-
మా కుటుంబానికి ప్రాణహాని వుంది
-
‘పరిటాల నుంచి మా కుటుంబానికి ప్రాణహాని’
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకం ఎక్కువైంది. మూడు సంవత్సరాల క్రితం హత్యకు గురైన వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మూడేళ్ల కిందట రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో పరిటాల అనుచరుల చేతిలో వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి దారుణహత్యకు గురైన సంగతి తెల్సిందే. తాజాగా ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ప్రసాద్ రెడ్డికి చెందిన భూమి రికార్డులు రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. టీడీపీ కార్యకర్త చెండ్రాయుడు పేరిట అడంగల్ జారీ చేశారు. దీనిపై ప్రసాద్ రెడ్డి సోదరుడు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహానందరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పరిటాల సునీత తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, తన అన్నను చంపినట్టే తననూ హత్య చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము కొనుగోలు చేసిన భూమిలో కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని చెప్పారు. మంత్రి పరిటాల సునీత నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మహానంద రెడ్డి విలేకరుల ఎదుట వెల్లడించారు. -
'అనంత'లో వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు
-
'వైఎస్ఆర్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు ఎత్తివేయండి'
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీకి విన్నవించారు. రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నాయకుడు ప్రసాద్ రెడ్డిని ఇటీవల దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్లకు బాధ్యులను చేస్తూ వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేయగా, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎస్పీ రాజశేఖర్ బాబును కలిశారు. ఘటన స్థలంలో ఉండికూడా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఎస్పీని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడతారనే ఉద్దేశ్యంతో లాఠీఛార్జ్ చేయలేదని ఎస్పీ చెప్పారు. ప్రసాద్ రెడ్డి హత్యానంతరం ప్రజలు అసహనంతో ఉన్నందున తాము శాంతిని కోరామని, అయినా ప్రజలు వినలేదని వైఎస్ఆర్ సీపీ నేతలు వివరించారు. -
తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డికి రిమాండ్
హైదరాబాద్: అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా ఈ మేరకు ఆదేశించారు. అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన అల్లర్లకు బాధ్యుణ్ని చేస్తూ పోలీసులు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రిషబ్ పంత్కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement