-
జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలపై అఖిలపక్ష నేతల ఆగ్రహం
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్రించిన అఖిలపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులను ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించినా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యమని అఖిల పక్ష నేతలు మండిపడ్డారు. అంతేకాదు సాక్షి విలేకరిపై జేసీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని, జేసి బ్రదర్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల పక్ష నేతలు ప్రెస్ క్లబ్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఇందులో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయ కర్త పెద్దారెడ్డి, హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఆధ్యక్షులు శంకర్ నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ పాల్గొన్నారు. -
హామీలను హరించిన 420 చంద్రబాబు
– హంద్రీనీవా దివగంత నేత వైఎస్సార్ పుణ్యమే – విలేకరులతో జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ రొద్దం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను హరించిన 420 చంద్రబాబునాయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన రొద్దం మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకుడు ఆర్ఏ రవిశేఖరరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. హంద్రీనీవాకు తానే శంకుస్థాపన చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో 2004 వరకు హంద్రీనీవా పునాది రాళ్లకే పరిమితమైన సంగతి ప్రజలకు తెలుసని చెప్పారు. దివగంత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవా పథకానికి శంకుస్థాపన చేసి రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ చొరవతోనే జీడిపల్లి, గొల్లపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. ఇప్పుడు కృష్ణాజలాలు అనంతకు వస్తుంటే వాటిని తానే తెచ్చానంటూ చంద్రబాబు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజుల కాలంలో కట్టించిన చెరువులు వర్షం నీటితో నిండుతుంటే వర్షాలను తానే కురిపించానని సీఎం, మంత్రులు పక్కా ప్రణాళికతో జలహారతి పేరుతో ప్రజా సమస్యలను తప్పదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు వజీర్బాషా, లక్ష్మీనారాయణరెడ్డి, కాటిమ తిమ్మారెడ్డి, సీనియర్ నాయకుడు రంగయ్య, మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు. -
అర్హులకు రాయితీ అందకుంటే ఉద్యమం
చిలమత్తూరు : అర్హులైన రైతులందరికీ పంట రాయితీ అందకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన చిలమత్తూరులో ముస్లిం సోదరుల వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పంట రాయితీ ఏకపక్షంగా జమ అవుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కడ స్థాపించారో చెప్పాలని ప్రశ్నించారు. రాగ మయూరి ఎల్సీనా పరిశ్రమ, సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీ తదితర పరిశ్రమలు ఏర్పాటు కాలేదని విమర్శించారు. పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి తక్కువ నష్టపరిహారం రైతులకు ఇచ్చి టేకులోడు, నల్లబొమ్మనపల్లి, ఆరుమాకులపల్లి గ్రామాల రైతులతో 210 ఎకరాల భూములు సేకరించారని ఎద్దేవా విమర్శించారు. పెనుకొండ, గొల్లపల్లి, అమ్మవారిపల్లి గ్రామాల సమీపంలో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు కూడా అధికార పార్టీ నేతల రియల్ ఎస్టేట్కు అనుకూలంగా మారిందని మండిపడ్డారు. ఆయనతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కన్వీనర్లు వెంకటరత్నం, సుధాకర్రెడ్డి, కొండలరాయుడు, రాజగోపాల్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, యాసీన్, తుంగోడు నారాయణరెడ్డి, స్థానిక నాయకులు జబీవుల్లా, లక్ష్మీనారాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా పోరాటాలకు సిద్ధం
- ప్రభుత్వ పెద్దల అవినీతిపై ప్రజలను చైతన్య పరుస్తాం - కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు - పెనుకొండ వైఎస్సార్సీపీ ప్లీనరీలో జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ పెనుకొండ (అనంతపురం) : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్యపరుస్తూ.. పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. కరువుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కరువు కాటకాలతో ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయని అన్నారు. పెనుకొండ పట్టణంలోని వన్షికా గ్రాండ్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. సీఎంగా గద్దెనెక్కిన తర్వాత తన హామీలను మాఫీ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అనైతిక పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. పట్టిసీమ, హంద్రీ-నీవా ప్రాజెక్ట్లలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు కోసం సేకరించిన భూములకు ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున రైతులకు పరిహారం చెల్లిస్తే.. అదే ఎకరా భూమిని చదును చేయడానికి రూ. 29.75 లక్షలు కేటాయించారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. బెల్, నాసన్ పరిశ్రమల ఏర్పాటు శిలాఫలకాలకే పరిమితమయ్యాయన్నారు. ఎమ్మెల్యే బీకే పార్థ«సారథి, ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇసుకను అక్రమంగా కర్ణాటకలోని బెంగళూరు, తుమకూరుకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాన్ని ప్రశ్నించిన వారిపై దాడులకు ఉసిగొల్పుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు దోపిడీ పాలనకు ముగింపు పలికేలా ప్రజలను చైతన్యపరుస్తూ, వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... మరో 365 రోజులు గడిస్తే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇటీవల జిల్లాలో జరిగిన టీడీపీ మహానాడులో జిల్లా కరువు గురించి గానీ, రైతు ఆత్మహత్యలు, కష్టాల గురించి గానీ చర్చించిన పాపాన పోలేదన్నారు. విశాఖలో జరిగిన మహానాడులోనూ ప్రజాసమస్యలపై చర్చించడంలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఇతర నాయకులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. టీడీపీ మూడేళ్ల పాలన మొత్తం అవినీతిమయమన్నారు. వైఎస్ పాలనలో వలసలు, రైతు ఆత్మహత్యలకు అవకాశం ఉండేది కాదన్నారు. వేరుశనగ చెట్లకు కాయలు కాయకపోయినా డబ్బులు కాయిస్తామంటూ రైతన్నలకు భరోసా ఇచ్చిన మహా మనిషి వైఎస్సార్ అని కొనియాడారు. ప్రస్తుతం కరువు నివారణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా టీడీపీ అడ్డుకుందన్నారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరిగి, యువతతో పాటు భావితరాలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. టీడీపీ అవినీతిని కాలరాయాలంటే జగన్ను సీఎం చేయాలన్నారు. పార్టీ పరిశీలకులు నర్సేగౌడ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితమై జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పెనుకొండ మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, సోమందేపల్లి కన్వీనర్ వెంకటరత్నం, గోరంట్ల కన్వీనర్ ఫకృద్దీన్, రొద్దం కన్వీనర్ నారాయణరెడ్డి, పరిగి కన్వీనర్ జయరాం, టౌన్ కన్వీనర్ ఏనుగుల ఇలియాజ్, సర్పంచ్లు సుధాకరరెడ్డి, సరస్వతమ్మచంద్రారెడ్డి, రాజగోపాలరెడ్డి, లక్ష్మానాయక్, పద్మావతమ్మ, ఎంపీటీసీ సభ్యులు రామ్మోహన్రెడ్డి, ఉమర్ ఫరూక్, మురళి, రహంతుల్లా, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, సెంట్రల్బ్యాంక్ డైరెక్టర్ శంకరరెడ్డి, జిల్లా నాయకులు గంపల వెంకటరమణారెడ్డి, బూదిలి వేణుగోపాలరెడ్డి, ఎస్బీశీనా, నియోజకవర్గంలోని సింగిల్ విండో అధ్యక్షులు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యే
అనంతపురం : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదుగుతుండడంతో వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో ఓర్వలేక ప్రభుత్వమే ఈ ఘాతుకానికి ప్రోత్సహించిందంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హత్యారాజకీయాలకు అండగా నిలుస్తున్నారని ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నారాయణరెడ్డి హత్యకేసు దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని, అసలు దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement