-
ఆర్టీసీ ఆస్తులు కాజేయడానికి కుట్ర
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం స్వార్థ పూరిత ఆలోచనతో ఆర్టీసీని నిర్వీర్యం చేసి, దాని ఆస్తులు కాజేయడానికి కుట్రపన్నుతోందని పీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ ఆరోపించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు ఎంత జీతాలు పొందుతున్నారో కూడా తెలియని సీఎం ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రతీ రోజూ కోటి మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్న ఉద్యోగులను తొలగిస్తామనడం దుర్మార్గపు చర్య అన్నారు. ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే వారి బలిదానాలకు ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం చెల్లించే బకాయిలు చెల్లిస్తే ఆర్టీసీకి నష్టాలే లేవని అన్నారు. రూ.1052 కోట్లు వాహనాల టాక్స్ కింద వసూలు చేసి ఆర్టీíసీకి ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు దిండిగాల మధు, తాజ్, బొబ్బిలి విక్టర్, నవాబ్, గణపతి, రమేశ్, బీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేను పేరుకే టీడీపీ ఇన్చార్జిని..
* ఎమ్మెల్యే, విజయమ్మ చెబితేనే అధికారులు పలుకుతున్నారు * బద్వేలుకు ఎలా వస్తావో చూస్తాం- టీడీపీ జిల్లాఅధ్యక్షుడితో కార్యకర్తల వాగ్వాదం ప్రొద్దుటూరు: ‘పేరుకే నేను టీడీపీ ఇన్చార్జిని..ఎమ్మెల్యే జయరాముడో, విజయమ్మనో చెబితేనే అధికారులు పనులు చేస్తున్నారు’ అని బద్వేలు నియోజకవర్గ ఇన్చార్జి విజయజ్యోతి అన్నారు. ప్రొద్దుటూరు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో సోమవారం విజయజ్యోతి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో మాట్లాడేందుకు వచ్చారు. ఆమె వెంట సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి కొంత మంది వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో 75 మంది నాయకులు, కార్యకర్తలకు నీరు-చెట్టు పథకం కింద కాలువలు తీసేందుకు పనులు పెట్టామన్నారు. 3 నెలలుగా ఈఫైల్ను పక్కన పెట్టారన్నారు. నిన్నకాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే జయరాములు, విజయమ్మ కలిసి రూ.10కోట్ల పనులు చేస్తున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు ఎందుకు పలకడం లేదని ప్రశ్నించారు. కూర్చొని మాట్లాడుదామని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చెబుతుండగానే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము విజయమ్మకో, జయరాములుకో ఓట్లు వేయలేదన్నారు. ఇంతలో జిల్లా అధ్యక్షుడు పార్టీ అనుకున్నారా, ఏమనుకున్నారు అంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలు జిల్లా అధ్యక్షునితో వాగ్వాదానికి దిగారు. బద్వేలుకు ఎలా వస్తావో చూస్తామంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో జిల్లా అధ్యక్షుడు సమన్వయ కమిటీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లోకి వెళ్లిపోయారు. దీంతో బద్వేలు నుంచి వచ్చిన వారు బయటికి వచ్చారు. -
ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కడప: ‘‘భిన్నమైన పరిస్థితుల మధ్య రాష్ట్ర విభజన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన చట్టంలోని అన్ని హామీలను కేంద్రం నెరవేర్చాలి. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే’’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన గురువారం వైఎస్సార్ జిల్లా కడప ఆర్అండ్బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్టను తిరుమల తరహాలో పవిత్ర స్థలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒంటిమిట్ట, కడప పెద్దదర్గా, గండికోట ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్ జిల్లాను హార్టికల్చర్ హాబ్గా మారుస్తామని వెల్లడించారు. నదుల అనుసంధానమే శరణ్యం రాష్ట్రంలో నదుల అనుసంధానం ద్వారానే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. అందుకే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొన్నారు. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసి, గ్రావిటీ ద్వారా నీరు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. 25, 26న మరోసారి జిల్లా పర్యటన కడపలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పెన్నా నదిలో చెక్డ్యాం నిర్మిస్తామని సీఎం తెలిపారు. నీరు-చెట్టు పథకం, సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు ఈ నెల 25, 26వ తేదీల్లో మళ్లీ వైఎస్సార్ జిల్లాకు వస్తానన్నారు. చెర్లోపల్లి పనులను పరిశీలించిన సీఎం సీఎం చంద్రబాబు గురువారం ఉదయం చెర్లోపల్లి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిపై ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా అనంతరం రామగిరి మండలం వెంకటాపురంలో మంత్రి పరి టాల సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత అనంతపురంలో నీరు-ప్రగతిపై సదస్సు నిర్వహించారు. చివరగా కొడికొండ చెక్పోస్టు సమీపంలో ఎలక్ట్రానిక్ అండ్ బయోటెక్నాల జీ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సదస్సుల్లో బాబు ప్రసంగించారు. -
వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుల దాడి
అశ్వారావుపేట(ఖమ్మం): ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వీధిలో ఉండే ఎం.మల్లికార్జునరావు గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఆవరణలో తన వాహనాన్ని పార్క్ చేసి ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముగ్గురు ఆగంతకులు ఆయనపై కర్రలు, రాడ్లతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దానిని గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయటంతో దుండగులు పరారయ్యారు. కాగా, ఈ దాడి దొంగల పనే అయి ఉంటుందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రాజమండ్రి ‘ఆర్అండ్బీ’లోనే కేబినెట్ భేటీ
సాక్షి, రాజమండ్రి: ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రాజమండ్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి రాజమండ్రిలోని ఓ ప్రైవేటు హోటల్లో మంత్రివర్గ సమావేశం జరపాలని ముందు నిర్ణయించారు. కానీ గోదావరి పుష్కరాల కారణంగా ఈ హోటల్లో 25వ తేదీ వరకూ అన్ని గదులూ నిండిపోయాయి. దీంతో ఈ సమావేశాన్ని ఈ హోటల్లో జరిపితే మంత్రులు, ఐఏఎస్లు, ఇతర అధికారులకు గదులు కేటాయించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని సీఎంకు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీని ఆర్అండ్బీ అతిథి గృహంలోనే నిర్వహించాలని నిర్ణయించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement