-
ఒక్కసారిగా మూగబోయిన గూగుల్..!
పలు బ్లాగింగ్ సైట్లకు, న్యూస్ వెబ్సైట్లకు గూగుల్ భారీ షాకిచ్చింది. గూగుల్ అనలిటిక్స్ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మూగబోయింది. గూగుల్ అనలిటిక్స్ ఒక్కసారిగా డౌన్ అవ్వడంతో పలు యూజర్లు ట్విటర్లో గగ్గోలు పెట్టారు. గూగుల్ అనలిటిక్స్ పనిచేయడం లేదంటూ ట్విటర్లో షేర్ చేశారు. రియల్ టైం వ్యూస్ పూర్తిగా జీరోకు చేరుకుందని యూజర్లు ట్విటర్లో పేర్కొన్నారు.గూగుల్ అనలిటిక్స్ డౌన్ విషయంపై గూగుల్ ఇంకా స్పందించాల్సి ఉంది. గూగుల్ అనలిటిక్స్ ఏం చేస్తుందంటే...! నేటి డిజిటల్ ప్రపంచంలో పలు వెబ్సైట్లకు, బ్లాగింగ్ సైట్లకు గూగుల్ అనలిటిక్స్ ముఖ్యమైన టూల్. ఈ టూల్ను ఉపయోగించి ఆయా వెబ్సైట్లకు ఎంత మేర ట్రాఫిక్(యూజర్లు) వస్తూందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. అంతేకాకుండా పలు సైట్లకు సంబంధించిన యూజర్ల సెషన్ వ్యవధి, ప్రతి సెషన్కు పేజీలను, బౌన్స్ రేటు మొదలైన వెబ్సైట్ కార్యకలాపాలను గూగుల్ అనలిటిక్స్ ట్రాక్ చేస్తుంది. @googleanalytics The real-time reports are not working. — MalwareTips (@MalwareTipscom) October 18, 2021 @googleanalytics Is real time reporting down? — Skint Dad (@SkintDad) October 18, 2021 What's going on @googleanalytics @Google @GoogleAds GA is down and showing everything is 0 🙄😐🤔 GA is Down??? #GADOWN #GooleGA #googleanalytics #down pic.twitter.com/UV9RLnFezl — Manny Farooqi (@MannyFarooqi) October 18, 2021 -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కళకళ
భూముల విలువ పెరగనుందన్న సమాచారంతో రిజిస్ట్రేషన్ల జోరు అనకాపల్లిలో రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ ఒక్క రోజే 60 క్రయవిక్రయాలు అనకాపల్లి/యలమంచిలి/రూరల్ : ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల ధరలు పెరుగుతాయనే ప్రచారంతో గత రెండు రోజులుగా అనకాపల్లి, యలమంచిలి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్లతో రద్దీగా కనిపిం చాయి. అనకాపల్లిలో రోజుకు సరాసరి 20 రిజిస్ట్రేషన్లు జరగ్గా బుధవారం 50, గురువారం 60 రిజస్ట్రేషన్లు నమోదయ్యాయి. యలమంచిలిలో రెండు రోజుల్లో 300 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. చివరిరోజు కావడంతో గురువారం రెండు కార్యాలయాలు అమ్మకందారులు, కొనుగోలుదార్లతో కిటకిటలాడాయి. భూముల విలువ 30 శాతం పెరుగుతుందన్న సమాచారం మేరకు రూ. 5 లక్షల విలువ ఉన్న భూమి రూ. 7 లక్షలకు, రూ. 7లక్షల భూమి రూ. 9 లక్షలకు పెరగనుంది. యల మంచిలి పట్టణంలో గజం స్థలం రూ.17 వందల నుంచి రూ.2200కు చేరనుంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూముల విలువ కూడా గణనీయంగా పెరగనుంది. ఎకరా 5 లక్షల విలువ చేసే భూమి క్రయ విక్రయాలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వానికి స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రు.30 వేలు చెల్లించాలి. పెరిగిన ధరలతో ఇది రూ.42 వేలకు చేరుతుంది. యలమంచిలిలో 100 గజాల స్థలానికి ప్రస్తుతం రూ.10,800 స్టాంప్డ్యూటీ చెల్లిస్తుండగా ఇకపై రూ. 13,200 చెల్లించాల్సి ఉంటుంది. ప్లాట్ల విలువలు కూడా 30 శాతం పెంచడంతో ఈ ప్రభావం వాటి ధరలపై పడనుంది. సర్వర్ డౌన్తో టెన్షన్ అనకాపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం కాసేపు సర్వర్ డౌన్ కావడంతో టెన్షన్ నెలకొంది. అనుకున్న అంచనా మేరకు రెండు రోజుల్లో రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు అవుతాయని భావించారు. గురువారం మధ్యాహ్నం నాటికి భూముల ధరల పెంపుదల నిర్ణయం ఇంకా ఖరారు కాకపోవడంతో వేగం తగ్గింది. అయినప్పటికీ రద్దీ కొనసాగింది. రాత్రి వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగడమే పరిస్థితికి నిదర్శనం. కాస్త కదలిక ఏప్రిల్ నుంచి అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో లక్ష్యం మేరకు రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో సంబంధిత అధికారులు కలవరపడుతున్నారు. ఎన్నికల సందడిలో రెండు నెలలు గడిచిపోవడంతో కొంత నష్టం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకోబోయే పాలసీలపై ఆధారపడి భూముల అమ్మకాల ప్రక్రియ జోరందుకుంటుందన్న అంచనాలు కొంత వరకు క్రయవిక్రయాలను దెబ్బతీశాయి. ఈలోగా రుణమాఫీపై స్పష్టమైన విధివిధానాలు రాకపోవడం, ఖరీఫ్ రుణాలు మంజూరు కాకపోవడంతో ఈ ప్రభావం భూముల క్రయవిక్రయాలపైనా కనిపించింది. మరోవైపు రాజధానిపై ఇంకా స్పష్టత రాకపోవడం కూడా పరిస్థితి మందగించడానికి కొంత కారణమైంది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో భూముల విలువ పెరుగుతుందన్న సమాచారం కాస్త కదలిక తెచ్చింది. రిజిస్ట్రేషన్లపై గణనీయమైన ప్రభావం చూపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement