-
పూడూరులో నేవీ వ్యూహాత్మక కేంద్రం
సీఎం కేసీఆర్తో వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ భేటీ రంగారెడ్డిలో 42 ఎకరాల దేవాదాయ శాఖ భూమి నేవీకి హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పూడూరు సమీపంలో భారత నావికాదళం వ్యూహాత్మక కేంద్రాన్ని(స్ట్రాటజిక్ సెంటర్) ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న 42 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని నేవీకి అప్పగించాలని తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును కలిసి కోరారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించి, పూర్తి సహాయసహకారాలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు. నావికా దళం ఏర్పాటు చేయనున్న వ్యూహాత్మక కేంద్ర నిర్మాణానికి మొత్తం 2,900 ఎకరాల భూమి కావాల్సి ఉంది. గతంలో భూమి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో అటవీ భూమి కూడా ఉన్నందున మళ్లీ అడవుల పెంపకంతోపాటు భూమి ధర కలిపి మొత్తం రూ.115.06 కోట్లను నేవీ రాష్ట్ర ప్రభుత్వానికి దశల వారీగా చెల్లిస్తుందని ైవె స్ అడ్మిరల్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇక్కడ కోల్పోయే అటవీ సంపదను మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ముఖ్య అధికారిని సీఎం ఆదేశించారు. ఇక్కడ వ్యూహాత్మక కేంద్రం ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. అక్కడున్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్లడానికి వెసులుబాటు కల్పిస్తామని వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ వివరించారు. ప్రస్తుతం దేశంలో కొచ్చిన్, టుటీకోరి ప్రాంతాల్లో ఇలాంటి స్థావరాలు ఉన్నాయని, ఇది మూడో స్థావరమని నేవీ అధికారులు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. -
నేవీ బేస్ క్యాంప్ ఏర్పాటుపై కేసీఆర్ సానుకూల స్పందన!
హైదరాబాద్: నేవీ బేస్ క్యాంప్ నిర్మాణం కోసం ఆలయ వివాదంలో ఉన్న భూమిని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్కు తూర్పు నావికాదళం కమాండెంట్ సతీష్ సోనీ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ఏర్పాటుచేయనున్న నేవీ బేస్ క్యాంప్ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను సతీష్ సోనీ గురువారం మధ్యాహ్నం భేటి అయ్యారు. నేవీ బేస్ క్యాంప్ ఏర్పాటుపై కేసీఆర్ సానుకూలం స్పందించారు. వీలైనంత త్వరగా నేవీ క్యాంప్ ఏర్పాటుకు భూమిని అప్పగిస్తామని సతీష్ సోనికి కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
తూర్పు నావికాదళ చీఫ్గా సతీష్ సోనీ
విశాఖపట్నం: తూర్పు నావికాదళ చీఫ్గా వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ సోమవారం ఇక్కడి నావల్బేస్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి 1976 జూలై ఒకటో తేదీన భారత నావికా దళంలో చేరిన ఆయన ఎయిర్క్రాఫ్ట్ డెరైక్షన్, నావిగేషన్ విభాగాల్లో ప్రావీణ్యత సాధించి స్వార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. డిఫెన్స్ స్టాఫ్ కాలేజ్, నావల్ వార్ఫేర్ కళాశాలల్లో విద్యనభ్యసించారు. ప్రతిష్టాత్మక నౌసేన మెడల్, అతి విశిష్టసేవా మెడల్, పరమ విశిష్టసేవా మెడల్స్ను అందుకున్నారు. తూర్పు నావికాదళ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చీఫ్గా సతీష్ సోనీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్చోప్రా పదోన్నతిపై పశ్చిమ నావికాదళం చీఫ్గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో సతీష్ సోనీ నియమితులయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement