-
టికెట్ ఎవరి చేతికో? అభయ ‘హస్తం’పై ఉత్కంఠ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ముందుగా అనుకున్న విధంగా అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి పేరు కాకుండా తెరపైకి మరో రెండు కొత్త పేర్లు రావడంతో కేడర్ అయోమయంలో పడింది. ఇప్పటికే కరీంనగర్లో లోకల్ నాన్ లో కల్ అంటూ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ మరో స్థానికేతరుడు తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తే తాము పనిచేసే పరిస్థితి ఉండదని స్థానికనేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన హస్తం అధిష్టానం తెలంగాణలో ఎంతో కీలకమైన కరీంనగర్ ఎంపీ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, స్థానికేతరులకు అవకాశం ఇస్తారన్న ఊహాగానాలు మొదలవడంతో కేడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రవీణ్రెడ్డి అభిమానుల గుస్సా అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును పార్టీ కోసం త్యాగం చేసిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డికి అదే సమయంలో ఎంపీ సీటు ఇస్తామని అధిష్టానం మాటిచ్చింది. ప్రవీణ్రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. పార్లమెంటు పరిధిలో ప్ర చార పోస్టర్లు వేసుకున్నారు. కానీ, అకస్మాత్తుగా తెరపైకి వెలి చాల రాజేందర్రావు పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తూ అధిష్టానాన్ని ఒప్పించే పనిలో పడ్డారు. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రవీణ్రెడ్డి వర్గం కిమ్మనడం లేదు. ఇది చాలదన్నట్లుగా అదనంగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పేరును తెరపైకి కాంగ్రెస్ నేతలు తీసుకువచ్చారు. దీంతో ప్రవీణ్రెడ్డి అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమకు హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, కరీంనగర్ నియోజవకర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉందని, తమను కాదని ఎక్కడి నుంచో నాయకులను తీసుకురావాల్సిన అగత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దూరమైన రోహిత్రావు పార్టీ టికెట్ కోసం కొన్నేళ్లుగా ఎమ్మెస్సార్ మనవడు మేనేని రోహిత్రావు కాంగ్రెస్లో పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన అధిష్టానం ఎంపీ ఎన్నికల సమయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. తనకు టికెట్ రాకున్నా.. ప్రవీణ్రెడ్డి కోసం పనిచేసేందుకు రోహిత్రావు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది. తీరా ప్రవీణ్రెడ్డిని కాదని ఇంకెవరికి ఇచ్చినా రోహిత్రావు వర్గం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, కనీసం పార్టీలో సభ్యత్వం లేనివారిని పోటీలోకి దింపడంపై జిల్లా కాంగ్రెస్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. త్వరలో కాంగ్రెస్లోకి గులాబీ నేతలు బీఆర్ఎస్ అధిష్టానానికి వరుసషాకులు తగులుతున్న వేళ.. కరీంనగర్ జిల్లా మాత్రం కంచుకోటలా ఉంటూ వస్తోంది. కొంతకాలంగా హస్తం పార్టీ నేతల లాబీయింగ్ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జిల్లాకు చెందిన కీలక గులాబీ నేతలు ఈనెల 6న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగే రాహుల్గాంధీ సభలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చకోనున్నారని సమాచారం. తెరపైకి మరో వ్యక్తి.. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, తీన్మార్ మల్లన్న, వెలిచాల రాజేందర్రావులతోపాటు మరో ఆసక్తికర వ్యక్తి పేరు వినిపిస్తోంది. బీఆర్ఎస్లో ముఖ్యనేతగా ఉన్న ఓ వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోగానే అతన్నే ఎంపీగా పోటీ చేయిస్తారన్న ప్రచారం ఆసక్తిగా మారింది. ఒకవేళ అదే వాస్తవరూపం దాలిస్తే.. కరీంనగర్ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టికెట్ ప్రకటించిన పెద్దపల్లిలో అనిశ్చితే.. పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ టికెట్ ఖరారైనా అనిశ్చితే నెలకొంది. గడ్డం కుటుంబానికి చెందిన వినోద్కుమార్ బెల్లంపల్లికి, వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తాజాగా పెద్దపల్లి ఎంపీగా ఆదే కుటుంబానికి చెందిన గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో రచ్చ జరుగుతోంది. మాదిగలు ఎక్కువగా ఉండే పెద్దపల్లి స్థానానికి మాదిగ సామాజికవర్గం వారికే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా గడ్డం వంశీకి టిక్కెట్ కేటాయించారని, పునరాలోచన చేయకపోతే వచ్చే నెల 5న న్యాయ దీక్ష చేస్తానంటూ యువజన జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ అధిష్టానాన్ని హెచ్చరించారు. తాజాగా రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలతో టికెట్ మార్పుపై ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు రిజర్వ్డ్ స్థానాల్లోని పెద్దపల్లి, నాగర్కర్నూల్లో మాల సామాజికవర్గానికి టికెట్ కేటాయించింది. వరంగల్లో మాదిగ సామాజికవర్గంలోని ఉప కులానికి చెందిన కడియం శ్రీహరికే టిక్కెట్ కేటాయించనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి టికెట్ మార్పు చేస్తుందా? గడ్డం వంశీనే కొనసాగిస్తాందో వేచి చూడాల్సి ఉంది. కాగా.. టికెట్ ఖరారు చేసుకున్న గడ్డం వంశీ ప్రచారంలో దూసుకపోకపోయినా.. వివిధ పార్టీల్లో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుతూ బలాన్ని పెంచుకుంటున్నారు.. ఇవి చదవండి: ఆర్థికంగా దెబ్బతీసేందుకు మోదీ కుట్ర : ఎమ్మెల్యే కవ్వంపల్లి -
పొన్నం వర్సెస్ అల్గిరెడ్డి.. ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా?
సాక్షి, మెదక్: కాంగ్రెస్ అధిష్టానం టికెట్ల కేటాయింపులో మొదటి లిస్ట్లో హుస్నాబాద్కు చోటు ఇవ్వలేదు. రేపో మాపో రెండో లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. టికెట్ ఖరారు కాకముందే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డిలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. టికెట్ నాకే అంటే నాకే అని ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ పోతున్నారు. – హుస్నాబాద్ హైదరాబాద్లోని తక్కుగూడలో జరిగిన రాహుల్ గాంధీ, సోనియాగాంధీ విజయభేరికి ఎవరికి వారే వాహనాల్లో కార్యకర్తలను తరలించారు. పార్టీ కార్యాలయాలను సైతం ప్రారంభించారు. ‘తిరగబడుదాం..తరిమికొడదాం’ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వి. హన్మంతరావు పాల్గొనగా, పొన్నం ప్రభాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఇద్దరూ పాల్గొన్నారు. దీని తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేదుకు నిర్వహించి సమావేశానికి ఏఐసీసీ సభ్యుడు మోహన్ ప్రకాశ్ రాగా, రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా ఏర్పడడం కార్యకర్తల్లో అయోమయానికి గురి చేసింది. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా హుస్నాబాద్ టికెట్ తమకే కేటాయించాలని సీపీఐ పార్టీ ఒత్తిడి తెస్తోంది. ఈ రెండు మూడు రోజుల నుంచి సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుండడంతో, హుస్నాబాద్ సీటు కాంగ్రెస్కే కేటాయిస్తారనే భావనతో టికెట్ కోసం పొన్నం ప్రభాకర్, ప్రవీణ్రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చలో కాళేశ్వరం.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని, ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు చూపేందుకు పొన్నం ప్రభాకర్ చలో కాళేశ్వరం పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలానికి ఒక బస్సు చొప్పున రైతులు, కాంగ్రెస్ నాయకులతో కాశేశ్వరానికి తరలివెళ్లారు. అలాగే మార్నింగ్ వాక్ పేరిట ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రచారం చేస్తూ ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఇటీవలె కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రచార రథాలకు పూజలు చేయించి ప్రతి రోజూ ప్రచారం చేయిస్తున్నారు. చాపకింది నీరులా ప్రచారం.. మరో వైపు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి చాపకింద నీరులా ప్రచారం ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని దాదాపు 90 గ్రామాలను చుట్టిముట్టి కాంగ్రెస్ ఆరు గ్యా రెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఊరు ఊరునా పరామర్శల పేరిట ఇంటింటికీ వెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. టికె ట్ తనకే వస్తుందనే ధీమాతో కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయంలో బుధవారం ప్రచ ార రథాలకు పూజలు నిర్వహించారు. నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఒకరికిస్తే మరొకరి మద్దతు ఉంటుందా? కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరి మద్దతు ఉంటుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరు నేతలు ఎందులోనూ తగ్గకుండా సీరియస్గా ఎవరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా చేస్తున్నారు. టికెట్ వచ్చిన తర్వాత ఇద్దరు చేతులు కలుపుతారా లేదా చేయి ఇస్తారా అనేది అంతుపట్టని పరిస్థితి నెలకొంది. -
నిజం గెలిచేదెలా భువనేశ్వరీ?
చంద్రగిరి (తిరుపతి జిల్లా)/సాక్షి, తిరుపతి: అబద్ధాలను పదేపదే చెప్పి వాటినే నిజమని ప్రజలను నమ్మించడంలో చంద్రబాబుకు మించిన వారు లేరనేది అందరికీ తెలిసిందే. ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో జైలు జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి సైతం చంద్రబాబు అబద్ధాల బాటలోనే పయనిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఒక్కరు కూడా మృతి చెందకపోయినా రాష్ట్రవ్యాప్తంగా 150 మందికి పైగా మరణించారని.. వారి కుటుంబాలను తాను పరామర్శిస్తానని భువనేశ్వరి బుధవారం నుంచి పరామర్శ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఆవులపల్లి ప్రవీణ్ రెడ్డి(33) కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఇంత నిస్సిగ్గుగా అబద్ధపు ప్రచారమా.. చంద్రగిరి పాతపేటకు చెందిన ప్రవీణ్ రెడ్డి రెండు నెలల క్రితం టీడీపీలో చేరాడు. అంతకముందు నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీకి పనిచేశాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం ఉదయం ఇంట్లో గుండెపోటు రావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే టీడీపీ నేతలు అతడి మృతిని బాబు ఖాతాలో వేసేశారు. వాస్తవానికి ప్రవీణ్ రెడ్డికి గతంలోనూ గుండెపోటు వచ్చిందని.. అప్పటి నుంచి అతడు తరచూ చికిత్స తీసుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇలాగే పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన కనుమూరి చిన్నబ్బ నాయుడు(70) కుటుంబాన్ని కూడా భువనేశ్వరి పరామర్శించారు. గత నెల 25న చిన్నబ్బ నాయుడు వృద్ధాప్య సమస్యలతో మృతి చెందాడు. అయితే చంద్రబాబుని అరెస్టు చేసినందుకు మనస్తాపంతో మృతి చెందినట్లు టీడీపీ నేతలు ప్రచారానికి దిగారు. దీనిపైనా స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. మరణిస్తారని ముందే తెలుసా? భువనేశ్వరి బుధవారం మృతుల కుటుంబాలకు పంపిణీ చేసిన చెక్కులు గందరగోళానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సంతకం చేసిన చెక్కులను మృతుని కుటుంబాలకు పంపిణీ చేశారు. భువనేశ్వరి తన పరామర్శ యాత్రలో ప్రవీణ్ రెడ్డి, చిన్నబ్బ నాయుడు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించారు. అక్టోబర్లో మరణిస్తే.. సెపె్టంబర్లోనే సంతకం చేసినట్లు ఉంది. చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ కాగా, ఆ చెక్లు చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు సెప్టెంబర్ 4న సంతకం చేసినవి. -
యూనివర్సిటీలకు ఏం ఒరగబెట్టారు?
విశ్వవిద్యాలయాలు విశ్వ విద్యా వికాస కేంద్రాలు. విద్య వికాసానికి, ఆ వికాసంతో విశ్వ మానవాళి జీవితాలను కొత్త పుంతలు తొక్కించగలిగిన ఆవిష్కరణలు చేయడానికి అవి వేదికలని తెలిసిన సంగతే. అటువంటి యూనివర్సిటీలు ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతున్నాయి. తెలంగాణ ఉద్య మంలో ప్రజానీకాన్ని చైతన్యపరిచి, ఉద్యమ బాటలో నడిపిన యూనివర్సిటీ కేంద్రాలు ఇప్పుడు స్వరాష్ట్రంలో ప్రభుత్వ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లుతున్నాయి. కేవలం యూనివర్సిటీ సర్వీసులో ఉన్న కొద్దిమంది సీనియర్ అధ్యాపకులే యూనివర్సిటీల మనుగడకు ఊపిరిలూదుతున్నారు. కొత్త నియామకాలు ఎండమా వులుగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు యూనివర్సి టీలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసారని గొంత్తెత్తిన నాయకుడే నేడు రాష్ట్రాన్ని పాలిస్తూ.. వాటిని మరింత నిర్లక్ష్యం చేస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలియని అయోమయపరిస్థితిలో విద్యార్థిలోకం ఉంది. యూనివర్సిటీలకు బడ్జెట్ కేటాయించకుండా, అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు భర్తీ చేయకుండా, మౌలిక వసతుల కల్పనకు ఏ మాత్రం కృషి చేయ కుండా గాలికొదిలేసిన ప్రభుత్వం.. మరోవైపు యూని వర్సిటీలు ఫీజులు పెంచుకోవడానికి అనుమతించి, యూనివర్సిటీలను పేద విద్యార్థులకు దూరం చేసే కుట్ర చేస్తున్నది. ప్రభుత్వ అనుమతిని సాకుగా చూపి యూనివర్సిటీలు పేద విద్యార్థులకు చెల్లింపు సాధ్యం కాని విధంగా ఫీజులను పెంచేశారు. అధ్యాపకులను నియమించి విద్యాప్రమాణాలను పెంచాల్సిన కొత్త వైస్ ఛాన్స్లర్లు ఫీజుల పెంపుపైనే దృష్టిపెట్టడం కనిపి స్తుంది. ఉస్మానియా, జెఎన్టియుహెచ్, కాకతీయ, మహాత్మగాంధీ యూనివర్సిటీలలో ఇంజనీరింగ్, పార్మసీ, పీజీ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు భారీగా నిర్ణయించడం అధికారుల బాధ్యతారాహి త్యమే. వందేళ్ల ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎంఏ(ఆర్ట్స్, సోషల్ సైన్సెస్) రెగ్యులర్ కోర్సుల ఫీజు రూ. 2,260 నుంచి రూ. 14,000 వరకు; సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రూ. 5170 నుంచి రూ. 21,000లకు పెంచారు. ఎంకామ్కి రూ. 30,000, ఎంబీఏ రూ. 35,000, ఎమ్మెస్సీ సైన్స్ కోర్సులకు రూ. 2,260 నుంచి రూ.20,490; సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకి రూ. 35,000 పెంచారు. ఇంజనీరింగ్ కోర్స్ ఫీజులనయితే భారీగా పెంచారు. రూ.18,000 నుంచి రూ. 35,000 వరకు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ. 75,000 వరకు పెంచారు, ఈ ఏడాది ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – మిషన్ లెర్నింగ్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా పేర్కొని ఫీజు లక్ష ఇరవై వేల రూపాయలుగా నిర్ణయించారు. అలాగే మైనింగ్ ఇంజ నీరింగ్ కోర్సు ఫీజు రూ. 1,00,000. దీన్ని గమనిస్తే పేద విద్యార్థులను యూనివర్సిటీ విద్యకు దూరం చేసే కుట్ర బహిర్గతమవుతుంది. ఈ ఫీజుల పెంపుదలను నిరసిస్తూ.. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళనకు దిగితే పోలీసులతో పాశవిక దాడులు చేయించి కేసులు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సిబ్బందికి జీతభత్యాలు చెల్లించడానికే యూని వర్సిటీ అధికారులు సతమతమౌతున్న తీరు గమనిస్తే యూనివర్సిటీల దయనీయ ఆర్థిక పరిస్థితి అవగత మౌతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన పరిమా ణంలోనే యూనివర్సిటీలకు బడ్జెట్ని కేటాయించడం చూస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా యూనివర్సిటీలకు జరిగిన మేలేమీ లేదని అర్థమవుతుంది. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీగా ఉన్న ఉస్మానియా నేడు పాల కుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో కలిపి 2,220 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో పేద విద్యార్థులు విద్యనభ్యసించడానికి ఉపకరిస్తున్న ఫీజు రీయంబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుంది. గత రెండేళ్లుగా రూ. 3,816 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు, ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి యూని వర్సిటీలను అద్భుత విజ్ఞాన కే్రందాలుగా విలసిల్లేలా చూడటం తెలంగాణ ప్రభుత్వ బాధ్యత. ప్రవీణ్ రెడ్డి వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శి, ఏబీవీపీ, తెలంగాణ మొబైల్ : 90104 05476 -
`సూర్యాస్తమయం` చేయడం గర్వంగా ఉంది
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `సూర్యాస్తమయం`. శ్రీహార్సీన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ ‘పదేళ్ల ముందు నిర్మాతగా చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్తమయం` సినిమా చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, అలాగే శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ కి మంచి స్పందన వస్తుండటం చాలా ఆనందం గా వుంది, మా హీరో ప్రవీణ్ రెడ్డి కి నటన పరంగా మంచి ప్రశంసలు అందుతున్నాయి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’అన్నాడు. ఈ మూవీ లో అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్కు ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు హీరో ప్రవీణ్ రెడ్డి. ప్రొడ్యూసర్ రఘు మాట్లాడుతూ.. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేది మరోసారి ‘సూర్యస్తమయం’తో నిజమైందని అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
కోహ్లి, స్కై కంటే హార్దిక్ బెటర్: టీమిండియా మాజీ బ్యాటర్
ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!
తప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
Advertisement