-
కాకినాడ జేఎన్టీయూలో కీచక ప్రొఫెసర్
సాక్షి, కాకినాడ : విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన గురువే లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కాకినాడ జేఎన్టీయూలో చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన వైవా పరీక్షల్లో ప్రొఫెసర్ బాబులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎంటెక్ ఈసీఈ ప్రథమ సంవత్సర విద్యార్థినులు వర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుపై స్పందించిన యూనివర్శిటీ వైస్ చాన్సులర్ కుమార్...నిజ నిర్ధారణ కోసం హైపర్ కమిటీని నియమించారు. శనివారం సాయంత్రం విద్యార్థినులు.. హైపర్ కమిటీ ఎదుట హాజరయ్యారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ బాబులు క్యాంపస్లో ఐసీఎస్టీ (ICST) డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రొఫెసర్ వేధింపులు.. మెడికో ఆత్మహత్య
వైద్యవిద్య చదువుతున్న ఒక యువతి ఆత్మహత్య చేసుకుని నిండుప్రాణాలు తీసుకుంది. మరికొన్నాళ్లలో మెడిసిన్ పూర్తిచేసి, డాక్టర్గా సేవలు అందించాల్సిన సంధ్యారాణి.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. తమ మెడికల్ కాలేజిలో పనిచేసే ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంధ్యారాణి తాను రాసిన సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలు సంధ్యారాణి స్వస్థలం హైదరాబాద్లోని మలక్పేట ప్రాంతమని తెలిసింది. -
ఆత్మహత్యలకు కేరాఫ్గా సెంట్రల్ వర్సిటీ
హైదరాబాద్: ప్రొఫెసర్ల వేధింపులతో కొందరు... ప్రేమ విఫలమై మరికొందరు...ఆర్థిక సమస్యలతో ఇంకొందరు.. ఇలా సెంట్రల్ యూనివర్శిటీలోని విద్యార్థులు క్షణికావేశంలో తమ బంగారు జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడి అటు తల్లిదండ్రులకు.., ఇటు సమాజానికి తీరని వేదన మిగులుస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న మందారి వెంకటేశ్ ఆదివారం ఆత్మహత్య చేసుకోవడంతో వర్సిటీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు పట్టుదలతో శ్రమిస్తున్నప్పటికీ, మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడం విస్మయానికి గురి చేస్తోంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల బలవన్మరణాలకు కేంద్రంగా మారుతోంది. అధ్యాపకుల వేధింపులు, ప్రేమ తదితర కారణాలతో ఒత్తిడికిలోనై కొందరు చావే శరణ్యంగా భావిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికే 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో ఐదురుగు పరిశోధక విద్యార్థులు కాగా మరో ఇద్దరు పీజీ విద్యార్థులున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల వివరాలు.. ప్రేమ విఫలమై... * 2006లో: ఆశిన్దావన్ 2007లో: కేశవాచారి, 2007లో: సునీత, 2012లో: స్వాతిరాణి, 2012లో: స్వరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. వీరంతా ప్రేమవిఫలమై ఆత్మహత్య చేసుకున్నారు. వేధింపులతో... * 2008లో: సెంథిల్కుమార్, 2009 బాలరాజు, 2012లో: నరేష్కుమార్రెడ్డి, 2013 మార్చిలో: పుల్యాల రాజు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు డిపార్ట్మెంట్ వేధింపులతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. * 2013 ఆగస్టులో ఇంటిగ్రేటెడ్ విద్యార్థిని మోహినీ మిశ్రా అనుమానాస్పదస్థితిలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి మృతి చెందింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement