-
నేనున్నానంటూ భరోసా
ఆత్మకూరు/నెల్లూరు(దర్గామిట్టా)/కావలి/కోవూరు: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ శనివారం నెల్లూరు జిల్లాలో తనను కలిసిన పలువురు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. ‘బాధపడకండమ్మా.. ఆదుకుంటానంటూ’ వారి కన్నీళ్లు తుడిచారు. అప్పటికప్పుడు తగిన సాయమందించాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి.. అండగా నిలిచారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వల్లిపేడుకు చెందిన గడ్డం పెద సుబ్బయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సీఎం జగన్ను కలిసి తన బాధను చెప్పుకునేందుకు శనివారం నెల్లూరు సింహపురి ఆస్పత్రి సెంటర్కు చేరుకున్నాడు. బస్సు యాత్రలో భాగంగా అక్కడికి చేరుకున్న సీఎం జగన్ అంతమంది జనంలోనూ వీల్చైర్లో ఉన్న పెద సుబ్బయ్యను చూసి.. పరిస్థితిని ఆరా తీశారు. వెంటనే సుబ్బయ్యకు మెరుగైన చికిత్స అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నా బిడ్డను బతికించన్నా.. నెల్లూరు జిల్లా సింగపేటకు చెందిన వ్యవసాయ కూలీ రవిచంద్ర తన నాలుగేళ్ల కుమార్తె బ్లెస్సీతో కలిసి సీఎం జగన్ను కలిసేందుకు ఉలవపాళ్ల కూడలి వద్దకు వచ్చాడు. ‘నా కుమార్తె పుట్టినప్పటి నుంచే జన్యు సంబంధిత సమస్యలతో బధిరత్వం, ఫిట్స్తో బాధపడుతోంది. రెండేళ్ల కిందట నా భార్య కూడా చనిపోయింది. చికిత్స కోసం నా కుమార్తెను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లా.. అనంతరం అక్కడి వైద్యుల సలహా మేరకు రాయవెల్లూర్లో చూపిస్తున్నా. నా బిడ్డను బతికించుకునేందుకు.. చికిత్సకు తగిన సాయం కోసం సీఎం జగన్ను కలిసేందుకు వచ్చా’అని రవిచంద్ర చెప్పాడు. వీరి పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది వివరాలన్నీ నమోదు చేసుకున్నారు. అవ్వా.. పింఛన్ వస్తోందా? బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ నెల్లూరు జిల్లా నార్త్రాజుపాలేనికి చెందిన పుల్లా లక్ష్మమ్మను ‘అవ్వా, పింఛన్ వస్తోందా’ అంటూ ఆరా తీశారు. ప్రతి నెలా ఒకటో∙తేదీనే వలంటీర్ తమ ఇంటికే వచ్చి పింఛన్ డబ్బులు ఇచ్చేవారని.. చంద్రబాబు నిర్వాకం వల్ల ఈనెల అష్టకష్టాలు పడ్డామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘మళ్లీ నువ్వే రావాలి.. మాలాంటి వృద్ధులను కంటికి రెప్పలా కాపాడాలి’ అని సీఎం జగన్ను కోరింది. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘మరో రెండు నెలల్లో నీ మనవడి ప్రభుత్వం మళ్లీ రాబోతోంది. మీ సమస్యలు తీరుస్తా’ అని భరోసా ఇచ్చారు. కాలు దెబ్బతిన్న బాధితుడికి అండ అల్లూరు మండలం తూర్పు గోగులపల్లికి చెందిన సత్యనారాయణకు 20 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు పూర్తిగా దెబ్బతింది. మెరుగైన వైద్యం కోసం సీఎం జగన్ సాయం కోరేందుకు నెల్లూరుకు వచ్చాడు. సత్యనారాయణను పరామర్శించిన ముఖ్యమంత్రి.. ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆ దేవుడికి సమస్యలు చెప్పుకున్నాం.. బుజబుజనెల్లూరుకు చెందిన చల్లా కృష్ణ దంపతులు సీఎం జగన్ను కలిసేందుకు జాతీయ రహదారిపైకి వచ్చారు. వారిని చూసిన సీఎం జగన్ బస్సులో నుంచి దిగివచ్చి.. చల్లా కృష్ణ దంపతులతో మాట్లాడారు. తాము అనారోగ్యంతో బాధపడుతున్నామని.. తనకు రెండుసార్లు వైద్యులు ఆపరేషన్ చేశారని చల్లా కృష్ణ సీఎం జగన్కు తెలిపారు. తన భార్య ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదని.. ముగ్గురు సంతానం ఉన్నారని వివరించారు. వారి సమస్యను విన్న సీఎం జగన్ ‘బాధపడకండి.. ఆదుకుంటా’నంటూ భరోసా ఇచ్చారు. పేదల పాలిట దేవుడైన సీఎం జగన్కు తమ సమస్యలు చెప్పుకున్నామని మీడియాకు చల్లా కృష్ణ తెలిపారు. -
నాటి ‘భగీరథుడు’ నేడు ‘గౌరి’ రూపంలో వచ్చాడా?
మహిళలు.. పురుషుల కంటే తక్కువని ఎవరన్నారు?.. ‘గౌరి’ గురించి తెలిస్తే ఇటువంటి మాటలు మాట్లాడేవారు ఇక జన్మలో ఎప్పటికీ స్త్రీలను తక్కువగా చూడరు. నింగినున్న గంగను భూమిపైకి తెచ్చిన భగీరథుని గురించి మనకు తెలుసు. కొండను తవ్వి రోడ్డును వేసిన బీహార్కు చెందిన దర్శత్ మాఝీ గురించి కూడా మనం వినేవుంటాం. అంతటి స్థాయిని దక్కించుకున్న ‘గౌరి’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన ‘గౌరి’ నీటి ఎద్దడిని పరిష్కరించడంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. ఈమె ఇప్పటి వరకు రెండు బావులను తవ్వి, ఇప్పుడు మూడో బావిని తవ్వడం మొదలు పెట్టింది. స్థానికులు ఆమెను అపర భగీరథ అని అభివర్ణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్కు చెందిన 55 ఏళ్ల మహిళ అంగన్వాడీలకు వచ్చే పిల్లలు దాహంతో అలమటించకూడదనే ఉద్దేశంతో స్వయంగా బావిని తవ్వడం ప్రారంభించింది. గౌరి చంద్రశేఖర్ నాయక్ తన ఇంటి సమీపంలోని అంగన్ వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వే పనిని వారం రోజుల క్రితం ప్రారంభించింది. రోజూ ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తోంది. పలుగు, పార, బుట్ట, తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె మట్టిని బయటకు తోడుతోంది. అంగన్ వాడీకి మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు నెల రోజుల్లో బావిని సిద్ధం చేయాలని ‘గౌరి’ లక్ష్యంగా పెట్టుకుంది. బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి గౌరి చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ‘గణేష్ నగర్లో నీటి కొరత ఉంది. అంగన్వాడీలకు వచ్చే చిన్నారులకు తాగునీరు లేదు. దాహం తీర్చుకునేందుకు పిల్లలు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితే నాలో బావులు తవ్వేందుకు ప్రేరణ కల్పించింది’ అని పేర్కొంది. గౌరి బావిని తవ్వడం ఇదేమీ మొదటి సారికాదు. 2017, 2018లో రెండు బావులు తవ్వింది. జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఇటువంటి మంచి పని చేస్తోంది. -
మన పని ఈజీగా అయ్యేలా చేశారు!
మన పని ఈజీగా అయ్యేలా చేశారు! -
వృద్ధాశ్రమాల్లో ఎయిర్ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు!
ఢిల్లీలో వాయుకాలుష్యం చెప్పనలవి కానంతగా పెరిగిపోయింది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలు కలిగినవారు ఊపిరి తీసుకునేందుకు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో డిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా వృద్ధాశ్రమాల్లో ఎయిర్ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు వీలైంతవరకూ బయటకు వెళ్లకుంటూ ఉంటే మంచిదని, స్వల్ప వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఉన్న శివ ఆశ్రయ్ వృద్ధాశ్రమం సెక్రటరీ రాజేశ్వరి మిశ్రా మాట్లాడుతూ పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా అత్యవసర అవసరాల కోసం ఆశ్రమంలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పలుచోట్ల ‘ఎయిర్ ప్యూరిఫయర్లు’ ఏర్పాటు చేసింది. ఎన్డీఎంసీ వైస్-ఛైర్మెన్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ తాము వృద్ధాశ్రమాలలో నివసించేవారి కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నామని, యోగా తరగతులను కూడా నిర్వహిస్తుంటామని, అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన! -
ఎజెండాలో కపిరాజు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించాయి. కానీ పల్లె, పట్నం, పేద, ధనిక అన్న తేడా లేకుండా అ న్నిచోట్లా ఇబ్బందులకు కారణమవుతున్న కోతుల సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఏపార్టీ కూడా ఈ సమస్యపై ఇప్పటివరకు మాట్లాడలేదు. జనావాసాలపై దాడులు.. అడవుల్లో ఉండాల్సిన కోతులు అక్కడ ఆహారం దొరక్క 20 ఏళ్లుగా ఊర్ల బాట పట్టాయి. మొదట్లో అడవుల గుండా వెళ్లే హైవేల పక్కన అడ్డా ఏర్పాటు చేసుకున్నాయి. వచ్చి పోయేవారు ఇచ్చే ఆహారం కోసం ఎదురుచూశాయి. ఇక అక్కడి నుంచి ఊర్లలోకి వచ్చిన తర్వాత పంట పొలాలు మొద లు ఇంట్లోని కిచెన్ వరకు ప్రతీ చోట కోతుల దాడి పెరిగింది. కోతులు అడవులకు వెళ్లాలి తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. ‘వనాలు పెరగాలి – కోతులు అడవులకు పోవాలి’ అనేది హరితహారం నినాదం. పదేళ్లు గడిచే సరికి తెలంగాణలో స్థూలంగా అడవుల విస్తీర్ణం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ హరితహారం నినాదానికి తగ్గట్టుగా కోతులు అడవులకు పోలే దు సరికదా మరింతగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రైతులకు పంట నష్టం జరుగుతోంది. కనిపించని ఫుడ్కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో కోతుల కోసం ప్రత్యేకంగా మంకీ ఫుడ్ కోర్టులంటూ పండ్ల మొక్కలను ఎంపిక చేసిన స్థలాల్లో నాటారు. కానీ సరైన ఆలనాపాలన లేకపోవడంతో ఇవి నామరూపాల్లేకుండా పోయాయి. అసెంబ్లీలో సైతం చర్చ తెలంగాణ తొలి శాసనసభలో సీఎం కేసీఆర్ స్వయంగా కోతుల కారణంగా గ్రామాల్లో తలెత్తుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో కోతుల కారణంగా కూరగాయల సాగుకు రైతులు దూరమయ్యారని చెప్పారు. కోతులు బాధ భయంకరంగా మారిందన్నారు. అడవుల్లో ఫలాలు ఇచ్చే వృక్షాలను పెంచడం తప్ప మరో మార్గం లేదన్నారు. పరిహారం మాటేమిటి? కోతుల కారణంగా జరుగుతున్న పంట నష్టానికి పరిహారం చెల్లించాలంటూ 2017లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నాటి కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు డిమాండ్ చేశారు. అప్పటి అటవీశాఖ మంత్రి జోగురామన్న కోతుల వల్ల ఇబ్బందులేమీ లేవని చెప్పే ప్రయత్నం చేయగా వరంగల్కు చెందిన ఎర్రబెల్లి దయాకర్రావు, అప్పటి స్పీకర్ మధుసూదనాచారి కోతుల సమస్య తీవ్రంగా ఉందంటూ చర్చలో తమ అభిప్రాయాలు తెలిపారు. ఆఖరికి కోతులను బెదరగొట్టేందుకు కొండెంగలు (కొండముచ్చులు) అద్దెకు తీసుకురావాలని అప్పటి శాసన సభ్యులు కోరారు. కోతుల నియంత్రణ కోసం రూ. 2.2 కోట్లతో నిర్మల్లో ప్రత్యేక సెంటర్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే ఆచరణ అంతంతగానే ఉంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలే స్వచ్ఛందంగా చందాలు వేసుకుని కోతులను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement