-
విద్యుల్లేఖతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ
ఆమె రూపం ప్రత్యేకం...ఆమె గొంతు ప్రత్యేకం. మాట్లాడే భాష కూడా ప్రత్యేకమే. ఆమె తెరపై కన్పించగానే నవ్వులు విరబూయాల్సిందే. రూపం..గొంతు..భాషతో సినీతెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది క్యారెక్టర్ కమ్ కమెడియన్ ఆర్టిస్ట్ విద్యుల్లేఖా రామన్. సరైనోడు సినిమాలో ‘సాంబార్ వదిన’గా..రాజుగారి గది మూవీలో బుజ్జెమ్మగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విద్యుల్లేఖ చెన్నైలో పుట్టి పెరిగింది. తండ్రి మోహన్ రామన్ తమిళ నటుడు. మొదట థియేటర్ ఆర్టిస్టుగా రాణించి...ఆపై వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ అమ్మాయి తెలుగు భాషను తమిళ యాసతో వెరైటీగా మాట్లాడుతుంది. హైదరాబాద్ అంటే ఇష్టమని, పాతబస్తీలో షాపింగ్... పలావ్ లాగించడం మరీ ఇష్టమని చెబుతున్న విద్యుల్లేఖ తన సినీ ప్రయాణం..వ్యక్తిగత అభిరుచుల గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.. శ్రీనగర్కాలనీ: ఆమె తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు.. ఏ పాత్ర వేసినా అందులో ఆ పేరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఆమె ఒరిజినల్ పేరు చాలా మందికి తెలియదు. తెలుగులో ‘బుజ్జెమ్మ, సాంబార్’ అని ముద్దుగా పిలిపించుకుంటూ ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఇంకా గుర్తుపట్టలేదా.. అదేనండీ.. ‘సరైనోడు’ చిత్రంలో అల్లు అర్జున్కు తమిళ సాంబార్ వదినగా, ‘రాజుగారి గది’లో బుజ్జెమ్మగా, ‘రన్ రాజా రన్’లో హీరోయిన్ ఫ్రెండ్గా పంచ్లు వేస్తూ కడుపుబ్బా నవ్వించిన నటి. బొద్దుగా చురుకుదనానికి కేరాఫ్గా కనిపించిందే ఆమె అసలు పేరు ‘విద్యులేఖా రామన్’. తెలుగు, తమిళ పరిశ్రమలో లేడీ స్టార్ కమెడియన్గా చాలా సుపరిచితురాలు. తెలుగు భాషను తమిళ వాసనలో మాట్లాడే ఈ పాప.. ‘సాక్షి’తో తన చిత్రసీమ ప్రయాణాన్ని పంచుకుంది. ఆ వివరాలు బుజ్జెమ్మ అలియాస్ విద్యుల్లేఖా రామన్ మాటల్లోనే.. నేను పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే. నాన్న మోహన్ రామన్ తమిళ నటుడు. రజనీకాంత్, కమలహాసన్ లాంటి స్టార్లతో పాటు పలు ప్రముఖ సీనియల్స్లో నటించారు. నేను విజువల్ ఎఫెక్టŠస్ అండ్ మీడియా కమ్యునికేషన్స్లో డిగ్రీ చేశాను. మా నాన్న ప్రభావం నాపై పడిందేమో.. నేనూ థియేటర్ ఆర్టిస్ట్ అయ్యాను. పదేళ్లు థియేటర్ ఆర్టిస్ట్గా చేస్తూ ‘అను’ అనే ట్రూప్ను ప్రారంభించాను. దానిద్వారా ప్రదర్శనలు ఇచ్చి అవార్టులు సైతం అందుకున్నాను. థియేటర్ ఆర్టిస్ట్గా స్టేజ్ ఫియర్ పోయి సినిమాల్లో నటించడానికి చాలా దోహదపడింది. ఒకేసారి తెలుగు, తమిళంలో నటించా.. గౌతమ్మీనన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమా తీస్తున్నారు. ఒక కొత్త అమ్మాయిని క్యారెక్టర్ కోసం వెతుకున్న సమయంలో థియేటర్ ఆర్టిస్ట్గా నా ప్రదర్శన చూసిన చిత్ర యూనిట్ ఆయనకు పరిచయం చేశారు. ఆడిషన్ తర్వాత చిత్రంలో క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమానే ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. ఆ తర్వాత రన్రాజారన్, సరైనోడు, రాజుగారి గది, తొలిప్రేమ, ఆనందోబ్రహ్మ, నిన్నుకోరి, భాగమతి, ధృవ, డీజే.. ఇలా తెలుగులో 35 చిత్రాలు చేశాను. తమిళంలో విజయ్, అజిత్ లాంటి స్టార్స్తో పాటు మొత్తం 26 సినిమాలు, కన్నడలో మూడు చిత్రాల్లోను నటించారు. సొంతంగా డబ్బింగ్.. మొదటి సినిమా చేసేనాటికి నాకు తమిళం తప్ప ఒక్క ముక్క తెలుగు రాదు. అయినా సరే కొత్త వాయిస్ ఉంటే బాగుంటుందని దర్శకుడు గౌతమ్ మీనన్ నాతో డబ్బింగ్ చెప్పించారు. ఆ తర్వాత అన్ని సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. కొత్త వాయిస్ కావడంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాను. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడతాను కూడా. రన్ రాజా రన్, రాజుగారి గది, సరైనోడు చిత్రాల్లోని పాత్రలు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఎంతగా అంటే నా అసలు పేరు ఎవరూ గుర్తుంచుకోలేదు.. ఆ చిత్రల్లోని పాత్రల పేరుతోనే పిలుస్తున్నారు. తెలుగు ఫుడ్కి ఫిదా అయిపోయా.. నాకు జీవితాన్ని, గుర్తింపును ఇచ్చింది తెలుగు సినిమా.. హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. పాతబస్తీ అంటే మరీ ఇష్టం. అక్కడి కట్టడాలు అపురూపంగా ఉంటాయి. ఇక్కడి సంస్కృతి చాలా గొప్పది. పాతబస్తీలో షాపింగ్ అంటే ఇష్టం.. హైదరాబాద్ బిర్యానీ కంటే పలావ్.. భీమవరం చేపల పులుసు, పీతలు, రొయ్యలు, స్పైసీ పుడ్ ఇష్టంగా తింటాను. నన్ను నేను మైమరపించేలా తెలుగు వంటకాలుంటాయి. హైదరాబాద్లో ట్యాంక్బండ్, బేగంబజార్, ఔటర్రింగ్ రోడ్లో లాంగ్ డ్రైవ్ ఇష్టం. పవన్ కల్యాణ్తో సినిమా నా డ్రీమ్.. తెలుగులో పవర్స్టార్తో సినిమా చేయాలని నా కోరిక.. కానీ తీరేలా లేదు. అవకాశం ఉంటే తప్పక చేస్తాను. మెగాస్టార్ చిరంజీవి గారంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయాలని ఉంది. ఇది కుదురుతుంది అనుకుంటున్నాను. అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని ఉంది. కామెడీ చేయడం చాలా కష్టం.. కానీ ఇష్టంతో చేయాలి. దానితో పాటు సీరియస్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అఖిల్, నితిన్, నిఖిల్, నాగచైతన్య సినిమాల్లో నటిస్తున్నాను. 500 చిత్రాలు చేయాలి తెలుగు, తమిళ భాషల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసిన మహానటుల్లా నా కెరీర్లో 500 చిత్రాలు చేయాలని ఉంది. దేవుడి కృప ఉంటే తప్పక చేస్తాను. సినిమాల్లో హెల్తీ కామెడీ రావాలి. సైజ్లు, కలర్ను పదేపదే అవహేళన చేసే విధంగా కాకుండా ఓ మోతాదులో హెల్తీ కామెడీ ఉంటే బాగుంటుంది. లేడీ కమెడియన్స్ పరిశ్రమలో లేరు. ప్రతిభ ఉన్న వారు తప్పక రావాలి. తమిళంలో కంటే తెలుగులో అధికంగా అవకాశాలు వస్తున్నాయి. నన్ను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాను. అన్నట్టు నా అసలు పేరు విద్యుల్లేఖా రామన్.. అంటూ ముగించారు. -
ఇక మీదట హీరోగానే..!
‘ఒక విచిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో ఆది పినిశెట్టి కోలీవుడ్లో హీరోగా మంచి విజయాలు సాధించాడు. అయితే తెలుగులో మాత్రం హీరోగా కన్నా ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లో, సహాయ పాత్రల్లోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాల్లో విలన్గా, ఆకట్టుకున్న ఆది ఇటీవల రంగస్థలం సినిమాలో హీరో అన్నగా నటించి మెప్పించాడు. అయితే ఇక మీద ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట ఈ యువ నటుడు. ఆది పినిశెట్టి ఇక మీద సోలో హీరోగానే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యూటర్న్ రీమేక్ తో పాటు కోన వెంకట్ నిర్మిస్తున్న సినిమాలో లీడ్ రోల్లో కనిపించనున్నాడు ఆది. ఇప్పటికే కోలీవుడ్ లో హీరోగా ప్రూవ్ చేసుకున్న ఆది త్వరలోనే తెలుగులో కూడా సోలో హీరోగా సత్తా చాటే ఆలోచనలో ఉన్నాడు. -
ఆమెకు ఇంకా సరైనోడు దొరకలేదట!
క్యాథరిన్ ట్రెసా సరైనోడు ఇంకా కంటపడలేదు అంటోంది. క్యాథరిన్కు తమిళంలో సరైన హిట్ రాలేదనే చెప్పాలి. ఆమె గ్లామర్గా నటించడానికి ఏమాత్రం వెనుకాడని ధైర్యం ఉన్న నటి. అయినా స్టార్స్తో జత కట్టే అవకాశాలు పెద్దగా రావడం లేదు. ఆ మధ్య విశాల్తో కథకళి చేసినా, అధర్వ కణిదన్తో విజయం అందుకున్నా, అవకాశాల్లో జోరు పెరగలేదు. అయితే టాలీవుడ్లో అల్లుఅర్జున్ లాంటి స్టార్స్తో నటించే అవకాశాలను రాబట్టుకుంటోంది. కోలీవుడ్లో ఆర్యతో జతకట్టిన కడంబన్ చిత్రం తరువాత క్యాథరిన్ ట్రెసాను చూడలేదు. అయితే ప్రస్తుతం కలగలప్పు-2, కథానాయగన్ చిత్రాలతో రానుంది. ముఖ్యంగా కలగలప్పు-2లో ఈ బ్యూటీ తన అందాలతో మోత మోగించనుందనే ప్రచారం జరుగుతోంది. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన క్యాథరిన్ను ఎలాంటి ప్రాతలను ఇష్ట పడుతున్నారంటే చాలా మంది హీరోయన్ల మాదిరిగానే చాలెంజింగ్ అనిపించే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అని చెప్పింది. అయితే హీరోలకు అక్కగానో, చెల్లెలిగానో నటించమంటే మోహమాటం లేకుంటా సారీ అనేస్తానని అన్నది. కథ, పాత్ర బాగుంటే హీరోయిన్గా కాకపోయినా వారికి లవర్ లాంటి పాత్రల్లో గ్లామర్గా నటించడానికైనా రెడీ అని చెప్పింది. క్యారెక్టర్ పాత్రలు చేయడానికి సిద్ధమా? అంటే ఆ వయసుకు తానింకా రాలేదని చెప్పింది. సరే పెళ్లెప్పుడు? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా అందుకు సరైనోడు ఇంకా తారస పడలేదని, నాకు నచ్చిన వాడు దొరికితే అప్పుడు పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని క్యాథరిన్ ట్రెసా చెప్పుకొచ్చింది. -
మెగా అభిమానులకు నిరాశే..!
ప్రస్తుతం టాలీవుడ్లో ధృవ ఫీవర్ నడుస్తోంది. బడా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతుండటంతో రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన గత సినిమా బ్రూస్లీ నిరాశపరచటంతో చరణ్ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్లో మిలియన్ మార్క్ను అందుకోవటంతో పాటు ఓవరాల్గా వందకోట్ల క్లబ్లో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ధృవ విషయంలో మెగా అభిమానులకు నిరాశ తప్పదని తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోల సందడి మొదలవుతుంది. తమ అభిమాన నటుడి సినిమాను అందరికంటే ముందే చూసేందుకు ఫ్యాన్స్ ఎంత రేటు పెట్టైనా టికెట్ కొనేందుకు సిద్ధమవుతారు. అయితే ధృవ విషయంలో మాత్రం నిర్మాత అల్లు అరవింద్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ధృవ సినిమాకు ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవట. ఉదయం ఆరుగంటల తరువాతే తొలి షో వేసేలా ప్లాన్ చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ కారణంగా ముందే టాక్ బయటికి వచ్చేయటంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో సరైనోడు రిలీజ్ సమయంలోనూ బెనిఫిట్ షోలకు నో చెప్పిన అల్లు అరవింద్. ప్రస్తుతం ధృవ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. -
బోయపాటి, బెల్లంకొండ సినిమా మొదలైంది..!
ఈ ఏడాది మొదట్లో సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బోయపాటి శ్రీను ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టలేదు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్గా పేరున్న బోయపాటి, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగినా.. సెట్స్ మీదకు మాత్రం రాలేదు. అయితే శనివారం మరోసారి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారన్న టాక్ వినిస్తోంది. కొత్త ఆఫీస్లో పూజా కార్యక్రమాలతో సినిమా పనులను మొదలపెట్టారు. ఇప్పటికే కథా కథనాలు సిద్ధంగా ఉండటంతో త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఇన్నాళ్లు ఈ ప్రాజెక్ట్పై ఉన్న అనుమానల విషయంలో క్లారిటీ వచ్చినట్టే అని భావిస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ షెడ్యూల్స్కు సంబందించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement