-
రూరల్ పోలీస్ కనుమరుగు
కమిషనరేట్ పరిధిలో హన్మకొండ, వరంగల్ జిల్లాలు సీనియర్లకు కొత్త జిల్లాల బాధ్యతలు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన డీజీపీ సాక్షి, హన్మకొండ : జిల్లాల పునర్విభజనతో వరంగల్ రూరల్ పోలీసు విభాగం కనుమరుగు కానుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రూరల్ విభాగాన్ని తీసుకురావాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వరంగల్ పోలీస్ కమిషరేట్, వరంగల్ రూరల్ పోలీసు జిల్లాల పునర్విభజన ప్రక్రియను సోమవారం డీజీపీ అనుగార్శర్మ వీడి యో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. వరంగల్ డీ ఐజీ రవివర్మ, వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్కిశోర్ఝా ఇ తర పోలీసు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. విస్తరించనున్న కమిషనరేట్ వరంగల్ జిల్లాను వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో వరంగల్ కమిషనరేట్, వరంగల్ రూరల్ పోలీసు విభాగాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో ఉన్న కమిషనరేట్ ప్రాంతా న్ని మినహాయించి మిగిలిన ప్రాంతాలకు రూరల్ విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక భారంతో పాటు పాలన పరంగా చిక్కుముడులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. దీంతో రూరల్ ప్రాంతం మొత్తాన్ని కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 19 సాధారణ పోలీస్ స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్ స్టేషన్, ఒక క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 41 సాధారణ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్, క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. త్వరలో ఈ రెండు విభాగాలు కలిసిపోనున్నాయి. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాలోని ఐదు మండలాలు ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలో కలుస్తున్నాయి. ఈ ఐదు మండలాల్లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటికి కూడా వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో విలీనం కానున్నాయి. పోలీసుశాఖ తాజాగా తీసుకున్న నిర్ణయం అమలైతే వరంగల్ రూరల్ పోలీసు విభాగం కనుమరుగు అవుతుంది. పోలీసు శాఖ తాజా నిర్ణయంతో వరంగల్ కమిషనరేట్ పరిధి విస్తరించనుంది. కమిషనరేట్ పరిధిలో 20 లక్షలకు పైగా జనాభా ఉంది. కొత్త స్టేషన్లు నాలుగు.. ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలో కొత్తగా కాజీపేట, ఖిలావరంగల్, వేలేరు, చిల్పూరు, ఇల్లందకుంట, ఐనవోలు మండలాలు ఏర్పాటవుతున్నాయి. వీటిలో ఖిలావరంగల్, కాజీపేట ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసు స్టేషన్లు ఉన్నాయి. దీంతో స్టేషన్లు లేని నాలుగు మండలాల్లో దసరా నాటికి కొత్త స్టేషన్లు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు బాస్ ఆదేశాలు జారీ చేశారు. ఇవి ప్రారంభమైతే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి మొత్తం 76 పోలీసు స్టేషన్లు వస్తాయి. ఎస్పీ క్యాంపునకు ఇబ్బందులు మహబూబాబాద్, జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలకు కొత్తగా పోలీసు శాఖ పరంగా ప్రత్యేక కార్యాలయాలు, క్యాంపు ఆఫీసులకు సంబంధించిన భవనాల ఎంపిక, మౌలిక సదుపాయల కల్పనపై చర్చించారు. మహబూబాబాద్ ఎస్పీ ఆఫీసుగా ఐటీఐ భవనాన్ని, ఎస్పీ క్యాంపు ఆఫీసుగా పట్టణంలో ఓ అద్దె భవనాన్ని ఎంపిక చేశారు. ఇక జయశంకర్ జిల్లాలో మైనింగ్ ఓకేషనల్ సెంటర్ భవనాన్ని ఎస్పీ కార్యాలయంగా మార్చనున్నారు. ఎస్పీ క్యాంపు ఆఫీసుగా సింగరేణి అధికారులకు కేటాయించే ఎన్–ఏ టైపు క్వార్టర్ను ఇవ్వనున్నారు. సింగరేణి కమ్యూనిటీ హల్లో ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా రెవెన్యూ అధికారులు ఇదే భవనం కోసం పట్టుబడుతున్నారు. పాలనపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా ప్రస్తుతం ఎస్లాబ్లిష్మెంట్ విభాగంలో సీనియర్ సిబ్బందిని కొత్త జిల్లాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. -
పెళ్లి పేరుతో నమ్మించి బాలికపై అత్యాచారం
మండ్య : పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగమంగల తాలూకా శికారిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు... గత ఏడాది డిసెంబర్ 25న శికారిపురకు చెందిన సంజయ్(28) అదే గ్రామానికి చెందిన బాలిక(14)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఇటీవల ఆ బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో గ్రామీణ పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తమం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సంజయ్ను అరెస్ట్ చేశారు. గతంలో సంజయ్కు ఓ యువతిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చినట్లు సమాచారం. -
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న4 ట్రాక్టర్లు సీజ్
ఖమ్మం: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. భద్రాచలం మండలం గొమ్ముకొత్తగూడెం ఇసుక ర్యాంప్ నుంచి ఇసుక మాఫియా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. -
విశాఖ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రూరల్ పోలీసులకు అమెరికాలోని అంతర్జాతీయ పోలీసు అధిపతుల సంఘం(ఐఏసీపీ) ప్రకటించిన హోంల్యాం డ్ సెక్యూరిటీ ప్రత్యేక గుర్తింపు అవార్డు లభించింది. దీనిని ఆ జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎ.వెంకటరావులు సంయుక్తంగా అందుకున్నారు. అమెరికాలో గతవారం జరిగిన కార్యక్రమంలో వీరికి దీనిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరినీ డీజీపీ జేవీ రాముడు బుధవారం అభినందించారు. విశాఖ జిల్లాలో మావోయిస్టుల్ని సమర్థంగా నియంత్రించడం, గిరిజనులకు ఉపాధి కల్పించి సేవలందించినందుకు రూరల్ పోలీసులకు ఈ అవార్డు లభించింది. -
వీడిన యువకుడి హత్య మిస్టరీవనపర్తి
రూరల్: ఈనెల 17న మండలంలోని నాగవరం శివారులో వెలుగుచూసిన ఓ యువకుడి దారుణహత్య మిస్టరీని వనపర్తి రూరల్ పోలీసులు ఛేదించారు. హత్యకుగురైన మణ్యంను అతడి సోదరుడే(చిన్నాన కొడుకు)హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం వనపర్తి రూరల్ పోలీస్స్టేషన్లో సీఐ మధుసూదన్రెడ్డి వెల్లడించారు. మృతుడు మణ్యం, వనపర్తి పట్టణ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న రాఘవేందర్ వరుసకు అన్నదమ్ములు. రాఘవేందర్ సొంత తమ్ముడు భాస్కర్ గత మార్చిలో ఆత్మహత్యకు పాల్పడగా.. దీనికి మణ్యమే కారణమని అతని భావించాడు. దీంతో మణ్యంపై మరింత కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హతమార్చాలని తలంచి తనభార్య తరఫు బంధువులు, కొత్తకోట మండలం మదనాపురం గ్రామానికి చెందిన వల్లెపు కురుమూర్తి, ద్యారంగుల మణికంఠ, కుంచెపు కురుమూర్తిలతో హత్యకు వ్యూహరచన చేశాడు. ఈనెల 16న రాత్రి మణ్యంతో కలిసి మద్యం సేవించారు. ఇంతలో పక్కనే ఉన్న మణ్యంను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. పట్టించిన ఫోన్కాల్ రంగంలోకి దిగిన పోలీసులు మణ్యం దారుణహత్య కంటే ముందు అతని ఫోన్కు వచ్చిన నంబర్లను సేకరించారు. పథకం ప్రకారం మణ్యంను లక్ష్యంగా చేసిన హోంగార్డు రాఘవేందర్ ముందస్తుగా తనఇంటి పక్కనే నివాసం ఉండే చెన్నమ్మ అనే మహిళగుర్తింపుకార్డుతో ఒక సిమ్కార్డును తీసుకున్నాడు. ఆ నంబర్ నుంచి కేవలం మణ్యంతో మాత్రమే మాట్లాడేవాడు. మణ్యం హత్య తరువాత ఈ నంబర్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు. చివరికి రాఘవేందరే నిందితుడని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన కత్తులు, మద్యం సీసాలను పోలీసులు చూపించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. హత్యకేసును ఛేదించిన వనపర్తి రూరల్ ఎస్ఐ నాగశేఖర్రెడ్డి, రాయుడు, కృష్ణసాగర్, రాంచందర్కు వనపర్తి డీఎస్పీ జోగు చెన్నయ్య రికార్డు అందజేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement