-
సమైక్యమే లక్ష్యంగా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర కోరుతూ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడో రోజైన గురువారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణ లో రాష్ట్రవిభజనకు నిరసనగా వైఎస్సార్సీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహారదీక్షలు మూడోరోజూ కొనసాగాయి. దీక్షను పార్టీ నాయకుడు కేవీజీ సత్యనారాయణ ప్రారంభించగా, పార్టీ నాయకులు జి.శ్రీనివాసరావు, బి.మల్లేశ్వరరావు, జి చలపతిరావు, కె.మార్కాండేశ్వరరావు, కె.ఎర్రయ్య, ఎం. నీలయ్య, పి.వెంకటరమణ, ఎస్.వేణుగోపాలరావులు కూర్చున్నారు. వీరికి పట్టణయూత్ కన్వీనర్ డి.అప్పలనాయుడు, పార్టీ నాయకుడు డి.శ్యామలరావు తదితులు సంఘీభావం తెలిపారు. పాతపట్నం: సమైక్యాంధ్రాను కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో నిరాహారదీక్షలను కొనసాగించారు. హిరమండలం మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గేదెల జగన్మోహనరావు, రేగాన మోహనరావు, వి.చిరంజీవులు, పతివాత తిరుపతిరావులతో పాటు పాతపట్నం మండలానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. టెక్కలి: పార్టీ అధిష్టానవర్గం పిలుపు మేరకు సంతబొమ్మాళిలో రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ నాయకురాలు దువ్వాడ వాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా జైజగన్ నినాదాలతో దీక్షా శిబిరాన్ని కొనసాగించారు. నాయకులు చింతాడ గణపతి, కోత మురళీ, దవళ రమేస్, శిమ్మ సోమేష్లు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం: రాష్ట్రాన్ని విడదీయడానికి వీల్లేదని రాష్ట్ర విభజన బిల్లును వెనక్కు తీసుకోవాలని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజవర్గ నాయకులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పార్టీ సోంపేట మండల కన్వీనర్ పిన్నింటి ఈశ్వరరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బస్వా శ్రీను, పార్టీ నాయకులు నిట్ట గోపాల్, రాపాక రామారావు, సునీల్ కుమార్ మండల్, గానాల దుర్యోధన, పి.శ్యామ్ పాల్గొన్నారు. వీరికి మున్సిపల్, మండల కన్వీనర్లు పిలక పోలారావు, కారంగి మోహనరావు, ఎం.వెంకటరెడ్డి, తదితరులు సంఘీబావం తెలిపారు. రాజాం: రాజాంలో మూడో రోజు దీక్షలు కొనసాగాయి. దీక్షల్లో పాల్గొన్నవారు రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు, మండల కన్వీనర్ బి.అచ్చిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘సమైక్య’ ఉద్యమానికి ఊపిరి
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ను అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షలు కొనసాగిస్తోంది. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు వ్యతిరేకంగా ఊరూరా సమైక్య ఉద్యమాలటకు ఊపిరి పోస్తోంది. విభజన వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల్లో సమైక్య స్ఫూర్తిని నింపుతోంది. జిల్లాలో బుధవారం కూడా వైఎస్ఆర్ సీపీ నాయకుల దీక్షలు కొనసాగాయి. ప్రజలను ఉద్యమంలో భాగస్వాములు చేస్తూ నాయకులు సమైక్య పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. బొబ్బిలి, న్యూస్లైన్: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షలు కొనసాగిస్తోంది. ఆ పార్టీ నాయకులు బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లోనూ, మండలాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి సమైక్య నినాదాలు చేశారు. బొబ్బిలిలో దక్షిణి దేవిడి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని పాత బొబ్బిలి గ్రామంలోని ఒకటి, రెండు, మూడు వార్డులకు చెందిన సుమారు వంద మంది వరకూ దీక్షల్లో కూర్చున్నారు. వీరికి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర సాధన కోసం కట్టుబడి ఉండే పార్టీకి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని కోరారు. సమైక్యాంధ్ర ముసుగులో ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. దీక్షలో ఆ వార్డులకు చెందిన కూరాకుల సంఘ ఉత్తరాంధ్ర నాయకుడు కోట పెదరాములు, మాజీ కౌన్సిలరు కోట అప్పారావు, మింది గుంపస్వామి, తోట కబీరుదాసు, పుప్పాల ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో ఆ పార్టీ నాయకుడు అవనాపు విక్రమ్ ఆధ్వర్యంలో రెండో రోజు దీక్షలు జరిగాయి. కొనిశ బంగ్రారాజు, పి.చిన్నప్పన్న, క్రిస్టఫర్ రాజు, కమలమ్మ, వెంకటరెడ్డిలకు విక్రమ్ పూలమాలలు వేసి అభినందించారు. కార్యక్రమంలో నామాల సర్వేశ్వరరావు, బుగత ముత్యాలమ్మ, రాంబార్కి సత్యం, సియ్యాదుల శేఖర్, సంతోష్ తదితరులు ఉన్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జిల్లా మైనార్టీ సెల్ కన్వినర్ షేక్ రహ్మాన్ నేతృత్వంలో రిలే నిరాహార దీక్షల శిబిరం రెండో రోజూ కొనసాగింది. సీతంపేట గ్రామానికి చెందిన చిప్పాడ సత్యన్నారాయణ, నౌదాసరి అప్పారావు, ఎలమంచిలి సోమునాయుడు, నౌదాసరి నర్సింగరావు, ఎలమంచిలి అప్పారావు, సరిత అప్పారావులు దీక్షల్లో కూర్చున్నారు. జిల్లా మైనార్టీసెల్ కన్వీనర్ షేక్ రహ్మాన్తో పాటు మండల కన్వీనర్ ఎస్.సత్యం తదితరులు వారికి సంఘీభావం తెలిపారు. అలాగే పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు కోళ్ల గంగాభవానీ కూడా లక్కవరపుకోటలో దీక్ష చేపట్టారు. గజపతినగరం నియోజకవర్గంలో సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, మ క్కువ శ్రీధర్, డాక్టరు పెద్దినాయుడుల ఆధ్వర్యంలో శిబిరాలు జరిగాయి. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రెండో రోజు దీక్షను సమన్వయకర్త మీసాల వరహాలనాయుడు ప్రారంభించారు. నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో జనా ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో మహిళలు పాల్గొన్నారు. పార్టీ నాయకుడు పెనుమత్స సురేష్ బాబు వీరికి సంఘీభావం తెలిపారు. అన్ని దీక్షా శిబిరాల వద్ద నాయకులు సమైక్య నినాదాలతో హోరె త్తించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్ఆర్ సీపీ మాత్రమే పోరాడుతోందని స్పష్టం చేశారు. భవిష్యత్లోనూ పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు, కార్యకర్తలు తెలిపారు. -
జిల్లా వ్యాప్తంగా సమైక్య దీక్షలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేసి నరసన తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే సహించమని హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కదలివచ్చారు. శ్రీకాకుళం: తహశీల్దారు కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలను వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యురాలు, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయ కర్త వరుదు కల్యాణి ప్రారంభించారు. సమైక్య నినాదాలు చేశారు. పార్టీ నాయకులు మార్పు ధర్మారావు, అందవరపు సూరిబాబు, శ్రీనివాస్పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. టెక్కలి: పార్టీ నాయకురాలు దువ్వాడ వాణి ఆధ్వర్యంలో టెక్కలి వైఎస్ఆర్ కూడలిలో రిలే దీక్షను ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. పార్టీ నాయకులు సంపతిరావు రాఘవరావు, తిర్లంగి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు. పలాస: కాశీబుగ్గ బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. నియోకజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావుతో పాటు నాయకులు డబ్బీరు భవానీశంకర్, బోనెల రాము, నర్తు ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. పలాస-కాశీబుగ్గ పట్టణాల్లోని మదర్థెరిసా కాన్సెప్ట్ స్కూల్, శ్రీ గురుకుల విద్యాలయం, విద్యావాహిని, షిర్డీసాయి డిగ్రీ కళాశాల, బీఈటీ స్కూల్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇచ్ఛాపురం: నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన దీక్షా శిబిరంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీ జిల్లామహిళా కన్వీనర్ బి.హేమామాలిని రెడ్డి, ఎన్ఆర్ఐ బల్లాడ రవికుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాతపట్నం: పాతపట్నం వైఎస్సార్ విగ్రహం ముందు రిలే నిరాహార దీక్షను పార్టీ నాయకులు చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ శిబిరాన్ని ప్రారంభించగా.. మండల యూత్ అధ్యక్షుడు బి.వసంతరావు, మండల కన్వీనర్ కె. అర్జునరావు పాల్గొన్నారు. రాజాం: రాజాం వైఎస్సార్ విగ్రహ కూడలి వద్ద పార్టీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. ఆమదాలవలస: స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణంలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షలో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్రావు, బొడ్డేపల్లి మాధురి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల: రణస్థలం మండల పరిషత్ కార్యాలయ సమీపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు టంపాల సీతారాం పాల్గొన్నారు. -
‘సమైక్య’ దీక్షలు
బొబ్బిలి, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన ప్రక్రియకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు విభజనను వ్యతి రేకిస్తూ.. రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యమని నినదించారు. బొబ్బిలి పట్టణంలో మొదటి రోజు సుమారు 70 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. పట్టణానికి చెందిన 4, 5 వార్డులతో పాటు గొల్లపల్లి గ్రామస్తులు శిబిరంలో కూర్చున్నారు. వారికి ఆ పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు, అరుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకు లు సుజయ్, సాంబశివరాజు మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకూ పోరాటాన్ని ఆపేది లేదన్నా రు. నెల్లిమర్లలో చేపట్టిన దీక్షలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, సింగుబాబు, సేవాదళ్ జిల్లా కన్వీనరు తూముల రాంసుధీర్, మాజీ కౌన్సిలర్లు, వార్డుస్థాయి నాయకులు పాల్గొన్నారు. విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాళ్ల గౌరీశంకర్, శిరువురి పార్వతి, రాంబార్కి సత్యం, గండికోట శాంతి, బుగత ముత్యాలమ్మ, తదితరులు పాల్గొన్నారు. గజపతినగరంలో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద డాక్టర్ పెద్దినాయుడు, మక్కువ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా శిబిరానికి పార్టీ జిల్లా కన్వీనరు సాం బశివరాజు సంఘీభావం తెలిప ారు. అలాగే బీఎస్ఆర్ ఆస్పత్రి ముందు సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. ఎస్. కోటలో జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ రెహ్మాన్, పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు కోళ్ల గంగాభవాని ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. చీపురుపల్లిలో సమన్వయకర్త మీసా ల వరహాలనాయుడు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల కన్వీనర్లు మీసాల అప్పలనాయుడు, సీహెచ్ సత్యనారాయణ రెడ్డి, కెల్ల సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.సాలూరులో మున్సిపల్ మాజీ చైర్పర్సన్, రాష్ర్ట మహిళా సభ్యురా లు ముగడ గంగమ్మ, మంచాల వెంకటరమణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. -
వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య దీక్ష
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement