-
IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. నిలకడైన ఆటతీరుతో కెరీర్ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లో రచిన్ 10 మ్యాచ్లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్గా ఎదగడం ఖాయం. సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై) ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది. ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. యూపీ టి20 లీగ్లో కాన్పూర్ సూపర్స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు. వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై) గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్తో కొయెట్జీ గత వన్డే వరల్డ్కప్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్గా కొయెట్జీని చూడవచ్చు. ఆల్రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్) 2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్గా అవతరించింది. గత ఏడాది రన్నరప్గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్కు ఆల్రౌండర్ కొరత ఏర్పడింది. ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్కప్లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్) మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్ను తీసుకుంది. లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో) ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్ను రూ. 3 కోట్లకు తీసుకుంది. -
శివాజీకి కూతురు ఉంది.. బయటపెట్టిన సమీర్
శివాజీ.. ఒకప్పుడు మంచి నటుడు.. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి మురికిపట్టిపోయాడు. స్వార్థపరులకు, అవకాశవాదులవైపు నిలబడి అందరితో ఛీ కొట్టించుకున్నాడు. ఫలితంగా జనాల్లో ఆదరణ తగ్గిపోయింది. అవకాశాలు దూరమయ్యాయి. ఇంట్లో ఖాళీగా ఉంటున్న సమయంలో బిగ్బాస్ ఛాన్స్ రావడంతో ఓకే చెప్పాడు. అలా బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్నాడు. ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను, అబద్ధం చెప్పను.. అసలు అబద్ధం అంటే ఎలా ఉంటుందో తెలీదన్నట్లుగా పోజు కొడుతుంటాడు శివాజీ. పీక మీద కాలేసి తొక్కుతా.. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేది చిల్లర పనులు అన్నట్లుగా ఈయన చెప్పేది ఒకటుంటుంది.. వాస్తవం మరొకటి ఉంటుంది. ఈ మధ్య అతడు షోలో ఆడవాళ్ల గురించి పిచ్చి కూతలు కూశాడు. శోభ కోపంతో అరిచినందుకుగానూ.. అలాంటి అమ్మాయిలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడిని.. రెండు పీకేవాడిని.. అంటూ నోటికొచ్చింది వాగాడు శివాజీ. అలా అపడం తప్పని నాగార్జున చెప్పినా వినిపించుకోలేదు. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే పీక మీద కాలేసి తొక్కుతావా? అని నాగ్ నిలదీస్తే.. అవును.. ఇలాగే ప్రవర్తిస్తా.. రెండు పీకుతా అని దురుసుగా సమాధానమిచ్చాడు. ఎవరికీ తెలియని విషయం చెప్పిన సమీర్ ఆఖరికి ఆడియన్స్ కూడా అలా కాలేసి తొక్కుతాననడం నచ్చలేదని చెప్తున్నా.. తనను తాను సమర్థించుకున్నాడే తప్ప తప్పును అంగీకరించడానికి ఇష్టపడలేదు. హౌస్లో ఉన్న ప్రియాంక, శోభను కూడా ఎప్పుడూ చులకన చేసి మాట్లాడుతూ ఆడవారి పట్ల తనకెంత చులకన భావం ఉందనే విషయాన్ని బయటపెడుతూనే వచ్చాడు. ఈ నేపథ్యంలో బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు సమీర్.. శివాజీ గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు ఉందని చెప్పాడు. శివాజీకి కూతురు ఉందా? ఈ విషయం తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎందుకంటే శివాజీ.. ఇప్పటివరకు తనకు ఇద్దరు కొడుకులు మాత్రమే సంతానం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడా తనకు కూతురు ఉన్నట్లు ప్రస్తావించలేదు. బిగ్బాస్ షోలోనూ పెద్ద కొడుకు ఫ్యామిలీ వీక్లో హౌస్లోకి వెళ్లాడు. అలాగే సండే ఎపిసోడ్లో శివాజీ భార్యతో పాటు చిన్న కొడుకు స్టేజీపై కనిపించారు. కానీ కూతురు ప్రస్తావన, ఉనికి మాత్రం ఎక్కడా లేదు. నెటిజన్ల డౌటానుమానాలు అయితే ఇన్నాళ్లూ శివాజీ గుట్టుగా దాచిన తన కూతురి విషయాన్ని బయటపెట్టాడు సమీర్. ఓ ఇంటర్వ్యూలో సమీర్ మాట్లాడుతూ.. శివాజీకి ఓ కూతురు ఉందన్నాడు. దీంతో యాంకర్.. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు ఉందా? అని తిరిగి ప్రశ్నించగా.. అవును, అతడికి ఓ కూతురు కూడా ఉందని నొక్కి చెప్పాడు. మరి శివాజీ ఆ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు? తన కూతురి గురించి ఇంతవరకు ఎక్కడా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అని నెటిజన్లు రకరకాలుగా అనుమానిస్తున్నారు. చదవండి: Adhik Ravichandran Marriage Photos: ప్రముఖ డైరెక్టర్తో ప్రభు కూతురి రెండో పెళ్లి.. విశాల్ స్వీట్ వార్నింగ్.. -
'వీళ్లతో మాట్లాడాక.. హాయ్ పెడతా'.. 24 గంటల్లోనే వీడిన మిస్టరీ..
జగిత్యాల: ‘నేను వీళ్లతో మాట్లాడుతున్న.. తర్వాత నీకు హాయ్ పెడత.. అప్పుడు ఫోన్ చెయ్’ అని ఓ వివాహితకు పెట్టిన చివరి వాయిస్ మేసేజ్ సమీర్ హత్య కేసు నిందితులను పట్టించింది. బుధవారం రాత్రి కనిపించకుండా పోయిన పట్టణానికి చెందిన సమీర్(25) మృతదేహం పట్టణ శివారులోని ఎస్సారెస్పీ డీ–40 కెనాల్లో లభించడం కలకలం రేపింది. యువ కుడి మృతదేహం లభించిన 24 గంటల వ్యవధిలోనే సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై కిరణ్.. నిందితులను అదుపులోకి తీసుకోవడం విశేషం. వివాహితతో సాన్నిహిత్యం.. ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న షేక్ సమీర్ కొంతకాలంగా ఓ వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో ఇప్పటికే సన్నిహితంగా ఉండే మరో వ్యక్తికి ఇది నచ్చలేదు. దీంతో తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సంగెం మెయిన్ కెనాల్కు అనుబంధంగా ఉన్న డీ–40 కెనాల్ వద్దకు వచ్చిన ఇద్దరు.. సమీర్తో గొడవ పడ్డట్లు సమాచారం. ఈ సమయంలోనే సమీర్.. తాను ‘హాయ్’ పెట్టేవరకు ఫోన్ చేయద్దని సదరు వివాహిత ఫోన్కు వాయిస్ మేసేజ్ పంపినట్లు సమాచారం. సమీర్తో గొడవ పడ్డ ఇద్దరు అతడిని హతమార్చి మోటార్సైకిల్తో సహా మెయిన్ కెనాల్లోకి తోసేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డీ–40 కాలువలో సమీర్ మృతదేహం కొట్టుకువచ్చి ఇటుక బట్టీల వద్ద తేలింది. సమీర్ బావ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. వాయిస్ మేసేజ్ ఆధారంగా విచారణ చేసి సమీర్ హత్యలో పాలుపంచుకున్న ఇద్దరిని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని విచారించిన సీఐ ప్రవీ ణ్కుమార్, ఎస్సై కిరణ్.. శనివారం ఉదయం సంగెం మెయిన్ కెనాల్లో సమీర్ తీసుకెళ్లిన మోటార్సైకిల్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మొత్తమ్మీద 24 గంటల వ్యవధిలోనే పోలీసులు సమీర్ హత్యోదంతంలో మిస్టరీని ఛేదించారు. -
బీఆర్ఎస్, బీజేపీలకు కార్మికలోకం బుద్ధి చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఫ్యూడల్, కేంద్రంలోని కేపిటలిస్టు ప్రభుత్వాల కుట్రలో కార్మికులు పడొద్దని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పి) నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హక్కులను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు కార్మికలోకం సిద్ధం కావాలని కోరారు. ఆదివారం ఇక్కడి గాంధీభవన్లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ (కేకేసీ) రాష్ట్ర చైర్మన్ సమీర్ కౌశల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రూ.10 వేల కోట్ల సెస్ నిధులను కార్మికుల కోసం ఖర్చు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని, ఔట్సోర్సింగ్ విధానంలో కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి కార్మికులు గుణపాఠం చెప్పాలని భట్టి కోరారు. త్వరలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. సమావేశం వేదికపైకి తమను ఆహ్వానించలేదంటూ ఐఎన్టీయూసీ నేతలు ఆందోళనకు దిగారు. వీరికి సర్దిచెప్పి సమావేశాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, కేకేసీ చైర్మన్ డాక్టర్ ఉదిత్రాజ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్కుమార్గౌడ్, అంజన్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రేను కార్మికనేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. -
పాస్ వర్డ్ పిన్ అవసరం లేకుండానే ఫోన్ పే పేమెంట్స్...
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెరుగైన వైద్యసేవలు అందించాలి
కనీసం ఇలాంటప్పుడైనా చెప్పుకోవడానికి మీరు ఏదైనా చేసుంటే బావుండేద్సార్!
నిలకడగా శిశువు ఆరోగ్య పరిస్థితి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోంది
పోలింగ్ సమయం గంట పెంపు
పాంచ్ న్యాయ్తో అన్ని వర్గాలకు న్యాయం
9 నుంచి కల్యాణ బ్రహ్మోత్సవాలు
ప్రశాంతంగా నీట్
మట్టి మాయగాళ్లు
మీటర్ మోగుతోంది!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement