-
కాంగ్రెస్ పవర్ పోతేనే కరెంటొచ్చింది
సాక్షి, సిరిసిల్ల: కాంగ్రెస్ పవర్ కట్ అయితేనే తెలంగాణకు కరెంటు వచ్చిందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. నాటి చీకటి రోజులను గుర్తుకు తెచ్చుకుని.. ఆలోచించి ఓటెయ్యాలని ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభలో, గంభీరావుపేటలో రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గంటలు కూడా కరెంటు ఇవ్వలేదన్నారు. అప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త అవుతోందని చెప్పారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణకు కరెంటు వచ్చిందని కాంగ్రెసోళ్లు నీతిలేని కూతలు కూస్తున్నారని, అదే నిజమైతే వాళ్లు అధికారంలో ఉన్న కర్నాటక, పంజాబ్ రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ది కుటుంబ పాలన అంటూ రాహుల్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ‘కాంగ్రెస్లో మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్గాంధీ దాకా అందరూ ఉంటే తప్పులేదు కానీ కేసీఆర్ కుటుంబం ఉండొద్దా? ఎన్టీఆర్ మనమలు, మనమరాళ్లు, చంద్రబాబు కొడుకు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి కావొచ్చు.. కానీ మేం రాజకీయాల్లో ఉండొద్దా?’అని ప్రశ్నించారు. ప్రజలు గెలిపిస్తేనే తాము రాజకీయాల్లో ఉన్నామని, పనిచేయకపోతే ఎందుకు గెలిపిస్తరని కేటీఆర్ ప్రశ్నించారు. సింహం సింగిల్గానే.. ‘ఒక్క సీఎం కేసీఆర్ను ఎదుర్కొనేందుకు అందరూ ఒక్కటవుతున్నరు. కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం, సీపీఐ ఒక్కటై ఐదారు కండువాలు కప్పుకొని వస్తున్నరు. వాళ్లను చూసిన జనం సంక్రాంతికి గదరా గంగిరెద్దులు వచ్చేది గిప్పుడెందుకు అని ముచ్చట్లు పెడున్నారు’ అని కె.తారకరామారావు ఎద్దేవా చేశా>రు. నలుగురైదురుగు కలసి ఒక్కటవుతున్నారంటే అది మన బలమా? కాదా? రాహుల్గాంధీ, చంద్రబాబు, మోదీ, మాయావతి ఇట్లా ఢిల్లీ, యూపీ, అమరావతి నుంచి వచ్చేవాళ్లు అందరూ టూరిస్టులే. ఎన్నికలప్పుడు వచ్చి పోయేవాళ్లే.. మిగిలేది పక్కా లోకల్ మనిషి కేసీఆర్ మాత్రమే’అని వ్యాఖ్యానించారు. సింహం సింగిల్గానే వస్తుందన్నారు. గుంపులుగా వచ్చేవారెవరో మీకే తెలుసని చెప్పారు. మోదీ చుట్టపు చూపోడే .. ‘తెలంగాణకు చుట్టపుచూపుగా వచ్చిన ప్రధాని నరేం ద్ర మోదీ.. తెలంగాణలో కరెంటు వస్తలేదు. కనబడుతలేదు అని నిజామాబాద్లో అన్నారు.. హెలికాప్టర్లో తిరిగితే కనబడదు. ముట్టుకొని చూడు నీకే కనబడుతది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పని బాగుంటే లక్ష మెజార్టీ ఇవ్వండి ‘కేసీఆర్ను గద్దె దించేదాక సిపాయి ఉత్తరకుమార్రెడ్డి గడ్డం తీసుకోడట. దాంతో మనకు పోయేదేముంది? గడ్డం పెంచేటోడు గబ్బర్సింగ్ అయితడా. కాంగ్రెసోళ్లు ఇంటి కిరాయి కడుతాం, బాసన్లు తోముతాం, డైపర్లు మార్చుతాం అంటూ వస్తున్నరు. వాళ్లు మామూలోళ్లు కాదు’అని కేటీఆర్ అన్నారు. బడిపిల్లలకు ఏడాదికోసారి పరీక్షలు వచ్చినట్లు, తమకు ఐదేళ్లకోసారి పరీక్ష వస్తుందని, ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఓటర్లను కోరారు. సొల్లు మాటలను నమ్మి ఆగం అయితే 50 ఏళ్లు వెనక్కి వెళతారని చెప్పారు. ‘కాంగ్రెస్కు 60 ఏళ్లు అధికారం ఇచ్చారు. నాలుగేళ్లు మాకు అవకాశం ఇచ్చారు. మా పనితీరు బాగుంటే లక్ష మెజార్టీతో గెలిపించండి. అభివృద్ధి చేయకపోతే డిపాజిట్ గల్లంతయ్యేలా తీర్పునివ్వండి’ అని కేటీఆర్ కోరారు. నాది లోకలే.. ‘సిరిసిల్లలో పోటీ చేయడానికి నేను లోకల్ కాదట.. సోనియా ఈదేశానికి లోకలా? ఆమెను నెత్తిమీద పెట్టుకుని ఊరేగించాలా?’ అని కేటీఆర్ అన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాక కూడా అవే మాటలా అని ప్రశ్నించారు. తన తాతది ముస్తాబాద్ మండలం మోహినికుంట అని, నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు భూములు కోల్పోయిన నిర్వాసితులమేనని కేటీఆర్ అన్నారు. నాన్లోకల్ అని మాట్లాడుతున్న వాళ్లు బతుకుదెరువు కోసం ఎలా హైదరాబాద్లో ఉంటున్నారో.. తాము కూడా హైదరాబాద్ వెళ్లామన్నారు. కూటమిని బొందపెట్టండి కాంగ్రెస్ సొల్లు కబుర్లు నమ్మొద్దు సీల్డ్ కవర్ సీఎంలు మనకొద్దు మోమిన్పేట రోడ్ షోలో కేటీఆర్ మోమిన్పేట: తెలంగాణ అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ భుజాలపై మోస్తోందని, కూటమి పేరుతో ఓట్లడుగుతున్న ఆ పార్టీలను బొంద పెట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో శుక్రవారం రాత్రి రోడ్షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనని శపథం చేసిన ఉత్తమ్కుమార్రెడ్డి మాటలు నమ్మొద్దన్నారు. గడ్డం పెంచుకున్న ప్రతిఒక్కరూ గబ్బర్సింగ్ కాలేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్సోళ్ల సొల్లు మాటలకు జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు 30 లేఖలు రాశారు వికారాబాద్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరిచ్చేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకువస్తే..దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారన్నారు. ఎవరాపినా జిల్లాకు సాగునీరు తెచ్చే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఉత్తరాలు రాసి నీళ్లను అడ్డుకున్న బాబును ఆయనతో జతకట్టిన కాంగ్రెస్ను ఓటు ద్వారా తరిమికొట్టాలని సూచించారు. రాష్ట్రంలో నేడు 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తుంటే.. ప్రధాని నరేంద్రమోదీ కరెంటు లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా..ఎప్పుడైనా విద్యుత్ తీగలను పట్టుకొని చూడాలని..అప్పుడే సరఫరా ఉందా లేదా అనేది తెలుస్తుందని చెప్పారు. ఒక్క కేసీఆర్ను ఎదిరించడానికి దేశంలోని పహిల్వాన్లందరూ వస్తున్నారని, ఎంతమంది వచ్చినా..అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. సీల్డు కవర్ సీఎంలు మనకొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్న వారు చేతులు ఎత్తాలని కేటీఆర్ పేర్కొనగా.. అక్కడున్న వారంతా చేతులు ఎత్తారు. మొండి చేతులు కాదు పిడికిలి బిగించి చెప్పాలని..ఇప్పటికే మొండి చేతులతో మోసపోయామని చమత్కరిస్తూ ప్రజలను ఉత్తేజపరిచారు. మోమిన్పేట రోడ్షోలో మాట్లాడుతున్న కేటీఆర్ -
పరిశ్రమలకు వారానికి ఒక రోజే పవర్హాలిడే!
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలకు విధించిన రెండురోజుల విద్యుత్ కోతను నవంబర్ మొదటి వారం నుంచి ఒకరోజుకు కుదించేందుకు పంచాయతీరాజ్శాఖ మంత్రి కె. తారకరామారావు హామీ ఇచ్చినట్లు తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం తెలిపింది. మంగళవారం సచివాలయంలో పారిశ్రామికవేత్తల సంఘంతోపాటు సీఐఐ, ఫ్యాప్సీ, ఫార్గింగ్ అసోసియేషన్, ఏపీపీఎంఏ, మైక్రో ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2రోజుల పవర్ హాలిడే వల్ల ఇబ్బందులు తలెత్తుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున విద్యుత్ కోత విషయంలో పరిశ్రమలు కొంతమేర సహకరించాలని మంత్రి సూచించినట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ను 8 రూపాయలకు కొనుగోలుచేస్తూ, వ్యవసాయానికి, పరిశ్రమలకు సర్దుబాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 54 శాతం విద్యుత్ను ఇవ్వకుండా చంద్రబాబు ట్రిబ్యునల్కు వెళ్లడం ద్రోహమేనని, తెలంగాణకు కేంద్రం అదనంగా విద్యుత్ ఇచ్చి ఏపీ ప్రభుత్వ తీరును అడ్డుకోవాలన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని వారు కొనియాడారు. మంత్రిని కలిసిన వారిలో కె. సుధీర్రెడ్డి, ఎం.గోపాల్రావు, సుధాకర్ తదితరులున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement