిరూరల్/మంచిర్యాల టౌన్ : మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ తరుణ్జోషి తెలిపారు. బుధవారం రాత్రి మంచిర్యాల పోలీసుస్టేషన్, గురువారం చెన్నూర్, మందమర్రిలోని పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. సెంట్రీ, తుపాకులు భద్రపర్చే గదులు, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయా స్టేషన్లలో విలేకరులతో మాట్లాడారు. ఐదు నెలల నుంచి జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, కాసిపేట మండలం తిర్యాణిలో ఎదురుకాల్పులు జరిగాయని, అక్కడ తప్పించుకుని పారిపోయారని అన్నారు. జిల్లాలో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో 15ఏళ్ల క్రితం సికాస పనిచేసిందని, ఆ సమయంలో పనిచేసిన సానుభూతి పరులను ఆకట్టుకుని ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా బుధవారం మందమర్రిలో వాల్పోస్టర్లు వేశారని తెలిపారు. వీటిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. మందమర్రి పోలీసుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లోపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. మంచిర్యాలలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్తోపాటు మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా ఎస్సై నియామకానికి త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
Advertisement