-
పీసీబీ చీఫ్గా నజమ్ సేథీ
కరాచీ:పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నూతన చైర్మన్ గా నజమ్ సేథీ ఎంపికయ్యారు. గత కొంతకాలంగా పీసీబీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ గా పని చేస్తున్న నజమ్ సేథీని గురువారం చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ మేరకు వార్షిక సర్వసభ్య సమావేశంలో సేథీ ఎంపికకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఇక తాను పీసీబీ చైర్మన్ గా కొనసాగనని షహర్యార్ ఖాన్ స్పష్టం చేయడంతో ఆయన స్థానంలో సేథీని ఎంపిక చేశారు. అయితే షహర్యార్ ఆగస్టు నెలవరకూ చైర్మన్ గా కొనసాగనున్నారు. ఆ తరువాతే నజమ్ సేథీ పీసీబీ చైర్మన్ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. కాగా, షహర్యార్ తరహాలోనే ఆయన శిష్యుడు సేథీ కూడా పాకిస్తాన్ క్రికెట్ ను అభ్యున్నతిలో నడిపిస్తారని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. -
భారత్లో ఆడటానికి సిద్ధం
పాక్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్ కరాచి: చిరకాల ప్రత్యర్థి భారత్తో వారి సొంతగడ్డపై తాము ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్ తెలిపారు. భద్రత పరమైన సమస్యలున్నప్పటికీ తమ జట్టును భారత్కు పంపడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే భారత్ నుంచి దీనిపై ఎలాంటి స్పందన రావడం లేదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగితే బోలేడంతా ఆదాయం సమకూరుతుందని, దీన్ని ఐసీసీ కూడా గుర్తించిందని తెలిపారు. నిజానికి 2017 డిసెంబర్లో ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్లు జరగాల్సి ఉండగా.. 2008 ముంబై దాడుల అనంతరం దాయాది దేశంలో క్రీడ సంబంధాలను భారత్ తెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య కుదరిన ఎంఓయూను అమలు చేయాలని భారత్కు పీసీబీ నోటీసు కూడా పంపించిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే జూలైలో బంగ్లాదేశ్లో పాక్ పర్యటిస్తుందని షహర్యార్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో పాక్ పర్యటించినా ఆదేశం పాక్లో పర్యటించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బంగ్లా బోర్డు పర్యటన షెడ్యూల్ పంపడంతో ఆదేశానికి పాక్ జట్టును పంపడానికి పీసీబీ అంగీకారం తెలిపింది. మరోవైపు వెస్టిండీస్తో జరుగుతున్న మూడోటెస్టు ద్వారా రిటైరవుతున్న దిగ్గజాలు యూనిస్ ఖాన్, మిస్వావుల్ హక్లను సత్కరించాలని పీసీబీ భావిస్తోంది. -
బీసీసీఐపై చర్యలకు పీసీబీ సిద్ధం!
కరాచీ: గత కొన్నేళ్లుగా తమతో క్రికెట్ ఆడటానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పై చర్యలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సిద్ధమైంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోలో బోర్డుపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైనట్లు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. దీనిలో భాగంగా త్వరలోనే న్యాయ నిపుణలను కలవనున్నట్లు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. బీసీసీఐపై చర్యలకు పీసీబీ ఆమోద ముద్ర వేసిన విషయాన్ని షహర్యార్ ఖాన్ తాజాగా తెలిపారు. '2014లో ఇరు క్రికెట్ బోర్డులు దైపాక్షిక సిరీస్లు ఆడటానికి ఒప్పందం చేసుకున్నాయి. ఆ విషయాన్ని బీసీసీఐ పక్కన పెట్టేసింది. మాతో సిరీస్ ఆడటాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. మా మధ్య ఒప్పందం ప్రకారం 2015 మొదలుకొని 2022 వరకూ ఆరు ద్వైపాక్షిక సిరీస్లు జరగాలి. అందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలే(ఐసీసీ) సాక్ష్యం. ఐసీసీ స్థాయిలో ఒప్పందం జరిగిన తరువాత బీసీసీఐ ఎందుకు మాతో ఆడటం లేదు. ఆ క్రమంలోనే బీసీసీఐపై చర్యలకు సిద్ధమవుతున్నాం' అని షహర్యార్ పేర్కొన్నారు. 2007 తరువాత భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. 2007లో చివరిసారి భారత్లో పాకిస్తాన్ పర్యటించింది. ఆ తరువాత పాకిస్తాన్ తో సిరీస్ కు బీసీసీఐ విముఖత వ్యక్తం చేయడంతో పీసీబీకి కొన్ని వందల కోట్ల రూపాయిలను నష్టపోయింది. దీనిలో భాగంగానే బీసీసీఐపై న్యాయపరమైన చర్యలు తీసుకుని కొంత మేరకు లబ్దిపొందాలని యోచిస్తోంది. -
పాక్ క్రికెట్ లో ఖాన్ కామెంట్స్ దుమారం
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ చేసిన 'డిగ్రీ' వ్యాఖ్యలపై సీనియర్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెటర్లు చదువులో వెనకబడ్డారని, మిస్బా-వుల్-హక్ మినహా డిగ్రీ చదివాళ్లే లేరని షహర్యార్ కామెంట్ చేశారు. దీనిపై సీనియర్ బ్యాట్స్ మన్ మహ్మద్ హఫీజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదువుతో ఆటకు సంబంధం ఏమిటని ప్రశ్నించాడు. క్రికెట్టే తమకు కంప్లీట్ ఎడ్యుకేషన్ అని అన్నాడు. టెస్టు క్రికెటర్ గా చెప్పుకోవడానికి గర్వపడతానని, అదే తన డిగ్రీ అని వ్యాఖ్యానించాడు. అయితే అందరికీ చదువు ముఖ్యమేనని, దీనికి డిగ్రీలే కొలమానం కాదన్నాడు. పాకిస్థాన్ క్రికెటర్లు చదువును నిర్లక్ష్యం చేస్తున్నారని షహర్యార్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సీనియర్ ఆటగాళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే వారు బహిరంగంగా మాట్లాడకుండా, తమ అభిప్రాయాలను పీసీబీ వర్గాలకు రహస్యంగా వెల్లడించినట్టు సమాచారం. -
'భారత్ లో ఆడే ప్రసక్తే లేదు'
న్యూఢిల్లీ: టీమిండియాతో డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాకిక్ష క్రికెట్ సిరీస్ ను భారత్ లో ఆడే ప్రసక్తే లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ముందుస్తు షెడ్యూల్ ప్రకారం ఆ సిరీస్ ను యూఏఈలో మాత్రమే ఆడాలనుకుంటున్నట్లు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత్ లో ఆడాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేసిన విన్నపాన్ని షహర్యార్ ఖాన్ తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఇరు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ ను భారత్ లో ఆడబోమని పేర్కొన్నారు. ఒకవేళ భారత్ తమతో ఆడాలనుకుంటే మాత్రం అది యూఏఈలో మాత్రమే జరుగుతుందని షహర్యార్ తెలిపారు. 'భారత్ లో సిరీస్ ఆడే విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నాం. యూఏఈలో జరగాల్సిన సిరీస్ ను భారత్ లో నిర్వహించడానికి మేము అంగీకరించం. ఇందులో వేరే ప్రశ్నే లేదు'అని షహర్యార్ తెలిపారు. 2009వ సంవత్సరంలో లాహార్ లో శ్రీలంక -పాకిస్థాన్ ల మధ్య సిరీస్ జరిగే సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో అప్పట్నుంచి పీసీబీ తమ క్రికెట్ సిరీస్ లను స్వదేశంలో నిర్వహించకుండా మిగతా వేదికలపై జరుపుతోంది. దీనిలో భాగంగానే బీసీసీఐ-పీసీబీల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ లకు ఒప్పందం కుదరింది. ఆ ఒప్పందంలో ముందస్తు సిరీస్ ను డిసెంబర్ లో యూఏఈలో నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ తో క్రికెట్ సిరీస్ లు జరగడానికి రాజకీయ పరమైన అంశాలు ముడిపడి ఉండటంతో ఆ సిరీస్ ను భారత్ లో జరపాలని బీసీసీఐ భావించింది. కాగా, అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఎటువంటి సానుకూలత లేకపోవడంతో ఆ సిరీస్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement