-
బీఆర్ఎస్ టికెట్ల లొల్లిలో రాసలీలల ట్విస్ట్!
సాక్షి, ఖమ్మం: అధికార పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోపు టికెట్ల కుంపటి భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లాలోనూ బీఆర్ఎస్లో టికెట్ల వార్ కొనసాగుతుండగా.. వైరాలో అది మరో టర్న్ తీసుకుంది. వైరా టికెట్ తనకే మళ్లీ వస్తుందంటూ ఎమ్మెల్యే రాములు నాయక్ ధీమాగా ఉండగా.. తమకే వస్తుందంటూ అనుచరులతో హల్ చల్ చేయించుకుంటున్నారు మాజీలు మదన్లాల్, బానోతు చంద్రావతిలు. ఈ క్రమంలో మదన్లాల్కే టికెట్ అనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్న ఆయన వర్గీయులకు ఊహించని ఝలక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ రాసలీలలు ఫోటోలు తెరపైకి వచ్చి వైరల్ ప్రకంపనలు సృష్టించాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం అక్కడి వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా అకౌంట్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అంటూ ప్రత్యర్థి గ్రూపులు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. అయితే.. అవి మార్ఫింగ్ ఫొటోలు అని, మదన్లాల్కే బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వనుందని, అది తట్టుకోలేకే ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గమే ఈ పని చేయించిందని మదన్లాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాములు నాయక్ వర్గం మాత్రం ఆ అవసరం తమకు లేదని చెబుతోంది. డీజీపీకి ఫిర్యాదు చేస్తా: మదన్లాల్ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్పింగ్ చేసిన ఫొటోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మరోవైపు ఈ ప్రచారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. -
పగలు ఫిజిక్స్ టీచర్.. రాత్రికి అడల్ట్ సైట్లో ఫొటోలు షేరింగ్.. ఎందుకో తెలుసా?
Physics Teacher kirsty buchan.. పగలు పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే చీచర్ ఆమె.. కానీ, రాత్రి అయితే మాత్రం ఆమె తన అర్ధనగ్న ఫొటోలను తీసుకుంటూ వాటిని అడల్ట్ సైట్స్లో పెడుతోంది. ఈ విషయం కాస్తా విద్యార్థులకు తెలియడంతో చివరకు టీచర్ జాబ్కు రాజీనామా చేసింది. వివరాల ప్రకారం.. స్కాట్లాండ్లోని బానర్మన్ హైస్కూల్లో క్రిస్టీ బూచన్ ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తోంది. దీంతో, ఆమె ఉదయం పూట కొన్ని సంవర్సతరాలుగా పిల్లలకు ఫిజిక్స్ పాఠాలు బోధిస్తోంది. కానీ, రాత్రి అవగానే ఆమె మరో పని కూడా చేస్తూ విద్యార్థుల కంటపడకుండా జాగ్రత్తపడింది. కాగా, రోజూ అర్ధరాత్రి వరకూ మెలకువగానే ఉంటూ ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్సైట్లో తన నగ్న చిత్రాలను పోస్ట్ చేసేది. వెబ్సైట్లో పోస్ట్ చేసేందుకు ఫొటో షూట్ నిర్వహించుకుని వాటిని సైట్లో పోస్ట్ చేసేది. ఇలా చేయడం ద్వారా ఆమెకు కొంత ఆదాయం వచ్చేది. అలా కొన్నేళ్లపాటు చేసుకుంటూ కాలం వెళ్లదీసింది. అయితే, టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. దొరకనంత వరకూ దొర.. దొరికిన తర్వాత ఎంతటి వారినైనా దొంగే అంటారనే సమేత ఉంది కదా. ఆమెకు ఇదే సమెత వర్తించింది. ఇలా చేస్తున్న క్రమంలో సదరు ఫిజిక్స్ టీచర్ ఫొటోలు ఓ విద్యార్థి కంటపడ్డాయి. దీంతో, అతడు ఈ విషయాన్ని స్కూల్లో అందరికీ చెప్పేశాడు. దీంతో, స్కూల్ క్రమశిక్షణా కమిటీ ఆమెను విచారణకు రావాలని కోరింది. ఈ క్రమంలో వారు.. తనను తప్పుబట్టేది ఏంటని.. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఫొటోలు పోస్టు చేయడానికి కారణమిదే.. అయితే, ఫిజిక్స్ టీచర్ క్రిస్టీ బూచన్కు కుమారుడు(11) ఉన్నాడు. అతడిని పోషించుకునేందుకు డబ్బు సరిపోకపోవడంతో తాను ఈ పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తన కుమారుడికి దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో సర్జరీలకు చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఇలా, నగ్న చిత్రాలను పోస్ట్ చేసి నెలకు వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలిపింది. డబ్బు కోసమే తాను ఈ పని చేస్తున్నట్టు పేర్కొంది. ఆ పని చేస్తున్నందుకు తాను నరకం అనుభవిస్తున్నానని వెల్లడించింది. ఉదయం టీచర్ పనిచేస్తూ.. అర్ధరాత్రి వరకు నిద్రలేకుండా ఈ పని చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి కోసం తాను కరెక్ట్గానే చేస్తున్నానని చెప్పుకొచ్చింది. A physics teacher has resigned from her job after pornographic images of her emerged online. Kirsty Buchan, 33, left her post at Bannerman High School in Baillieston, Glasgow, after explicit pictures from her Only Fans site were circulated among pupils. pic.twitter.com/tuBFfUU3qR — vijay banga (@lekh27) December 1, 2022 -
వాట్సాప్లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ
చెన్నై: మోస పోయిన వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులది. తప్పు చేసిన వారిని శిక్షించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత వాళ్లది. అలాంటి గౌరవమైన వృత్తిలో ఉన్న ఓ ఉన్నత అధికారి నీచానికి దిగజారారు. తోటి మహిళా పోలీసులకు అసభ్యకర ఫోటోలు షేర్ చేస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. తన ప్రైవేటు ఫోటోలను వాట్సాప్లో పంపి రాక్షస ఆనందం పొందాడు. చివరికి తను తీసుకున్న గోతిలో తానే పడినట్లు డీఎస్పీ కామ క్రీడల వ్యవహారం అతన్ని చిక్కుల్లో పడేసింది. ఐపీఎస్ అధికారి పారా వాసుదేవన్ తమిళనాడులోని తిరుచ్చి డీఎస్పీగా(డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 19న నేర సంబంధిత విషయాల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో తన న్యూడ్ ఫోటోలు షేర్ చేశాడు. కాసేపటి తరువాత ఆ ఫోటోలు డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అవి నెట్టింట్లో లీక్ అయ్యాయి. దీంతో అసభ్యకర ఫోటోలు షేర్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా పోలీసులు పారా వాసుదేవన్పై ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా పోలీస్ అధికారులు డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులకు రాసిన లేఖలో.. తమ అనుమతి లేకుండా మహిళా పోలీసులను అసభ్యకరంగా ఫోటోలు తీసి తనతో శృంగారంలో పాల్గొనాలని పారా వాసుదేవన్ బలవంతం చేసినట్లు ఆరోపించారు. ఇప్పటికే డీఎస్పీపై మే 23, సెప్టెంబరు 30న ఫిర్యాదు చేసినప్పటికీ డీఎంకే మంత్రి అండదండలతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఈ లేఖ వైరల్ కావడంతో విచారణ కోరుతూ పారా వాసుదేవన్ను పోలీస్ శాఖ వెయిటింగ్ లిస్ట్లో పెట్టింది. చదవండి: సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేసిన యువకుడు.. ఇద్దరిని ఇంటికి పిలిపించి.. -
ఫొటోలు లీక్..ప్రియురాలు రౌద్రరూపం.. ప్రియుడు ఖతం
బొమ్మనహళ్లి: ప్రియుడు తన ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశాడనే ఆగ్రహంతో ప్రియురాలు రౌద్రరూపం దాల్చింది. ముగ్గురు మగ స్నేహితులతో కలిసి ప్రియున్ని ఇష్టానుసారం కొట్టడంతో కోమాలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ సంఘటన బెంగళూరులో బేగూరు పరిధిలో చోటుచేసుకుంది. నిందితురాలు ప్రతిభ (26), ఆమె స్నేహితులు సుశీల్, గౌతమ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్లో చదివి వచ్చి వివరాలు... చెన్నై నగరానికి చెందిన వికాస్ (27), ప్రతిభ ప్రేయసీ ప్రియులు. ఉక్రెయిన్లో వైద్య కోర్సు చదివి వచ్చిన వికాస్ చెన్నైలో డాక్టర్గా పని చేసేవాడు. ఆరు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చి మైకో లేఔట్ వద్ద నివాసం ఉంటున్నాడు. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఒక ఆర్కిటెక్ట్ కంపెనీలో పని చేస్తున్న ప్రతిభతో వికాస్కు రెండేళ్ల కిందట సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. వికాస్ బెంగళూరుకు వచ్చాక అది ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారు కూడా ఒప్పుకొన్నారు. నవంబర్ నెలలో పెళ్లి చేసుకుందామని జంట అనుకుంది. ఇన్ స్టాలో ఫొటోల పోస్టింగ్తో గొడవ ప్రతిభ నగ్న చిత్రాలను వికాస్ ఇన్ స్టా గ్రామ్లో పోస్ట్ చేశాడు. అది ఆమె కంటపడింది. దాంతో ప్రతిభ కుటుంబీకులు వికాస్తో గొడవ పడ్డారు. ప్రేమించినవాడు మోసం చేశాడని, కుటుంబం ముందు పరువు తీశాడని ప్రతిభ కుమిలిపోయింది. ఆఫీసులో స్నేహితులైన సుశీల్, గౌతమ్, సూర్యతో గోడు చెప్పుకుంది. అతనికి బుద్ధి చెప్పాలని అందరు కలిసి వారం రోజుల క్రితం వికాస్ గదికి వెళ్లి తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత వారే ఆస్పత్రికి తీసుకెళ్లి ఎవరో కొట్టి పారిపోయారని చెప్పారు. అక్కడ చేర్చుకోకపోవడంతో సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బాధితుడు ఆదివారం రాత్రి చనిపోయాడు. బేగూరు పొలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు సూర్య పరారీలో ఉన్నాడు. (చదవండి: మహిళను వాటేసుకుని ముద్దుపెట్టబోయిన కాంగ్రెస్ నాయకుడు.. చితకబాదిన బాధితురాలి ప్రియుడు) -
మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. మీ ప్రియమైన వారికి ఇలా చేయరుగా
Jacqueline Fernandez Request To Media Not Circulate Her Private Photos: శ్రీలంక బ్యూటీ, బీటౌన్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు బాలీవుడ్ హీరోయిన్స్తోపాటు జాక్వెలిన్కు సుకేష్ ఖరీదైన బహుమతులు ఇవ్వడంతో ఈడీ ఆమెను విచారించింది. అప్పటినుంచి ఫిల్మ్ దునియాలో తరచుగా, వార్తల్లో అప్పుడప్పుడూ జాక్వెలిన్ పేరు వింటూనే ఉన్నాం. తాజాగా జాక్వెలిన్ మీడియాకు విన్నవించుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సుకేష్ చంద్రశేఖర్తో లీక్ అయిన తన ఫొటోను ప్రసారం చేయొద్దని మీడియాను అభ్యర్థించింది. తన గోపత్యకు భంగం కలిగిస్తోందని పేర్కొంది జాక్వెలిన్. 'ఈ దేశం, ఈ ప్రజలు నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం నేను కఠినమైన పరిస్థితిలో ఉన్నాను. అది నా స్నేహితులు, అభిమానులు గమనిస్తూనే ఉన్నారని తెలుసు. ఈ నమ్మకంతోనే నా వ్యక్తిగత చిత్రాలను ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నాను. నేను ఇప్పటికే చాలా నేర్చుకున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తున్నాను. మీరు మీ ప్రియమైన వారికి ఇలా చేయరు కదా. అలాగే నాకు కూడా ఇలా చేయరని నమ్ముతున్నా. న్యాయం, మంచి గెలుస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అని పోస్ట్లో రాసుకొచ్చింది జాక్వెలిన్. View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) ఇదీ చదవండి: జాక్వెలిన్ను సుకేష్ ఇలా ముగ్గులోకి దింపాడట..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement