-
శనీశ్వరాభిషేకం టిక్కెట్కు రెక్కలు
సాక్షి, శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతిరోజూ నిర్వహించే శనీశ్వరాభిషేకం పూజలను రూ.150 నుంచి రూ.300కు పెంచారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పూజలు నిర్వహిస్తారు. శనివారం ఈ పూజను ఎక్కువ మంది భక్తులు చేయించుకుంటారు. ఇటీవల రూ.300 టిక్కెట్ ద్వారా నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు రూ.500కు పెంపుదల చేశారు. ఇక ఆరు నెలల క్రితం రూ.600 టిక్కెట్ ద్వారా నిర్వహించే రుద్రాభిషేకం టిక్కెట్ను రూ.1000కి పెంచిన విషయం తెలిసిందే. అదే క్రమంలో సోమవారం శనీశ్వరస్వామి అభిషేకం టిక్కెట్లు రెట్టింపు చేశారు. ఇదే తరహాలో మరికొన్ని పూజా టిక్కెట్లు పెంపుదల చేస్తారని చర్చ సాగుతుంది. ఇలా పూజా టిక్కెట్లు పెంపుదల చేయడంతో సామాన్య భక్తులు పూజలు చేయించుకోవడం భారంగా మారుతుందని పలువురు విమర్శలు చేస్తున్నారు. -
తొలగిస్తారా? తొలగించమంటారా? : ఎంపీ నాని
తొలగిస్తారా? తొలగించమంటారా? శనైశ్చరస్వామి ఆలయ నిర్వాహకులతో ఎంపీ నాని ఊరిబయట స్థలాలిస్తాం.. అక్కడే నిర్మించుకోండంటూ బేరం బెదిరించైనా స్థలాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం విజయవాడ : నగరంలోని ప్రముఖ ఆలయమైన శనైశ్చరస్వామి దేవస్థానాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇక్కడి దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిని పూర్తిగా తొలగిస్తే.. ఊరిబయట కోరిన గ్రామాల్లో స్థలాలు ఇస్తామని, అక్కడ ఇదే దేవాలయాన్ని నిర్మించుకోవచ్చని నిర్వాహకులను ప్రలోభ పెడుతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తన కార్యాలయానికి ఆలయ నిర్వాహకులను పిలిపించుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం గుడి వల్ల పార్కింగ్కు ఇబ్బంది ఉందని, గొల్లపూడిలో స్థలం కేటాయిస్తాం.. వెళ్లిపోతారా అని నాని నిర్వాహకులను ప్రశ్నించారు. ఇక్కడి ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు అనుమతిస్తే ఊరిబయట మీరు కోరిన గ్రామాల్లో స్థలాలు ఇస్తామని అక్కడ ఇదే దేవాలయాన్ని నిర్మించుకోవచ్చంటూ చెప్పారు. గుడిని తప్పనిసరిగా తీసివేయాలని, మీకు మీరుగా తీస్తారా? మమ్మల్ని తొలగించమంటారా? అని ప్రశ్నించారు. అవసరమైతే పుష్కరాలు ముగిశాక రాజీవ్గాంధీ పార్కుకు సమీపంలో తగిన స్థలం కేటాయించి గుడి నిర్మాణం చేయిస్తామని చెప్పారు. శనైశ్చరస్వామి ఆలయం జోలికి రాబోమని తొలుత హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు మాటమార్చడంతో అవాక్కైన నిర్వాహక కమిటీ దీనికి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో శనైశ్చరాలయాన్ని పూర్తిగా కూల్చివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గోశాల కనుమరుగు? గోశాలలోని 150 గోవులకు ప్రస్తుతం ఇంద్రకీలాద్రి గోడ పక్కగా ఇరుగ్గా ఉండే ప్రదేశాన్ని మాత్రమే ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ ప్రదేశాన్ని కూడా తీసుకుని, గోశాలను కొత్తురు తాడేపల్లికి తరలించేందుకు ఎంపీ కేశినేని శ్రీనివాస్, కలెక్టర్ బాబు.ఎ రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. గోశాల వెనుకవైపు ఇంద్రకీలాద్రిపై కొన్ని ఇళ్లు ఉన్నాయి. వారికి ఎన్టీఆర్ హయాంలో బీఫారం పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాల యజమానులకు ఒక్కొక్కరికి గజం రూ.53 వేలు చొప్పున దుర్గగుడి నుంచి ఇప్పించి వాటిని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఆ ఇళ్లు తొలగించేటప్పుడే గోశాలను పూర్తిగా తొలగిస్తారని మల్లికార్జున పేటలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. గోశాలలోని ఒక వర్గం ఇప్పటికే నాయకుల బెదిరింపులకు లొంగిపోయింది. వీరితోనే చర్చలు జరిపి గోశాలను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. గోశాలను పూర్తిగా కొత్తూరు తాడేపల్లికి తరలించాలంటూ ఇప్పటికే నిర్వహకులపై ఒత్తిడి తెస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement