-
యాంబీ వ్యాలీకి రూ.24,647 కోట్ల ఐటీ నోటీస్!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్నకు చెందిన యాంబీ వ్యాలీ లిమిటెడ్కు ఆదాయపు పన్ను శాఖ రూ.24,647 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ అకౌంట్ల ప్రత్యేక ఆడిట్ అనంతరం కొద్ది నెలల క్రితం ఈ నోటీసులు జారీ ఆయ్యాయి. సహారా గ్రూప్ ప్రతినిధి తాజాగా ఈ పరిణామాన్ని ధ్రువీకరించారు. 2012–13 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించి రూ.48,086 కోట్ల ఆదాయం సంస్థ రికార్డ్ బుక్స్లో ప్రతిబింబించలేదని సంబంధిత ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. దీనితో పన్ను, జరిమానాగా ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సహారాకు చెందిన రెండు గ్రూప్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్ల సమీకరణ, పునఃచెల్లింపుల్లో (వడ్డీసహా దాదాపు రూ.37,000 కోట్లు) వైఫల్యం కేసులో యాంబీ వ్యాలీ అమ్మకానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 28న సహారా చీఫ్ సుబ్రతా రాయ్ సుప్రీంకోర్టు ముందు స్వయంగా హాజరుకావాల్సి ఉంది. -
స్టైలిస్ గా ఎల్ జీ స్టైలస్ 2 ప్లస్...
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్ జీ తన తాజా స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి గురువారం ఆవిష్కరించింది. ఎల్ జీ స్టైలస్ 2 ప్లస్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫోన్ ధర రూ.24,450గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రపంచవ్యాప్తంగా గత నెలలోనే అందుబాటులోకి తెచ్చామని, ప్రస్తుతం ఈ ఫోన్ ను భారత్ లో ఆవిష్కరించామని ఎల్ జీ ఇండియా మొబైల్స్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ తెలిపారు. ఈ ధరల పోటీ ప్రపంచంలో తాము స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని నూతన స్థాయికి తీసుకెళ్లడానికి, స్టైలిస్ అనుభూతితో స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఎల్ జీ అంతకు ముందు రబ్బర్ టిప్డ్ పెన్ సీన్ తో తీసుకొచ్చిన ఎల్ జీ జీ4 స్టైలస్ మాదిరిగా కాకుండా, మరింత కచ్చితత్వం కోసం నానో కోటెడ్ టిప్ తో ఈ హ్యాండ్ సెట్ ను తీసుకొచ్చింది. స్టైలస్ ను తొలగిస్తున్నప్పుడు పాప్ అప్ మెనూ కనిపించేలా పెన్ పాప్ నూ ఈ ఫోన్ కలిగి ఉంటుంది.. క్విక్ మెమో, ఆఫ్ మెమో, పాప్ స్కానర్ షార్ట్ కట్ లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. పెన్ కీపర్ కూడా ఈ ఫోన్ కు ప్రత్యేక ఫీచరే. స్టైలస్ 2 ప్లస్ ఫీచర్లు... 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ క్వాంటమ్ డిస్ ప్లే 1.4 గిగాహెడ్జ్ ఆక్టా కోర్ క్వాల్ కామ్ నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 3 జీబీ ర్యామ్ 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 200 జీబీ విస్తరణ మెమరీ 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 8 మెగా పిక్సెల్ ముందుక కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ ఎల్ టీతోపాటు వాయిస్ ఓవర్ ఎల్ టీఈ 3జీ, 2జీ కనెక్టివిటీ ఆప్షన్లు 145 గ్రాములు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement