-
ఆ తెలుగు డైరెక్టర్ ప్రేమలో సంఘవి.. దీంతో కెరియరే నాశనమైందా..?
అందాలతో కనువిందు చేస్తూ, అభినయంతోనూ అలరించిన నటి సంఘవి. కావ్య రమేష్గా కర్ణాటకలోని మైసూరులో 1977 అక్టోబర్ 4న పుట్టింది. ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగంలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. తర్వాత ఆయన మరణించడంతో ఆమె కుటుంబం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఆమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో 8వ తరగతి వరకే ఆగిపోయింది. కన్నడ నటి ఆరతి సంఘవి కుటుంబానికి దగ్గరి బంధువు కావడంతో ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల బాల్యంలోనే చదవు ఆపేసి బాల నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా 1993లో ఆమెకు తమిళ హీరో అజిత్ సరసన అమరావతి సినిమాలో హీరోయిన్గా తొలిసారి అవకాశం దక్కింది. అలా ఆమె 90వ దశకంలోని టాప్ హీరోల అందరితోనూ సినిమాలు చేసింది. చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేశ్,జూ. ఎన్టీఆర్, రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో నటించింది సంఘవి. ఆ హీరోతో ప్రేమ వల్ల అవకాశాలు పోగొట్టుకున్న సంఘవి అజిత్ సినిమా తర్వాత తమిళ్ స్టార్ దళపతి విజయ్తో ఆమె జోడిగా సినిమా ఛాన్స్ దక్కింది. ఆ సినిమాకు విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్గా వ్యవహరించాడు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. అయినా కూడా సంఘవి- విజయ్ జోడిగా మూడు సినిమాలను ఆయన డైరెక్ట్ చేశాడు. నాలుగో సినిమా కూడా వారిద్దరితో ప్లాన్ చేసిన చంద్రశేఖర్ షూటింగ్ మధ్యలోనే ఆర్థాంతరంగా ఆపేశాడు. దీనికి ప్రధాన కారణం విజయ్- సంఘవి ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారం రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు కోలీవుడ్లో సినిమా అవకాశాలు రాకుండా పోయాయి. తెలుగులో లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఆ డైరెక్టర్తో ప్రేమ పెళ్లి శ్రీకాంత్తో తాజ్మహల్ సినిమా నిర్మిస్తున్న డి రామానాయుడు సెకండ్ హీరోయిన్ కోసం సర్చ్ చేస్తున్న సమయంలో సంఘవి వచ్చి ఆయన్ను కలవడంతో ఆడిషన్స్ చేసి అలా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సురేష్ ప్రొడక్షన్స్లో సుమారు అరడజనుకు పైగా సినిమాలు చేసింది. ఇదే క్రమంలో చిరంజీవి,వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. అలా ఆమె కెరియర్ టాప్ రేంజ్లో దూసుకుపోతుండగా రాజశేఖర్తో 'శివయ్య' సినిమాలో నటించింది. ఆ సినిమాకు తెలుగు డైరెక్టర్ అయిన సురేష్ వర్మ తెరకెక్కించాడు. సినిమా సమయంలో అతనితో ప్రమలో పడిన సంఘవి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: సీక్రెట్గా బిగ్బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్.. ఎవరా మిస్టరీ మ్యాన్?) ఈ పెళ్లి ఆమె తల్లికి ఇష్టం లేదు అయినా ప్రేమ కోసం ఇంట్లో నుంచి వచ్చేసింది సంఘవి. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత సపోర్టింగ్ యాక్టర్, ఐటెం సాంగ్స్కు మాత్రమే పరిమితం అయింది. ఇలాంటి సమయంలోనే పెళ్లైన ఏడాదికి భార్యభర్తల మధ్య విబేదాలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం సురేష్ వర్మ ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉండటం. అంతేకాకుండా షూటింగ్కు వెళ్లి వస్తున్న సంఘవి పట్ల అతనికి అనుమానం రావడం వంటి కారణాలు అప్పట్లో వచ్చాయి. దీన్ని తట్టుకోలేని సంఘవి అతనికి విడాకులు ఇచ్చేసి తల్లి వద్దకు వెళ్లిపోయింది. అలా టాప్ రేంజ్లో ఉండాల్సిన సంఘవి ప్రేమ పెళ్లితో ఆ అవకాశం చేజార్చుకుంది. పెళ్లి విషయంలో ఎన్నో కష్టాలు విడాకుల తర్వాత సంఘవికి సినిమా అవకాశం వచ్చింది. జూ.ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమాలో ఆమె కనిపించింది. తర్వాత పలు సినిమాలు చేసినా అవి అంతగా మెప్పించకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తల్లి సూచన మేరకు సీరియల్స్లలో నటించింది. అక్కడా ఆమె ఫేట్ మారలేదు. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని ఒక ఎన్ఆర్ఐ సంబంధాన్ని ఆమె తల్లి తెచ్చింది. కొన్ని కారణాల వల్ల అదీ ఆగిపోయింది. అప్పటికే సంఘవికి 39 ఏళ్లు దీంతో ఆమె పెళ్లిపై తల్లికి ఆందోళన పెరగడం. ఎలాగైనా తనకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం ప్రారంభించింది. అలా కర్ణాటకకు చెందిన ఐటీ సంస్థ అధినేత ఎన్ వెంకటేశ్ను 2016లో ఆమె పెళ్లి చేసుకుంది. సంఘవి కన్నడ అమ్మాయి కాగా, వెంకటేశ్ మలయాళీ. 42 సంవత్సరాల వయస్సులో ఆమెకు మొదటి సంతానంగా పాప జన్మించింది. సంఘవి ఆస్తుల విలువ వెంకేశన్తో పెళ్లి తర్వాత ఆమె టీవి సీరియళ్లతో పాటు పలు డ్యాన్స్ షోలకు జడ్జ్గా వ్యవహరించింది. కానీ 2019 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నటి సంఘవి ఈరోజు తన 46వ పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకుంటుంది. కర్ణాటకలోని మైసూరులో భర్తతో ఉంటున్న నటి సంఘవి ఆస్తి సుమారు రూ. 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. -
ఎల్బీనగర్లో దారుణం.. ప్రేమ వ్యవహారమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఇంట్లో ఉన్న అక్కాతమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడి మృతిచెందగా.. అక్కకు తీవ్రగాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు ఓ గదిలో బంధించారు. వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో శివకుమార్ అనే వ్యక్తి.. సంఘవి, పృథ్వీపై కత్తితో దాడి చేశాడు. సంఘవి, శివకుమార్ కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సంఘవితో ఆదివారం మాట్లాడటానికి శివకుమార్ ఎల్బీనగర్కు వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని సంఘవిపై శివ ఒత్తిడి తెచ్చాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆవేశానికి లోనైన శివకుమార్.. సంఘవిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఇంట్లోనే పృధ్వీపై కూడా శివకుమార్ చేయడంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను చూసిన స్థానికులు శివకుమార్ను గదిలో బంధించి.. సంఘవి, పృథ్వీలను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పృథ్వీ మృతిచెందగా.. సంఘవికి చికిత్స అందిస్తున్నారు. అక్కాతమ్ముళ్లు ఇద్దరూ ఎల్బీనగర్లో ఉంటూ చదువుకుంటున్నారు. సంఘవి హోమియోపతి చదువుతోంది, పృథ్వీ బీటెక్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడి శివని అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్ను రామాంతపూర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: సరదాగా ఈతకెళ్లి.. కానరాని లోకాలకు.. -
హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో చూశారా? రీఎంట్రీపై క్లారిటీ!
ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ సంఘవి తెలుగు తెరపై కనిపించక 18 ఏళ్లవుతోంది. ఆమె చివరగా కొలాంజి అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత నటనకు గుడ్బై చెప్పేసి పర్సనల్ లైఫ్కే పూర్తి సమయం కేటాయించింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది కానీ బయట మాత్రం పెద్దగా కనిపించలేదు. అయితే గత నెలలో మాత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సంఘవి. తాజాగా మరోసారి తన కుటుంబంతో కలిసి శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన సంఘవి ప్రస్తుతం జడ్జిగా సినిమాలు చేస్తున్నానని, ఏదైనా మంచి రోల్స్ వస్తే తప్పకుండా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. దీంతో తను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. కాగా సంఘవి అసలు పేరు కావ్యా రమేష్. ఆమె మొదట తమిళంలో అజిత్కు జంటగా నటించిన 'అమరావతి' సినిమాతో చిత్రసీమకు పరిచయమైంది. ఆ తరువాత విజయ్, కార్తీక్ తదితర ప్రముఖ తమిళ హీరోలతో నటించింది. రజనీకాంత్ 'బాబా' చిత్రంలోనూ తళుక్కుమని మెరిసింది. తెలుగులో నాగార్జున, రాజశేఖర్ వంటి ప్రముఖ హీరోలతో జతకట్టి.. అనేక సినిమాలతో అభిమానులను మెప్పించింది. సూర్యవంశం, శివయ్య, సమరసింహారెడ్డి, సీతారామరాజు, మృగరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, ఆంధ్రావాలా.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఆమె నటించిన హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. దక్షిణాది భాషలన్నింటిలోనూ సంఘవి హీరోయిన్గా నటించింది. ఈమె మలయాళీ కుటుంబం నుంచి వచ్చిన ఐటీ సంస్థ అధినేత ఎన్. వెంకటేశ్ను 2016 ఫిబ్రవరి 3న పెళ్లి చేసుకుంది. వీరికి 2020లో కూతురు పుట్టింది. చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్డే పార్టీలో సెలబ్రిటీల హవా లస్ట్ స్టోరీస్ 2 రివ్యూ -
భర్త చనిపోయాక తొలిసారి అలా కనిపించిన మీనా..
బాలనటిగా తెరంగేట్రం చేసిన మీనా ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించి దక్షిణాది ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నటిగా మంచి ఫామ్లో సమయంలో 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప జన్మించింది. ఓపక్క కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాలు చేస్తున్న మీనా జీవితంలో గతేడాది పెను విషాదం చోటుచేసుకుంది. గతేడాది జూన్ నెలలో ఆమె భర్త కన్నుమూశారు. ఎప్పుడూ బిజీగా ఉంటూ ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది మీనా. సినిమాలకు కూడా సైన్ చేసి షూటింగ్స్లో పాల్గొంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ తిరిగి నార్మల్ అవడానికి ట్రై చేస్తోంది. అయితే భర్త చనిపోయాక మొదటిసారి డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. సీనియర్ హీరోయిన్ సంఘవితో కలిసి ఓ పాటకు స్టెప్పులేసింది. దీన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) చదవండి: నీ ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరు: విష్ణుప్రియ రెండుసార్లు బ్రేకప్.. అది బ్లాక్డే అంటున్న బ్యూటీ -
భర్త చనిపోయాక మీనా తొలిసారి ఇలా.. ఫొటో వైరల్
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే భర్త విద్యాసాగర్ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అతడి మరణంతో ఆమె కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. తాజాగా మీనాను పరామర్శించేందుకు సీనియర్ హీరోయిన్స్ రంభ, సంగీత, సంఘవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీనా వారితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త చనిపోయాక మీనా చేసిన తొలి పోస్ట్ ఇది. ఇందులో మీనా నవ్వుతూ కనిపించగా ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. కాగా ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న మరణించారు. ఆయన మరణంతో కుంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. ఇటీవలే ఆమె ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా షూటింగ్లోనూ పాల్గొంది. ఈ సినిమా సెట్స్లో రాజేంద్రప్రసాద్ బర్త్డే సెలబ్రేట్ చేయగా ఆ వేడుకల్లో మీనా తళుక్కున మెరిసింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) చదవండి: మహేశ్కు చిరు, వెంకీల స్పెషల్ బర్త్డే విషెస్ ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement