-
గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ: లాంచింగ్ ముందే హల్చల్,ఐఫోన్కు ఝలక్?
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నెక్స్ట్ గెలాక్సీ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీన జరగనున్న అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఎస్ 23 సిరీస్లో మూడు కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో ఈ సిరీస్ విడుదల కానుంది. ఈ క్రమంలో ధర, డిజైన్, ఫీచర్ల గురించి లీక్లు మొదలయ్యాయి. స్పెసిఫికేషన్ల పరంగా, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ 200ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్తో వస్తోంది. 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, రెండు 10ఎంపీ టెలిఫోటో సెన్సార్తో రియర్ క్వాడ్-కెమెరా మరో ప్రధాన ఆకర్షణ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ ఫీచర్లు 6.8 అంగుళాల 2x డైనమిక్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఆండ్రాయిడ్ 13 One UI 5.0 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 45 వాట్ ఛార్జింగ్ ధర (అంచనా) రూ. 1,14,990 యాపిల్ ఐఫోన్14 ప్రో మాక్స్కు షాక్? అయితే యాపిల్ 14 ప్రో మాక్స్తో పోలిస్తే 8జీబీ ర్యామ్ సహా, 200 ఎంపీ కెమెరా, డిస్ప్లే చివరికి ధర విషయంలో కూడా మెరుగ్గా ఉన్న శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్, యాపిల్కు గట్టి పోటీ ఇవ్వనుందని పలు అంచనాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. -
విముక్తి దినోత్సవం.. ‘శామ్సంగ్’ వారసుడికి అధ్యక్షుడి క్షమాభిక్ష
సియోల్: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వారసుడు లీ సహా ప్రముఖ కార్పొరేట్లు తదితర 1,700 మందికి దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విముక్తి దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రకటించనున్నారు. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక జపాన్ వలస పాలన నుంచి విముక్తి పొందిన రోజును దక్షిణ కొరియా ఏటా ఆగస్ట్ 15న విముక్తి దినోత్సవం జరుపుకుంటుంది. శామ్సంగ్ అనుబంధంగా ఉన్న రెండు సంస్థల విలీనం కోసం 2015లో అప్పటి అధ్యక్షురాలు పార్క్కు ఆ సంస్థ వారసుడైన లీ జే యంగ్ భారీగా ముడుపులు అందజేశారు. ఈయనతోపాటు లొట్టే గ్రూప్ చైర్మన్ షిన్ డాంగ్ బిన్ తదితరుల నుంచి కూడా అధ్యక్షురాలు భారీగా లంచాలు అందుకున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో అధ్యక్షురాలు పార్క్ పదవి నుంచి వైదొలిగారు. ఆమెకు సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెకు గత ఏడాది అధ్యక్షుడు మూన్ క్షమాభిక్ష ప్రకటించారు. 30 నెలల జైలు శిక్ష పడిన శామ్సంగ్ వారసుడు లీకి కూడా గత ఏడాది పెరోల్ లభించింది. తాజాగా, అధ్యక్షుడి క్షమాభిక్షతో మిగిలిన జైలు జీవితం కూడా ముగియనుంది. దేశంలో వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే అధ్యక్షుడు ప్రముఖ వ్యాపారవేత్తలకు క్షమాభిక్షలు ప్రకటించారని దక్షిణ కొరియా న్యాయశాఖ శుక్రవారం పేర్కొంది. -
పేటెంట్కు లేటెందుకు!
అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ సీరియస్గా ఇలా అంటాడు... ‘పేటెంట్ అనేది టెక్నాలజీకి కీ లాంటిది. టెక్నాలజీ అనేది ప్రొడక్షన్కు కీ లాంటిది’ ‘మోస్ట్ సీరియస్ మెన్’గా పేరున్న, మూడువందల పేటెంట్లకు సొంతదారైన సెర్బియన్–అమెరికన్ ఇన్వెంటర్ నికొల టెస్లా చాలా తేలికగా ఇలా అంటాడు... ‘నా ఐడియాను ఎవరో దొంగిలించారు అనే బాధ కంటే, వారికంటూ ఒక ఐడియా ఎందుకు లేదు అనే బాధ నాలో ఎక్కువగా ఉంటుంది’ ... ఎవరు ఎలా అన్నా, ప్రస్తుతం పెద్ద పెద్ద కంపెనీలు పేటెంట్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. మెరికల్లాంటి యూత్తో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ సౌత్ కొరియన్ సాంకేతిక దిగ్గజం శాంసంగ్. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 7,500 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 50 శాతం మన దేశం నుంచే ఉన్నాయి. ఈ పేటెంట్ ఫైలర్స్ ఫస్ట్ టైమ్ ఇన్వెంటర్స్. మిలీనియల్స్, జెన్ జెడ్ను సాంకేతికంగా తీర్చిదిద్దడంలో బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన శ్రీ–బి (శాంసంగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్–బెంగళూరు) బాగా ఉపయోగపడుతుంది. శ్రీ–బికి ప్రత్యేకమైన ఐపీ(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) బృందం ఉంది. ఇది యువతరానికి ఇన్వెన్షన్–క్రియేషన్ ట్రైనింగ్, ఇన్వెన్షన్ ప్రాసెస్కు ఉపకరించే అడ్వాన్స్డ్ ఇన్వెంటివ్ స్టెప్ ట్రైనింగ్ ఇస్తుంది. పేటెంట్ ఫైలింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంటర్నల్ పోర్టల్ ఏర్పాటు చేసింది. వీటిద్వారా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎమర్జింగ్ ఏరియాలుగా చెప్పుకునే 5జీ, ఏఐ, ఐవోటి, కెమెరా అండ్ విజన్ టెక్నాలజీస్కు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయి. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకునే వాటిలో ఎక్కువ భాగం అంకుర సంస్థలుగా మొదలుకావడం విశేషం. ‘యువతరం ఆవిష్కర్తలను చూసి గర్వపడుతున్నాం. ఎదుగుతున్న దశలోనే అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. వారికి శాంసంగ్ అన్ని విధాల అండగా ఉంటుంది’ అంటున్నారు శ్రీ–బి సీటీవో అలోక్నాథ్. ‘కొత్త ఆవిష్కరణల కోసం జరుగుతున్న ఈ ప్రయాణం యువతరం మనస్తత్వానికి తగినట్లుగానే ఆటపాటలతో హుషారుగా సాగుతుంది’ అంటున్నారు శ్రీ–బి డిజైన్ మెనేజర్ స్వాధా జైశ్వాల్. సాంకేతిక జ్ఞానం మాత్రమే కాకుండా ఇన్స్పైరింగ్ స్టోరీలు వినిపించడం ద్వారా యువతరంలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి సంస్థలు. మచ్చుకు ఒకటి... పదిహేనేళ్ల వయసులోనే వైద్యరంగం ముక్కున వేలేసుకునేలా చేశాడు జాక్ అండ్రాక (యూఎస్). ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను ముందుగా, తక్కువ ఖర్చుతో గుర్తించే సాధనానికి రూపలకల్పన చేసి ‘ఐకానిక్ ఇన్వెంటర్ ఆఫ్ జెనరేషన్ జెడ్’గా కీర్తి అందుకున్నాడు జాక్. అయితే జాక్ చదువులో అద్భుతాలు సాధిస్తున్న విద్యార్థి ఏమీకాదు. సాధారణ విద్యార్థే. తన ఆవిష్కరణకు మూలం గూగుల్ అనేది ఆశ్చర్యకరమైన వాస్తవం! తన దగ్గరి బంధువు ఒకరు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో చనిపోయాడు. దీంతో ఆ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆ క్యాన్సర్కు కారణం ఏమిటి? ఏ దశలో గుర్తిస్తున్నారు? పరీక్షలు ఏమిటి? సర్వైవర్ల శాతం ఎంత... మొదలైన విషయాలను గూగుల్ ద్వారా తెలుసుకోగలిగాడు. ‘ఈజీ, చీప్, సింపుల్, సెన్సెటివ్ అండ్ సెలెక్టివ్’ అనే మూలసూత్రంతో రిసెర్చ్ ప్రపోజల్ తయారు చేసుకొని, క్యాన్సర్పై పరిశోధిస్తున్న 200 మందికి పంపించాడు. 199 మంది తిరస్కరించారు. ఒక్కరు మాత్రం ‘బహుశా వీలవుతుందేమో!’ అన్నారు. ఇక జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ(మేరిలాండ్)లో ప్రయోగాలు చేయడానికి అనుమతి అనేది చా...లా కష్టంగా దొరికింది. ఎన్నో అవాంతరాలను తట్టుకొని తన కలను సాకారం చేసుకున్న జాక్ ఇప్పుడు మరికొన్ని కలలు కంటున్నాడు. వాటిని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే జాక్ ది ఒంటరిపోరు. అయితే శ్రీ–బిలాంటి సంస్థల వల్ల కలలు కనే యువతరానికి ఒంటరిపోరు తప్పుతుంది. శక్తిమంతమైన మద్దతు దొరుకుతుంది. -
శామ్సంగ్ టైజెన్- టీవీ ఓఎస్లలో టాప్
సియోల్: గ్లోబల్ టీవీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మార్కెట్లో టైజెన్ అతిపెద్ద ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)గా ఆవిర్భవించినట్లు స్ట్రాటజీ అనలిటిక్స్ పేర్కొంది. టైజెన్ ఓఎస్ను లైనక్స్ ఆధారంగా శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, ఇంటెల్ కార్ప్ అభివృద్ధి చేశాయి. ఈ ఏడాది(2020) మూడో క్వార్టర్లో శామ్సంగ్ టీవీ విక్రయాలు జోరు చూపడం టైజెన్ ఓఎస్కు బూస్ట్ నిచ్చినట్లు టీవీ పరిశ్రమను సమీక్షించే స్ట్రాటజీ అనలిటిక్స్ తెలియజేసింది. తాజా వివరాల ప్రకారం టైజెన్ 12.5 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవం ద్వారా ఇతర ఓఎస్లను వెనక్కి నెట్టినట్లు వెల్లడించింది. ఈ బాటలో ఎల్జీకి చెందిన వెబ్ ఓఎస్, సోనీ ప్లేస్టేషన్, రోకు టీవీ ఓఎస్, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ అండ్రాయిడ్ ప్రధాన ఓఎస్లుగా నిలిచినట్లు పేర్కొంది. చదవండి: (3 నిముషాలకు టిక్టాక్ వీడియోలు!) 1.18 కోట్లు ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో ప్రపంచవ్యాప్తంగా శామ్సంగ్ 1.18 కోట్ల స్మార్ట్ టీవీలను విక్రయించినట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఏ ఇతర కంపెనీ అమ్మకాలకంటే ఇవి ఎక్కువకాగా.. దీంతో 15.5 కోట్ల టైజెన్ ఓఎస్ స్మార్ట్ టీవీలు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నట్లు వివరించింది. గతేడాదితో పోలిస్తే ఇది 23 శాతం వృద్ధిగా తెలియజేసింది. ప్రపంచంలోనే టీవీ విక్రయాలలో తొలి ర్యాంకులో ఉన్న శామ్సంగ్కు టైజెన్ కొత్త ఆదాయ వనరుగా నిలుస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల పలువురు వినియోగదారులు సంప్రదాయ పే చానళ్లు, ప్రసార ప్లాట్ఫామ్స్ నుంచి స్ట్రీమింగ్ సర్వీసులకు మళ్లుతున్నట్లు తెలియజేసింది. ఫలితంగా ఇటీవల శామ్సంగ్ ప్రకటనదారులు, కంటెంట్ ప్రొవైడర్లను ఆకట్టుకునే ప్రణాళికలు అమలు చేస్తోంది. తద్వారా వేగంగా ఎదుగుతున్న టైజెన్ను టీవీ ప్రకటనల విభాగంలో నాయకత్వ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 8.13 కోట్లు ప్రపంచవ్యాప్తంగా క్యూ3లో స్మార్ట్ టీవీలు, మీడియా స్ట్రీమర్లు, గేమింగ్ కన్సోల్స్ తదితర కనెక్టెడ్ టీవీ డివైస్లు 8.13 కోట్లకు చేరినట్లు స్ట్రాటజీ అనలిటిక్స్ వెల్లడించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 19 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కారణంగా హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో భారీ డిమాండ్ నెలకొనడం ఇందుకు సహకరించినట్లు తెలియజేసింది. దీంతో 2020 డిసెంబర్కల్లా 7 శాతం వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల కనెక్టెడ్ టీవీ డివైసెస్లు వినియోగంలోకి రానున్నట్లు అభిప్రాయపడింది. -
జూన్కల్లా శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 ఫోన్
ముంబై, సాక్షి: వచ్చే జూన్కల్లా గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 పేరుతో ప్రీమియం స్మార్ట్ఫోన్ను శామ్సంగ్ విడుదల చేయనున్నట్లు దక్షిణ కొరియన్ అజు న్యూస్ పేర్కొంది. ఈ ఫోల్డబుల్ ఫోన్.. ఎస్ పెన్ సపోర్ట్తో లభించనున్నట్లు తెలియజేసింది. తద్వారా ప్రీమియం విభాగంలోని గలాక్సీ నోట్ సీరిస్ ప్రొడక్టులను ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్.. నిలిపివేసే అవకాశముట్లు అభిప్రాయపడింది. ఆధునిక టెక్నాలజీలతో కూడిన అంటే.. ఎస్ పెన్(ఎలక్ట్రానిక్ పెన్) సపోర్ట్తోపాటు.. అండర్ డిస్ప్లే కెమెరా(యూడీసీ) ఫీచర్ను సైతం జెడ్ ఫోల్డ్3లో ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఆధునిక సాంకేతికలో భాగంగా కెమెరాను ఓలెడ్ స్ర్కీన్ అడుగుభాగాన అమర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో కెమెరాకు డిస్ప్లేలో హోల్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదని వివరించింది. యూడీసీ ఫీచర్తో జెడ్ ఫోల్డ్3 స్క్రీన్ ట్యాబ్లెట్ పీసీని పోలి ఉంటుందని అభిప్రాయపడింది. పెద్ద డిస్ప్లేలు.. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ వచ్చే జనవరిలో విడుదల చేయ తలపెట్టిన గలాక్సీ ఎస్21 అల్ట్రా(అంచనా)లోనూ ఎస్ పెన్ ఫీచర్ను అందించనున్నట్లు అజు న్యూస్ పేర్కొంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల డిస్ప్లేలో లభించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గలాక్సీ ఎస్ 21 సిరీస్లో 3 ఫోన్లను 2021 జనవరి నుంచీ విడుదల చేసే వీలుట్లు తెలియజేసింది. ఎస్21 6.2 అంగుళాలు, ఎస్21 ప్లస్ 6.7 అంగుళాల స్క్రీన్లతో విడుదలకానున్నట్లు వెల్లడించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ
మట్టపల్లిలో నిత్యకల్యాణం
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
‘నీట్’కు 997 మంది హాజరు
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఉరుములు.. మెరుపులు
వంటింట్లో ధరల మంట!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement