-
నిధుల వేటలో.. మోసం లోతుల్లో!
రైస్ పుల్లింగ్.. పూడు పాములు.. అక్షయపాత్ర.. సంజీవని వేరు.. బంగారు నాణేలు.. పేర్లు వేరైనా మోసం ఒక్కటే. ఊరికే డబ్బు వస్తుందంటే చాలు.. నమ్మడం అలవాటైన వాళ్లు మోసగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్ల చేతిలో పెట్టి తీరా మోసపోయాక లబోదిబోమంటున్నారు. ఇక గుప్త నిధుల కోసమని అమావాస్య రాత్రిళ్లు.. పౌర్ణమి వెలుగుల్లో అడవిని జల్లెడ పడుతున్నారు. చారిత్రక ఆలయాలు, ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీ కుండలు వెక్కిరిస్తున్నా అన్వేషణ మాత్రం కొనసాగుతోంది. గతేడాది పలమనేరు మండలం దేవలంపెంట పురాతన శివాలయం ఎదురుగా ఉన్న నంది విగ్రహంలో కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయంటూ దాన్ని హైదరాబాద్ ముఠా ధ్వంసం చేసింది. ఇది కేవలం మోసమేనని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేశారు. ఏడాది క్రితం మండలంలోని దొడ్డిపల్లి అడవిలో ఓ ముఠా గుప్తనిధుల తవ్వకాలకు వెళుతూ వేటగాళ్ల కరెంటు ఉచ్చుకు చిక్కి ఇద్దరు గాయపడ్డారు తాజాగా నియోజకవర్గంలో బేలుపల్లి సమీపంలోని శాతపురాళ్ల ఆలయం వద్ద ఓ ముఠా తవ్వకాలు చేపట్టడం కలకలం రేపింది. .. ఇలాంటి ఘటనలు పోలీసుల దృష్టికి వెళితే కానీ విషయాలు వెలుగులోకి రాని పరిస్థితి. పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో తరచుగా తవ్వకాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పలమనేరు: జిల్లాలోని పడమటి మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా గుప్తనిధుల వేట సాగుతోంది. రాత్రివేళల్లో కొన్ని అంతర్ రాష్ట్ర ముఠాలు స్థానికులను ఏజెంట్లుగా నియమించుకొని తమ పని కానిచ్చేస్తున్నాయి. ముఖ్యంగా పురాతన, పాడుబడ్డ ఆలయాల్లో పూర్వీకులు బంగారాన్ని దాచి ఉంటారనే అనుమానంతో ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ కారణంగా ఇప్పటికే పురాతన ప్రాశస్త్యం ఉన్న పలు ఆలయాలు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలు ఇటు కర్ణాటక, అటు తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి ఎన్నో అడ్డదారులు ఉన్నాయి. ఎవరైనా, ఎప్పుడైనా సులభంగా వచ్చే వీలుంది. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గతంలోనూ నకిలీ బంగారు నాణేలు, రైస్పుల్లింగ్, పూడుపాములు, అక్షయపాత్ర, సంజీవిని వేరు లాంటి రకరకాల మోసాలు, ఘటనలు ఈ ప్రాంతంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. దుర్గం కొండపై ఉన్న ప్రాచీన ఆధారాలన్నింటినీ అక్రమార్కులు పెకళించారు. కృష్ణమ్మకొండపై సైతం దేవతా మూర్తులను పెకళించి నిధులకోసం అన్వేషించారు. కుప్పం ప్రాంతంలోని కర్ణాటక సరిహద్దు గ్రామాలు.. పుంగనూరు, సోమల, చౌడేపల్లె్ల, రామసముద్రంలో తవ్వకాలు షరామామూలుగా సాగుతున్నాయి. రాత్రి వేళల్లో గుట్టుగా.. ∙పలమనేరు మండలంలోని చెల్లెమ్మ చెరువులో పురాతన కాలంనాటి ఓ పుష్కరిణి గతంలో బయటపడింది. దీంతో బంగారు నాణేలున్నాయని పలువురు గతంలో తవ్వకాలు చేపట్టారు. ∙జగమర్ల అటవీప్రాంతంలో రంగురాళ్లు, వజ్రాల కోసం రాత్రి పూట కర్ణాటక వ్యక్తుల వేట కొనసాగుతోంది. ∙బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం అడవిలో ఉండే పాండవ గుహల్లో ఇప్పటికే పలుమార్లు తవ్వకాలు చేశారు. అందులో ఏమీ దొరక్కపోయినా తవ్వకాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ∙ఇదే మండలంలోని అటవీప్రాంతంలో ధనబండ వద్ద ధనం ఉందని గతంలో తవ్వకాలు జరిగాయి. ∙వీకోట మండలంలోని దుర్గంకొండ, కృష్ణమ్మ కొండ, క్రిష్ణాపురం, మోట్లపల్లె, గోనుమాకులపల్లె, కోటనక్కనపల్లె గ్రామాల్లోని పాత ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ∙మోట్లపల్లె వద్ద పంటపొలాల్లో బండల కింద గుప్త నిధులు ఉన్నాయని కర్ణాటకకు చెందిన ఓ ముఠా నాటు బాంబులతో ఆ బండలు పగులగొ ట్టింది. రాతి కింద బొగ్గులు ఉన్న కుండలు అక్కడ బయటపడడం గమనార్హం. అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లో అధికం బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం సమీపంలో పాండవ గుహలున్నాయి. సుమారు పదెకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతంలో గతంలో పాండవులు నివసించారని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ ఓ ప్రత్యేకమైన చంద్రాకారంలో బండలతో నిర్మించిన గుడులున్నాయి. అయితే వీటి కింద నిధి నిక్షేపాలు ఉన్నాయని పలు ముఠాలు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేశాయి. ఈ ప్రాంతం అడవిలో ఉండడంతో స్థానికులు సైతం గుర్తించేందుకు వీలుకాని పరిస్థితి. ఈతంతు అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లోనే సాగుతోంది. కొన్ని ఆలయాల వద్ద బండలపై చెక్కిన లిపిని పరిశీలించి బంగారం ఉంటుందని కొందరు ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ముఠాల మాటలను నమ్మి ఈ ప్రాంతవాసులే కాకుండా చుట్టుపక్క రాష్ట్రాలకు చెందిన వారు సైతం లక్షలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని ఘటనలో మినహా చాలా వరకు పోలీసుల దృష్టికి కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. అమాయకంగా నమ్మకండి గుప్తనిధులు, రైస్పుల్లింగ్ లాంటి మో సాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. చాలా వరకు అరెస్టులు కూడా చేశాం. పత్రికల్లోనూ వెలుగులోకి వస్తున్నా అమాయకంగా నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ముఠాల కదలికలపై నిఘా ఉంచాం. ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులను ఆశ్రయిస్తే వారి ఆటకట్టిస్తాం. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు -
రైస్పుల్లింగ్: రాగిపాత్రకు రంగుపూసి..
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): రైస్పుల్లింగ్ ముఠా సభ్యులు 13 మందిని మదనపల్లె రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మూదు కార్లు, ద్విచక్ర వాహనం, రూ. 20 వేలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ దిలీప్కుమార్ కథనం మేరకు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఓ ముఠా రైస్పుల్లింగ్ పేరుతో మోసం చేస్తోందని సమాచారం అందింది. బుధవారం సాయంత్రం మదనపల్లె రూరల్ మండలంలో మదనపల్లె–పుంగనూరు మార్గంలోని బసినికొండ వై–జంక్షన్ వద్ద మూడు వాహనాల్లో వచ్చిన కొంతమంది రాగిపాత్రను పరిశీలిస్తున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లడాన్ని చూసి పరారయ్యేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాగిపాత్రకు రంగుపూసి టార్చిలైట్ వేస్తే కొంత సేపటికి లైటింగ్ ఆగిపోతుందని, తరువాత ఆ పాత్ర మహిమ కలిగిన రైస్ ఫుల్లింగ్(అక్షయపాత్ర)గా మారిపోతుందని నమ్మిస్తున్నారు. ఆ పాత్రను రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు విక్రయించేందుకు యత్నిస్తున్నారు. నిందితులను అరెస్టు చేశారు. మూడు కార్లు, ద్విచక్రవాహనం రూ.20,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో తిరుపతి ఎన్జీవో కాలనీకి చెందిన శాంతిలాల్(37), రామచంద్రాపురం మండలం చుట్టగుంట గ్రామానికి చెందిన జె.శ్రీనివాసులు(45), దుర్గసముద్రం ప్రాంతానికి చెందిన ఎన్.శివశంకరయ్య(48), మదనపల్లె రూరల్ మండలం బసినికొండకు చెందిన జి.శ్రీనివాసులు(35) వైఎస్ఆర్ జిల్లా చిప్పిడిరాళ్ల గ్రామానికి చెందిన కె.మధుసూదన్రెడ్డి(32), కర్ణాటకలోని ఎలహంకకు చెందిన కె.ఎం.మునీష్(27), చిక్బళ్లాపూర్కు చెందిన వి.నాగరాజు(25), అనంతపురం జిల్లా బండార్లపల్లెకు చెందిన న్యాయవాది డి.చెన్నారెడ్డి(55), తాడిపత్రిలోని సుంకులమ్మ కాలనీకి చెందిన పి.నాగరాజు(40), నంద్యాల రోడ్డు సీపీఐ కాలనీకి చెందిన పి.చంద్రహాస్(21), ఎర్రంకలవారిపల్లెకు చెందిన బి.ప్రేమానందరెడ్డి(42) తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా వెంకటాపూర్కు చెందిన డి.రాజేంద్రప్రసాద్(33), కూకుట్పల్లెలోని నీలాద్రీ టవర్స్కు చెందిన ఎస్.అశోక్రెడ్డి(42) ఉన్నారు. చదవండి: యువతి బ్లాక్మెయిల్: డబ్బులు పంపించు.. లేదంటే.. ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఊహించని షాకిచ్చిన భర్త -
వైద్యం ఓడింది మూడత్వం గెలిచింది!
-
రైస్ 'కిల్లింగ్'!
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: బియ్యాన్ని ఆకర్షించే మహిమ కలిగిన అద్భుత యంత్రం ఇంట్లో ఉంటే మహర్దశ పడుతుందనే మూఢ నమ్మకం నిండు కుటుంబాలను బలి తీసుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్ పెన్మెత్స రామకృష్ణంరాజు కుటుంబ ఆత్మహత్యకు రైస్ పుల్లర్ మోసమే కారణమని పోలీసులు నిర్ధారించారు. రైస్ పుల్లర్ పేరుతో రూ.5 కోట్లు కాజేసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన వరికూటి వెంకట వేణుధరప్రసాద్ను అరెస్టు చేసినట్లు అమలాపురం పోలీసులు మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్లో ఉంటున్న ప్రసాద్ మరో ముగ్గురితో కలసి ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు రామకృష్ణంరాజు నుంచి రూ.5 కోట్లకుపైగా వసూలు చేశాడు. అప్పుల పాలైన రామకృష్ణంరాజు (55), భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు డాక్టర్ కృష్ణసందీప్ (25) నాలుగు రోజుల క్రితం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటం తెలిసిందే. అతీత శక్తుల పేరుతో మోసాలు.. బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాన్ని రైస్ పుల్లర్గా పరిగణిస్తారు. అత్యంత అరుదైన, ఖరీదైన ఇరీడియం లోహాన్ని కలిగి వుండే వీటిని చూపించి మోసగిస్తున్నారు. అతీత శక్తుల పేరుతో వీటిని విక్రయించడం భారతీయ శిక్షాస్మృతి 415, 420 ప్రకారం నేరం. తేలికగా డబ్బులు సంపాదించేందుకు కొందరు ముఠాలుగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో రేడియేషన్ ఆర్టికల్ అమ్మకాలతో మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి దివ్య శక్తులు ఉంటాయని, ఇది ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని నమ్మించి మోసగిస్తున్నారు. రాగి లోహంతో చేసిన గ్లాసులు, గిన్నెలు, బిందెలు, మూతలు, విగ్రహాలు, నగలు, పాతకాలం నాణేలు లాంటివి రైస్ పుల్లర్ పరికరాలుగా చలామణి అవుతున్నాయి. నల్ల పసుపు, ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర కలబంద లాంటి మొక్కల్లో కూడా రైస్ పుల్లర్ లక్షణాలున్నాయని నమ్మబలుకుతున్న ముఠాలు కూడా ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్న ఏడుగురితో కూడిన ముఠాను ఈ ఏడాది జూలైలో మచిలీపట్నం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసగిస్తున్న ముఠాను ఇటీవల తిరువనంతపురంలో అరెస్టు చేశారు. రైస్ పుల్లింగ్ అంటే...? రైస్ అంటే బియ్యం... పుల్లింగ్ అంటే లాక్కోవడం. సాధారణంగా ఓ వస్తువుకు కొద్ది గంటలపాటు అయస్కాంతాన్ని రాపిడి చేస్తే కొద్దిసేపు ఆకర్షణ గుణాన్ని పొందుతుంది. రైస్ పుల్లింగ్లో దీన్ని అద్భుత శక్తిగా నమ్మిస్తారు. పురాతన లోహ విగ్రహాలు, పాత్రలు, నాణేలను రైస్ పుల్లింగ్ ముఠా తమ మోసాలకు ముడి సరుకుగా వాడుతుంది. వీటికి అయస్కాంతాన్ని రుద్దడం ద్వారా బియ్యపు గింజలను ఆకర్షించి ప్రజలను మోసగిస్తున్నారు. పురాతన వస్తువుల పేరుతో రూ.కోట్లు కాజేస్తున్నారు. -
డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకు ఈ ముఠానే కారణం!
సాక్షి, అమలాపురం(తూర్పు గోదావరి) : అమలాపురంలో డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్యహత్య చేసుకున్న ఘటనలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చేస్తున్న దర్యాప్తులో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా నలుగురు వ్యక్తులతో కూడిన ఈ ముఠా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని ఈ రైసు పుల్లింగ్ ఊబిలోకి లాగి రూ.కోట్లు కాజేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలో సభ్యుడైన కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరికూటి వెంకటవేణుధర ప్రసాద్ను అమలాపురం పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజే అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆదేశాలతో నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ముఠా సభ్యుడైన వేణుధర ప్రసాద్ను అమలాపురం బస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టణ సీఐ బి.సురేష్బాబు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా సూత్ర, పాత్రధారి అయిన హైదరాబాద్కు చెందిన షావలిన్, ముఠాలోని మిగిలిన సభ్యులు అనంతరామ్, శ్రీనివాసరావులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ బాషా తెలిపారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్రంలో తమ పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలోనూ వీరి కోసం పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. డాక్టర్ కుటుంబం నుంచి రూ.ఐదు కోట్లు గుంజుకున్న ముఠా ముఠా సభ్యుడైన వెంకట వేణుధర ప్రసాద్ను అరెస్ట్ అనంతరం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ బాషా మంగళవారం ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అమలాపురం పట్టణ, రూరల్, ముమ్మిడివరం సీఐలు బి.సురేష్బాబు, ఆర్.భీమరాజు, రాజశేఖర్లతో కలిసి ముఠా వివరాలను వెల్లడించారు. ఏడాది నుంచి డాక్టర్ రామకృష్ణంరాజు ఈ ముఠా మాయమాటల్లో పడినట్టు చెప్పారు. తొలుత వేణుధరప్రసాద్ డాక్టర్కు పరిచయమై రైస్ పుల్లింగ్ ఆశ పుట్టించాడు. తర్వాత డాక్టర్ను హైదరాబాద్లోని ప్రధాన నిందితుడు షావలిన్కు పరిచయం చేశాడు. దైవాంశ సంభూతమైన పురాతన విగ్రహాలు, నాణేలు, పాత్రల గురించి డాక్టర్కు వివరించి వాటి వల్ల రుణ విముక్తి కావడమే కాకుండా అష్టైశ్వర్యాలు ఎలా ప్రాప్తిస్తాయో తన ముఠాలోని సభ్యులతో ఆయనకు చెప్పించి నమ్మించాడు. రైస్పుల్లింగ్లో ఇవ్వబోయే పురాతన వస్తువు విలువ రూ.కోట్లలో ఉంటుందని మానసికంగా సిద్ధం చేశారు. మీ కోసం రైస్ పుల్లింగ్ వస్తువు తయారవుతోందని డాక్టర్ కుటుంబం నుంచి ముఠా దఫదఫాలుగా నగదు రూపంలో, బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంది. ఇందు కోసం డాక్టర్ అధిక మొత్తాలను అధిక వడ్డీలకు అప్పు చేసి రూ.ఐదు కోట్లు ముఠాకు అతికష్టంగా సరిపెట్టారు. చివరకు ఈ ముఠా చేసిన మోసాలకు బలి అయ్యానని డాక్టర్ కుటుంబం గ్రహించి ఇటీవల హైదరాబాద్ వెళ్లి రెండు వారాలు ఉండి పొగొట్టుకున్న రూ.ఐదు కోట్లను ఏలాగైనా రాబట్టుకోవాలని విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఇంతటి ఘోరమైన మోసానికి గురైన డాక్టర్ కుటుంబం చివరకు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు ఒడిగట్టిందని డీఎస్పీ బాషా తెలిపారు. డాక్టర్ పెద్ద కుమారుడు, మృతుడు డాక్టర్ కృష్ణ సందీప్ సూసైడ్ నోట్, డాక్టర్ చిన్న కుమారుడు కృష్ణ వంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ ఆదేశాల మేరకు రైస్ పుల్లింగ్ మోసాలు, ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement