-
ఈ దారి... సోలార్ రహదారి!
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. దక్షిణ కొరియాలోని ఈ ఫొటో చూస్తే ఈ సామెత నిజమేననిపించక మానదు. దాజియా- సెజాంగ్ పట్టణాలను కలిపే ఈ హైవే మధ్యలో సైకిళ్లు మాత్రమే వెళ్లేందుకు ఓ దారి ఏర్పాటు చేశారు. దాదాపు 32 కిలోమీటర్ల పొడవున్న ఈ దారికి అంత ప్రత్యేకత ఉండకపోవచ్చుగానీ... దానిపై కప్పు మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతపొడవునా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారుమరి! సైకిళ్లలో ప్రయాణించేవారికి చల్లటి నీడనిస్తూ... విద్యుత్ కూడా ఉత్పత్తి చేసుకోగలగడం భలే ఆలోచన కదూ! -
ఓడినవాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడుస్తాడు!
నివృత్తం: ఇది ఆధునిక న్యాయస్థానాలు వచ్చాక పుట్టుకు వచ్చిన సామెత. కోర్టు మెట్లు ఎక్కితే న్యాయాన్యాయల సంగతి పక్కనపెట్టి చూస్తే ఇరు వర్గాలకు కష్టాలు మొదలైనట్లే. ఎందుకంటే కోపతాపాల వల్లో, పెండింగ్ ఫైళ్ల వల్లో, ఇగోల వల్లో ఒక పట్టాన వాదనలు పూర్తి కావు. సాక్ష్యాలనీ, గైర్హాజరులనీ, రాజీలనీ ఇలా పుణ్యకాలం కాస్త కోర్టుకు తిరగడంలోనూ వాయిదాలకు హాజరు కావడంలోనూ గడిచిపోతుంది. ఈ నేపథ్యంలో గెలిచినా, ఓడినా తుది తీర్పు వచ్చే సమయానికి చాలా కోల్పోయి ఉంటాం. పనులన్నీ మానుకుని కోర్టుకు తిరగడం వల్ల, దారి ఖర్చులు-లాయరు ఖర్చులు ఇలా రకరకాలుగా ఎంతో పోగొట్టుకుంటాం. కాబట్టి గెలిచినా ఓడినా అత్యధిక కేసుల్లో ఇరువర్గాలకీ ఎంతోకొంత నష్టం వాటిల్లక తప్పదన్న అంతరార్థంతో వాడుకలోకి వచ్చిన సామెత ఇది. నుదుటి మీద బొట్టు ఎందుకు పెడతారు? నుదుటి మీద బొట్టు పెట్టడం అనేది ఒక సనాతన భారతీయ సంప్రదాయం. ఇది హిందువుల సంప్రదాయమని ప్రచారమైంది కానీ ఇది మతానికి సంబంధించిన సంప్రదాయం కాదు. దేహానికి సంబంధించిన సంప్రదాయం. మనిషిలో అష్టచక్ర స్థానాలుంటాయి. వాటిలో ముఖ్యమైన ‘ఆజ్ఞచక్ర’ రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. అక్కడ బొట్టు పెట్టడం ద్వారా ఆ చక్రం ఉత్తేజితమై మనిషిలో ఆందోళన తగ్గి ప్రశాంతత సిద్ధిస్తుంది. ఆక్యుపంక్చర్ విధానంలోని ఆక్యుప్రెజర్ సూత్రాల ప్రకారం నుదురు తలనొప్పి నివారణ కేంద్రం. బొట్టు పెట్టుకోవడం ద్వారా అక్కడ కొంత ఒత్తిడి పడుతుంది. అపుడు ఆ కేంద్రం ఉత్తిజేతిమై అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది అని చెబుతారు. -
మాటే మంత్రం
పద్యానవనం: అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినుర వేమ! నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని సామెత. మాట విషయంలో కొందరిది తెచ్చిపెట్టుకున్న సహనం, సౌమ్యత అయితే మరికొందరు సహజసిద్ధంగానే సౌమ్యులై ఉంటారు. ఆచి తూచి మాట్లాడతారు. అలా మాట్లాడటం వారి నైజం ఇంకొందరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. గంభీరంగా, ఆడంబరంగా ఉండాలనీ, మాట్లాడాలనీ చూస్తారు. ఇది అల్పుల లక్షణమంటాడు యోగివేమన. సజ్జనుడైన వాడు ఎప్పుడూ చల్లగా, సౌమ్యంగానే మాట్లాడతాడనేది ఆయన సూత్రీకరణ. అన్ని పద్యాల్లోలాగానే ఇందులోనూ ఒక ప్రాపంచిక విషయాన్ని సాపేక్షంగా చూపాడు. బంగారం అత్యంత విలువైన లోహమే అయినా కంచు మ్రోగినంత ఘనంగా అది మ్రోగదనేది జగమెరిగిన సత్యమే! అందుకేనేమో, ‘స్పీచ్ ఈజ్ సిల్వర్’ అన్న వారే ‘సెలైన్స్ ఈజ్ గోల్డ్’ అన్నారు. మనిషి బాహ్య సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఎన్ని ఆభరణాలున్నా (లేకున్నా!) అంతస్సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసే వాగ్భూషణం భూషణం అంటాడు భర్తృహరి. మంచిగా మాట్లాడకపోయినా సరే, చెడు మాట్లాడకుంటే చాలనే వారూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనం మహా గొప్ప ‘కమ్యూనికేషన్’ అంటే ఆశ్చర్యం కలిగించినా అది నిజం. మౌనంలోని మహత్తు గురించి రమణ మహర్షే కాదు, మహాత్మాగాంధీ కూడా చెప్పేవారు. సహాయనిరాకరణ సందర్భంగా ఆయన పలుమార్లు మౌనదీక్షలు జరిపారు. విపాసన సాధకులు నిరూపిస్తారు మౌనంలో దాగి ఉన్న మార్మికత ఏంటో! మరీ మౌనం కాకపోయినా... మాట్లాడటం కూడా ఎదుటి వార్ని నొప్పించకుండా, సౌమ్యంగా, సామరస్య పూర్వకంగా ఉంటే తప్పేంటి? అనేది ప్రశ్న. ఏదో ఒక సందర్భానికి అని కాకుండా, అలా మాట్లాడటమే సదా లక్షణమైనా తప్పులేదు. గత చరిత్రలో... మంచి మాటలతో పెద్ద పెద్ద కార్యాలు సాధించి, జఠిల సమస్యల్ని తేలిగ్గా పరిష్కరించిన వారున్నారు. పెడసరం మాటలతో మంచి వాతావరణాన్నీ చెడగొట్టి సమస్యను పరష్కరించకపోగా మరింత జఠిలం చేసిన వారూ ఉన్నారు. సంభాషణ ఎలా ఉండాలి? దాని లక్షణం, స్వరూప స్వభావాల గురించి ఆదికవి వాల్మీకి అద్భుతంగా చెప్పాడు రామాయణంలో. ‘‘అవిస్తరం, అసందిగ్దం, అవిలంభితం, అవ్యధం. ఉరస్థ కంఠగం వాక్యం వర్ధతే మధ్యమస్వరం’’ అంటాడు. ఎదుటి వారితో సంభాషించేప్పుడు... విషయం సుదీర్ఘంగా ఉండొద్దట, అస్పష్టత లేకుండా సూటిగా ఉండాలట, సాగదీసినట్టుగా కాకుండా ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా విడమర్చినట్టుండాలట. ఎదుటి వారిని ఏ విధంగానూ నొప్పించని రీతిలో సంభాషణ సాగాలట. హృదయం నుంచి జనించిన మాటలు కంఠం ద్వారా వృద్ధి చెందుతూ, మంద్రంగా మొదలై ఓ మధ్య స్థాయి వరకే పెరగాలి తప్ప ఉచ్ఛ స్వరంలో ఉండకూడదట. ఇదీ సంభాషణ పద్ధతంటాడు. రామాయణం మొత్తంలో హనుమంతుడ్ని ఓ గొప్ప సంభాషణా చాతుర్యం కలిగిన వాడిగా అభివర్ణిస్తాడు వాల్మీకి. సొంత సమస్యల్లో గొంతుదాకా కూరుకుపోయి ఉన్న శ్రీరామ, సుగ్రీవుల్ని కలిపి, పరస్పరం ఉపయోగపడేలా చేయడంలోనే ఆయన చాతుర్యం తెలిసిపోతుంది. జీవిత భాగస్వామికి దూరమై విలపిస్తున్న సీతా, శ్రీరాముల మధ్య సంధానకర్తగా వ్యవహరించడమైనా ఆయన మాటకారితనం, అంతకు మించి సంభాషణా చాతుర్యం వల్లే సాధ్యమైందనుకోవచ్చు. లంకలోని అశోక వృక్షం కింద కూర్చొని ఏ పరిణామాన్నయినా రాక్షస మాయ కావచ్చని సందేహిస్తున్న సీతకు తాను రామబంటునన్న విశ్వాసం కల్గించడానికి తానెంచుకున్న సంభాషణా క్రమం, వృద్ధి, ముగింపు... వీటిని జాగ్రత్తగా గమనిస్తే ఈ గొప్పతనం ఇట్టే తెలిసిపోతుంది. చైనా మహోపాధ్యాయుడు కన్ఫ్యూసియస్, గ్రీకు తాత్వికుడు సోక్రటిస్, భరతఖండ దయామయుడు గౌతమ బుద్ధుడు, కరుణామయుడైన ఏసుక్రీస్తు, మహ్మద్ ప్రవక్త, మార్టిన్ లూథర్కింగ్, నెల్సన్ మండేలా... ఇలా జాతిని ప్రభావితం చేసిన ఏ మహనీయుడ్ని తీసుకున్నా వారి నడతలో సౌశీల్యత, కార్యాచరణ నిబద్ధతతో పాటు వారి మాటల్లోని సౌమ్యత గురించి కూడా అంతే గొప్పగా చెబుతారు. కటువుగా, పరుషంగా మాట్లాడే దుర్లక్షణం సామాన్యుల్లో ఉండటం పెద్ద ప్రమాద హేతువు కాకపోయినా, నిర్ణాయక స్థానాల్లో ఉన్న వారలా మాట్లాడటం కచ్చితంగా సమాజానికి నష్టం కలిగిస్తుంది. పాలకుల్లో ఇది సర్వదా అవాంఛనీయం. దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకుల్లో కొందరు తమ పెడసరం మాటలతో వివిధ వర్గాల మధ వైషమ్యాలు పెంచి కక్షలు, కార్పణ్యాల్ని సృష్టిస్తున్నారు. మాటతీరు మార్చుకోండి మహానుభావులారా! అని వేడుకోవడం తప్ప మనమేం చేయగలం. మంచితనంతో ప్రపంచాన్ని వశీకరించుకోవడానికి మాటే మంత్రం. మనసుకది సంకేతం. - దిలీప్రెడ్డి -
నేను హైదరాబాదీ.. చలో తిందాం బిర్యానీ!!
ఈ రోజుల్లో తినడం అంటేనే అదేదో పాపంలా చూస్తున్నారు. తిండెక్కువైతే అన్నీ రోగాలే అంటూ శాపాలిచ్చేస్తున్నారు. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ ‘భాగ్య’నగరంలో ఇవ్వాళ్టికీ ఐదు రూపాయలకు ‘దాల్ రైస్’లూ, రెండు రూపాయలకే ప్లేటిడ్లీ పెట్టే సైకిల్ సెంటర్లు చాలా ఉన్నాయి. అందుకే ఇది భోజనప్రియుల సౌభాగ్యనగరం. ఇక్కడ ఒక్క ‘టై బిస్కెట్తో ఆకలికీ, డబ్బులేమికీ మధ్య జరిగే మ్యాచ్ ‘టై’గా ముగుస్తుంది. తిండి మాట రాగానే ప్రతివాడూ ‘బిర్యానీ’ని తలచుకునేవాడే. నిజమే.. మన్లాంటి తిండిపోతు మారాజులందరికీ ‘బిర్యానీ’ కిరీటం లాంటిదే! కానీ దాంతో పాటు దండకడియాలూ, మెడగొలుసులూ, కాళ్లపట్టీల లాంటి అచ్చమైన హైదరాబాదీ వంటకాలెన్నెన్నో ఉన్నాయి కదా. మొహమాటం లేకుండా మెహమాన్ను ఆదరించే ఈ నగరంలో ఓ సామెత ఉంది. అనుకోకుండా తిండి టైమ్కు మనం ఎవరింటికైనా వెళ్లామనుకోండి. అప్పుడు మనం ఇబ్బంది పడతామేమోనని హోస్టు భావన. అందుకే ఘోస్టుకైనా మర్యాద చేసేందుకు ఓ సామెత సృష్టించాడిక్కడి మోస్టు సంస్కార హోస్టు. అదే.. ‘ఖానేకే టైమ్ ఆనేవాలే దోస్త్ హోతే హై’ అని. అందుకే తినే టైమ్కు వచ్చిన ప్రతివాడూ స్నేహితుడే ఈ నగరంలో. ప్రాంతాలవారీ వంటకాలెన్నున్నా నగరానికే ప్రత్యేకమైనవి కొన్నున్నారుు. వాటితో నోటికి రుచి నింపడం, కడుపుకి తిండి నింపడం లాంటి ప్రయోజనాలే కాదు.. మరెన్నో సైడ్ బెనిఫిట్లు! ఉదాహరణకు మా ఛోటేమియాకు లెక్కలు రావడం లేదని ఓ రోజు ఇరానీ హోటల్కు తీసుకెళ్లి ఛోటా సమోసా చూపించి ‘ఇదేరా త్రిభుజం’ అన్నా. ఉస్మానియా బిస్కెట్ చూపించి ‘ఇదేరా వృత్తం’ అన్నా. లుఖ్మీని చూపించి ‘చతురస్రం ఇలాగే ఉంటుంది బేటా’ అని చెప్పా. స్టార్టర్ కాబట్టి లుఖ్మీతో మొదలుపెట్టి, ఛోటా సమోసా తిని, ఉస్మానియా బిస్కెట్ను ఇరానీ చాయ్లో ముంచినంత ఈజీరా లెక్కలంటే అన్నా. అంతే... జామెట్రీ అంటేనే జారుకునే వాడు కాస్తా... ఇప్పుడు ట్రిగనామెట్రీని టీ లా.. అర్థమెటిక్సూ, ఆల్జిబ్రాలనూ ఆరారా.. న్యూమరికల్స్ను నోరారా ఆస్వాదిస్తున్నాడు. ఇక లెక్కలు చాలు. సాయంత్రాల వేళల్లో పాయా షేర్వాతో షిర్మాల్ని చిన్నచిన్న ముక్కలు చేసి, ఆ షేర్వాతో కలిపేసి, అందులోనే నానేసి వేడివేడిగా ఉండగానే, ముక్కు నుంచి మసాలా ఘాటు వెలువడుతూ ఉండగా తినేవాడు మరింకెక్కడైనా ఉన్నాడా.. ఒక్క హైదరాబాద్లో తప్ప. ఇక బేకరీకి వెళ్తే ఆ పేర్లే వేరు. ‘దిల్ఖుష్’ తింటే నిజంగానే దిల్కు ఖుషీయే. ‘దిల్పసంద్’తో దిల్కు పసందే. ఐటమ్స్ పేర్లలో ఇంతలా భావుకత హైద్రాబాద్లో కాక మరెక్కడ?! ఒకడు రుమాలీ రోటీ తినేసి రుమాల్తో మూతి తుడుచుకుంటాడు. అది దక్కకపోతే ఇంకొకడు మూతి ముడుచుకుంటాడు. ఒకడికి తందూరీ యమా ప్యారీ. మరొకడికి ‘నహారీ’ అంటే షాయిరీ అంత ప్యారీ. ఇంకొకడికి ‘తలాహువా’ తింటే చాలు చెహరా ఖిలాహువా. అదే అల్లాహ్ కీ దువాహ్. హైదరాబాదీకి ఇవన్నీ ఇష్టమన్నమాటకు ‘ఖుదా యే గవాహ్’! మిఠాయిలు.. ఖుబానీ కీ మీఠా కోసం బతుకు ఖుర్బానీ అయిపోయినా పరవాలేదనుకునే వారెందరూ? డబుల్ కా మీఠాను ట్రబుల్ లేకుండా త్రిబుల్ టైమ్స్ తిననివారెందరు? తినే వారే అందరూ! హమారే షెహర్కే నవాబీ లోగోంకో... అంటే అసఫ్జాహీ నవాబులకూ మన హైదరాబాదీ రుచులు ఎంత ఇష్టం కాకపోతే.. సాక్షాత్తూ తమ అధికారిక జెండాలో ‘కుల్చా’ అనే రోటీని ముద్రించి దాన్నే ‘లోగో’గా వాడారు. వంటలకు పడగెత్తారు. రుచికి పట్టం కట్టారు. మనముండేది ఆ నవాబుల నగరంలోనే కదా.. అందుకే స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడల్లా బవర్చీలోనైనా, కేఫ్ బహార్లోనైనా, సర్వీలోనైనా, నయాగరాలోనైనా, ప్యారడైజ్, ఆస్టోరియాలలోనైనా తిండి కోసం క్యూలోనైనా నిలబడి నా వంతు కోసం వెయిట్ చేస్తా. అక్కడి వాళ్లు బయటకు తోసేస్తూ ఉన్నా ‘నేనూ ఉన్నా, లోపలికి పంపించమం’టూ ప్రాధేయపడుతూ వేచి చూస్తా. వెరసి... నేను హైదరాబాదీనీ... చలో తిందాం బిర్యానీ! -
బాసికం ఎందుకు కడతారు?
వివాహ ఘట్టంలో వధూవరుల అలంకరణలో బాసికం ఓ ప్రధాన భాగం. అయితే దీన్ని ఎందుకు కడతారు అన్నది చాలామందికి తెలియదు. ఈ ఆచారం వెనుక ముఖ్యమైన కారణం ఉంది. వివాహానికి అత్యంత అవసరమైనది సుముహూర్తం. సరిగ్గా ఈ సుముహూర్త సమయంలో వధువు కనుబొమల మధ్య స్థానాన్ని, అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని వరుడు చూడాలి. అదే విధంగా వధువు కూడా వరుడి కనుబొమల మధ్య స్థానాన్ని చూడాలి. అయితే పెళ్లి సందట్లో కొన్నిసార్లు వారు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అలా జరగకుండా గుర్తు ఉండేందుకే ఇద్దరికీ బాసికాన్ని కడతారు. నుదిటి మీది బాసికం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి కచ్చితంగా దానిమీదకి దృష్టి పోతుందన్నమాట! కుంచెడు గింజల కూలికి పోతే... తూమెడు గింజలు దూడ మేసినట్లు... అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకున్నప్పుడు ఈ సామెత వాడుతుంటారు! పూర్వం ఒక ఊరిలో ఓ ఆశబోతు ఉండేవాడు. అతడు ఓ ఆసామి దగ్గర కూలిపని చేసుకునేవాడు. అందుకు ప్రతిఫలంగా అతడికి ధాన్యం బాగానే ముట్టేది. ఓ యేడు పంటలు బాగా పండటంతో కూలీల అవసరం ఎక్కువైంది. దాంతో ఇతగాడికి ఆశ పుట్టింది. ఇంకాస్త ధాన్యం వస్తుంది కదా అని మరోచోట కూడా పనికి ఒప్పుకున్నాడు. తన యజమాని ఇచ్చిన ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకుని, వేరే పొలానికి పనికి పోయాడు. అక్కడ కుంచెడు వడ్లు లభించడంతో ఆనందంగా బయలుదేరాడు. తీరా ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఉండాల్సిన ధాన్యం లేదు. వెళ్లే హడావుడితో తలుపు వేయడం మర్చిపోవడంతో దూడ వచ్చి ఉన్నదంతా మేసేసింది. దాంతో ఘొల్లుమన్నాడా వ్యక్తి. నాటి నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement