-
పనామా కాలువను ఓడలు ఎలా దాటుతాయంటే? చూస్తేనే అర్థమవుతుంది
మానవ నిర్మితమైన 'పనామా కాలువ' (Panama Canal) పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతోంది. ఈ కాలువ ఉత్తర, దక్షిణ అమెరికాలు విడదీస్తుంది. ఈ కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత ప్రయాణించే దూరం ఏకంగా 9500 కిమీ తగ్గిపోయింది. సాధారణంగా సముద్రం మీద వెళ్లినట్లు ఈ కాలువలో షిప్పులు ప్రయాణించడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ భూభాగం ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల ఇది అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని లాకింగ్ సిస్టం అనే పద్దతి ద్వారా షిప్పులను జాగ్రత్తగా ఒకవైపు నుంచి మరో వైపుకు పంపడం చూడవచ్చు. పనామా కాలువలో షిప్పులు ఎలా ముందుకు వెళతాయి అనేదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్టేట్ నుంచి మరో స్టేజికి వెళ్లాలంటే లాకింగ్ పద్దతిని అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది. అంటే నీటిని ఓకే సమతుల్య స్థానానికి తీసుకు వచ్చిన తరువాత ఇవి ముందుకు కదులుతాయి. ఇలా లాకింగ్ పద్దతిని అనుసరించి అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ సముద్రంలోకి షిప్పులు కదులుతాయి. How ships cross the Panama Canal.. ❤️pic.twitter.com/G5GeuBxK92 — #NaMo Again 🚩 (@BhaktSanatani_) February 29, 2024 -
ఎర్ర సముద్ర ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్
న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అది చాలా ముఖ్యమైన నౌకామార్గం అయినందున ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రన్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మాకు వాణిజ్య స్వేచ్ఛ, రవాణా స్వేచ్ఛ రెండూ ముఖ్యమే. ఎర్ర సముద్రంలో జరుగుతున్న ఘటనలు కేవలం మమ్మల్నే కాదు. ప్రపంచంలోని చాలా దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’అని జైస్వాల్ అన్నారు. డ్రోన్ దాడి కారణంగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో చిక్కుకున్న భారత్కు చెందిన వాణిజ్య నౌకలోని సిబ్బందిని భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం బుధవారం రాత్రి కాపాడింది. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్ర ఘటనలపై భారత్ స్పందించడం గమనార్హం. గాజాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆసియా నుంచి యూరప్, ఆసియా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంపెనీలకు షిప్పింగ్ ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదీచదవండి.. ట్రంప్ చేతిపై ఎర్రమచ్చలేంటి.. ఫ్యాన్స్లో జోరుగా చర్చ -
నౌకలపై దాడులు.. ఇంధన సరఫరాపై ప్రభావం: జై శంకర్
టెహ్రాన్: ఎర్రసముద్రంలో వాణిజ్య రాకపోకలకు పెరుగుతున్న ముప్పుపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. భారతదేశానికి సమీపంలో నౌకలపై దాడులు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఇలాంటి చర్యలు ఎవరికీ ప్రయోజనం కలిగించబోవని చెప్పారు. ఎర్రసముద్రంలో ఓడలపై జరుగుతున్న దాడుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్తో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడారు. "భారతదేశ సమీపంలోనూ కొన్ని దాడులు జరిగాయి. ఇది అంతర్జాతీయ సమాజానికి చాలా ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి చర్యలు భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ చర్యలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు.” అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. గాజాలో యుద్ధం ఆందోళన కలిగించే అంశమని జైశంకర్ అన్నారు. పౌరుల ప్రాణనష్టం, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై దాడులతో మానవతా సంక్షోభం నెలకొంది. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గాజాకు భారత్ స్వయంగా సామగ్రిని పంపి సహాయం చేసిందని స్పష్టం చేశారు. పాలస్తీనాలో నెలకొన్న పరిస్థితుల్ని పరిష్కరించేలా భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇదీ చదవండి: సిరియా, ఇరాక్పై ఇరాన్ క్షిపణి దాడులు -
Red Sea: హౌతీ పైరేట్లు... చైనా మిత్రులా?
టెహ్రాన్: ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్ల దాడులు తప్పించుకోవడానికి వాణిజ్య నౌకలు కొత్త టెక్నిక్ను వాడుతున్నట్లు తెలుస్తోంది. చైనాతో సంబంధాలున్నట్లుగా సంకేతాలిస్తూ నౌకలు హౌతీల దాడుల నుంచి తప్పించుకుంటున్నాయి. నౌకలో అందరూ చైనా సిబ్బంది ఉన్నట్లు లేదంటే నౌక చైనాకు వెళుతోందని సంకేతాలిస్తే హౌతీలు దాడి చేయకుండా విడిచి పెడుతుండడంతో వాణిజ్య నౌకలు ఈ టెక్నిక్ను వాడుతుండటం విశేషం. ఎలాంటి ఆటంకాలు లేకుండా తాజాగా ఎర్ర సముద్రాన్ని దాటిన ఐదు వాణిజ్య నౌకలు ఇదే టెక్నిక్ను వాడాయని సమాచారం. నిజానికి గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్తో లింకులున్న దేశాలకు చెందిన నౌకలపై మాత్రమే దాడి చేస్తామని ప్రటించిన హౌతీలు ఇజ్రాయెల్తో ఎలాంటి లింకులేని దేశాల వాణిజ్య నౌకలపైనా దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హౌతీలపై అమెరికా, బ్రిటన్లకు చెందిన బలగాలు వైమానిక దాడులకు దిగాయి. ఈ దాడులు ఇక ముందు కూడా కొనసాగుతాయని అమెరికా హెచ్చరించింది. ఆసియా నుంచి అమెరికా, యూరప్లకు వెళ్లేందుకు కీలక మార్గంగా ఉన్న ఎర్ర సముద్రంలో హౌతీలు దాడులకు దిగుతుండడంతో నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు వెళుతున్నాయి. ఇదీచదవండి..హౌతీలపై అమెరికా మిత్ర పక్షాల దాడులు -
Houthi Attacks: హౌతీ గ్రూపు మాస్ వార్నింగ్..
టెహ్రాన్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రక్షణపై అమెరికా ఏర్పాటు చేసిన కూటమిలో భాగస్వామ్య దేశాలంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ గ్రూపు హెచ్చరించింది. కూటమి దేశాలన్నీ ఎర్ర సముద్రంలో తమ నౌకల భద్రతను కోల్పోవాల్సి వస్తుందని హౌతీ గ్రూపు సుప్రీం రివల్యూషనరీ కమిటీ సీనియర్ అధికారి మహ్మద్ అలీ అల్ హౌతీ తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నింగ్ ఇచ్చాడు. తాము దాడులను పూర్తిగా ఆపే వరకు కూటమి దేశాల నౌకలకు ముప్పు తప్పదని స్పష్టం చేశాడు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబెల్స్ జరుపుతున్న దాడులను ఎదుర్కొనేందుకు 12 దేశాలతో కలిసి అమెరికా ఒక కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో యూకే,ఆస్ట్రేలియా జపాన్ తదితర దేశాలున్నాయి. అయితే ఈ కూటమిలో తాము లేమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా తూర్పు, పశ్చిమ దేశాల సముద్ర రవాణాకు కీలకమైన ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మండెబ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై హౌతీలు డ్రోన్లతో ఇటీవల దాడులు చేస్తున్నారు. హౌతీల దాడులు మొదలైన తర్వాత ఈ రూట్లో భారత షిప్పింగ్ కంపెనీలు తమ నౌకల రవాణాను రద్దు చేసుకుని భారీ ఖర్చుతో కూడిన ఆఫ్రికా రూట్లో నౌకలను పంపుతున్నాయి.ఈ రూట్లో ఇండియా నుంచి నౌకలు అమెరికా, యూరప్లను చేరుకోవడానికి 14 రోజులు ఎక్కువ సమయం పడుతోంది. ఇదీచదవండి..ట్రంప్ పై బ్యాన్.. రివ్యూకు సుప్రీం కోర్టు ఓకే
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement