-
యాపిల్కి షాకిచ్చిన జేపీ మోర్గాన్
కరోనా ఆర్థిక వ్యవస్థకు చేసిన గాయాలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎఫెక్ట్ వెరసి స్మార్ట్ఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్కి ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. స్మార్ట్ఫోన్ డిమాండ్ పడిపోతుండటంతో ఆ కంపెనీ లాభాలు పరిమితం కావచ్చంటూ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ సూచించింది. అందుకు తగ్గట్టుగా మోస్ట్ ఫ్రిఫరెడ్ స్టాక్స్ జాబితా నుంచి యాపిల్ను తొలగించింది. మార్కెట్ కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ అనేక బడా కార్పోరేట్ కంపెనీలకు సేవలు అందిస్తోంది. అదే విధంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కూడా విలువైన సూచనలు చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆయా కంపెనీల లావాదేవీలు, మార్కెట్ ఎత్తుగడలు, ప్రపంచ పరిస్థితులను అంచనా వేస్తూ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు మోస్ట్ ఫ్రిఫరెడ్ స్టాక్స్ పేరుతో ఓ జాబితా రూపొందిస్తుంది. ఈ జాబితాలో యాపిల్ సంస్థ కొన్నేళ్లుగా సుస్థిర స్థానం సంపాదించుకుంది. అయితే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆ వెంటనే సప్లై చెయిన్ దెబ్బతినడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూలికే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇంతలో ఉక్రెయిన్, రష్యా వార్ వచ్చిపడింది. దీంతో ఆదాయ వనరులు తగ్గిపోయాయి. ఈ క్రమంలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు క్షీణిస్తున్నాయి. వీటిని నిలబెట్టుకునేందుకు అప్పటికీ యాపిల్ సంస్థ పలు మోడళ్ల ధరలకు కోత పెట్టింది. ఐనప్పటికీ అమ్మకాలు మెరుగుపడే అవకాశం లేకపోవడం. పైగా యాపిల్ ఫోన్లు ఎక్కువగా తయారయ్యే చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఫలితంగా యాపిల్ ఆశించిన మేరకు లాభాలు అందించలేకపోవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. యాపిల్తో పాటు ప్రముఖ చిప్ మేకర్ కంపెనీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ సైతం మోస్ట్ ప్రిఫరబుల్ స్టాక్స్ జాబితాలో చోటు కోల్పోయింది. ఈ రెండింటి స్థానంలో నెట్వర్క్ ఎక్వీప్మెంట్ కంపెనీలైన ఆరిస్టా నెట్వర్క్, సియన్నా కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. చదవండి: యాపిల్ మాస్టర్ప్లాన్...అందరికీ అందుబాటులో ఐఫోన్..! -
OnePlus 10 Pro: అదిరిపోయే ఫీచర్స్తో విడుదలైన వన్ప్లస్ సూపర్ స్మార్ట్ఫోన్..!
యాపిల్, శామ్ సంగ్ మొబైల్స్ తర్వాత అంత క్రేజ్ వన్ప్లస్ మొబైల్స్కి ఉంటాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన చాలా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్మడు పోతాయి. అయితే, తాజాగా వన్ప్లస్ మరో కొత్త మొబైల్ని చైనా మార్కెట్లో మొదట విడుదల చేసింది. ఈ వన్ప్లస్ 10 ప్రో స్మార్ట్ఫోన్లో కొత్తగా వచ్చిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్1 చిప్ వస్తుంది. ఈ మొబైల్ 120హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లేతో రానున్నట్లు కంపెనీ తెలిపింది. వన్ప్లస్ 10 ప్రో 80డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో వస్తుంది. కొత్త వన్ప్లస్ ఫ్లాగ్ షిప్ మొబైల్ కూడా హైపర్ బూస్ట్ టెక్నాలజీతో రానున్నట్లు తెలిపింది. వన్ప్లస్ 10 ప్రో ధర: వన్ ప్లస్ 10 ప్రో బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను సిఎన్వై 4,699 (సుమారు రూ. 54,500)కు తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సిఎన్వై 4,999(సుమారు రూ. 58,000)కు లభిస్తే, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సిఎన్వై 5,299 (సుమారు రూ. 61,500)కు లభిస్తుంది. ఇది చైనాలో జనవరి 13 నుంచి సేల్ కోసం అందుబాటులోకి రాలేదు. అయితే, ఈ వన్ప్లస్ 10 ప్రోను ప్రపంచ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొని వస్తారు అనే విషయం పేర్కొనలేదు. వన్ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్: 6.7 అంగుళాల క్యూహెచ్ డి+ (1,440ఎక్స్3,216 పిక్సెల్స్) అమోల్డ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ గల కలర్ ఓఎస్ 12.1 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్1 చిప్ 12 జీబీ ఎల్పిడిడిఆర్ 5 ర్యామ్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ ఎక్స్615 ఫ్రంట్ కెమెరా 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ సపోర్ట్ 5,000 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ 80 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్ వైర్ లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ (చదవండి: హల్చల్ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్ కారు..! రేంజ్ ఎంతంటే..?) -
పిచ్చెక్కిస్తున్న షావోమీ 12 స్మార్ట్ఫోన్ డిజైన్, ఫీచర్స్..!
ప్రముఖ చైనా మొబైల్ తయారీ దిగ్గజం షావోమీ నుంచి త్వరలో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్ షావోమీ 12 రానున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12ప్రో, షావోమీ 12 అల్ట్రా రానున్నాయి. షావోమీ12 సిరీస్ స్మార్ట్ఫోన్ల గురుంచి చైనా టెక్ దిగ్గజం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే, ఇటీవల షావోమీ12 స్మార్ట్ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. అలాగే, రాబోయే స్మార్ట్ఫోన్కి సంబంధించిన కొన్ని డిజైన్ కూడా బయటకు వచ్చాయి. షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ ఫీచర్స్(అంచనా) తాజాగా లీక్ అయిన షావోమీ 12 స్పెసిఫికేషన్స్ ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ మొబైల్ డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ లైట్ తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లో సెంట్రల్ అలైన్డ్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. షావోమీ 12 ఫుల్-హెచ్ డి+(1,920ఎక్స్1,080 పిక్సెల్స్) రిజల్యూషన్ గల డిస్ ప్లేను కలిగి ఉండనుంది. అదనంగా, ఇందులో స్క్రీన్ ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా రానున్నట్లు సమాచారం. షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ గతంలో చైనా కంపల్సరీ సర్టిఫికేషన్(3సీ) వెబ్సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇది 67డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. బేస్ షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ స్మార్ట్ఫోన్ యుఎస్బి టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేయనుంది. షావోమీ 12 8జీబీ ర్యామ్ గల క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్ సహాయంతో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు బ్లూటూత్ వి5.2 కనెక్టివిటీ ఉంటుందని పేర్కొన్నారు. దీని ధర సుమారు రూ.69,990గా ఉండే అవకాశం ఉంది. (చదవండి: అమెరికాకు వచ్చినప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ లేదు: ఎలోన్ మస్క్!) -
రియల్ మీ నుంచి జీటీ నియో–2
న్యూఢిల్లీ: రియల్మీ తన జీటీ సిరీస్లో కొత్తగా జీటీ నియో 2 5జీ మొబైల్ను విడుదల చేసింది. ఇందులో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్, 120 హెర్జ్ రీఫ్రెష్ రేట్తో కూడిన ఈ4 (మరింత ప్రకాశవంతంగా, తక్కువ ఇంధనాన్ని వినియోగించుకునే) అమోలెడ్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ సూపర్డార్ట్ చార్జర్, వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ఏఐ ట్రిపుల్ కెమెరా, 7జీబీ డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ సదుపాయం ఇలా ఎన్నో ఫీచర్లున్నాయి. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.31,999 కాగా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999. ఫ్లిప్కార్ట్ పోర్టల్, రియల్మీ పోర్టల్పై కొనుగోలు చేసేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అదే విధంగా రియల్మీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ స్టిక్, రియల్మీ బ్రిక్ బ్లూటూత్ స్పీకర్, గేమింగ్ పరికరాలను సైతం విడుదల చేసింది. -
గూగుల్.. చిప్ చిచ్చు రాజుకుందా?
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్(ఆల్ఫబెట్ కంపెనీ), చిప్మేకర్ క్వాల్కమ్ మధ్య విభేధాలు మొదలయ్యాయి. చిప్ తయారీ విషయంలో గూగుల్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ మేరకు గూగుల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్వాల్కమ్ ఒక ట్వీట్ చేయడం విశేషం. అమెరికన్ చిప్మేకర్ కంపెనీ క్వాల్కమ్.. సొంతంగా చిప్లు తయారు చేసుకోవాలన్న గూగుల్ నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతోంది. రాబోయే పిక్సెల్ 6 స్మార్ట్ఫోన్స్ను గూగుల్ తాము సొంతంగా రూపొందించిన చిప్ సిస్టమ్తో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ నిర్ణయంపై క్వాల్కమ్ ట్వీట్ రూపంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. "We've decided to make our own smartphone SoC instead of using Snapdragon" 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 — Snapdragon (@Snapdragon) October 13, 2021 స్నాప్డ్రాగన్కు బదులు ఇకపై సొంత స్మార్ట్ఫోన్ ఎస్వోసీని తయారు చేబోతున్నాం అంటూ ఎర్ర జెండాల ఎమోజీతో ఒక ట్వీట్ చేసింది క్వాల్కమ్. ఇప్పటిదాకా పిక్సెల్ ఫోన్లకు చిప్సెట్లను సప్లై చేస్తూ వస్తోంది క్వాల్కమ్. కానీ, తాజా నిర్ణయంతో క్వాల్కమ్కు నష్టం వాటిల్లనుంది. గూగుల్ టెన్సర్ చిప్ను నమ్మకూడదంటూ ఆండ్రాయిడ్ యూజర్లను క్వాల్కమ్ హెచ్చరించడం విశేషం. అయితే పొరపచ్చాలు..ఈ రెండు కంపెనీల భవిష్యత్తు వ్యాపారంపై పడే నష్టం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పిక్సెల్ ఫోన్లను మినహాయిస్తే.. మిగతా డివైజ్లన్నీ క్వాల్కమ్ ప్రాసెసర్లతోనే మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ, రాబోయే రోజుల్లో ఇది శత్రుత్వంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక గూగుల్ డెవలప్ చేస్తున్న సొంత చిప్ అండ్ ప్రాసెసింగ్ వ్యవస్థ 2023 నాటికల్లా మార్కెట్లోకి రానుంది. ప్రపంచంలో 90 శాతం మొబైల్ డివైజ్ వ్యవస్థలో ఉపయోగించే.. బ్లూప్రింట్ ఆఫ్ ఆర్మ్స్ ఆధారంగా గూగుల్ సీపీయూ, మొబైల్ ప్రాసెసర్ ను గూగుల్ తీసుకురాబోతోంది. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
ది లీడర్..!
టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు
షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
వయ్యారి భామ నీ కళ్లు చూస్తే.. రేరాజైనా కుళ్లుకోవాల్సిందే! (ఫోటోలు)
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement