-
ఇద్దరు దొంగలు..రెండు కేసులు!
సాక్షి, సిటీబ్యూరో: నల్లకుంట శంకర్మఠ్లో జరిగిన చోరీ ఇంటి దొంగ రాళ్ళబండి నాగ సాయిరాం పనిగా తేలింది. అదే ఠాణా పరిధిలోని కేశవులు ఇంట్లో దొంగతనం చేసింది అతడి స్నేహితుడు సుంకి రాముగా గుర్తించారు. తక్కువ కాలంలోనే ఈ రెండు కేసుల్నీ ఛేదించిన నల్లకుంట పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం తెలిపారు. వీరిద్దరి నుంచి దాదాపు రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తూర్పు మండల డీసీపీ ఎం.రమేష్, కాచిగూడ ఏసీపీ ఎస్.సుధాకర్లతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అమ్మవారి చీర కోసం బంగారం సమీకరిస్తే... శంకర్మఠ్లోని శారద మాతకు బంగారు పట్టు చీర చేయించాలని నిర్వాహకులు నిర్ణయించారు. దీనికోసం కొన్నాళ్ళుగా పసిడి సమీకరిస్తూ మఠంలోని పరిపాలన విభాగం కార్యాయంలో భద్రపరుస్తున్నారు. 5, 10, 15 గ్రాముల బరువు ఉండే నాణేల రూపంలో భక్తుల నుంచి స్వీకరిస్తున్న ఈ బంగారాన్ని మేనేజర్ తన కార్యాలయంలో ఉన్న చెక్క బీరువాలో భద్రపరుస్తున్నారు. ఖమ్మం జిల్లా మథిరకు చెందిన రాళ్ళబండి నాగ సాయిరామ్ ఇదే కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. మేనేజర్ తన చెక్క బీరువా తాళాలను కార్యాలయంలో వదిలి వెళ్తుండటం, బంగారు పట్టుచీర కోసం సమీకరిస్తున్న బంగారం అందులోనే ఉన్న విషయం తెలిసిన సాయిరామ్ దానిపై కన్నేశాడు. అదును చూసుకుని బీరువా తాళం తీస్తూ అందులో ఉన్న బంగారు నాణేలు ఒక్కొక్కటిగా తస్కరించడం మొదలెట్టాడు. గత ఏడాది డిసెంబర్ నుంచి గత వారం వరకు ఇలా మొత్తం 25 నాణాలు దొంగిలించారు. గత వారం బంగారు నాణేలను లెక్కించిన మేనేజర్ మొత్తం 250 గ్రాముల బరువుతో కూడినవి పోయినట్లు తేల్చారు. దీనిపై గురువారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు పరారీలో ఉన్న సాయిరామ్ ఈ పని చేసినట్లు గుర్తించారు. ఇతడి కోసం ముమ్మరంగా గాలించిన బృందం 48 గంటల్లో పట్టుకుని నాణాలను యథాతధంగా రికవరీ చేసింది. వీటి గురించి సాయిరామ్ అసలు విషయం చెప్పకుండా ఓ మహిళ వద్ద దాచి ఉంచాడు. మద్యం మత్తులో నోరు జారితే... నల్లకుంట టీఆర్టీ కాలనీలో నివసించే కేశవులు ఇంట్లో అతడి స్నేహితుడు సంకి రాము దొంగతనానికి పాల్పడ్డాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగుతున్నప్పుడు ఆ మత్తులో కేశవులు చెప్పిన విషయాలే దీనికి ఆధారమయ్యాయి. కేశవులు, అంబర్పేటకు చెందిన దినసరి కూలీ సంకి రాము స్నేహితులు. వీరు నిత్యం కలిసి మద్యం తాగుతూ ఉంటారు. ఆ మత్తులో కేశవులు అవసరమైన, అవసరంలేని విషయాలు మాట్లాడేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం ఇద్దరూ కలిసి మద్యం తాగుతుండగా కేశవులు ‘నోరు విప్పాడు’. తన ఇంట్లో ఎంత బంగారం, వెండి ఉన్నాయి? అవి ఎక్కడ ఉంటాయి? తాము బయటకు వెళ్తే బీరువా/ఇంటి తాళాలు ఎక్కడ పెడతాము? ఇలాంటి విషయాలన్నీ బయటపెట్టేశాడు. ఇది విన్న రాముకు ఆ సొత్తుపై కన్ను పడింది. అప్పటి నుంచి అదును కోసం ఎదురు చూసిన ఇతగాడు గత బుధవారం కేశవులు ఫ్యామిలీతో సహా బయటకు వెళ్తున్నట్లు తెలుసుకున్నాడు. ఆ రోజే అతడి ఇంటి వద్దకు వెళ్ళిన రాము తాళాలు తీసి బీరువాలో ఉన్న 90 గ్రాముల బంగారం, 192 గ్రాముల వెండి ఆభరణాలు తీసుకుని ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన నల్లకుంట పోలీసులు ప్రాథమికంగా పరిచయస్తుల పనిగా గుర్తించారు. కేశవులు ద్వారా అతడి స్నేహితులు, ఇంటికి రాకపోకలు సాగించే వారి వివరాలు సేకరించారు. వీటికి తోడు వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించి రాము నిందితుడిగా తేల్చారు. అతడి కోసం గాలించిన బృందం శనివారం పట్టుకుని సొత్తు రికవరీ చేసింది. సిబ్బందిని అభినందించిన కొత్వాల్... ఈ రెండు కేసుల్నీ నల్లకుంట పోలీసులు తక్కువ సమయంలో ఛేదించారు. ఇన్స్పెక్టర్ మురళీధర్ పర్యవేక్షణలో అదనపు ఇన్స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో డీఎస్సై ఎస్.కోటేశ్వరరావు తన బృందంతో ఈ కేసుల్ని దర్యాప్తు చేశారు. ఈ కేసుల చిక్కుముడులు విప్పిన నల్లకుంట పోలీసుల్ని నగర పోలీసులు కమిషనర్ అంజనీకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
శంకరమఠంలో దొంగలు పడ్డారు..!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధ క్షేత్రమైన శృంగేరీ పీఠం ప్రధాన కేంద్రమైన నల్లకుంటలోని శంకరమఠంలో దొంగలు పడ్డారు. 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇది ఇంటి దొంగల పనే కావొచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకునే బంగారు అభరణాలు భద్రపరిచే గదినుంచి కొన్ని వారాల క్రితమే మాయమైనట్టు మఠం అధికారులు వెల్లడించారు. ఇద్దరు క్లర్కు స్థాయి ఉద్యోగులు శ్రీనివాస్, సాయిని తొలగించామని తెలిపారు. అయితే, ఈ విషయం శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి దృష్టికి వెళ్లడంతో.. వారి ఆదేశాల మేరకు పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. సాయి అనే ఉద్యోగిని నల్లకుంట పోలీసులు శనివారం విచారించనున్నట్టు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హైదరాబాద్: నల్లకుంట శంకరమఠంలో చోరీ
-
ఘనంగా శత చంఢీ హోమం
నల్లకుంట : హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠం సోమవారం భక్తులతో పోటెత్తింది. పౌర్ణమిని పురస్కరించుకొని మఠంలోని శక్తి గణపతి, శంకరభగవత్పాదులు, చంద్రమౌళీశ్వరుడు, లోకమాత శారదాంబలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ శత చంఢీ హోమం నిర్వహించారు. ప్రాంగణంలో మహిళా భక్తులచే కైలాస గౌరీ వ్రతం నిర్వహించి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందజేశారు. మధ్యాహ్నం దాదాపు 300 మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదానం నిర్వహించారు. సాయంత్రం శ్రీలలితా ప్రచార సేవక్ ఆధ్వర్యంలో శంకరమఠం ప్రాంగణంలో కొనసాగుతున్న శ్రీ లలితా అనుగ్రహ భాషణంపై ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం శ్రీ లలితా స్వరూపులు భగవాన్ శ్రీవత్స శ్రీ గురుదేవులు అనుగ్రహ భాషణలు ఇచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement