-
అద్దె ఇంట్లో దినం చేయొద్దని వివాదం
గుంటూరు, పెనమలూరు : ఓ వ్యక్తి మృతి చెందగా అతనికి చిన్న దినం అద్దె ఇంట్లో చేయరాదని ఆ ఇంటి యజమాని కుటుంబ సభ్యులు బాధితులపై దాడి చేశారు. ఈ వ్యవహారం వివాదంగా మారటంతో న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్స్టషన్ వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. పెనమలూరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కానూరు సనత్నగర్కు చెందిన కర్రి సన్యాసినాయుడు ఈ నెల 14వ తేదీన పటమటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు సనత్నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అతని మృతదేహాన్ని శనివారం తీసుకురాగా ఇంటి యజమానులు మృతదేహం తీసుకురావద్దని అభ్యంతరం తెలిపారు. దీంతో రోడ్డుపైనే మృతదేహం ఉంచి అనంతరం దహన సంస్కారాలు పూర్తి చేశారు. కాగా ఆదివారం ఇంటి వద్ద చిన్న దినం చేయటానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందుకుగాను ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇంటి యజమానులు దీనికి అభ్యంతరం తెలిపారు. మృతుడి కుమార్తె కర్రి హేమలతతో ఇంటి యజమానులు కొండలరావు, పొండూరు పద్మ, సుబ్బులమ్మ, బుల్లి.. తగాదాకు దిగి దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిíస్థితి ఏర్పడింది. బాధితులు, స్థానికులతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి తమపై అన్యాయంగా ఇంటి యజమానులు దాడి చేశారని న్యాయం చేయాలని నిరసనకు దిగారు. దీంతో సీఐ దామోదర్ ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించి బాధితులను శాంతింప చేశారు. కేసు నమోదు చేస్తానని హామీ ఇచ్చారు. దాడిపై కేసు నమోదు.. మృతుడి కుమార్తె హేమలతపై ఇంటి యజమానులు దాడి చేయటంతో పోలీసులు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. హేమలత ఇచ్చిన ఫిర్యాదుతో కొండలరావు, పద్మ, సుబ్బులమ్మ, బుల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కాగా, చిన్న దినం కోసం చేసిన ఏర్పాట్లన్నీ చిందరవందర చేయడంతో ఆందోళనల మధ్యే కార్యక్రమాన్ని పూర్తి చేసి మమ అనిపించారు. -
భర్తను వీడి అద్దెఇంటికి మారిన హీరోయిన్
హాలీవుడ్ హీరోయిన్, దర్శకురాలు ఏంజెలినా జోలీ తన పిల్లలను తీసుకుని భర్త, హీరో బ్రాడ్ పిట్ ఇంటినుంచి వెళ్లిపోయింది. లాస్ ఏంజిలెస్లోని ఓ అద్దె ఇంట్లో జోలీ తన ఆరుగురు పిల్లలతో కలసి ఉంటున్నట్టు సమాచారం. 52 ఏళ్ల పిట్, 41 ఏళ్ల జోలీ విబేధాల కారణంగా దూరమయ్యారు. విడాకులు కోరుతూ గతనెలలో జోలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా పిట్తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు జోలీ చెప్పింది. ఓ ప్రైవేట్ విమానంలో పిట్ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు వార్తలు వచ్చాయి. పిల్లల సంరక్షణ బాధ్యత తనకు అప్పగించాలని, పిట్కు పిల్లలను కలుసుకునే హక్కు మాత్రమే ఇవ్వాలని జోలీ కోర్టును కోరింది. జోలీ, పిట్ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. పిట్ నటిస్తున్న ఓ ప్రాజెక్టు నుంచి ఇటీవల జోలీ వైదొలిగింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు జోలీ తొలుత అంగీకరించినా, ఇటీవల జరిగిన పరిణామాల వల్ల పిట్తో వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement