-
ఎనిమిది ట్రంకు పెట్టెల్లో ఆభరణాలు, నగదు
-
మనోజ్ అవినీతి విలాసం..
అనంతపురం క్రైం: ట్రంకు పెట్టెల్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు వెలుగుచూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడం తెలిసిందే. వీటి వెనుక ఉన్న ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ గాజుల మనోజ్కుమార్ ఆస్తుల విలువ రూ.3 కోట్ల పైమాటేనని పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీలోని బాలప్ప ఇంట్లో మారణాయుధాలున్నాయనే సమాచారంతో ఈ నెల 18న ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీసీఎస్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు సోదాలు నిర్వహించి బంగారం, వెండి, నగదు, డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకుని తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. అవన్నీ ట్రెజరీ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అకౌంటెంట్ మనోజ్వేనని విచారణలో గుర్తించారు. రూ.15 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్.. బాలప్ప ఇంట్లోకి పెట్టెలు ఎలా వచ్చాయంటే.. మనోజ్ అనంతపురంలోని సాయినగర్ 8వ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఇతని తండ్రి జి.సూర్యప్రకాష్ పోలీసు శాఖలో హెడ్కానిస్టేబుల్గా పని చేస్తూ మరణించాడు. కారుణ్య నియామకం కింద 2005లో మనోజ్కుమార్కు ట్రెజరీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. మనోజ్కుమార్కు బుక్కరాయసముద్రంలో వ్యవసాయ క్షేత్రం ఉండగా.. అందులో పనిచేసేందుకు స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగ వెళ్లేవాడు. అలా నమ్మకం ఏర్పడిన తర్వాత అతడినే మనోజ్ తన కారు డ్రైవర్గా నియమించుకున్నాడు. ఏడేళ్లుగా నాగలింగ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మనోజ్ ఆస్తులను నాగలింగ తన మామ బాలప్ప ఇంట్లో దాచిపెట్టాడు. నగదు...నగలు...వాహనాల స్వాధీనం మనోజ్ కారు డ్రైవర్గా పనిచేసే నాగలింగ మామ బాలప్ప ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెలను పరిశీలించగా అందులో 54 బంగారు ఆభరణాలు.. మొత్తం 2.42 కేజీల బంగారం, 280 వెండి సామగ్రితో పాటు మొత్తంగా 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు , రూ.49.10 లక్షల విలువైన 24 ఫిక్స్డ్ డిపాజిట్/ఎన్ఎస్ఎస్ బాండ్లు, రూ.27.05 లక్షల విలువైన 145 ప్రాంసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు పిస్తోళ్లు, 18 రౌండ్లు, ఒక ఎయిర్గన్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా బీకేఎస్లో ఉన్న మనోజ్ వ్యవసాయ క్షేత్రాన్ని పోలీసు బృందాలు పరిశీలించగా.. అక్కడ రెండు మహీంద్ర ఎక్స్యూవీ టాప్ మోడల్ కార్లు, ఒక హార్డీ డేవిడ్ సన్ మోటర్ వాహనం, మూడు ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలు, రెండు కరీజ్మా ద్విచక్ర వాహనాలు, ఒక హోండా యాక్టివా, నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డమ్మీ పిస్తోళ్లు.. అవన్నీ డమ్మీ పిస్తోళ్లే పోలీసుల సోదాల్లో మూడు పిస్తోళ్లు, ఒక ఎయిర్గన్ స్వాధీనం చేసుకున్నామని, అవన్నీ డమ్మీవేనని ఓఎస్డీ వెల్లడించారు. పిస్తోళ్లతో పాటు 16 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్చినప్పుడు వాటి నుంచి ఫైర్, సౌండ్ మాత్రమే వస్తాయనీ, వీటితో షూట్ చేసినా ఎవరికీ ప్రాణహాని ఉండదని తెలిపారు. కేసు నమోదు భారీ మొత్తంలో ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు కలిగి ఉండడంతో మనోజ్కుమార్పై సీఆర్ నం 213/2020,యు/ఎస్ 102 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశామని ఓఎస్డీ వివరించారు. కేసు చేధింపులో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ బి.సత్యయేసు బాబు అభినందించి రివార్డులు ప్రకటించారన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఈ.శ్రీనివాసులు, ఏ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, సీఐలు సాయిప్రసాద్, శ్యాంరావు, ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీజీపీ దృష్టికి మనోజ్ వ్యవహారం చిరు ఉద్యోగి మనోజ్ భారీగా నగదు, నగలు దాచుకోవడం...పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ సత్యయేసుబాబు డీజీపీ గౌతం సవాంగ్కు నివేదిక సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక మనోజ్ అక్రమాస్తులపై ఏసీబీ కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ముందే చెప్పిన ‘సాక్షి’ జిల్లా ఖజానా కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందనీ, ముడుపులిస్తే కానీ ఫైళ్లు ముందుకు కదలవని ‘సాక్షి’ ఈ ఏడాది మే 21న ‘ముడుపుల ఖజానా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అవినీతి తతంగంలో తెర వెనుక ఇద్దరు ఉద్యోగులున్నారని, అందులో సీనియర్ అకౌంటెంట్ మనోజ్ కీలకపాత్ర పోషించినట్లు పేర్కొంది. ఉద్యోగులకు డీఏ, అరియర్స్ విషయంలోనూ సదరు సీనియర్ అకౌంటెంట్ భారీ స్థాయిలో దందాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని, వీటితో పాటు కార్యాలయంలో ఎవరికైనా మెమో, షోకాజ్ తదితర నోటీసులిస్తే సమాధానం అతనే రాసి వారితో సొమ్ము చేసుకుంటున్నారని మే నెలలో ప్రచురించిన కథనంలో ‘సాక్షి’ పేర్కొంది. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం.. -
అవినీతి ‘ఖజానా’ ఆస్తి రూ.3 కోట్ల పైనే
అనంతపురం క్రైం: అనంతపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గాజుల మనోజ్కుమార్ అవినీతి అనకొండగా మారి కూడబెట్టిన ఆస్తి విలువ రూ.3 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. ఆస్తిని తన నమ్మిన బంటు అయిన కారు డ్రైవర్ నాగలింగ మామ బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెల్లో దాచిపెట్టాడు. పోలీసుల తనిఖీల్లో 2.42 కేజీల బంగారం, 84.10 కేజీల వెండి, రూ.15,55,560 నగదు, రూ.49.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు/బాండ్లు, రూ.27.05 లక్షల విలువ గల ప్రామిసరీ నోట్లు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఒక ఎయిర్ పిస్తోలు, మరో మూడు 9 ఎంఎం డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఈ వివరాలను డీపీవో కార్యాలయ ఆవరణలో పోలీస్ శాఖ ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ బుధవారం విలేకరులకు తెలియజేశారు. సొత్తును స్వాధీనం చేసుకుని.. మనోజ్కుమార్పై కేసు నమోదు చేసి డీజీపీకి నివేదించామని చెప్పారు. కేసును ఏసీబీకి అప్పగిస్తామన్నారు. అవినీతి డొంక కదిలిందిలా.. ► మనోజ్కుమార్ వద్ద మారణాయుధాలు ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఎస్పీ బి.సత్యయేసుబాబు ఈ నెల 18న డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఇ.శ్రీనివాసులు, ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ ప్రసాద్, సీసీఎస్ సీఐ శ్యామ్రావు రంగంలోకి దిగారు. ► మనోజ్కుమార్ డ్రైవర్ నాగలింగ, అతడి మామ బాలప్ప ఇళ్లల్లో తనిఖీ చేయగా.. బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెలు కనిపించాయి. ► వాటిని తెరిచి చూడగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, భారీగా వెండి, నగదు, 4 డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు లభించాయి. స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న పోలీసులు విలాసవంతమైన జీవితం ► మనోజ్కుమార్ బెంగళూరు వెళ్లేందుకు ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైక్ వాడేవాడని.. దీని ధర రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా. ► రూ.7 లక్షల విలువైన మూడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు, రెండు కరిజ్మా బైక్స్, రెండు మహీంద్ర ఎక్స్యూవీ కార్లు కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇవికాకుండా హోండా యాక్టివా, తాను పెంచుతున్న గుర్రాల కోసం లీజుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రంలో పనుల కోసం నాలుగు ట్రాక్టర్లు కూడా కొనుగోలు చేశాడు. -
సీనియర్ అకౌంటెంట్కు రిమాండ్
కోవెలకుంట్ల: స్థానిక ఉప ఖజానా కార్యాలయ సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన సదురుద్దీన్ను గురువారం రిమాండ్కు తరలించారు. ఉయ్యాలవాడకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బషీర్అహమ్మద్కు రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్కు సంబంధించి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం విధితమే. ఈ మేరకు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్
చీరాల : ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఖజానా శాఖ సీనియర్ అకౌంటెంట్ అక్కేశ్వరరావు.. ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు... వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ హాస్టల్ వాచ్మెన్గా పనిచేసి పదవీ విరమణ పొందిన గరికా శంకర్రావుకు ప్రభుత్వం నుంచి రూ.1.20 లక్షల మేర బకాయిలు రావాల్సి ఉంది. అయితే వీటిని మంజూరు చేసేందుకు అక్కేశ్వరరావు రూ.15వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సోమవారం చీరాలలో తహసీల్దారు కార్యాలయం ఆవరణలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో శంకర్రావు నుంచి రూ.5వేలు లంచం తీసుకంటుండగా అక్కేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.5వేలు స్వాధీనం చేసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement