-
అలక పాన్పుపైనే..
♦ ఇద్దరు గన్మెన్లను వెనక్కి పంపిన చింతమనేని ♦ ప్రభుత్వ ఆదేశాల అనంతరమే నిర్ణయమన్న ఎస్పీ సాక్షి ప్రతినిధి, ఏలూరు : మంత్రి పదవి ఇవ్వలేదని అలకపాన్పు ఎక్కిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా దిగిరాలేదు. తనకు ఇద్దరు గన్మెన్లు చాలంటూ.. ఇద్దర్ని వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చింతమనేనికి 2+2 పద్ధతిలో నలుగురు గన్మెన్లు భద్రతగా ఉన్నారు. వీరిలో ఇద్దరు విధుల్లో ఉంటే.. ఇద్దరు విశ్రాంతిలో ఉంటారు. తనకు ఇద్దరు గన్మెన్లు చాలని, మిగిలిన ఇద్దరిని వెనక్కి పంపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేనందున ఆ ఇద్దరిని కూడా విధులు నిర్వహించాలంటూ జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ తిరిగి చింతమనేని వద్దకు తిప్పి పంపారు. ప్రభుత్వం నుంచి అదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, ఆదేశాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంతో తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన చింతమనేని నేరుగా అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ పంపించిన విషయం విదితమే. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిసిన ఆయన పార్టీకి కట్టుబడి ఉంటానని, నిబద్ధతతో పనిచేస్తానంటూ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఇది జరిగిన 24 గంటలకే తనకు కల్పించిన భద్రతను సగానికి తగ్గించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో ఆయన మరో పరిణామానికి తెరతీయడంతో వ్యవహారం మొదటికొచ్చినట్టయ్యింది. అసలు చింతమనేని ఏం చేయాలనుకుంటున్నారు, తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఏవిధంగా ముందుకు వెళతారనే అంశాలపై చిక్కుముడి వీడటం లేదు. ఇద్దరు గన్మెన్లను ఉపసంహరించుకోవడంపై చింతమనేని ప్రభాకర్ స్పందిస్తూ తనకు ప్రజలే రక్షణగా ఉంటారని, గన్మెన్లు అవసరం లేదని నిశ్చయించుకున్నట్టు వ్యాఖ్యానించారు. -
అరచేతిలో నేరగాళ్ల చిట్టా
► నేరస్తుల వివరాలు కంప్యూటరీకరణ ► పోలీసు శాఖ ప్రత్యేక యాప్ ► 90 శాతం పనులు పూర్తి ఏలూరు అర్బన్ : నేర నియంత్రణపై దృష్టి సారించిన పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నేరాల నిరోధానికి గతంలో అమలు చేసిన సాధారణ పరిశోధనలకు సాంకేతికను జోడిస్తున్నారు. దీనిలో భాగంగా పోలీసుశాఖ ప్రత్యేకతలు ఉన్న కొత్త యాప్ను రూపొందించుకుంది. దీంట్లో నేరస్తుల చరిత్రను నిక్షిప్తం చేయడంతో పాటు నేరగాళ్ల వేలిముద్రలు, ఆధార్ సంఖ్య పొందుపరుస్తున్నారు. ఇలా తయారైన యాప్ను రాష్ట్ర పోలీసు కార్యాలయంలోని కంప్యూటర్లోనే కాకుండా అన్ని పోలీసు కార్యాలయాల్లో, పోలీసుల వాడే స్మార్ట్ఫోన్లలో కూడా ఇన్స్టాల్ చేస్తారు. దీని వలన పోలీసులకు అనుమానితులు ఎదురైతే వెంటనే యాప్ను యాక్టివేట్ చేస్తే నేరగాళ్ల చరిత్ర సులభంగా తెలుస్తుంది. ఇలా అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పంచుకునేందుకు పోలీసు శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఆధార్ నంబర్, వేలిముద్రల ఆధారంగా..: యాప్ అమలులోకి వస్తే నేరస్తుడి ఆధార్ నంబర్ లేదా వేలిముద్ర స్మార్ట్ఫోన్లో ఎంటర్ చేయగానే పూర్తి జాత కం స్క్రీన్పై కనిపిస్తుంది. దీంతో నేర విచారణ పద్ధతుల అవసరం ఉండబోదనేది పోలీసుల భావన. దీనిని దృష్టిలో ఉంచుకుని నేరస్తుల పూర్తి వివరాలను కంప్యూటరీకరించేందుకు సిద్ధం చేస్తున్నారు. దందాలో భాగంగా ఇతరులను బెదిరించడం, భూ కబ్జాలు, తగాదాలు, ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేయడం, దొంగతనాలు, బ్లాక్మెయిలింగ్, కిడ్నాప్లకు పాల్పడటం వంటి పలు నేరాలకు సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ కళ్ల ముందు సాక్షాత్కరించేలా అన్ని వివరాలు సమగ్రంగా కంప్యూటర్లో నిక్షిప్తం చేసి అనంతరం ఇంటర్నెట్తో అనుసంధానించే పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో నేరాల నియంత్రణ లక్ష్యం: నేరాలను పూర్తిస్థాయిలో నివారించడం, అదుపుచేయడం పోలీసుల ఏకైక లక్ష్యం. దీనిలో భాగంగా పోలీసులు ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేందుకు యాప్ రూపకల్పన చేసుకున్నాం. దీని ద్వారా నేరస్తులను గుర్తించడం, కేసులను ఛేదించడ సులభమని భావిస్తున్నాం. అసలు నేరాలే జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం యాప్ అంతమ లక్ష్యం. –భాస్కర్భూషణ్, ఎస్పీ -
బాధితులకు న్యాయం చేసే అదృష్టం పోలీసులదే
ఏలూరు అర్బన్ : సమాజంలో ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడే అవకాశం పోలీసులకు మాత్రమే లభించే గొప్ప అవకాశమని జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ అన్నారు. ఆదివారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు.ఒత్తిళ్ల మధ్య విధి నిర్వహణలో పోలీసు ఉద్యోగం నిజమైన కత్తిసాము అని ఎస్పీ అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఎస్సైలు పి.పోతురాజు, పీవీవీ కుమార్, కె.నాగేశ్వరరావు, జి.లీలావతి, పి.రాజు, హెచ్సీ కేవీఆర్.కృష్ణ, కానిస్టేబుళ్లు బి.సత్యనారాయణ, ఎండీఎస్ గోరి, ఎస్వీ.ప్రసాద్, డీఎస్.నారాయణలకు శుభాకాంక్షలందించారు. ఏలూరు డీఎస్పీ, గోగుల వెంకటేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ, పి.భాస్కరరావు,సంఘం అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
ఏలూరు (ఆర్ఆర్పేట) : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుని నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజ్లో ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు సభను గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రోడ్డుపై వాహనం నడిపే ప్రతి చోదకుడూ అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా వారితో పాటు ఎదుటి వారిని ప్రమాదాల బారిన పడకుండా నివారించ వచ్చన్నారు. ప్రమాదాల నివారణ కోసం ప్రతి నెలా రహదారి భద్రతా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తనతో పాటు కలెక్టర్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, ఉపరవాణాశాఖాధికారి సమావేశంలో పాల్గొని తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నామని చెప్పారు. ప్రమాద సంఘటనల్లో తప్పు ఎవరిదైనా డ్రై వర్లే బాధ్యత వహించాల్సి వస్తోందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్.ధనుంజయరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రై వర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాల వల్ల బాధితులకు సంస్థ లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తోందన్నారు. డ్రై వర్లు తమ అభిరుచులు మార్చుకోవాలని సూచించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి బస్సులు నడపడం ద్వారా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు. డ్రై వర్లు ఆధ్యాత్మిక చింతనతో, యోగా, వ్యాయామం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం పొందాలని సూచించారు. జిల్లా పరిధిలో ఆర్టీసీ డ్రై వర్ల కారణంగా జరిగిన ప్రమాదాల వల్ల గతేడాది 21 మంది మతిచెందగా ఈ ఏడాదిలో ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. ప్రమాదరహితంగా డ్రై వింగ్ చేసిన ఉత్తమ డ్రై వర్లకు ఎస్పీ భాస్కర్భూషణ్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆర్టీసీ డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ ఎం.నాగేశ్వరరావు, కార్మిక సంఘాల నాయకులు, డ్రై వర్ల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు పశ్చిమ రీజియన్ స్థాయిలో.. ఆర్ఎన్ రావు, బీవీఆర్ఎం రావు, ఎన్వీ ప్రసాదరావు (ఏలూరు డిపో) డిపో స్థాయిలో.. ఏలూరు: జేవీఎన్వీ ప్రసాద్, ఎంఎస్ నారాయణ, కేడీ రావు జంగారెడ్డిగూడెం : ఎస్కే మొహిద్దీన్, బీఆర్ కష్ణ, కె.అబ్రహం తాడేపల్లిగూడెం: జీఎస్సీహెచ్ రావు, పి.కుశరాజు, ఎన్ఎన్వీవీ కుమార్ తణుకు: సీహెచ్ శ్యాంసన్, ఎంపీ రావు, కేఎన్ రావు నరసాపురం: కేవీ రత్నం, జీవీ రావు, పి.మంగపతిరావు భీమవరం: టీఎస్ బాబా, ఈఎల్ రావు, వీవీ రావు కొవ్వూరు: ఎంబీ రావు, ఎస్కే అహ్మద్, టీవీ రాజు నిడదవోలు: ఎస్కేఏ బాషా, పీఎన్ రావు, పీఎస్ రావు వీరితో పాటు ప్రమాద రహిత డ్రై వింగ్లో డ్రై వర్లను ప్రోత్సహించిన కొవ్వూరు, నిడదవోలు డిపో మేనేజర్లు, సేఫ్టీ డ్రై వింగ్ ఇన్స్ట్రక్టర్లకు బహుమతులు అందజేశారు. -
దొరికితే దొంగ.. దొరక్కపోతే..
దొరికితే దొంగ.. దొరక్కపోతే పోలీస్.. సారీసారీ దొర.. ఒక గ్రామంలో నిత్యం కోడి పందాలు జరుగుతున్నాయి. పోలీసులు ఆ వ్యవహారాన్ని ‘మామాళ్లు’గానే పట్టించుకోవడం లేదు. అయితే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు (ఎస్బీ) విషయం తెలిసి దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో మన పోలీసులకు దాడులు చేయక తప్పింది కాదు. ఆ దాడుల్లో 10 మందిని అరెస్టు చేసి సుమారు రూ.3 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎఫ్ఐఆర్లో అలవాటులో పొరపాటుగా ఏదో అటూఇటూగా రూ.2 లక్షల పైగా సొమ్ము తక్కువ చూపారు. ఈ విషయం డిపార్టమెంట్లో ఆ నోట ఈ నోట.. నాని.. చివరకు ఎస్పీకి చెవికి చేరింది. దీంతో ఆయన సీరియస్ అయ్యి ఎస్బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన మన పోలీసులు తెగులు సోకిన కోడిలా విలవిల్లాడిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వివరాలేంటో చూద్దామా? ఏలూరు (సెంట్రల్) : చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలోని ఒక కోడి పందాల శిబిరంపై ఇటీవల పోలీసులు ఆకస్మిక దాడిలో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో సొమ్మును పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ స్పెషల్ బ్రాంచ్ అధికారులను(ఎస్బీ) విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొద్దికాలంగా వెంకటాపురంలో రోజూ కోడి పందాలు నిరాటంకంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పందాలపై అక్కడి పోలీసులు ఎటువంటి దాడులు నిర్వహించకపోవడంతో విషయం ఎస్బీ అధికారులకు తెలిసింది. వెంటనే దాడులు నిర్వహించాలని చింతలపూడి పోలీసులను ఆదేశించారు. ఆ సొమ్ములు కోళ్లు ఎత్తుకుపోయాయా? ఈ క్రమంలో ఈ నెల 23న చింతలపూడి పోలీసులు వెంకటాపురం గ్రామంలో కోడి పందాల స్థావరంపై దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.66,750, రెండు కార్లు, నాలుగు మోటారు సైకిళ్లు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఐఆర్లో చూపించారు. అయితే ఈ దాడుల్లో 10 మంది దగ్గర నుంచి రూ.మూడు లక్షలు వరకు స్వాధీనం చేసుకుని రూ. 66,750 మాత్రమే లెక్కల్లో చూపించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసులు లెక్కల్లో తేడాలు ఉన్నాయని అక్కడి నిఘా వర్గాలు ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన చింతలపూడి పోలీసులు అధికారులపై ఎస్బీ అధికారులను విచారణకు ఆదేశించినట్టు సమాచారం. పోలీసులు నిర్వహించిన దాడిలో దొరికిన ఓ కాంట్రాక్టరు దగ్గర నుంచే పోలీసులు రూ.లక్ష వరకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఎస్పీ ఈ విషయంపై సీరియస్గా ఉండడంతో సదరు కాంట్రాక్టరుకు తిరిగి డబ్బులు ఇచ్చేందుకు అక్కడే ఓ అధికారి వద్ద పంచాయతీ పెట్టారని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారీ మొత్తాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిపై జిల్లా పోలీసు బాస్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement