-
సభ్యుల గైర్హాజరుపై స్పీకర్ గరం
బెంగళూరు: విధానసభలో మంత్రులు, ఎమ్మెల్యేల గైర్హాజరుపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప తీవ్రంగా స్పందించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం విధానసభ కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంలో ఐటీ శాఖమంత్రి ఎస్.ఆర్ పాటిల్ ఒక్కరే చట్టసభలో కన్పించారు. ఇక అధికార పార్టీకు చెందిన ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో సభలో ప్రభుత్వ ప్రతినిధులు తక్కువగా ఉన్న విషయాన్ని స్పీకర్ కాగోడు తిమ్మప్ప విపక్షసభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. ‘వారికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అసలు శాసనసభ అంటే ఏంటో మంత్రులతో పాటు అధికార పార్టీకు చెందిన శాసనసభ్యులకు అర్థమయినట్లు లేదు.’ అని అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీజేపీ సీనియర్ నేత విశ్వేశ్వర హెగ్డే కాగేరి కలుగ జేసుకుని ‘మంత్రి అంబరీష్ ఒక్కరే కాంగ్రెస్కు గుడ్బై చెప్పారన్న వార్తలు వస్తున్నాయి. అయితే సభలో పరిస్థితి చూస్తుంటే మంత్రులందరూ అధికార కాంగ్రెస్కు టా...టా చెప్పినట్లు ఉంది.’ అని వ్యంగ్యాస్త్రం వదిలారు. అంతేకాక అంబరీష్ మంత్రి పదవికి రాజీనామా చేసుంటే ఆ పత్రాన్ని మీకేమైనా అందించారా అని స్పీకర్ కాగోడు తిమ్మప్పను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ సమయంలో ఎస్.ఆర్ పాటిల్ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా విశ్వేశ్వర హెగ్డే కాగేరి వినిపించుకోకుండా....‘బాబురావ్ చించన్ సూర్ పై చెక్ బౌన్స్ కేసు., చిన్న నీటిపారుదల శాఖ మంత్రి శివరాజ్ తంగడి పై హత్యారోపణలు, రైతుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్న ఉద్యాన శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప ఇలా ప్రతి ఒక్కరిపై ఏదో ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రులే శాసనసభకు గైర్హాజరైతే ఏ విషయాలపై చర్చించాలి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో శాసనసభలో జేడీఎస్ పార్టీ ఉపనాయకుడు వై.వి.ఎస్ దత్తా కలుగజేసుకుని ‘అభివృద్ధిలో వెనకబడిన ఉత్తర కర్ణాటక విషయమై చర్చించేందుకే స్పీకర్ రెండు రోజుల సమయాన్ని కేటాయించారు. అయితే ఈ విషయమై అధికార పార్టీకు ఎటువంటి ఆసక్తి లేదు. ఇక ప్రభుత్వ ప్రతినిధుల్లో 85 శాతం మంది ఇలా నిర్లక్ష్యవైఖరితో ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం అయిన శాసనసభకు గైర్హాజరు కావడం సరికాదు. కనీసం ఉత్తర కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు లేకపోతే ఎలా.’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని అధికార పార్టీ నాయకులతో తాను మాట్లాడి హాజరు శాతం పెంచడానికి ప్రయత్నిస్తానని చెప్పి పరిస్థితిని యథాస్థితికి తేవడంతో శాసనసభలో సభా కార్యక్రమాలు యథావిధిగా జరగడం ప్రారంభించాయి. -
వాయిదా తీర్మానానికి అధికార పక్షం సభ్యుడి పట్టు..
బెంగళూరు: శాసనసభలో వాయిదా తీర్మానానికి అధికార పక్షం నాయకుడే పట్టుబట్టిన ఘటన బెళగావిలో జరగుతున్న వర్షాకాల శాసనసభ సమవేశాల్లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు... నిధుల విడుదల్లో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని దీనిపై చ ర్చించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకు చెందిన ఏ.ఎస్ పాటిల్ నడహళ్లి వాయిదా తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందుకు విపక్షనాయకుడైన శెట్టర్తో పాటు పాటు పలువురు జేడీఎస్ నాయకులు మద్దతు తెలి పారు. ఈ సమయంలో కలుగ జేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఈ విషయంపై చర్చను సోమవారం జరుపుదామన్నారు. అయితే ఇప్పుడే చర్చ జరపాల్సిందేనని నాడహళ్లి పట్టుబట్టారు. అరవై ఏళ్ల నుంచి హైదరాబాద్ కర్ణాటక పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగానే గుర్తింపు పొందిందన్నారు. ఈ విషయంపై చర్చించడానికి అనుగుణంగా పాలక పక్షం నాయకులే వాయిదా తీర్మానానికి సంతకాలు చేశారని వెల్లడించారు. దీంతో కంగుతిన్న ప్రభుత్వ విప్ పీ.ఎం అశోక్ తప్పుడు సమాచారమిచ్చి నాడహళ్లి తమ పార్టీ నా యకులతో సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అయ న్ను పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొక రు ఏకవచనంతో దూషించుకోవడం మొ దలు పెట్టారు. వీరిద్దరికీ సర్ధిచెప్పడానికి స్పీకర్ కాగోడు తిమ్మప్ప తీవ్రంగా శ్రమిం చాల్సి వచ్చింది. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ కలుగజేసుకుని పాలక పక్షం వారు వాయిదా తీర్మానం పెట్టడం సరికాదన్నా రు. ఈ సంప్రదాయాన్ని మనం మొదటి నుంచి అనుసరిస్తున్నామని తెలి పారు. అటుపై వాయిదా తీర్మానానికి మ ద్దతు తెలుపుతూ సంతకాలు చేసిన సీ. ఎస్ నాడగౌడ, జీ.టీ పాటిల్ మాట్లాడుతూ...‘నంజుండప్ప నివేదికపై చర్చ కోసం అంటే సంతకాలు చేశాం. అం దులో ఏముందో కూడా మాకు తెలియదు.’ అ న్నారు. ఈ సమయంలో కలుగజేసుకున్న బీజేపీ నాయకుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి ‘బాధ్యతాయుతమైన స్థానం లో ఉండి ఓ కాగితంలో ఏముందో చదవకుండా సంతకాలు ఎలా చేస్తారో’ అని ప్రశ్నించారు. ఈ విషయమై స్పీకర్ చర్యలు తీసుకోవాలని సభాముఖంగా కోరారు. దీంతో స్పీక ర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని చేసి న తప్పుకు క్షమాపణ చెప్పండంటూ స భ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదా తీర్మానంలో ఏముందో చదవకుండా సంతకం చేయడం తప్పు. చేసిన తప్పుకు క్షమాపణ కోరండి.’ అని సూచించారు. దీంతో వారు తెలియక చేసిన తప్పు అని దీనికి చింతిస్తున్నామని చెప్పడంతో సభ కార్యకలాపాలు ముం దుకు సాగాయి. -
ప్రభుత్వం తప్పు చేసింది
- ప్రజలను శిక్షించడం సరికాదు - స్పీకర్ కాగోడు తిమ్మప్ప సాక్షి, బెంగళూరు: చెరువుల్లో ఆక్రమణల తొలగింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను స్పీకర్ కాగోడు తిమ్మప్ప తప్పుబట్టారు. ప్రభుత్వం తప్పులు చేస్తూ శిక్ష మాత్రం సాధారణ ప్రజలకు విధిస్తోందని విమర్శించారు. ఇంతటి బాధ్యతారాహిత్య పాలనా విధానాన్ని మునుపెన్నడూ తాను చూడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నగరంలోని చెరువు ప్రాంతాలను ప్రభుత్వ విభాగంలో ఓ భాగమైన బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) లే అవుట్లను చేసి ప్రజలకు విక్రయించిందన్నారు. ఇందులో పూర్తీ బాధ్యత ప్రభుత్వానిదే అని అభిప్రాయపడ్డారు. ఈ లే అవుట్లను ఎప్పటికప్పుడు రెగ్యులరైజేషన్ చేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండి హఠాత్తుగా ఆక్రమణల తొలగింపు పేరుతో ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చడం తగదని అన్నారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఆ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి తప్పిస్తే వారికి ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ప్రస్తుతం ఉంటున్న డాలర్స్ కాలనీ కూడా చెరువు స్థలాన్నిలే అవుట్గా మార్చి గతంలో బీడీఏనే విక్రయించింది. ఈ మొత్తం ప్రక్రియ చట్టప్రకారమే జరిగింది. అయితే ఇది అక్రమమని పేర్కొంటూ ఇక్కడి ఇళ్లను కూల్చడానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం సరికాదు. బీడీఏ లే అవుట్లు చేసే సమయంలో ప్రభుత్వం ఎందుకు ఊరికే కుర్చొన్నట్లు? ఇప్పుడు ఎందుకు కూల్చడానికి తొందర పడుతున్నట్లు? ఈ విషయాలన్నీ పేర్కొంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు త్వరలో లేఖ రాస్తా’ అని పేర్కొన్నారు. చెరువు ఆక్రమణల విషయమై ఏర్పాటైన సభాసమితికి కూడా నివేదిక తొందరగా ఇమ్మని సూచిస్తున్నట్లు ఈ సందర్భంగా కాగోడు తిమ్మప్ప తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపు వల్ల ఇప్పటి వరకూ దాదాపు 180 మంది పేద, మధ్య ప్రజలు ఇళ్లను కోల్పోయి వీధిన పడ్డారని ఆయన వాపోయారు. ఆక్రమణతొలగింపు వల్ల గూడును కోల్పోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాగోడు తిమ్మప్ప స్పష్టం చేశారు. -
అతిక్రమిస్తే.. చర్యలు తప్పవు
బెంగళూరు : శాసనసభలో నిబంధనలు అతిక్రమిస్తూ సమస్యలపై చర్చలు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించే శాసనసభ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ కాగోడు తిమ్మప్ప హెచ్చరించారు. రేపటి (సోమవారం) నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో విధాన సౌధలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాసమస్యలను చర్చించేందుకు చట్టసభలు ఏర్పాటయ్యాయన్నారు. సోమవారం నుంచి మొదలయ్యే చట్టసభల్లో ఆర్కావతి డీ నోటిఫికేషన్, చెరుకు రైతుల సమస్యలపై చర్చకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అయితే శాసనసభలు జరిగే 10 రోజులూ వాటి పైనే చర్చజరగాలని చూడటం సరికాదన్నారు. ఈ దిశగా ఆలోచించి అనవసర చర్చకు మొగ్గుచూపుతూ విలువైన సభాసమయాన్ని హరించడానికి ప్రయత్నించే సభ్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తానన్నారు. మొదటి రోజున గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా ఉభయ సభలను ఉద్దేశించి హిందిలో ప్రసంగించనున్నారని తెలిపారు. తమకు వచ్చిన భాషలో చట్టసభల్లో ప్రసంగించడానికి అవకాశం ఉందన్నారు. కర్ణాటక విద్యా హక్కు చట్టానికి తీసుకువచ్చే మార్పులో కూడిన ముసాయిదా బిల్లు, చెరువుల సంరక్షణ, అభివృద్ధి విషయంపై రూపొందించిన ముసాయిదా బిల్లు తదితర విషయాలకు చట్టసభల్లో అనుమతి లభించే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక చానల్ : చట్టసభల ప్రసారం కోసం ప్రత్యేక చానల్ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి సూచన అందిందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఇక చానల్ ప్రారంభించే విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. పేపర్లెస్ చట్టసభల నిర్వహణ కోసం కృషి చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. -
వాటిని పెద్దగా పట్టించుకోను తనపై వస్తున్న విమర్శలపై
స్పీకర్ కాగోడు తిమ్మప్ప సమాధానం బెంగళూరు:ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపై ప్రతిస్పందించేందుకు స్పీకర్ కాగోడు తిమ్మప్ప నిరాకరించారు. అలాంటి విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని అన్నారు. అది ఓ ముగిసిపోయిన అధ్యాయమంటూ సమాధానమిచ్చారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను తెలియజేసే అధికారం ఉందని అన్నారు. ఎవరి అభిప్రాయాలను వారు చెబుతూ ఉంటారని, అలాంటి వ్యాఖ్యలన్నింటిపై తాను స్పందించబోనని, అసలు పట్టించుకోనని తెలిపారు. తాను ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని, కేవలం ఒక స్పీకర్గా ఆ పదవికి మాత్రమే న్యాయం చేస్తున్నానని స్పష్టం చేశారు. కాగా, గత కొంతకాలంగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప మంత్రుల పనితీరుపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై హైకమాండ్కు ఫిర్యాదు చేసేందుకు కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి అనుయాయులు సిద్ధమయ్యారంటూ వార్తలు వెలువడిన విషయం తెలసిందే. ఈ ఘట్టానికి ముగింపు పలికేందుకే స్పీకర్ కాగోడు తిమ్మప్ప ‘అది ఓ ముగిసిపోయిన ఘట్టం’ అంటూ విలేకరులతో చెప్పారని తెలుస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement