-
వైద్య విద్య... మార్పులు తథ్యం!
దేశంలో వైద్య విద్యలో సమూల మార్పులకు రంగం సిద్ధమైంది. యూజీ నుంచి పీజీ మెడికల్ కోర్సుల వరకు.. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ పరీక్షల వరకు.. కాలేజీలకు అనుమతి మొదలు.. ఫీజులపై అధికారాల వరకు.. పలు మార్పులు జరుగనున్నాయి. ఆ దిశగా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుæ–2017కు డిసెంబర్ 15న కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో.. ప్రతిపాదిత ఎన్ఎంసీ బిల్లులో ముఖ్యాంశాలు.. ... దేశంలో వైద్య విద్యలో రానున్న మార్పులపై విశ్లేషణ..! ఎంసీఐ రద్దు నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు.. నిపుణుల కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా నేషనల్ మెడికల్ కమిషన్ డ్రాఫ్ట్ బిల్లుæ–2017ను రూపొందించారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)బిల్లుæ–2017 ప్రకారం– ప్రస్తుతం దేశంలో వైద్య విద్య పర్యవేక్షణ సంస్థగా వ్యవహరిస్తున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి.. దాని స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ని ఏర్పాటు చేస్తారు. ఎన్ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే నాలుగు అటానమస్ బోర్డులు యూజీ, పీజీ మెడికల్ విద్య నిర్వహణ; వైద్య కళాశాలల అసెస్మెంట్, అక్రిడిటేషన్; వైద్య వృత్తి నిపుణుల రిజిస్ట్రేషన్ తదితర బాధ్యతలు నిర్వహిస్తాయి. నాలుగు బోర్డులు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్; పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్; మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్; బోర్డ్ ఫర్ మెడికల్ రిజిస్ట్రేషన్. ఇలా.. ప్రత్యేకంగా ఏర్పాటైన నాలుగు బోర్డ్ల్లో.. ఒక్కో బోర్డ్ ఒక్కో బాధ్యతను నిర్వహిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు సంబంధించిన బాధ్యతను అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్; పీజీ మెడికల్ కోర్సులకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. మెడికల్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థుల రిజిస్ట్రేషన్, వృత్తి సంబంధిత ఎథిక్స్ వంటి అంశాలను బోర్డ్ ఫర్ మెడికల్ రిజిస్ట్రేషన్ చూస్తుంది. ఎంఏఆర్బీయే కీలకం ఎన్ఎంసీ బిల్లులో పేర్కొన్న నాలుగు బోర్డ్లలో.. మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ పనితీరే కీలకంగా మారనుంది. కళాశాలల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయాలు మొదలు మెడికల్ ప్రాక్టీషనర్లకు, మెడికల్ కళాశాలలకు గుర్తింపు ఇచ్చే వరకు.. అన్ని వ్యవహారాలు ఎంఏఆర్బీయే చూసుకుంటుంది. అంతేకాకుండా ప్రతి ఇన్స్టిట్యూట్కు పనితీరు ఆధారంగా రేటింగ్ ఇచ్చే విధానం కూడా ఎంఏఆర్బీ చేపట్టనుంది. ఈ రేటింగ్ ఆధారంగా విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కాళాశాలను గుర్తించి.. అందులో చేరే వీలుంటుంది. ప్రాక్టీస్కు ముందు పరీక్ష నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లు–2017 ప్రకారం–వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ విధానం అమల్లోకి వచ్చింది. అలాగే వైద్య కోర్సులు పూర్తిచేసుకొని.. డాక్టర్గా ప్రాక్టీస్ చేపట్టేందుకు ముందుగా జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ లైసెంటీయేట్ ఎగ్జామ్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. విద్యార్థులు గ్రాడ్యుయేష¯Œ స్థాయి వైద్య కోర్సుల్లో పొందిన నైపుణ్యాలను పరిశీలించేలా ఈ పరీక్ష జరుగుతుంది. వాస్తవానికి ప్రస్తుతం విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులు చదివి.. మన దేశంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలనుకంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ)లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఎన్ఎంసీ బిల్లు ప్రకారం– ఇక నుంచి మన దేశంలోని కాలేజీల్లో వైద్య విద్యలో చేరిన విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత నేషనల్ లైసెంటీయేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రైవేటు ఫీజులపై స్వేచ్ఛ ఎన్ఎంసీ బిల్లుæ 2017 ప్రకారం– ప్రయివేట్ వైద్య కళాశాలలు మొత్తం సీట్లలో 60శాతం సీట్లకు సంబంధించి ఫీజును నిర్ణయించుకునే అధికారం ఆయా కళాశాలల యాజమాన్యాలకు లభిస్తుంది. మిగతా.. 40శాతం సీట్లకు ఫీజును మాత్రం ఎన్ఎంసీ నిర్దేశిస్తుంది. ఎన్ఎంసీ నిర్దేశించిన ఫీజుకంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే... భారీ జరిమానా విధించే ఆస్కారముంది. ఏటా అనుమతులకు స్వస్తి ప్రస్తుతం ఎంసీఐ నిబంధనల ప్రకారం– కళాశాలలు సీట్లు పెంచుకోవాలన్నా.. కొత్తగా కోర్సులు ప్రవేశ పెట్టాలన్నా.. ప్రతిఏటా ఎంసీఐకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అనుగుణంగా ఎంసీఐ నేతృత్వంలోని నిపుణుల బృందాలు ఆయా కళాశాలల్లో ప్రత్యక్ష తనిఖీలు చేసి.. అనుమతులు మంజూరు చేస్తాయి. ఎన్ఎంసీ బిల్లుæ ప్రకారం.. ఈ విధానానికి స్వస్తి పలకనున్నారు. ఇక కళాశాలల ఏర్పాటుకు, గుర్తింపునకు దరఖాస్తు ఒకసారి చేసుకుంటే సరిపోతోంది. ప్రతిఏటా అనుమతుల పునరుద్ధరణ కోసం, సీట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంసీఐ.. అనుమతుల పునరుద్ధరణ, సీట్ల పెంపు పేరుతో ప్రతిఏటా తనిఖీలు చేయడం.. ఆ క్రమంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో బిల్లులో తాజా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పర్యవేక్షణకు సలహా మండలి ఎన్ఎంసీకి సమాంతరంగా రెండు స్వతంత్ర సలహా మండళ్లు పనిచేస్తాయి. ఐదు మంది సభ్యులతో సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ; 64 మంది సభ్యులు కలిగిన మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్. సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ ఎన్ఎంసీలో ఖాళీల భర్తీ ప్రక్రియను చూస్తుంది. మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్లో ఎన్ఎంసీ సభ్యులతోపాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతి నిధులు ఉంటారు. ఎన్ఎంసీ సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్ వైద్య రంగంలో వస్తున్న నిరంతర మార్పులు, దానికి అనుగుణంగా అకడమిక్గా విద్యార్థు లకు కొత్త నైపుణ్యాలు అందించే క్రమంలో సిలబస్, కరిక్యులంలో ఎప్పటికప్పుడు చేయాల్సిన మార్పులకు సంబంధించి తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. ఎన్ఎంసీ ముఖ్యాంశాలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) రద్దు ప్రత్యేకంగా నాలుగు అటానమస్ బోర్డ్ల ఏర్పాటు ఇన్స్టిట్యూట్లు, కోర్సుల మూల్యాంకనకు ఎంఏఆర్బీ ప్రైవేటు కళాశాలల్లో 40 శాతం సీట్లకు ఫీజు నిర్ణయించే అధికారం కరిక్యులంలో మార్పులు, చేర్పులకు సంబంధించి సలహాల కోసం మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్. మేలు చేసే అంశమే ఎన్ఎంసీ బిల్లులోని అంశాలు విద్యార్థులకు మేలు చేసే విధంగానే ఉన్నాయి. అయితే ప్రైవేటు కళాశాలలకు ఫీజుల విషయంలో 60 శాతం సీట్లకు స్వేచ్ఛ ఇవ్వడం అనే విషయాన్ని పునరాలోచించాలి. ఇక.. ఆయా బోర్డ్ల పరిధిలో మెడికల్ ఎక్స్పర్ట్స్తోపాటు అనుబంధ రంగాల నిపుణులు కూడా ఉండేట్లు చేస్తే సదరు బోర్డ్ల పనితీరు మరింత సమర్థవంతంగా ఉంటుంది. – డాక్టర్.కె.శ్రీనాథ్ రెడ్డి, ప్రెసిడెంట్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ -
ఎస్ఎంసీల పాత్ర కీలకం
- జడ్జి ఎంఏ సోమశేఖర్ - ఎస్ఎంసీలపై జాతీయ సదస్సు కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం అమలులో స్కూల్ మేనెజ్మెంట్ కమిటీలది కీలక పాత్ర అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఏ. సోమశేఖర్ అన్నారు. స్థానిక మథర్ థెరిస్సా ఎక్స్లెంట్ ఇన్ టీచర్స్ ఎడ్యుకేషన్ సెమినార్ హాల్లో మంగళవారం తేజ రూరల్ డెవలప్మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో ఎస్ఎంసీలపై రెండు రోజుల జాతీయ శిక్షణ, జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ఎస్ఎంసీలు చేపట్టే పనులు అభినందనీయమన్నారు. 6-14 సంవత్సరాల వయసున్న బాలబాలికలు బడి బయట ఉండరాదన్నారు. అనంతరం ఎస్ఎస్ఏ డైరెక్టర్ ఆంజనేయులు, హుసేన్, జనార్ధన్గౌడు, సైకాలజిస్టు పెద్దగారి లక్ష్మన్న, సిల్వర్ జూబ్లీ కాలేజీ అధ్యాపకులు డా.ఎస్ జహాన్, రిసోర్స్ పర్సన్ ఏవీ రమణయ్య, ఉస్మానియా కాలేజీ అధ్యాపకులు గౌస్, స్వచ్చంధ సంస్థ సభ్యులు బాబురావు, వెంకటేశ్వర్లు, సర్దార్ బాషా, మేఘన తదితరులు పాల్గొన్నారు -
తమ్ముళ్ల తన్నులాట
– ఎస్ఎంసీ ఎన్నికల్లో గొడవ –రామిరెడ్డి, రాజశేఖర్రెడ్డి వర్గీయుల బాహాబాహీ –ఎన్నికలు వాయిదా మంత్రాలయం రూరల్: పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికల్లో తెలుగు తమ్మళ్లు తన్నుకున్నారు. బాహాబాహీకి దిగి మరోమారు విభేదాలను బయటపెట్టుకున్నారు. తమ్ముళ్ల తన్నులాటతో మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎన్నికలూ వాయిదా పడ్డాయి. మండల పరిధిలోని మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గతంలో కోరం లేని కారణంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం విదితమే. బుధవారం తిరిగి కమిటీ ఎన్నిక జరిపారు. ఉదయాన్నే టీడీపీ సీనియర్ నేత రామిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్రెడ్డి వర్గీయులు గుంపులుగా పాఠశాలకు చేరుకున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులను మాత్రమే పాఠశాలలోకి అనుమతించారు. ఎన్నికల అధికారి జగదీష్ ఆధ్వర్యంలో 6వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్నికలు నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఏడో తరగతి విద్యార్థి తల్లితండ్రుల వివరాలను సేకరించే సమయంలో రాజశేఖర్రెడ్డి, రామిరెడ్డి వర్గీయులు ఒకరినొకరు కొట్టుకున్నారు. సీఐ నాగేశ్వర రావు, ఎస్ఐ సునీల్కుమార్ ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు. ఇరువర్గాలను కూర్చోబెట్టి చర్చించి ఎన్నికలు వాయిదా వేశారు. -
త్వర‘బడి’తేనే ప్రగతి
పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలదే ‘గురు’తర బాధ్యత పీడిస్తున్న నిధుల కొరత జలుమూరు: పాఠశాల అభివృద్ధిలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీలు)ల బాధ్యత కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన వివిధ నిధులు ఇక వీరి అనుమతిలేనిదే రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలుపడదు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కమిటీలు త్వరబడితేనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ఈ నేపథ్యంలో ఆయా సంఘాలు విధులు, బాధ్యతలపై ప్రత్యేక కథనం. కమిటీలకు శిక్షణ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తయిన సందర్భంగా కమిటీ సభ్యులు శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాకాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. విధులు చేపట్టిన పాఠశాల కమిటీలకు చెందిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు సంఘ సభ్యులకు సంఘాల బాధ్యతలు, విధులు, ఇతరత్రా అంశాలపై తెలియజేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ప్రణాళిక సిద్ధం పాఠశాల అభివృద్ధికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. జిల్లా వ్యాప్తంగా 3,308 సంఘాలకు గాను 3,160పాఠశాలల్లో కొత్త సంఘాలు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో పూర్తి స్థాయి మౌలిక వసతులు, భవనాలు, మరుగుదొడ్లు, ప్రహరీ లేనివి తదితర వాటిపై కమిటీలు దృష్టి పెట్టవలసి ఉంటుంది. పనితీరుపై పర్యవేక్షణ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయలపనితీరు, విద్యార్థుల ప్రగతిపై కమిటీలు తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాల్సిందే. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 14 వేల మంది ఉపాధ్యాయలు పనిచేస్తున్నారు. గత నెలలో రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవి చంద్ర తన దత్తత గ్రామమైన సైరిగాం అభివృద్ధిపై స్వయంగా జలుమూరు మండల అధికారులుతో సమీక్షించి గ్రామంలో ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలలో చదవకూడదని, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలని సూచించారు. దీనికి కావలిన పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మండల విద్యాశాఖధికారి గైర్హాజరయ్యారు. అలాగే మరుసటి రోజు ఉదయం తనే స్వయంగా పాఠశాలకు వెళ్లి విద్యార్థుల చదువు,ప్రగతిపై అడిగేందుకు పాఠశాలకు వెళ్లగా అక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు సుమారు 25 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. దీనిపై సంబంధిత విద్యాధికారులు వీరికి శాఖపరంగా మెమోలు ఇచ్చారు. అలాగే, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి బలివాడ దయానిది ఎంత మంది ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటున్నారో తెలుసుకునేందుకు బస్లో రాకపోకలు చేస్తున్న ఉపాధ్యాయుల నివేదిక తయారు చేశారు. విధులు, బాధ్యతలు ఉన్నా నిధుల మాటేంటి విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ పాఠశాల సామాజిక భాగస్వామ్యం కింద ఎస్ఎంసీలదే బాధ్యత. ఏటా ప్రాథమిక పాఠశాలకు పదివేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.22 వేలు సదుపాయలు, నిర్వహణ కింద విడుదల చేస్తుంది. ఈ లెక్కన జిల్లాలో 2,269 ప్రాథమిక పాఠశాలలుకు రూ.226 కోట్లు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.12.51 కోట్లు విడుదలవుతాయి. ఈ నిధులు సద్వినియోగం అయ్యేలా కమిటీలు చూడాలి. ఈ ఏడాది కనీసం సుద్దముక్కలు కొనేందుకు కూడా రూపాయి లేదని, మరి ఎలా అభివృద్ధి జరుగుతుందని ఆయా పాఠశాల కమిటీలు ప్రశ్నిస్తున్నారు. గతేడాది పాఠశాల నిర్వహణ నిధులు సుమారు రూ.12 కోట్లు ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఇప్పుడు కొత్తగా నిధులు వచ్చే పరిస్థితి కనబడం లేదు. చదువులో ప్రగతి, సక్రమంగా భోజన పథకం నిర్వహణపై దృష్టి ఎస్ఎంసీలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ప్రగతిని పరిశీలించాల్సిందే. జిల్లా వ్యాప్తంగా సీ గ్రేడ్లో ఉన్న విద్యార్థులను ఆయా పాఠశాల సముదాయాల్లో గత వేసవిలో శిక్షణ ఇచ్చారు. ఇందులో సీ గ్రేడ్లో ఉన్నవారికి బీ గ్రేడ్కు బీ గ్రేడ్లో ఉన్న వారికి ఏ గ్రేడ్లోకి మార్చాలి. చాలా మంది ఇందులో వెనుకబడిపోయారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అతి ప్రధాన బాధ్యత మధ్యాహ్నభోజన పథకం అమలు. జిల్లా వ్యాప్తంగా 3,310 పాఠశాలల్లో 3,44,354 మంది విద్యార్థులు చదువుతుండగా, ఇందులో మధ్యాహ్న భోజన పథకం కింద 3,29,620 మంది లబ్ధిపొందుతున్నారు. దీనికి నెలకు సుమారు సుమారు రూ.7.2 కోట్లు ఖర్చవుతోంది. విద్యాశాఖ ఇచ్చిన మెనూ ప్రకారం ఆయా ఏజెన్సీలు నాణ్యమైన భోజనం విద్యార్థులకు వండి పెట్టాల్సిందే. కానీ వీటి అమలు ఎక్కడా సక్రమంగా జరగలేదు. అలాగే, గత ఏడాది మరుగుదొడ్ల నిర్వహణకు 2,570 మందిని నియమించగా, వారికి వేతనాల కింద రూ.1.24 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది వేతనాలు లేక పోవడంతో చాలా మంది చోట్ల మరుగుదొడ్ల నిర్వహణ మానేశారు. ఎస్ఎంసీలతో అభివృద్ధి పాఠశాల యాజమాన్య కమిటీలతో అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నాం. ఎన్నికైన సంఘాలు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి. ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. అలాగే ఎస్ఎంసీలు భాగస్వామ్యంతోపాటు మా పర్యవేక్షణ ఉంటుంది. – ఎ.సుబ్బారావు, జిల్లా ఉప విద్యాశాఖధికారి. -
ఎస్ఎంసీ చైర్మన్పై దాడి
రాజోలు(కురవి) : రాజోలు జెడ్పీ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ బానోత్ అర్జున్పై ఆదివారం పలువురు వ్యక్తులు కత్తులతో దాడిచేసి గాయపరిచారు. బాధితుడు అర్జున్ కథనం ప్రకారం.. బాలు తండాకు చెందిన బానోత్ అర్జున్ ఇటీవల రాజోలు హైస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. కాగా, అదే తండాకు చెందిన మాలోత్ రమేష్, మాలోత్ వీరన్న, సురేష్, భద్రు, ధరావత్ సుందర్లు తండా శివారులో కాపు కాసి అర్జున్పై దాడికి పాల్పడ్డారు. దీం తో ఆయన తలకు గాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో దాడికి పాల్పడిన యువకులు పరారయ్యారు. అనంతరం అర్జున్ను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన పై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement