-
నటి వేధింపుల కేసు: 'మేడం' ఆమెనే
సాక్షి, కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తాజాగా కీలక విషయాలు వెల్లడించాడు. 'నా మేడం ఎవరో కాదు కావ్యామాధవనే' అంటూ వెల్లడించాడు. అయితే, నటిపై లైంగిక వేధింపుల కేసు వెనుక ఆమె ప్రమేయం ఉందా? అన్న ప్రశ్నకు అతను 'లేదు' అని సమాధానం చెప్పాడు. నటిపై లైంగిక వేధింపుల కేసులో కావ్యా మాధవన్ ప్రమేయం కూడా ఉన్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో అపహరించి.. లైంగికంగా వేధించామని, ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీశామని పల్సర్ సునీ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని అతను చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్ సునీ గతంలో పోలీసులకు చెప్పాడు. తాజాగా ఆ మేడం ఎవరో వెల్లడించిన పల్సర్ సునీ.. అయితే, ఆమెకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని చెప్తుండటం గమనార్హం. ప్రముఖ మాలయళ హీరో దిలీప్ రెండో భార్య అయిన కావ్యా మాధవన్కు కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్.. పల్సర్ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన రెండో భార్య కావ్య పాత్రపై కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో రెండోసారి అభ్యర్థించినా నటుడు దిలీప్కు కేరళ హైకోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. -
ఆమె పచ్చి అబద్ధాలు చెప్తోంది!
కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసు ఉచ్చు మరో నటి కావ్యా మాధవన్ మెడకు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ తాజాగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో లైంగికంగా వేధించి.. ఆమెను బ్లాక్మెయిల్ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలిపాడు. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్ సునీ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఈ 'మేడం' ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 'మేడం' అని మాత్రమే చెప్పిన పల్సర్ సునీ.. ఆమె పేరు, వివరాలు మాత్రం పోలీసులకు తెలియజేయలేదని తెలుస్తోంది. ప్రముఖ మాలయళ హీరో దిలీప్ రెండో భార్య కావ్యా మాధవనే ఈ 'మేడం' అయి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, పల్సర్ సునీ ఎవడో తనకు తెలియదని కావ్యా మాధవన్ అంటుండగా.. ఆమె వ్యాఖ్యలను పల్సన్ సునీ తోసిపుచ్చాడు. 'కావ్యా నేనెవరో తెలియదనడం మూర్ఖత్వం. ఆమెకు నేను బాగా తెలుసు' అని పల్సర్ సునీ మీడియాతో తెలిపాడు. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్.. పల్సర్ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో దిలీప్ సూత్రధారి కాగా, ఆయన భార్య కావ్య కూడా పాత్రధారిగా వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
స్టార్ హీరోను పట్టించిన సీక్రెట్ ఫోన్ నంబర్!
తిరువనంతపురం: కేరళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో మొదటినుంచీ ఓ ప్రముఖ హీరో హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఇటీవల దొరికిన ఓ కీలకసాక్ష్యం ఆధారంగా మలయాళ సూపర్స్టార్ దిలీప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో దిలీప్ వాడిన ఓ సీక్రెట్ మొబైల్ నంబర్ ఆధారంగానే ఆయన అడ్డంగా బుక్కయినట్లు తెలుస్తోంది. ఆ నంబరే లభించడమే ఆయన అరెస్ట్లో కీలకపాత్ర పోషించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ కీలక సమాచారాన్ని తన ఫోన్ నుంచి ఇండస్ట్రీకి చెందిన కొందరికి పంపించాడు. ఎవరికి సమాచారం అందించాడో మాత్రం పల్సర్ సునీ వెల్లడించలేదు. కొందరికి విషయం చెప్పేశాను, నాకు డబ్బు ఇవ్వాలంటూ దిలీప్ను నిందితుడు సునీ డిమాండ్ చేయగా అందుకు ఆయన నిరాకరించాడు. సునీ తనను వేధిస్తున్నాడని, రూ.1.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ కొన్ని రోజుల కిందట ఆయన పోలీసులను ఆశ్రయించారు. గత వారం దిలీప్ను పిలిపించిన పోలీసులు దాదాపు 12 గంటలపాటు ప్రశ్నించి విచారించారు. దిలీప్ భార్య కావ్య మాధవన్, మేనేజర్ అప్పుణ్ని, అనూప్ అనే మరోవ్యక్తికి ఈ నటుడు చేసిన కాల్స్ లిస్ట్ పరిశీలించగా ఓ కొత్త విషయం తెలిసింది. దిలీప్ ఓ ప్రైవట్ నంబర్ను వాడి తన సన్నిహితులకు కాల్స్ చేసేవారని, ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు అదే నంబర్తో తరచూ ఫోన్లో మాట్లాడేవాడని పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నటుడు దిలీప్ను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ అంగమలి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దిలీప్ను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆయన తరఫు నాయవ్యాది కోర్టుకు విన్నవించారు. -
హీరోయిన్ వేధింపుల కేసులో కీలక సాక్ష్యం
కోచి : మలయాళ హీరోయిన్ వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి లభించిందని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి గురువారం తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న హీరోయిన్ను కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు వేధించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పల్సర్ సుని అనే వ్యక్తిని, హీరోయిన్ వాహనం డ్రైవర్ మార్టిన్తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి తమకు లభ్యమైందని పోలీసులు చెబుతున్నారు. కారులో ఆమెను వేధిస్తుండగా మొబైల్లో తీసిన వీడియో బయటపడిందని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఈ నేరానికి పాల్పడటానికి బ్లాక్మెయిల్ చేయాలనే యోచనే ప్రధాన కారణమని తేలిందని ఆయన చెప్పారు. ఈ ఘటన వెనుక మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల హస్తం, భారీ కుట్ర కోణం ఉందని వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. తమ దర్యాప్తుతో సంతృప్తి చెందని పక్షంలో సీబీఐతో ఎంక్వైరీ చేయించుకోవచ్చని.. తమకెటువంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. కాగా, మార్టిన్, పల్సర్ సుని తదితరుల పోలీసు కస్టడీ గడువు రేపటితో ముగియనుంది. -
నటి కేసు: 'లై డిటెక్టర్ టెస్ట్ వద్దు'
కొచ్చి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు సునిల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ తమను తప్పుదోవ పట్టిస్తున్నాడని కేరళ పోలీసులు అంటున్నారు. శనివారం పల్సర్ సునీని అలువా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లై డిటెక్టర్ టెస్ట్ (నిజ నిర్ధారణ పరీక్ష) చేస్తేనే కేసు విచారణ త్వరగా పూర్తవుతుందని, లేనిపక్షంలో నిందితుడు సునీ పొంతన లేని విషయాలు చెబుతున్నాడని పోలీసులు అలువా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కు విన్నవించారు. లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించ వద్దని, అందుకు తాను సిద్ధంగా లేనని కోర్టులో పల్సర్ సునీ చెప్పాడు. కేరళ నటి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వీపీ విగీష్, పల్సర్ సునీలకు పోలీస్ కస్టడీని మార్చి 10 వరకు కోర్టు పొడిగించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధం ఉన్న కొందరిని అదుపులోకి విచారిస్తున్న పోలీసులకు ఆధారాలు సంపాదించడం సమస్యగా మారింది. నిందితుడు పల్సర్ సునీ నటిని కిడ్నాప్ చేసి కారులో తిప్పుడూ మరికొందరితో కలిసి తన స్మార్ట్ ఫోన్లో ఆమెను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీశాడు. అయితే ఫోన్ వివరాలు మాత్రం వెల్లడించడక పోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఈ నెల 17న సినిమా షూటింగ్ నుంచి ఇంటికి బయలుదేరిన నటిని కొచ్చిలో కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. నటిని దాదాపు 2 గంటలు కారులో బంధీగా తిప్పుతూ లైంగికంగా వేధిస్తూ ఫొటోలు, వీడియోలు తీశారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 23న పల్సర్ సునీ, విగ్నేష్ లతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement