-
గంగూలీ.. ఇది ఎక్కడైనా ఉందా?
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ను కామెంట్రీ ప్యానల్ నుంచి తప్పించడంపై క్రికెట్ పరిపాలన కమిటీ(సీఓఏ) మాజీ సభ్యుడు రామచంద్ర గుహ మండిపడ్డారు. సంజయ్ మంజ్రేకర్ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు దారుణమన్నారు. గతేడాడి వరల్డ్కప్ సమయంలో రవీంద్ర జడేజాను బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అని వ్యాఖ్యానించడం మంజ్రేకర్కు ముప్పుతెచ్చింది. అతన్ని కామెంట్రీ ప్యానల్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ ఏడాది జరిగిన ఐపీఎల్కు సైతం మంజ్రేకర్ కామెంట్రీ చెప్పలేకపోయాడు. తను కామెంట్రీ ప్యానల్లో చేర్చాలని మంజ్రేకర్ మొరపెట్టుకున్నా బోర్డు మాత్రం ముందు నిర్ణయానికే కట్టుబడింది. దాంతో మంజ్రేకర్కు ఐపీఎల్ కామెంట్రీ చెప్పే అవకాశం రాలేదు. అయితే భారత క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంజ్రేకర్ కామెంట్రీ చెప్పనున్నాడు. అయితే ఇక్కడ బీసీసీఐ తరఫున కాకుండా, సోనీ అతన్ని కామెంట్రీ చెప్పడానికి కొనుగోలు చేసింది. తమ ఇంగ్లిష్ కామెంట్రీ ప్యానల్లో చేర్చింది. (‘ఆ క్లిప్స్ చూస్తూ కోహ్లి బిగ్గరగా నవ్వుతాడు’) కాగా, మంజ్రేకర్పై ఇంతటి కక్ష సాధింపు ధోరణి సరికాదంటూ రామచంద్ర గుహ పేర్కొన్నారు. అసలు కామెంటేటర్లపై బీసీసీఐ తన అధికారాన్ని చూపించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇలా ప్రపంచ క్రికెట్లో ఎక్కడైనా జరిగిందా అంటూ నిలదీశారు. ‘ ఈ తరహా విధానం బీసీసీఐకి మంచిది కాదు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ కామెంటేటర్ల వ్యవహారంలో ప్రవర్తిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ తనను తిరిగి తీసుకోవాలని మంజ్రేకర్ బోర్డుకు విన్నవించడం చాలా దారుణం. కామెంటేటర్లపై పెత్తనం చెలాయించాలనుకోవడం అర్థం లేనిది. ఈ విషయంలో బోర్డు అజమాయిషీ ఏమిటి. ప్రపంచ క్రికెట్లో ఎక్కడైనా ఇలా జరిగిందా?, ఒక్కసారి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్లో జరుగుతున్న దానిని ఒక్కసారి ఊహించుకోండి’ అని గుహా విమర్శించారు.(‘రాయుడ్ని ఎంపిక చేయకపోవడం మా తప్పే’) -
‘అది మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదం’
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం... దేశ విభజన తర్వాత మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదమని ప్రముఖ చరిత్రకారుడు, ఆర్థికవేత్త రామచంద్ర గుహ అభివర్ణించారు. ప్రధానమంత్రి మోదీ ఒక వారం సమయం ఇచ్చి లాక్డౌన్ ప్రకటిస్తే వలస కార్మికుల ఇక్కట్లు తగ్గేవని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశ విభజన సమయంలో భయంకరమైన మత కలహాలు చెలరేగాయని, లక్షలాది మంది వలస వెళ్లారని గుర్తుచేశారు. హింస జరగకపోయినా ఇప్పటి పరిస్థితి మాత్రం దేశ విభజన తర్వాత మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదమని పేర్కొన్నారు. దీని దుష్పరిణామాలు సమాజంపై తప్పకుండా ఉంటాయన్నారు. కూలీలు ఇప్పట్లో మళ్లీ పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపబోరని అన్నారు. -
రాహుల్ను మరోసారి ఎన్నుకోకండి
తిరువనంతపురం : కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ను వయనాడ్ ఎంపీగా గెలిపించి కేరళ ప్రజలను తప్పు చేశారని అన్నారు. ప్రస్తుత యంగ్ ఇండియాకు ఐదో తరానికి చెందిన రాహుల్ నాయకత్వం అవసరంలేదని వ్యాఖ్యానించారు. ఆయనతో పోల్చకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న తెలివితేటలు ఎంతో గొప్పవని అభిప్రాయపడ్డారు. రాహుల్ అసమర్థతే మోదీకి ఎంతో ప్రయోజమని అన్నారు. తిరువనంతపురంలో జరుగుతున్న ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’ రెండోరోజు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రగుహా ‘దేశభక్తి-మతోన్మాదం’ అంశంపై ప్రసంగించారు. ‘ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. రాహుల్పై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. నేటి యంగ్ జనరేషన్కి ఐదో తరానికి చెందిన రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం లేదు. ఆయన కుటుంబ కంచుకోట అయిన అమేథిలోనే ఓటమి చెందారు. రాహుల్ను కేరళ ప్రజలు ఎంపీగా ఎన్నుకుని తప్పిదం చేశారు. 2024లో మరోసారి అదేపని చేస్తే మోదీకి ఎంతో లబ్ధిచేకూర్చినట్లు అవుతుంది. రాజకీయంలో మోదీకి ఉన్న పరిపక్వత రాహుల్కు లేదు. గుజరాత్కు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పనిచేసి.. పరిపాలనాపరమైన అనుభవాలను మోదీ పొందారు. ఆయనకు ఉన్న కష్టించే తత్వం ముందు రాహుల్ నిలువలేరు. రాహుల్లా నెలలో 15 రోజులు మోదీ యూరప్ ట్రిప్పులకు వెళ్లరు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కేవలం ఢిల్లీకే పరిమితమైయ్యారు. దేశ వ్యాప్తంగా పార్టీ క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోంది. కాగా రామచంద్రగుహ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తొలినుంచి మోదీకి వ్యతిరేకంగా ఉండే ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ప్రముఖ చరిత్రకారుడిపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ట్విటర్ వేదికగా ఆయనను అర్బన్ నక్సలైట్గా వర్ణించింది. ఆయన చీకటి ప్రపంచాన్ని నడుపుతున్నాడని ఆరోపించింది. ఈ మేరకు కర్ణాటక బీజేపీ శాఖ శనివారం తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘‘ప్రశ్న: మీరు ఎవరు?. జవాబు: నా పేరు రామచంద్ర గుహ. చీకటి ప్రపంచంలో కార్యకలాపాలు నిర్వహించే అర్బన్ నక్సల్స్ గురించి సామాన్యులకు తెలియదు. తమ యజమానుల తరఫున హింసను ప్రేరేపించడం, ఆందోళనలు జరపడం ద్వారా తమ ఉనికిని ప్రదర్శించుకుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. ఇప్పుడు వారంతా బయటికి వస్తున్నారు..’ అంటూ వ్యాఖ్యానించింది. దీనికి తోడు ఆయన మాట్లాడుతున్న ఓ వీడియోను కూడా ట్విటర్లో షేర్ చేసిది. కాగా ప్రభుత్వ నిషేధాజ్ఞలను ధిక్కరించి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రామచంద్ర గుహను బెంగళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తనను నిర్బంధించడం తీవ్ర అప్రజాస్వామికమనీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. -
పౌరసత్వ రగడ: పోలీసుల అదుపులో ప్రముఖులు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే భారీగా పోలీసులను మోహరించారు. అయినప్పటికీ నిరసనకారులు, పలువురు ప్రముఖలు రోడ్లపైకి వచ్చి సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్దకు నిరసకారులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది నిరసకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనను తీసుకెళ్లే సమయంలో ‘భారత్ మాతా కీ జై’ అంటూ యోగేంద్ర యాదవ్ నినాదాలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీంతో 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు..16 మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు. మరోవైపు బెంగళూరు టౌన్ హాల్ సమీపంలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండగానే పోలీసులు లాక్కుని వెళ్లారు. సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణలోని చార్మినార్ వద్ద ఆందోళన చేపట్టిన పలువురు నిరసనకారులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement